ఈరోజు అధ్యాత్మిక విశిష్ఠత కామిక ఏకాదశి / అజ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత 🕉️ నారాయణ తే నమో నమః 🙏

PSV APPARAO
583 views
1 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శ్రీకృష్ణ జన్మాష్టమి/శ్రీకృష్ణ జయంతి/గోకులాష్టమి/అష్టమి రోహిణి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #🙏హ్యాపీ కృష్ణాష్టమి🙏 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 *పుట్టెడు కష్టాలతో చెర శాలలో జన్మించిన శ్రీ కృష్ణ పరమాత్ముడు తన చిలిపి చేష్టలతో వెన్న ముద్దల దొంగగా పెరిగి పెద్ద అయ్యే తరుణంలో పసి వయసులోనే తల్లి యశోదకు తన బుల్లి నోటిలో లోకాన్ని మొత్తం చూపించి దైవాంశ సంబుతుడయ్యాడు, కుటుంబ సభ్యుల మధ్య వైరం వచ్చాక మహా భారత యుద్ధ భూమిలో ధర్మం నెలకొని ఉన్న పంచ పాండవులు వైపు అస్త్ర శస్త్రములు పట్టుకోకుండా తన తెలివితేటలతో కేవలం రధ సారధిగా ఉంటూ పాండవులను గెలిపించి చరిత్ర సృష్టించి ప్రధాన భూమిక పోషించాడు, నేడు కలియుగానికి లోక పావనుడయ్యాడు, అంతటి గొప్ప మహానుభావుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకుందాం!* 🦚శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 💐🦚
Myra Gupta
539 views
15 days ago
AI indicator
#🌑చుక్కల అమావాస్య..ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగిపోతాయట! #హరియాలి అమావాస్య అంటే ఏమిటి? ఈ రోజున ఏమి చేస్తారు? #⚫ఆషాఢ అమావాస్య రోజున చేయాల్సిన పనులు..తప్పక పాటించండి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🌑🌞అమావాస్య శుభాకాంక్షలు🌹🌘🌓🌚🌝🌞 🔔 *విశేషం* 🔔 ఆషాఢమాసంలోని చివరి రోజైన నేటి అమావాస్య ను, చుక్కల అమావాస్య అంటారు...``` ఈ రోజున పితృదేవతలను తల్చుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా, గొప్ప ఫలితం దక్కుతుందని చెబుతారు పెద్దలు ... *ఎందుకంటే... మన పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది... మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే, కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది... దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు, అదే చుక్కల అమావాస్య గా చెబుతారు... ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు, దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట... కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా, వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందని పురాణాలు చెబుతున్నాయి !!!... ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం, కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి, ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు... ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా ‘చుక్కల అమావాస్య’ పేరుతో ఒక నోముని నోచుకుంటారట... ఇందుకోసం గౌరీపూజని చేసి , సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు, అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట... దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు, తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక కదా ! https://youtu.be/3a-V6ZcxXdc ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు... రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికీ, అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు, అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి, వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు, ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు... ఈ చుక్కల అమావాస్య వెనకాల ఇన్ని విశేషాలు ఉన్నాయి...✍️``` 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
PSV APPARAO
546 views
15 days ago
#తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం 🙏 #శుభ శ్రావణమాసం ... వరలక్ష్మీ వ్రతం ... వరలక్ష్మీ వ్రతకల్పం 🙏 #శ్రీహరిహరుల శుభ అధ్యాత్మిక పవిత్ర మాసం "శ్రావణ మాసం" ప్రారంభం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు 👆 *శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం* *భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు* *శోభాయమానంగా ముస్తాబైన అష్టలక్ష్మీ మండపం* *సాయంత్రం వైభవంగా స్వర్ణరథోత్సవం* తిరుపతి, 2026 ఆగస్టు 21:: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం శుక్రవారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన ఈ పవిత్ర వేడుకలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. *విశేష పూజలతో వరలక్ష్మీ వ్రతం* వేకువజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు చీరతో విశేషంగా అలంకరించుకుని భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి తదితర సుగంధ, సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అర్చించారు. తొమ్మిది గ్రంథులతో అమ్మవారిని అలంకరించి, ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు ప్రతీకగా పూజించారు. అనంతరం 12 రకాల నైవేద్యాలను సమర్పించి మహా మంగళహారతితో వ్రతాన్ని ముగించారు. *మహిళలకు మంగళప్రదమైన వరలక్ష్మీ వ్రతం* వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా సత్సంతానం, దీర్ఘమాంగల్య సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించినందున, అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అత్యంత విశిష్టమైనదని పేర్కొన్నారు. *భక్తులకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి జేఈవో శ్రీ ఏ. శరత్* టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. వ్రత కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. *పుష్ప సౌందర్యంతో కనువిందు చేసిన వ్రత మండపం* టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 60 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుమారు మూడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 14 రకాల 30 వేల కట్ ఫ్లవర్స్‌తో ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, ముసాంబి, పైనాపిల్ తదితర పండ్లు, వివిధ రకాల పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, ఇరువైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అష్టలక్ష్మి మూర్తులు, రంగురంగుల రోజాలు, తామరపూలతో ఆస్థాన మండపం శోభాయమానంగా అలంకరించారు. *7 ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష వీక్షణ* భక్తులందరూ వరలక్ష్మీ వ్రతాన్ని వీక్షించేందుకు ఆస్థాన మండపం, పుష్కరిణి, వాహన మండపం, ఫ్రైడే గార్డెన్స్, తొలప్ప గార్డెన్, గేట్ నం.3 తదితర ప్రాంతాల్లో మొత్తం ఏడు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. *స్వర్ణరథంపై అమ్మవారి దివ్య విహారం* వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జీ. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీ సురేష్ కుమార్, శ్రీమతి జానకి దేవి, శ్రీమతి రంగశ్రీ, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఇతర అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
PSV APPARAO
572 views
15 days ago
#శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #వరలక్ష్మీ వ్రతం #శుభ శ్రావణమాసం ... వరలక్ష్మీ వ్రతం ... వరలక్ష్మీ వ్రతకల్పం 🙏 #💐వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు🌼 *వరలక్ష్మీ వ్రతం* : తెలుగునాట మహిళలు ప్రతి సంవత్సరం తప్పకుండా వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఆ రకంగా వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 'వర' అంటే శ్రేష్ఠమైనది అని అర్థం. వరలక్ష్మి అంటే శ్రేష్ఠమైన వరాలనిచ్చే చల్లని తల్లి. వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన మహిళలు పేరంటాళ్లకు వాయనం ఇస్తూ 'కోరితి వరం' అంటారు. వాయనం అందుకుంటున్న వారు 'ఇస్తిని వరం' అంటారు. ఆ తరువాత పూజ చేసుకున్నవారు 'ఇస్తినమ్మ వాయనం' అంటారు. వాయనాన్ని అందుకుని ముత్తయిదువ 'పుచ్చుకొంటినమ్మ వాయనం' అనాలి. ముత్తయిదువ రూపంలోనే లక్ష్మీదేవి మనపై వరాలను కురిపిస్తుందని నమ్ముతారు. వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి కాలనియమం లేదు. ఎన్ని సంవత్సరాలైనా ప్రతి శ్రావణమాసంలోనూ సాధ్యమైనప్పుడల్లా ఇతర మాసాల్లో కూడా చేసుకోవచ్చు. పెళ్లి తరువాత తొలిసారి వ్రతాన్ని ఆచరించే వారు అత్తవారింటనే చేసుకోవడం చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. సాధారణంగా ఉదయం వేళలోనే వ్రతం పూజ ఆచరిస్తారు. ముత్తయిదువలను పిలుచుకుని పేరంటాన్ని మాత్రం సాయంత్రం కూడా నిర్వహించుకోవచ్చు. పూజాసామగ్రి సిద్ధం చేసుకుని లక్ష్మీపూజకు ఉపక్రమించాలి. వరలక్ష్మీవ్రతం పూజావిధానంలో లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజిస్తారు. కలశంలో లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. కలశంలో ఉంచే కొబ్బరికాయపై అమ్మవారి కన్ను, ముక్కు, చెవుల వంటివి పిండితో తయారు చేసి అలంకరిస్తారు. స్తోమతు కలిగినవారు వెండి, బంగారు ప్రతిమలను ఉపయోగిస్తారు. ఆ అవకాశం లేనివారు కలశాన్ని పూజిస్తే చాలు. పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపళ్లు, కొబ్బరికాయ, ఆవుపాలు, బెల్లంతో చేసిన పరమాన్నం, బూరెలు మొదలైన పిండివంటలు నివేదిస్తారు. కొందరు తొమ్మిదిరకాల పిండివంటలు చేస్తారు. చివరిగా వ్రతకథ చదువుకుంటారు.
PSV APPARAO
1.2K views
18 days ago
#శుభ శ్రావణ మంగళవారం ... మంగళ గౌరీ వ్రతం / నోములు #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రావణ మాసం #శ్రావణమాసం విశిష్టత *మంగళగౌరీ వ్రతం* *మంగళగౌరీ వ్రతం సందర్భంగా...* శ్రావణమాసంలో స్త్రీలు మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలు జరుపుకుంటారు. ఈ రెండు వ్రతాలు సౌభాగ్యాన్ని, సుమంగళీత్వాన్ని కలిగిస్తాయని విశ్వసిస్తారు. శ్రావణమాసంలో మంగళగౌరిని శ్రీ తల్చుకోవడం ఏ ఇల్లాలికైనా మహాభాగ్యమే! గౌరీదేవి కేవలం ప్రతాలకు, నోములకే పరిమితం కాదు. ఆమె విభిన్న రూపాల్లో మనకు దర్శనమిస్తుంది.. మహాకవులు పద్యాల్లో, జానపదులు పాటల్లో గౌరీదేవిని పూజిస్తారు. బతుకమ్మ పండుగలప్పుడు తెలంగాణలో వాయనం పుచ్చుకునేటప్పుడు మహిళలు గౌరీదేవి పాట పాడతారు. సస్య సంపద అభివృద్ధి కోసం గౌరీదేవిని ప్రార్ధిస్తారు. జొన్నలు, వడ్లు, కందులు, పెసలు ఇలా అన్నీ బాగా పండాలని రైతులు గౌరమ్మను పూజిస్తారు. 'జొన్నల్ల పుట్టిన గౌరి, జొన్నల్ల పెరిగిన గౌరి అన్నవేసిన పొన్నల కింద. నేను వేసిన నిమ్మల కింద చల్లంగుండు సంపతి గౌరమ్మా వడ్లల్ల పుట్టిన గౌరీ, వడ్లల్ల పెరిగిన గౌరీ అన్నవేసిన పొన్నల కింద, నేను వేసిన నిమ్మల కింద చల్లంగుండు సంపతి గౌరమ్మా ఇలా కందుల గురించి, పెసల గురించి గౌరమ్మను ప్రార్థించి వాయనాలు ఇచ్చుకుంటారు మహిళలు, రైతన్నల బతుకులు బాగుండాలంటే గౌరీదేవి దయ కావాలనే విశ్వాసం బతుకమ్మ పాటల్లో కనిపిస్తుంది. గౌరీశ్వరుల ప్రణయంలో సరస శృంగార సంభాషణలు జానపద పాటల్లో కనిపిస్తాయి. చింత చెట్టు మీద కూర్చుని ఆలి పొడే పాటలను ఆలకిస్తున్నాడు. శివుడు. ఆ స్వామికి గౌరిపై కోపమొచ్చింది. 'అన్నల్ని పాడేవు, తమ్ముల్ని పాడేవు నన్నేల పాడవే? సిరి గౌరిదేవి అన్నాడు శివుడు ఆమె వెంటనే 'సిగ్గు ఎగ్గుల మారి వ్యాపారి శివుడా యేమని పాడేది ఇందరిలోనా' అంది. అందరిలో భర్త గురించి ఎలా పాడేది అని ఆమె ఆలోచిస్తోంది ఎలా పాడాలో, ఏమి పాడాలో ఆమెకు చెప్పాడు శివుడు 'పూల బాణము తొడిగి పులి నందినెక్కి నా పుణ్య పురుషుడు వచ్చెను అని పాడు అన్నాడు శివుడు. ఆమె ముసిముసిగా నవ్వుకుంటోంది. మళ్లీ శివుడిలా అంటున్నాడు. నాగబాణము తొడిగి నవనందినెక్కి నా స్వామి వచ్చెను అని పాడు. 'సూర్య బాణము తొడిగి సూర్యరథమెక్కి నా పుణ్యాల రాశి వచ్చెను అని పాడు. ఇలా సాగుతాయి గౌరీశ్వరుల ప్రణయ సంభాషణలు ఈ సంభాషణల్లో శివతత్త్వం, గౌరి లాలిత్యం కనిపిస్తుంది. శ్రావణమాసంతో పాటు ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో కూడా గౌరీ పూజ చేస్తారు. ఆ మాసాల్లో బాలికలు గౌరీ నోము నోస్తారు. ఉయ్యాల ఊగుతూ పాటలు పాడతారు. బాలికలంతా చెరువు కుంటలోని బంకమట్టిని తెచ్చి గౌరమ్మ బొమ్మను చేసి పాటలు పాడుకుంటారు. 'గౌరం గౌరమ్మా యెవరాడీ చిడ్డమ్మా బచ్చన్నీ కుంట్లో నా బంకమన్నమ్మా కోలూ కోలన్నా ఎవని మేలు కొలన్నా గౌరమ్మొచ్చిందీ గుళ్లోన గూసుంది మాయమ్మ బోయిందీ సద్ది తేనీకి' ఇలా గౌరమ్మకి చల్లి నైవేద్యాలు పెడుతూ పాటలు పాడతారు. యక్షగానాల్లో గంగా గౌరీ సంవాదం చాలా ప్రసిద్ధమైంది. అయితే స్త్రీల పాటల్లో హాస్యంతో కూడిన సంవాదాలు గౌరీపరంగా ఉన్నాయి. 'గౌరీదేవి నీ శంభుదేవునకు గళమున నలుపేమమ్మా' అంటే నలుపేమిటో చెప్పక చెప్పటం ఇందులో విశేషం. 'నారీమణీ! నీ విష్ణుదేవుడూ నలుపు కాదటే కొమ్మా అని జవాబిస్తుంది. గౌరీదేవి. గోపికలు జలక్రీడలాడి గంగ ఒడ్డున నిలిచారు. ధూపదీప నైవేద్యాలతో గౌరమ్మను పూజించారు. వారి కోరికేమిటో చూద్దాం... ఆ కోరిక తీరిస్తే మల్లెపూలతో పూజ చేస్తామంటున్నారు. 'వినవమ్మ గౌరమ్మ విన్నపము లాలించి విని మా మనసులో కోర్కె లీడేర్చవమ్మా అచ్యుతునకు మాకు ఆలింగనము చేసితే ఇచ్ఛ మల్లెల పూజ చేతునే గౌరి' గౌరమ్మను ఎలా పూజించినా ఆమె భక్తులపై కరుణా కటాక్షాలు ప్రసరిస్తుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
536 views
19 days ago
#నాగ స్తోత్రం 🐍 #నవ నాగ స్తోత్రం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #సర్ప రక్షకురాలు మానస దేవి... నాగుల చవితి / నాగ పంచమి 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *నవనాగ స్తోత్రం......!!* *ప్రతీరోజూ తప్పకుండా ఒక్కసారైనా ఈ మంత్రం భక్తి శ్రద్ధలతో పఠిస్తే మంచిది.* *నవనాగ స్తోత్రము అంటే తొమ్మిది మంది ప్రముఖమైన నాగ దేవతల పేర్లను పఠించటం.* *ఈ స్తోత్రాన్ని పఠించటం వలన విష భయం తొలగిపోతుందని నమ్ముతారు.* *కాలసర్పదోషం,నాగ దోషం ఉన్నవారు దీనిని రోజూ పఠించాలి.* *నవ నాగ స్తోత్రం..* అనంతం వాసుకిం శేష పద్మనాభంచ కంబలమ్ శంఖుపాలం ధృతరాష్ట్రంచ తక్షకం కాళీయం తధా ఫలశ్రుతి... ఏతాని నవ నామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్| సర్పసూక్తం - సుబ్రహ్మణ్య సూక్తం.... తైత్తిరీయ సంహితా - ౪.౨.౮ ఋగ్వేదము నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః | యే ౭ దో రోచసే దివో యే వా సూర్యస్య రశ్మిషు | యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతుధానానాం యే వా వనస్పతీగ్ంరను | యే వా ౭ పటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః || ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం | ఆశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః | యే రోచసే సూర్యస్స్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామాశ్రేషా అనుయంతి కామం | తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి || నిఘృష్వైరసమాయుతైః | కాలైర్హరిత్వమాపన్నైః | ఇంద్రాయాహి సహస్రయుక్ | అగ్నిర్విభ్రాష్టివసనః | వాయుశ్చేతసికద్రుకః | సంవథ్సరో విషూవర్ణైః | నిత్యాస్తే ౭ నుచరాస్తవ | సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం || ఇతి సర్ప సూక్తం..!! సర్ప స్తోత్రం.. భుజంగేషాయ విద్మహే క్షక్షు శివాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్! ఈ మంత్రం నాగ విగ్రహానికి పాలు పోస్తూ చెప్పుకొంటే ఎవ్వరికైన అనుకొన్నది జరుగుతుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
524 views
19 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత: శ్రావణ పంచమి / నాగ పంచమి / నాగుల పంచమి / గరుడ పంచమి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత శ్రావణ పంచమి / నాగ పంచమి / గరుడ పంచమి / నాగుల పంచమి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత: శ్రావణ పంచమి / నాగ పంచమి / నాగుల పంచమి / గరుడ పంచమి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *గరుడ పంచమి* *ఆగష్టు 17 సోమవారం గరుడ పంచమి సందర్భంగా...* గరుత్మంతుణ్ణి వైష్ణవులు గరుడాళ్వార్ అంటారు. గరుడుడు విష్ణు భక్తి పరాయణుడు, మాతృదాస్య విముక్తికి పాటుపడ్డవానిగా పురాణాలు ఆయనను అభివర్ణించాయి. స్వామికి వాహనంగా నిలిచిన గరుత్మంతుణ్ణి ఆయన జన్మతిథినాడు పూజించడం ఆచారం. గరుత్మంతుడు పక్షులకు రాజు, సర్పజాతికి శత్రువు. ఆయన గొప్పదనమంతా విష్ణుమూర్తిని వాహనరూపుడై సేవించడంలోనే ఉంది. నిరంతర స్వామి పాదసేవా పరాయణుడు గరుడుడు. అపార శక్తికి, అద్భుత గమనానికి సంకేతంగా ఆ పక్షిరాజును దేవతలు భావిస్తారు. _''వేదాత్మా విహగేశ్వరః"_ వేద స్వరూపుడు గరుత్మంతుడు. _మాతృదాస్య విముక్తి_ కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు. వినతకు ఇద్దరు కుమారులు కలిగారు. వీరిలో పెద్ద వాడైన అనూరుడు సూర్యునికి రథసారథయ్యాడు. రెండో కుమారుడైన గరుడుడు విష్ణుమూర్తికి వాహనమయ్యాడు. దేవేంద్రుని వజ్రాయుధం దెబ్బలను కూడా తట్టుకోగలిగిన శక్తి గరుత్మంతుని రెక్కలకు ఉంది. అందుకే ఆయనను సువర్ణుడు అన్నాడు. అందువల్లనే దేవేంద్రుని ఓడించి అమృతాన్ని తెచ్చి సవితి తల్లికిచ్చి కన్నతల్లికి దాస్య విముక్తి కలిగించాడు. ఈ విధంగా తల్లికి దాస్య విముక్తి కలిగించిన రోజే శ్రావణ శుద్ధ పంచమి. విష్యాలయాల్లో గర్భాలయానికి ఎదురుగా నిలిపే ధ్వజస్తంభానికి దిగువన గరుడుని విగ్రహం ఉంటుంది. స్వామికి -నమస్కరిస్తున్న భంగిమలో అక్కడ మనం గరుత్మంతుని చూస్తాం. ఈ కారణంగానే ధ్వజస్తంభాన్ని గరుడ స్తంభం, గరుడ కంబం అని కూడా పిలుస్తారు. విష్ణువు పతాకం మీద గరుత్మంతుడు అధిష్ఠించి ఉంటాడు. విష్ణునామాల్లో గరుడధ్వజుడనేది ప్రసిద్ధనామం. గరుత్మంతుని పేరుతోనే గరుడ పురాణం ఉంది. మరణించిన వ్యక్తికి కర్మకాండ పూర్తయ్యేంత వరకూ అశౌచ దినాల్లో గరుడ పురాణాన్ని పఠించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇలా చేస్తే మరణించిన వ్యక్తికి పుణ్యలోకాలు లభిస్తాయని నమ్మకం. యుద్ధ వ్యూహాల్లో గరుడ వ్యూహం కూడా ప్రముఖమైనదే. యుద్ధ రంగంలో సైనికుల్ని గరుడుని ఆకారంలో నిలబెడతారు. ఈ వ్యూహాన్ని భేదించడం కష్టసాధ్యం. గోదావరి రాజమండ్రి దాటిన తరువాత ఏడుపాయలుగా విడిపోయింది. వాటిలో ''వైనతేయ' అనే పాయ గరుత్మంతుని పేరుమీదుగా ఏర్పడించే. నతేయగా విడిపోయిన చోట రాజోలు వద్ద గరుత్మంతునికి అరుదైన ఆలయం ఉంది. ఇందులో కొలువైన స్వామిని గరుడేశ్వర స్వామిగా ఆరాధిస్తారు. _వివిధ ప్రాంతాల్లో గరుడ పంచమి_ గరుడుడు తల్లి దాస్యాన్ని విముక్తి చేసిన శ్రావణ శుద్ధ పంచమినాడు గరుడ పంచమి పర్వదినంగా జరుపుకోవడం ఆచారం. కృష్ణా గోదావరి జిల్లాల్లోని వారు, సాగర తీర వాసులు ఈ పర్వాన్ని విశేషంగా జరుపుకుంటారు. వ్రతరత్నాకరం, గరుడ పురాణం ఈ రెండు గ్రంథాల్లోనూ గరుడ పంచమి వ్రత విధానం గురించి ప్రస్తావన ఉంది. సోదరులున్న స్త్రీలందరూ గరుడపంచమి వ్రతం చేసుకోవచ్చు. పంచమి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుచిగా కొయ్యతో చేసిన చతురస్రాకారంలో ఉన్న పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అయిదు రంగులతో ముగ్గు పెట్టాలి. పీటపై ముగ్గుమధ్యలో బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మధ్యలో తమలపాకు ఉంచి దానిపై బంగారు, వెండి లేదా మట్టితో చేసిన గరుత్మంతుని ప్రతిమ ఉంచాలి. ఇవేవీ వీలు కాని పక్షంలో గరుతంత్ముని చిత్రపటాన్ని ఉంచి పూజించవచ్చు. పూజకు ముందుగా అయిదు రంగుల దారాలకు అయిదు ముడులు వేసి అయిదు పూలతో కట్టిన తోరాన్ని ఉంచాలి. అనంతరం షోడశోపచారాలతో గరుడుణ్ణి పూజించాలి. చక్రపొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజించిన తోరాన్ని స్త్రీలు కుడి చేతికి ధరించాలి. ఇలాచేస్తే సర్ప భయం ఉండదని విశ్వసిస్తారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* .