ఉపాధి పనులు

Sekhar Digitals & Reporter 9603197203
1.3K views
2 months ago
#ఉపాధి పనులు #🧴సమ్మర్ స్కిన్ కేర్☀️ #⚠️భగ్గుమంటున్న ఎండలు..రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు🌡️ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ *​ఉపాధి ‘హామీ’... రైతుకు ‘శాపం’...!!!* ​కూలీల కొరతతో వరి కోతలకు తిప్పలు.. ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాతకు నష్టం.. *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* ​అవసరం లేని పనులతో నిధుల దుర్వినియోగం.. వ్యవసాయానికి అనుసంధానించాలని రైతుల డిమాండ్. కూలీల కొరతతో రైతాంగం తల్లడిల్లిపోతోంది. ఓ పక్క చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు ఆరాటపడుతుంటే, మరోపక్క *ఉపాధి హామీ పనుల వల్ల కూలీలు దొరక్క వరి కోతలు నిలిచిపోతున్నాయి.* సకాలంలో ఒబ్బిడి చేసుకోలేక, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడి పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని లేదా ప్రస్తుత కోతల సమయంలో నెల రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.​ కాట్రేనికోన మండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీ కింద జరుగుతున్న పనులు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.*ఎవరికీ ఉపయోగం లేని చెరువులు, కాలువ డ్రైన్లు, గట్లపై మట్టి తొలగించడం, గడ్డి పీకడం, ముళ్ళ డొంకలు కొట్టడం వంటి సాదాసీదా పనులతో అధికారులు,సిబ్బంది కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.* చెరువుల యజమానులు దగ్గర సొమ్ములు తీసుకుని వారికిఉపయోగపడే పనులు చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. *కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఇలా నిరుపయోగం అవుతున్నాయే తప్ప, అత్యవసరమైన వ్యవసాయ పనులకు మాత్రం కూలీల కొరత వేధిస్తోంది.* వ్యవసాయ రంగంలో కోత,నూర్పిడి యంత్రాలు రాకుంటే మా పరిస్థితి మరింత భయంకరంగా ఉండేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.​ప్రకృతి వైపరీత్యాల భయం..​వరి కోతలు ముమ్మరంగా సాగాల్సిన ఈ సమయంలో కూలీలు దొరక్కపోవడంతో కోతలు ఆలస్యమవుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, అకాల వర్షాల ముప్పు పొంచి ఉండటంతో రైతులు గుండె చేతపట్టుకుని బతుకుతున్నారు. కోసిన పంట పొలాల్లోనే ఉండిపోవడం, తడిసి ముద్దవడం వల్ల తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తోందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అకాల ప్రకృతి వైపరీత్యాల భయం వారిని వెంటాడుతోంది.ప్రభుత్వ నిధులు వృథా కాకుండా, అటు కూలీలకు ఉపాధి దొరికేలా, ఇటు రైతులకు మేలు జరిగేలా ఉపాధి హామీని వ్యవసాయ పనుల వైపు మళ్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల గోడును ప్రభుత్వాలు ఆలకించడం లేదని నిరసన వ్యక్తం అవుతోంది. అది సాధ్యం కాకపోతే, వరి కోతలు పూర్తయ్యే వరకు కనీసం నెల రోజుల ఉపాధి హామీ పనులను తక్షణమే నిలిపివేయాలని రైతులు కోరుతున్నారు.​ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని, అన్నదాతలను ఆదుకునేందుకు ఉపాధి హామీ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని రైతులు కోరుతున్నారు.కాట్రేనికోన మండల ఉపాధి ఏపీఓ బి చంద్రమోహన్ ను వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలకు మస్తర్ వేసి రైతులకు సంబంధించి సొంత వ్యవసాయ పనులు చేయించే వీలు లేదన్నారు. కొత్తగా వచ్చే వి.బి.జి రాంజీ పథకంలో మార్పులు చేసే అవకాశం ఉందన్నారు. మండలంలో ఏడు వేల మందికి పైగా జాబ్ కార్డులు ఉండగా 3120 మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు ఏపీవో చెప్పారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼