ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
885 వీక్షించారు
1 నెలల క్రితం
🌺🙏తిరుపతి సమీపంలోని తిరుచనూరు (అలిమేలు మంగాపురం) లో కొలువై ఉన్న 🌷 శ్రీ పద్మావతీ అమ్మవారు అత్యంత పవిత్రమైన దేవతలలో ఒకరు. శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడి సాంప్రదాయం.🌹🙏 ​అమ్మవారి విశిష్టత, ఆలయ చరిత్ర గురించిన ముఖ్యమైన విషయాలు మీకోసం🙏 🌼​1. అమ్మవారి అవతార విశిష్టత భృగు మహర్షి స్వామి వారి వక్షఃస్థలాన్ని తన్నడంతో లక్ష్మీదేవి అలకతో వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చింది. ఆ తర్వాత చంద్రవంశానికి చెందిన ఆకాశరాజు కుమార్తెగా, పద్మ (తామరపువ్వు) లో అమ్మ ప్రత్యక్షమైంది. అందుకే అమ్మ కు పద్మావతి అని పేరు వచ్చింది. తమిళంలో 'అలర్' అంటే తామర, 'మేల్' అంటే పైన, 'మంగై' అంటే స్త్రీ... అంటే తామరపువ్వుపై వెలసిన తల్లి కాబట్టి అమ్మ ను అలిమేలు మంగ అని కూడా పిలుస్తారు. 🌼​2. ఆలయ ప్రాముఖ్యత ​కార్తీక బ్రహ్మోత్సవాలు: అమ్మవారికి ప్రతి ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా అమ్మవారి జన్మదినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు జరిగే "పంచమీ తీర్థం" (చక్రస్నానం) అత్యంత విశిష్టమైనది. ఆ రోజు తిరుమల నుండి శ్రీవారి పట్టుచీర, ఆభరణాలు, ప్రసాదాలు అమ్మవారికి వస్తాయి. 🌼​పద్మసరోవరం ✨ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్రమైన కోనేటిని 'పద్మసరోవరం' అంటారు. ఈ కోనేట్లోనే అమ్మవారు బంగారు తామరపువ్వులో అవతరించారని నమ్ముతారు. 🌼​3. దర్శన నియమం ​సాధారణంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందే తిరుచనూరు అమ్మవారిని దర్శించుకోవాలని పెద్దలు చెబుతారు. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీవారి హృదయంలో కొలువై ఉండే అలమేలుమంగ, భక్తుల కోర్కెలను త్వరగా నెరవేరుస్తుందని ప్రతీతి. 🌼​4. ఆలయ ఉపాలయాలు ​తిరుచనూరు ఆలయ ప్రాంగణంలో పద్మావతి అమ్మవారితో పాటు మరికొన్ని ముఖ్యమైన సన్నిధులు ఉన్నాయి: ​శ్రీ కృష్ణ స్వామి ఆలయం ​శ్రీ సుందరరాజ స్వామి ఆలయం (శ్రీ మహావిష్ణువు రూపం) ​సూర్యనారాయణ స్వామి ఆలయం (పద్మసరోవరం ఒడ్డున ఉంటుంది) 🌷🌷లక్ష్మీ స్వరూపిణి అయిన పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు, ప్రశాంతత లభిస్తాయని భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ.. 🙏🌹 🌺🙏​ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాసాయ నమః! 🌺🙏 #ఓం శ్రీ మాత్రే నమః #🕉️ఓం శ్రీ మాత్రే నమః 🕉️🙏 #ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #హిందూ దేవాలయాలు💐🎂
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
942 వీక్షించారు
1 నెలల క్రితం
లలిత సహస్రనామంలో ముఖ్యమైన నామాలు 🙏🏻🕉️📖🌺🪔👣 1. శ్రీమాతా - సర్వ జగత్తుకు తల్లి 2. శ్రీమహారాజ్ఞీ - ముల్లోకాలకు రాణి 3. శ్రీమత్-సింహాసనేశ్వరీ - శ్రీచక్ర సింహాసన అధిష్టాన దేవత 4. చిదగ్నికుండ సంభూతా - చైతన్య అగ్నికుండం నుండి ఉద్భవించినది 5. దేవకార్య సముద్యతా - దేవతల కార్యం కోసం అవతరించినది 6. ఉద్యద్భాను సహస్రాభా - వేయి సూర్యుల కాంతి గలది 7. చతుర్బాహు సమన్వితా - నాలుగు భుజాలు కలది 8. రాగస్వరూప పాశాఢ్యా - రాగం అనే పాశం ధరించినది 9. క్రోధాకారాంకుశోజ్జ్వలా - క్రోధం అనే అంకుశం ధరించినది 10. మనోరూపేక్షుకోదండా - మనస్సు అనే చెరకు విల్లు ధరించినది 11. పంచతన్మాత్ర సాయకా - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే బాణాలు కలది 12. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా - ఎర్రని కాంతితో బ్రహ్మాండాన్ని ముంచెత్తేది 13. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా - సంపెంగ, అశోక పూల సువాసన కల కురులు కలది 14. కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా - పద్మరాగ మణుల కిరీటం ధరించినది 15. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా - అష్టమి చంద్రుడిలా ప్రకాశించే నుదురు కలది 16. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా - చంద్రుడిలో మచ్చలా కస్తూరి బొట్టు కలది 17. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా - మన్మథుడి మంగళ తోరణం లాంటి కనుబొమలు కలది 18. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా - ముఖసౌందర్య ప్రవాహంలో చేపలా కదిలే కళ్ళు కలది 19. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా - కొత్త సంపెంగ పువ్వులాంటి ముక్కు కలది 20. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా - నక్షత్రాల కాంతిని మించిన ముక్కుపుడక కలది #తెలుసుకుందాం #ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః #🕉️ఓం శ్రీ మాత్రే నమః 🕉️🙏 #ఓం శ్రీ మాత్రే నమః #🙏🏻sri lalitha devi
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
707 వీక్షించారు
1 నెలల క్రితం
#ఓం శ్రీ మాత్రే నమః #🕉️ఓం శ్రీ మాత్రే నమః 🕉️🙏 #ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః #తెలుసుకుందాం #hindu temples #జ్ఞానప్రదాయిని కొల్లూరు మూకాంబిక ......!! కర్ణాటకలో పడమటి కొండలలో అందమైన కొండలు లోయలు ఫల వృక్షాల మధ్య కొల్లూరు లో మూకాంబికా క్షేత్రం ఉంది. #కామాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను విపరీతంగా బాధిస్తుంటే అందరూ పార్వతీదేవిని శరణు కోరారు. #కామాసురుడు ఒక మహిళ చేతులలోనే చస్తాడని గ్రహించిన దేవి వాడిని అవలీలగాసంహరించింది. ఆమె ధైర్యానికి మెచ్చి శివుడు ఇక్కడ తన కాలి మడమతో శ్రీ చక్రాన్ని సృష్టించి ప్రతిష్టించాడని ప్రతీతి. #ఆలయానికి కనీసం 1200 ఏళ్ళ చరిత్ర ఉంది. హలుగల్లు వీర సంగయ్య అనే రాజు అమ్మ వారి విగ్రహం చెక్కించాడని చెప్పుకొంటారు. #మంగుళూరు నుండి నూట ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉడిపి క్షేత్రానికి ఎనభై కిలోమీటర్ల దూరం కొండల మధ్య ప్రకృతి అందాలు విందు చేస్తుండగా కుడజాద్రి శిఖరంపై ఈ ఆలయం కనువిందు చేస్తుంది. #తమిళనాడుకు అతి సమీపంలో ఉంటుంది. బంగారు శిఖరంతో భక్త జనాల దృష్టిని ఆకర్షిస్తుంది. #ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మ వారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం. ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించటంతో మూకాంబికాదేవి ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది. #పంచముఖ గణేశ ప్రతిమ అద్భుత శిల్ప నైపుణ్యంతో విరాజిల్లుతుంది. #కర్ణాటకలోని ఏడు ముక్తిక్షేత్రాలలో కొల్లూరు ఒకటి. మిగిలినవి ఉడిపి, సుబ్రహ్మణ్య, కోడేశ్వర, శంకర నారాయణ, గొకర్ణ క్షేత్రాలు. #కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మావారు ప్రత్యక్షం అయ్యారట. #ఆదిశంకర్యాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. #దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచాయుల వెంట వస్తానని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తె చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట. #ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట. #అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు వెనక్కు తిరిగి చూశారట. #అలా మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్టించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని ప్రతీతి. #గర్భాలయం లో ''శంకర సింహాసనం'' ఉంది. మూకాంబిక సరస్వతి మహాకాళి, శక్తిలా సంయుక్త స్వరూపంగా భావిస్తారు. #అమ్మవారు కొలువైన కుడజాద్రి పర్వతం మీదనే ఆదిశంకరులు తపస్సు చేసిన అంబవనం, చిత్రమూలం ప్రదేశాలున్నాయి. #శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏 #సర్వేజనా సుఖినోభావంత్ 🙏🙏🙏🙏🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
678 వీక్షించారు
6 నెలల క్రితం
ల‌క్ష్మీ క‌టాక్షం కొరకు.........!! ఆ ల‌క్ష్మీ దేవి చ‌ల్ల‌గా చూస్తేనే మ‌న‌కు భోగ‌భాగ్యాలు, ఆస్తులు అంత‌స్తులు ద‌క్కేది. అందుకోస‌మే ఆమెను మొక్కులు, పూజ‌లు చేస్తుంటాం. అయితే ల‌క్ష్మీదేవిని తిధి ప్ర‌కారం పూజిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. ఆ తిధిని బ‌ట్టి చేయాల్సిన ప‌ద్ద‌తులు కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం. పాడ్యమి. ఈ రోజున ల‌క్ష్మీ దేవికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. విదియ. ఈ రోజున చ‌క్కెర‌తో అమ్మ‌వారికి అభిషేకం చేయాలి. తదియ. ఈ రోజున కూడా ఆవుపాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది చవితి. పిండివంటల నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు సంప్రాప్తిస్తాయి. పంచమీ. అరటిపళ్ళు నైవేద్యం నివేదించడం వలన మేథస్సు, బుద్ధిశక్తి దిగ్వినీకృతం అవుతుంది (పెరుగుతుంది). షష్ఠి. తేనెతో అభిషేకించి..తేనెను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది. అష్టమి. బెల్లం నీళ్ళతో అభిషేకించి, శుద్ధి బెల్లం ఎవరికయినా దానం ఇవ్వడం వలన అష్టకష్టాలు తీరిపోయి సుఖంగా ఉంటారు. నవమి. పేలాలు నైవేద్యం నివేదించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. దశమి. నల్లనువ్వులతో చేసిన నైవేద్యాన్ని పెట్టిన‌ట్ట‌యితే దీర్ఘాయుష్షు ల‌భిస్తుంది. #ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః #ఓం శ్రీమాత్రే నమః🙏🕉️🌹🙏 #శ్రీ మహాలక్ష్మి దేవి #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
698 వీక్షించారు
6 నెలల క్రితం
కమలాస్తోత్రమ్...........!! విష్ణు పురాణంలో అతర్గతంగా ఉన్న కమలా శ్లోకం ఇది సంకల్పసిద్ది, ధనప్రాప్తి , శుభకార్యాలు కలగ చేస్తుంది. శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు ఈ స్త్రోత్రన్నీ నిత్యం పారాయణ చెయాలి. శుక్ర గ్రహ దోష ప్రభావం వల్ల భార్యాభర్తలు దూరం అవుతారు, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటుంది. ఒకవేల విడిపోక పోయిన ఇద్దరు ఎక్కువ రోజులు ఒక చోట ఉండరు క్యాంప్ ఉద్యోగాలు, దూరప్రాంత లో ఉద్యోగం వల్లనో భార్యభర్త దూరంగా ఉంటారు, అలాగే మంచి చేసిన చెడు ఎదురు అవుతుంది, తమకు రావాల్సిన ప్రమోషన్ తమకన్నా కింద స్థాయి వారికి వెళ్తుంటుంది, ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా చేస్తున్న పనిలో ముందుకు వెళ్ల లేరు అభివృద్ధి ఉండదు. ఇవన్నీ శుక్రగ్రహ దోషం యొక్క ప్రభావం , ఈ శుక్రుడు లక్ష్మీ దేవి మరియు శివుని ఉపాసకుడు , లక్ష్మీ ఆవిర్భావం గురువారం అయినా శుక్రగ్రహ ప్రభావంతో బాధల నుండి విముక్తి కలగాలి అని శుక్రవారం రోజు లక్ష్మీ దేవి పూజ జరుపుకుంటారు. దశమహా విద్యలో లక్ష్మీ దేవిని కమలాత్మిక రూపంలో ఆరాధిస్తారు. ఈ స్త్రోత్రం , ఇక్కడ ఇస్తున్న అష్టోత్తరం ప్రతి శుక్రవారం చేయండి, ప్రతి రోజు ఒకసారి ఈ శ్లోకం చదువుకుంటే మంచిది. శ్లోకం :- ఓంకారరూపిణీ దేవి విశుద్ధసత్త్వరూపిణీ । దేవానాం జననీ త్వం హి ప్రసన్నా భవ సున్దరి ॥ తన్మాత్రంచైవ భూతాని తవ వక్షస్థలం స్మృతమ్ । త్వమేవ వేదగమ్యా తు ప్రసన్నా భవ సుందరి ॥ దేవదానవగన్ధర్వయక్షరాక్షసకిన్నరః । స్తూయసే త్వం సదా లక్ష్మి ప్రసన్నా భవ సున్దరి ॥ లోకాతీతా ద్వైతాతీతా సమస్తభూతవేష్టితా । విద్వజ్జనకీర్త్తితా చ ప్రసన్నా భవ సుందరి ॥ పరిపూర్ణా సదా లక్ష్మి త్రాత్రీ తు శరణార్థిషు । విశ్వాద్యా విశ్వకత్రీం చ ప్రసన్నా భవ సున్దరి ॥ బ్రహ్మరూపా చ సావిత్రీ త్వద్దీప్త్యా భాసతే జగత్ । విశ్వరూపా వరేణ్యా చ ప్రసన్నా భవ సుందరి ॥ క్షిత్యప్తేజోమరూద్ధయోమపంచభూతస్వరూపిణీ । బన్ధాదేః కారణం త్వం హి ప్రసన్నా భవ సుందరి ॥ మహేశే త్వం హేమవతీ కమలా కేశవేఽపి చ । బ్రహ్మణః ప్రేయసీ త్వం హి ప్రసన్నా భవ సుందరి ॥ చండీ దుర్గా కాలికా చ కౌశికీ సిద్ధిరూపిణీ । యోగినీ యోగగమ్యా చ ప్రసన్నా భవ సున్దరి ॥ బాల్యే చ బాలికా త్వం హి యౌవనే యువతీతి చ । స్థవిరే వృద్ధరూపా చ ప్రసన్నా భవ సున్దరి ॥ గుణమయీ గుణాతీతా ఆద్యా విద్యా సనాతనీ । మహత్తత్త్వాదిసంయుక్తా ప్రసన్నా భవ సున్దరి ॥ తపస్వినీ తపః సిద్ధి స్వర్గసిద్ధిస్తదర్థిషు । చిన్మయీ ప్రకృతిస్త్వం తు ప్రసన్నా భవ సుందరి ॥ త్వమాదిర్జగతాం దేవి త్వమేవ స్థితికారణమ్ । త్వమన్తే నిధనస్థానం స్వేచ్ఛాచారా త్వమేవహి ॥ చరాచరాణాం భూతానాం బహిరన్తస్త్వమేవ హి । వ్యాప్యవ్యాకరూపేణ త్వం భాసి భక్తవత్సలే ॥ త్వన్మాయయా హృతజ్ఞానా నష్టాత్మానో విచేతసః । గతాగతం ప్రపద్యన్తే పాపపుణ్యవశాత్సదా ॥ తావన్సత్యం జగద్భాతి శుక్తికారజతం యథా । యావన్న జ్ఞాయతే జ్ఞానం చేతసా నాన్వగామినీ ॥ త్వజ్జ్ఞానాత్తు సదా యుక్తః పుత్రదారగృహాదిషు । రమన్తే విషయాన్సర్వానన్తే దుఖప్రదాన్ ధ్రువమ్ ॥ త్వదాజ్ఞయా తు దేవేశి గగనే సూర్యమణ్డలమ్ । చన్ద్రశ్చ భ్రమతే నిత్యం ప్రసన్నా భవ సున్దరి ॥ బ్రహ్మేశవిష్ణుజననీ బ్రహ్మాఖ్యా బ్రహ్మసంశ్రయా । వ్యక్తావ్యక్త చ దేవేశి ప్రసన్నా భవ సున్దరి ॥ అచలా సర్వగా త్వం హి మాయాతీతా మహేశ్వరి । శివాత్మా శాశ్వతా నిత్యా ప్రసన్నా భవ సున్దరి ॥ సర్వకాయనియన్త్రీ చ సర్వభూతేశ్వరీ । అనన్తా నిష్కాలా త్వం హి ప్రసన్నా భవసున్దరి ॥ సర్వేశ్వరీ సర్వవద్యా అచిన్త్యా పరమాత్మికా । భుక్తిముక్తిప్రదా త్వం హి ప్రసన్నా భవ సున్దరి ॥ బ్రహ్మాణీ బ్రహ్మలోకే త్వం వైకుణ్ఠే సర్వమంగలా । ఇంద్రాణీ అమరావత్యామమ్బికా వరూణాలయే ॥ యమాలయే కాలరూపా కుబేరభవనే శుభా । మహానన్దాగ్నికోణే చ ప్రసన్నా భవ సున్దరి ॥ సున్దరీ! ఆప హమ పర ప్రసన్న హోం । నైఋర్త్యాం రక్తదన్తా త్వం వాయవ్యాం మృగవాహినీ । పాతాలే వైష్ణవీరూపా ప్రసన్నా భవ సున్దరి ॥ సురసా త్వం మణిద్వీపే ఐశాన్యాం శూలధారిణీ । భద్రకాలీ చ లంకాయాం ప్రసన్నా భవ సున్దరి ॥ రామేశ్వరీ సేతుబన్ధే సింహలే దేవమోహినీ । విమలా త్వం చ శ్రీక్షేత్రే ప్రసన్నా భవ సున్దరి ॥ కాలికా త్వం కాలిఘాటే కామాఖ్యా నీలపర్వత । విరజా ఓడ్రదేశే త్వం ప్రసన్నా భవ సుందరి ॥ వారాణస్యామన్నపూర్ణా అయోధ్యాయాం మహేశ్వరీ । గయాసురీ గయాధామ్ని ప్రసన్నా భవ సుందరి ॥ భద్రకాలీ కురూక్షేత్రే త్వంచ కాత్యాయనీ వ్రజే । మాహామాయా ద్వారకాయాం ప్రసన్నా భవ సున్దరి ॥ క్షుధా త్వం సర్వజీవానాం వేలా చ సాగరస్య హి । మహేశ్వరీ మథురాయాం చ ప్రసన్నా భవ సున్దరి ॥ రామస్య జానకీ త్వం చ శివస్య మనమోహినీ । దక్షస్య దుహితా చైవ ప్రసన్నా భవ సున్దరి ॥ విష్ణుభక్తిప్రదాం త్వం చ కంసాసురవినాశినీ । రావణనాశినాం చైవ ప్రసన్నా భవ సున్దరి ॥ ఫలస్తుతి:- లక్ష్మీస్తోత్రమిదం పుణ్యం యః పఠేద్భక్సింయుతః । సర్వజ్వరభయం నశ్యేత్సర్వవ్యాధినివారణమ్ ॥ ఇదం స్తోత్రం మహాపుణ్యమాపదుద్ధారకారణమ్ । త్రిసంధ్యమేకసన్ధ్యం వా యః పఠేత్సతతం నరః ॥ ముచ్యతే సర్వపాపేభ్యో తథా తు సర్వసంకటాత్ । ముచ్యతే నాత్ర సన్దేహో భువి స్వర్గే రసాతలే ॥ సమస్తం చ తథా చైకం యః పఠేద్భక్తిత్పరః । స సర్వదుష్కరం తీర్త్వా లభతే పరమాం గతిమ్ ॥ సుఖదం మోక్షదం స్తోత్రం యః పఠేద్భక్తిసంయుక్తః । స తు కోటీతీర్థఫలం ప్రాప్నోతి నాత్ర సంశయః ॥ ఏకా దేవీ తు కమలా యస్మింస్తుష్టా భవేత్సదా । తస్యాఽసాధ్యం తు దేవేశి నాస్తికించిజ్జగత్ త్రయే ॥ పఠనాదపి స్తోత్రస్య కిం న సిద్ధయతి భూతలే । తస్మాత్స్తోత్రవరం ప్రోక్తం సత్యం హి పార్వతి ॥ ॥ ఇతి శ్రీకమలా స్తోత్రం సమ్పూర్ణమ్ ॥ శ్రీ కమలా అష్టోత్తర శతనామావలీ...... శ్రీమహామాయాయై నమః । శ్రీమహాలక్ష్మ్యై నమః । శ్రీమహావాణ్యై నమః । శ్రీమహేశ్వర్యై నమః । శ్రీమహాదేవ్యై నమః । శ్రీమహారాత్ర్యై నమః । శ్రీమహిషాసురమర్దిన్యై నమః । శ్రీకాలరాత్ర్యై నమః । శ్రీకుహవై నమః । శ్రీపూర్ణాయై నమః । ౧౦ ఆనన్దాయై నమః । శ్రీఆద్యాయై నమః । శ్రీభద్రికాయై నమః । శ్రీనిశాయై నమః । శ్రీజయాయై నమః । శ్రీరిక్తాయై నమః । శ్రీమహాశక్త్యై నమః । శ్రీదేవమాత్రే నమః । శ్రీకృశోదర్యై నమః । శ్రీశచ్యై నమః । ౨౦ శ్రీఇన్ద్రాణ్యై నమః । శ్రీశక్రనుతాయై నమః । శ్రీశఙ్కరప్రియవల్లభాయై నమః । శ్రీమహావరాహజనన్యై నమః । శ్రీమదనోన్మథిన్యై నమః । శ్రీమహ్యై నమః । శ్రీవైకుణ్ఠనాథరమణ్యై నమః । శ్రీవిష్ణువక్షస్థలస్థితాయై నమః । శ్రీవిశ్వేశ్వర్యై నమః । శ్రీవిశ్వమాత్రే నమః । ౩౦ శ్రీవరదాయై నమః । శ్రీఅభయదాయై నమః । శ్రీశివాయై నమః । శ్రీశూలిన్యై నమః । శ్రీచక్రిణ్యై నమః । శ్రీపద్మాయై నమః । శ్రీపాశిన్యై నమః । శ్రీశఙ్ఖధారిణ్యై నమః । శ్రీగదిన్యై నమః । శ్రీమూణ్డమాలాయై నమః । ౪౦ శ్రీకమలాయై నమః । శ్రీకరుణాలయాయై నమః । శ్రీపద్మాక్షధారిణ్యై నమః । శ్రీఅమ్బాయై నమః । శ్రీమహావిష్ణుప్రియఙ్కర్యై నమః । శ్రీగోలోకనాథరమణ్యై నమః । శ్రీగోలోకేశ్వరపూజితాయై నమః । శ్రీగయాయై నమః । శ్రీగఙ్గాయై నమః । శ్రీయమునాయై నమః । ౫౦ శ్రీగోమత్యై నమః । శ్రీగరుడాసనాయై నమః । శ్రీగణ్డక్యై నమః । శ్రీసరయ్వై నమః । శ్రీతాప్యై నమః । శ్రీరేవాయై నమః । శ్రీపయస్విన్యై నమః । శ్రీనర్మదాయై నమః । శ్రీకావేర్యై నమః । శ్రీకోదారస్థలవాసిన్యై నమః । ౬౦ శ్రీకిశోర్యై నమః । శ్రీకేశవనుతాయై నమః । శ్రీమహేన్ద్రపరివన్దితాయై నమః । శ్రీబ్రహ్మాదిదేవనిర్మాణకారిణ్యై నమః । శ్రీదేవపూజితాయై నమః । శ్రీకోటిబ్రహ్మాణ్డమధ్యస్థాయై నమః । శ్రీకోటిబ్రహ్మాణ్డకారిణ్యై నమః । శ్రీశ్రుతిరూపాయై నమః । శ్రీశ్రుతికర్య్యై నమః । శ్రీశ్రుతిస్మృతిపరాయణాయై నమః । ౭౦ శ్రీఇన్దిరాయై నమః । శ్రీసిన్ధుతనయాయై నమః । శ్రీమాతఙ్గ్యై నమః । శ్రీలోకమాతృకాయై నమః । శ్రీత్రిలోకజనన్యై నమః । శ్రీతన్త్రాయై నమః । శ్రీతన్త్రమన్త్రస్వరూపిణ్యై నమః । శ్రీతరుణ్యై నమః । శ్రీతమోహన్త్ర్యై నమః । శ్రీమఙ్గలాయై నమః । ౮౦ శ్రీమఙ్గలాయనాయై నమః । శ్రీమధుకైటభమథిన్యై నమః । శ్రీశుమ్భాసురవినాశిన్యై నమః । శ్రీనిశుమ్భాదిహరాయై నమః । శ్రీమాత్రే నమః । శ్రీహరిపూజితాయై నమః । శ్రీశఙ్కరపూజితాయై నమః । శ్రీసర్వదేవమయ్యై నమః । శ్రీసర్వాయై నమః । శ్రీశరణాగతపాలిన్యై నమః । ౯౦ శ్రీశరణ్యాయై నమః । శ్రీశమ్భువనితాయై నమః । శ్రీసిన్ధుతీరనివాసిన్యై నమః । శ్రీగన్ధార్వగానరసికాయై నమః । శ్రీగీతాయై నమః । శ్రీగోవిన్దవల్లభాయై నమః । శ్రీత్రైలోక్యపాలిన్యై నమః । శ్రీతత్త్వరూపతారుణ్యపూరితాయై నమః । శ్రీచన్ద్రావల్యై నమః । శ్రీచన్ద్రముఖ్యై నమః । ౧౦౦ శ్రీచన్ద్రికాయై నమః । శ్రీచన్ద్రపూజితాయై నమః । శ్రీచన్ద్రాయై నమః । శ్రీశశాఙ్కభగిన్యై నమః । శ్రీగీతవాద్యపరాయణ్యై నమః । శ్రీసృష్టిరూపాయై నమః । శ్రీసృష్టికర్యై నమః । శ్రీసృష్టిసంహారకారిణ్యై నమః । #ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః #ఓం శ్రీమాత్రే నమః🙏🕉️🌹🙏 #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శ్రీ మహాలక్ష్మి దేవి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
675 వీక్షించారు
6 నెలల క్రితం
శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం...............!! ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు... పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు . శత్రుదుర్భేధ్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరిసంపదలతో , భోగభాగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఏలోటు లేకుండా తులతూగుతుండేవారు . అలా ఉన్నాకూడా! రాజు గజపతివర్మ తన మంత్రి శూరసేనుడుతో కలసి మారువేషంలో రాజ్యంలోతిరిగి ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకునేవాడు ఆ రాజ్యంలో అందరు ధనికులే అయినప్పటికీ శాంతశీల అనే పేదరాలు ఉండేది. ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి. ఒక రోజు రాజు ,మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళ్ళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు . దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి.. నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో'' అని అంటాడు . కాని రుద్రసేనుడు ''తమరు ఆపదలో ఉంటే కాపాడానే గాని ఏదో ఆశించి మాత్రం కాదు'' అని వీరోచితంగా అంటాడు . దానికి రాజు సంతోషించి ''నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్న తనని కోరమని ''చెప్పి వెళ్ళిపోతాడు . ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది . అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టేలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు అప్పుడు తను తన పేదరికం గురించి చెప్పినపుడు . ఆ మునీశ్వరుడు ''తల్లి ఒకవిషయం చెబుతాను శ్రద్దగా విను . లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లో అయినా.. దీపం లేకుండా వుండిన ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో.. అప్పుడు నల్లని చీర ధరించిన ఒకామే నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూంది. అప్పుడు నువ్వామెని అడ్డగించి బయటకి వెళ్ళితే లోపలికి రాకూడదని షరతు విధించు. అప్పుడామె నేను లోపల వుండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది. ఇంకొకామే పట్టుపితాంబరాలతో ధగధగామెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అమెని కూడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు. అమె అప్పుడు బయటి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటుంది . ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావని ''మునీశ్వరుడు చెప్పినది గుర్తుకువస్తుంది . వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోను దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది . వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలోఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లుగా..చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ వుంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్ధించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ''ఇకపై ప్రతి శుక్రవారం ఎవరైతే.. సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను ''అని వరం ప్రసాదిస్తుంది . ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు. #ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః #ఓం శ్రీమాత్రే నమః🙏🕉️🌹🙏 ##పురాణాలూ_కథలు #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️