#హాయ్ అందరికీ నమస్తే 🕺🤝🌺 #😴శుభరాత్రి
తొలి సంధ్యవేళ కోడి కూయకముందే ఇంటి ముందుకు అతిథిలా వస్తాడు. జోరువానలోనూ... ఎముకలు కొరికే చలిలోనూ తానెవరో సమాజానికి కనిపించకుండా సైకిల్పై వచ్చి నిత్యనూతన సమాచారాన్ని అందించే తొలి సామాజిక కార్యకర్త అతడు. చీకటి తెరలను చీల్చుకుంటూ పేపర్ చేతిలో పెట్టుకుని ప్రతి ఇల్లూ తిరుగుతూ సార్.. పేపర్ అంటూ వేడి వేడి వార్తలను మన ముంగిటకు చేర్చే కనిపించని వ్యక్తే పేపర్ బాయ్..
భారత రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యార్థి దశలో పేపర్బాయ్గా పని చేశారు. తన విద్యార్థి దశలో పుస్తకాల ఖర్చుల కోసం తెల్లవారుజామునే లేచి ఇంటింటా పేపరు వేసేవారు. ఇక ప్రఖ్యాత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రాపూరి భరద్వాజ కూడా పేపర్బాయ్గా పని చేశారు. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న రోజుల్లో బాలగంగాధర్ తిలక్ సైతం పీపుల్స్వార్ పత్రికకు కొన్నాళ్లపాటు పేపర్బాయ్గా పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు, మహాను బావులు పేపర్బాయ్లుగా పనిచేసిన వారే.
తొలి పేపర్ బాయ్గా గుర్తింపు పొందిన బార్నీ ప్లాహెర్డీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబరు 4న అంతర్జాతీయ పేపర్బాయ్ దినోత్సవం జరుపుతున్నారు తమ విశ్వసనీయ
_*కప్పాటి పాండురంగా రెడ్డి*_
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
#😃మంచి మాటలు #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)