🕉️కృష్ణం వందే జగద్గురుమ్🙏

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
465 views
3 hours ago
పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వారిని పరామర్శించడానికి కామ్యకవనానికి వచ్చాడు. అప్పుడు ద్రౌపది తన ఆవేదనను ఆపుకోలేక కన్నీరుమున్నీరై ఇలా పలికింది: "ప్రభూ! ధర్మపరులైన పాండవుల భార్యను, ద్రుపద మహారాజు పుత్రికను, నీ ప్రియసఖిని అయిన నన్ను సభలో నిలబెట్టి దాసిగా మార్చారు! భీముడి అపార బలం ఏమైంది? పార్థుడి గాండీవం ఎక్కడ దాక్కుంది? ప్రద్యుమ్నుడితో సమానులైన ఐదుగురు కుమారులున్నా మేము అనాథలమయ్యాము. కృష్ణా... నాకు నువ్వు తప్ప ఎవరూ దిక్కు లేరు!" ఆమె దీనస్థితిని చూసి చలించిన వాసుదేవుడు ఆనాడు చారిత్రాత్మకమైన వాగ్దానం చేశాడు: "కల్యాణీ! నీ కన్నీటికి కారణమైన వారి భార్యలు కూడా రేపు నీలాగే కన్నీరు కారుస్తారు. అర్జునుడి వాడి బాణాలకు శరీరాలు చీలి, రక్తపు మడుగులో పడివున్న భర్తల శవాలను చూసి వారు గుండెలవిసేలా రోదిస్తారు. నువ్వు మళ్లీ మహారాజులకు పట్టపురాణివి అవుతావు. ఆకాశం నేలకూలినా, హిమవత్పర్వతం బద్దలైనా, భూమి బూడిదైనా, మహాసాగరాలే ఇంకిపోయినా... ఈ కృష్ణుడి మాట మాత్రం ఎప్పటికీ వ్యర్థం కాదు!" రాయబార వేళ శాంతి vs ధర్మం కురుసభకు కృష్ణుడు రాయబారిగా వెళ్లే సమయంలో, పాండవులు శాంతి కోసం మాట్లాడినప్పుడు ద్రౌపది మళ్లీ కన్నీటితో తన విడిచిన కురులను చూపించింది. తనపై జరిగిన అవమానాన్ని శాంతి పేరుతో మర్చిపోతారేమోనని ఆమె తల్లడిల్లింది. అప్పుడు కూడా కృష్ణుడు ఆమెకు భరోసా ఇచ్చాడు: "పాంచాలీ! దుర్బుద్ధి గల దుర్యోధనుడు సంధికి ఎప్పటికీ తలఒగ్గడు. యుద్ధం అనివార్యం! నీ కన్నీటికి ఆ రణరంగమే సరైన న్యాయం చేస్తుంది!" కురుక్షేత్రంలో అధర్మ నిర్మూలన – న్యాయం గెలిచిన వేళ కృష్ణుడు పలికిన ప్రతి మాటా కురుక్షేత్ర సంగ్రామంలో అక్షరసత్యమై నిలిచింది: 17వ రోజు – ప్రతీకార జ్వాల: ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొచ్చిన దుశ్శాసనుడి రొమ్ము చీల్చి, భీమసేనుడు తన శపథాన్ని నెరవేర్చుకున్నాడు. అదే రోజు రథచక్రం నేలలో కూరుకుపోయినప్పుడు కర్ణుడు ధర్మం గురించి మాట్లాడగా, కృష్ణుడు గర్జించాడు: "ద్రౌపదిని బంధకి అని నిందించి, వస్త్రాలు లాగమని ఆదేశించిన నాడు ఎక్కడికి పోయింది కర్ణా నీ ధర్మం? అధర్మాన్ని ఆశ్రయించిన వారికి ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు! పార్థా... ఏమాత్రం సంకోచించకు, బాణం సంధించు!" — ఆ మరుక్షణమే కర్ణుడు నేలకొరిగాడు. 18వ రోజు – దురహంకార పతనం: సభలో ద్రౌపదికి తొడ చూపి అవమానించిన దుర్యోధనుడిని, శ్రీకృష్ణుడి సంకేతంతో భీముడు గదాఘాతంతో తొడలు విరగ్గొట్టి సంహరించాడు. శ్రీకృష్ణుడు నాడు ద్రౌపదికి ఇచ్చిన మాట ప్రకారం అధర్మపరులంతా తుదముట్టారు. ద్రౌపది గౌరవం పునరుద్ధరించబడింది. "యతో ధర్మస్తతో కృష్ణః, యతో కృష్ణస్తతో జయః" ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు; ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం తథ్యం! 🪈 #🦚 హరే కృష్ణ 🦚 #హరే కృష్ణ #💗నా మనస్సు లోని మాట #🗣️జీవిత సత్యం #🕉️కృష్ణం వందే జగద్గురుమ్🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
596 views
14 hours ago
శ్రీకృష్ణుడు పుట్టినపుడు జరిగిన 5 సంఘటనలు శ్రీ కృష్ణుడు జన్మించిన రాత్రి 5 సంఘటనలు జరిగాయి.. అవేంటో తెలుసా వాసుదేవుడు శ్రీ కృష్ణుడు బిడ్డడుగా ఉన్నప్పుడే యోగమాయం ప్రభావంతో మధురలో ఉన్న జైలు నుంచి బయటకు వచ్చి యమునా నదిని దాటి గోకులంలో ఉన్న నందుడి దగ్గరకు చేరుకున్నాడు. అనంతరం నందుడి పాపను తాను తీసుకుని కృష్ణుడిని అతడికి అప్పగించాడు. హిందు ధర్మంలో శ్రీ కృష్ణుడికి విశేషమైన స్థానముంది. భావి తరాలు ధర్మం ప్రకారం నడుచుకునేలా పవిత్రమైన భగవద్గీతను బోధించిన పరమ పావనమూర్తి ఆ మాధవుడు. అంతేకాకుండా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ ప్రభావం తన ముఖంపై కనపడనీయకుండా ఉంటాడు. ప్రతి సమస్యను తన చిరునవ్వుతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని ఎలా అధిగమించాలో ప్రతి అంశాన్ని భగవద్గీతలో పొందుపరిచారు. అంతటి మురళీ మోహనుడు జన్మించిన రాత్రి 5 ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి. మరి వాసుదేవుడు జన్మించిన రోజు జరిగిన 5 ప్రత్యేక ఘటనలేంటో సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం... కృష్ణుడికి గొడుగుగా మారిన ఆదిశేషుడు శ్రీ కృష్ణుడు జన్మించినపుడు జైలులో ఉన్నవారందరూ యోగమాయ ప్రభావంతో గాఢ నిద్రలో ఉండిపోయారు. జైలు తలుపులు కూడా వాటంతట అవే తెరచుకున్నాయి. అంతేకాకుండా ఆ రోజు రాత్రి వర్షం కూడా తీవ్రంగా కురిసింది. ఆ వర్షంలోనే కృష్ణుడు తండ్రి అయిన వాసుదేవుడు ఓ బుట్టలో చిన్ని కృష్ణుడిని ఉంచి జైలు నుంచి తీసుకెళ్లాడు. కన్నయ్య వానలో తడవకుండా ఆదిశేషుడు పడగ గొడుగులా పట్టి ఆదేవదేవుడి సేవ చేసుకున్నాడు.ఆ వర్షంలోనే మధుర నుంచి రేపల్లేలో నివసిస్తున్న నందుడి దగ్గరకి చిన్నికృష్ణుడిని తీసుకెళ్లాడు. అయితే, వాసుదేవుడు ఆ తీవ్ర ఘటననను మనసులో పెట్టుకోలేదు. యమునా నది రెండుగా విడిపోయింది శ్రీ కృష్ణుడు పుట్టిన సమయంలో భారీ వర్షాలు కురిశాయి. యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ విచ్చలవిడిగా ఉంది. వాసుదేవుడు బుట్టలో కన్నయ్యను తీసుకుని యమునా నదీ తీరానికి చేరగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది. యమునా నదిలోని నీరు చిన్ని కృష్ణుడి పాదాలను తాకి రెండు భాగాలుగా విడిపోయింది. ఆ రెండు భాగాల మధ్య మార్గంలో వాసుదేవుడు ప్రయాణించి గోకులాన్ని చేరుకున్నాడు. నందుడి ఇంటికి కన్నయ్యను చేరవేశాడు. వాసుదేవుడు పిల్లలను మార్చాడు యమునా నదిని దాటిన అనంతరం వాసుదేవుడు కన్నయ్యను గోకులంలోని నందుడి ఇంటికి చేరాడు. అప్పటికే నందుడి భార్య ఆయశోధ ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో వాసుదేవుడు కృష్ణుడిని యశోద పక్కన ఉంచి చిన్ని పాపను తన వెంట తీసుకెళ్లాడు. ఈ విషయం నందుడికి మినహా మిగిలిన వారెవరికి తెలియకపోవడం గమనార్హం. ఆ విధంగా కన్నయ్య దేవకి తనయుడి నుంచి యశోద సుతుడికి ప్రసిద్ధి గాంచాడు. వాసుదేవుడికి నందుడు స్వాగతం పురాణాల ప్రకారం కూతురు పుట్టినప్పుడే నందుడికి ఈ విషయం తెలుసు. వాసుదేవుడు కృష్ణుడిని తీసుకువస్తున్నాడని, తన పాప స్థానంలో చిన్ని కృష్ణుడిని ఉంచాలని వాసుదేవుడి కోసం తలుపు దగ్గరే నిలబడి వేచిచూస్తున్నాడు. వాసుదేవుడు వచ్చిన తరువాత తన చేతిలో ఉన్న కృష్ణుడిని నందుడికిచ్చి నందుడి దగ్గర ఉన్న పాపను వాసుదేవుడు తీసుకెళ్లాడు. అయితే అనంతరం ఈ సంఘటనను వాసుదేవుడు, నందుడు ఇద్దరూ మర్చిపోయారు. ఇదంతా యోగమాయ ప్రభావంతో జరిగింది. వింధ్యాచల శక్తిదేవతగా అవతరణ నందుడి ఇంట్లో శ్రీ కృష్ణుడిని విడిచిపెట్టిన అనంతరం వాసుదేవుడు పాపతో నిశ్శబ్దంగా మధురా నగరంలో ఉన్న కంసుడి జైలుకు వచ్చాడు. అనంతరం దేవకి తన ఎనిమిదవ సంతానాన్ని కనిందని తెలుసుకున్న కంసుడు జైలుకు చేరుకున్నాడు. అతడు ఆ నవజాత శిశువును చంపాలని భావించాడు. ఇంతలో ఆ పాప అకస్మాత్తుగా ఆకాశానికి చేరుకుంది. అంతేకాకుండా తన దైవిక రూపాన్ని ప్రదర్శించి కంసుడికి తన మరణాన్ని గురించి తెలియజేసింది. ఆ తర్వాత ఆమె వింధ్యాచల పర్వతంపై దేవతగా వెలుగొందింది. ఆమెనే విధ్యాచల శక్తిదేవతగా భక్తులు పూజిస్తారు. #🙏హ్యాపీ కృష్ణాష్టమి🙏 #కృష్ణం వందే జగద్గురుం #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #💗నా మనస్సు లోని మాట
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
522 views
14 hours ago
ఈ రోజు ప్రశ్న కు సమాధానం. ప్రశ్న : శ్రీ కృష్ణుని కోరిక పై విశ్వకర్మ చేసిన రెండు బాల కృష్ణుని విగ్రహాలు పూజలందుకొంటున్న క్షేత్రాలు ఏవి. సమాధానం : పుట్టగానే కన్న వాళ్లకు దూరమై యశోద నందుల వద్ద పెరిగిన శ్రీ కృష్ణుడు. తన అవతార లక్ష్యాలు అన్ని పూర్తి అయ్యాక తనను పెంచిన తల్లి తండ్రులు అయిన యశోద నందులు, కన్న తల్లి తండ్రులు అయిన దేవకీ వాసుదేవులతో కలిసి ఎంతో సంతోషం గ ఉన్న సమయం అది. ఆలా ఉండగా ఒక రోజు దేవకీ దేవి శ్రీ కృష్ణుని వద్దకు వచ్చి. కన్నయ్య నీ బాల్యన్ని చూసి నీ బాల్య లీలలను దగ్గర నుండి చూసిన యశోద నందులు ఎంతో అదృష్టవంతులు.నేను నీ బాల్యన్ని చూడలేక పోయాను. ఆని బాద పడగా శ్రీ కృష్ణుడు ఆమె ను ఓదార్చి అమ్మ నీకు ఏం కావాలి చెప్పు ఆని అడుగుతాడు. అప్పుడు దేవకీ దేవి ఇలా అంటుంది. నువ్వు బాల్యం లో ఎలా ఉండేవాడివో చూడాలని కోరిక గ ఉంది నాయన ఆని చెప్పగా అప్పుడు శ్రీ కృష్ణుడు వెంటనే విశ్వకర్మ ను పిలిచి తన బాల్య రూపం లోని రెండు విగ్రహాలు చేసి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు విశ్వకర్మ రెండు విగ్రహాలు చేసి ఇస్తాడు. అందులో ఒకటి బ్రహ్మదేవుని కి శ్రీ కృష్ణుడు దర్శనం ఇచ్చిన రూపం ఆ రూపం లో చేతిలో పెరుగన్నం ముద్ద ఇంకో చేతి నీ నడుము పై ఉంచుకొని మొల కు కొమ్ముబూర వేలాడుతూ ఉండే రూపం.ఐతే రెండవది శ్రీ కృష్ణుని పసి రూపం. ఆ రూపం లో ఒక చేతిలో కవ్వం ఇంకో చేతిలో చిన్న తాడు పట్టుకుని ఉన్న రూపం. దేవకీ దేవి ఎంతో సంతోషం తో ఆ విగ్రహాలను స్వీకరించి వాటిని ఎంతో ముద్దు గ చూసుకొంటూ ఉంటుంది. ***** శ్రీ కృష్ణుడు తన అవతారం సమాప్తి చేసాక.. ద్వారక నగరం సముద్రం లో మునిగిపోతున్న సమయం లో దేవకీ దేవి వద్ద ఉన్న రెండు విగ్రహాలలో బ్రహ్మ దేవునికి దర్శనం ఇచ్చిన రూపం లోని విగ్రహాన్ని వాయుదేవుడు, దేవగురువు బృహస్పతీ కలిసి రక్షించి కేరళ దేశం లోకి తెచ్చి ప్రతిష్ట చేస్తారు. ఆ విగ్రహం పూజలు అందుకొనే ఆలయమే కేరళ ప్రజల ఆరాధ్య ఆలయం అయినా గురువాయుర్. **** ఇక రెండో విగ్రహం ద్వారక భూగర్భం లో కలిసిపోయింది కొన్ని వేల ఏళ్ళ తరువాత **** ఒక నాడు వాయుదేవుని అంశ అయిన మధ్వాచార్యుల వారు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు వారికి దూరం గ ఒక పెద్ద ఓడ తుఫాను లో చిక్కుకొని తీరం తెలియక ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించి ఆయన తన పంచె ను ఒక కర్ర కు కట్టి ఓడ లోని వారికి కనిపించేలా ఊపుతారు. అప్పుడు ఓడ లోని వారు తీరాన్ని గమనించి ఒడ్డు కు చేరుకొంటారు. ఒడ్డు కు చేరాక ఆ ఓడ యజమాని మధ్వాచార్యుల వారిని సమిపించి ఆయనకు నమస్కరించి. ఇలా అంటాడు స్వామి మా ప్రాణాలు కాపాడారు మా ఓడ లోకి రండి మీకు ఏం కావాలో తీసుకోండి అనీ అంటాడు. అప్పుడు మధ్వాచార్యుల వారు తనకు ఏమీ అవసరం లేదని చెప్పిన ఆ నావికుడు వినకుండా ప్రాధేయపడడం తో సరే ఆని ఓడ లోకి వెళ్ళి చూడగా ఓడ మొత్తం బంగారు, వజ్రాలు, రత్నాల తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు మధ్వాచార్యుల వారు ఓడ మొత్తం తిరిగి ఒక మూల ఉన్న గోపి చందనం గడ్డ లను చూసి అందులో ఉన్న ఒక పెద్ద గడ్డ ను తనకు ఇమ్మంటాడు. గోపి చందనం అంటే ద్వారక లో మాత్రమే దొరికే ఒక రకమైన మట్టి. ఆ మట్టి నీ తిలకం లాగ దరిస్తారు. అది చూసి నావికుడు అంటాడు స్వామి అవి బరువు సమాతూకం చెయ్యడం కోసం పెట్టిన రాళ్లు అవి ద్వారక లో దొరికే సాధారణ రాళ్లు ఎందుకు మీకు అంటే అప్పుడు మధ్వాచార్యుల వారు నాకు అదే కావాలి అనడం తో సరే అనీ ఆ గోపి చందనం గడ్డ ను ఇస్తాడు. కిందకు తెచ్చి ఆ మట్టి గడ్డ ను కరిగించగా అందులోనుంచి విశ్వకర్మ తయారు చేసిన రెండో బాల కృష్ణుని విగ్రహం వస్తుంది. అప్పుడు దివ్యద్రుష్టి తో గ్రహించిన మధ్వాచార్యుల వారు ఆ విగ్రహానికి ఒక ఆలయం నిర్మించి ఎనిమిది మఠాలను రెండేళ్ల పాటు ఒక్కో మఠం వారికి ఆలయ బాధ్యత అప్పగించేలా ఏర్పాటు చేశారు. ఆ రెండో ఆలయమే కర్ణాటక లోని ఉడిపి చిన్నికృష్ణుని ఆలయం. అంటే ఆ రెండూ క్షేత్రాలు ఒకటి గురువాయుర్ ఐతే రెండో క్షేత్రం ఉడిపి. #🙏హ్యాపీ కృష్ణాష్టమి🙏 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #కృష్ణం వందే జగద్గురుం #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః