🕉️ జాపాలి ఆంజనేయ స్వామి 🚩

the MEDIA POWER
26.6K views
1 months ago
🎯తెలంగాణ RTCలో కొత్త సేవలు! 🚌🚖 ఇక బస్సు + ఆటో టికెట్ ఒకేసారి బుక్ చేసుకోవచ్చు | ప్రయాణికులకు గుడ్ న్యూస్! _______ తెలంగాణ RTC రాష్ట్రవ్యాప్తంగా చివరి మైలు (Last Mile Connectivity) సేవలను మెరుగుపరచేందుకు కొత్త ఆటో సేవలను ప్రారంభించనుంది. ఇకపై బస్సు టికెట్‌తో పాటు ఆటో టికెట్‌ను కూడా ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించనుంది. బస్ స్టాప్ నుంచి మీ గమ్యస్థానం వరకు సులభంగా చేరుకునేలా ఈ కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. _______ 💬 ఈ కొత్త సేవపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్‌లో చెప్పండి. 👍 వీడియో నచ్చితే Like చేయండి. 🔄 మీ స్నేహితులతో Share చేయండి. 🔔 తాజా తెలుగు వార్తల కోసం Rajh News TV ని Follow & Subscribe చేయండి. ________ #TSRTC #TelanganaRTC #Telangana #AutoService #LastMileConnectivity #BusTicket #AutoTicket #Transport #Hyderabad #TeluguNews #BreakingNews #LatestNews #RajhNewsTV ##RAJHన్యూస్
PSV APPARAO
746 views
3 months ago
#🕉️ జాపాలి ఆంజనేయ స్వామి 🚩 #జాపాలి తీర్థం #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: హనుమజ్జయంతి / హనుమాన్ జయంతి / హనుమాన్ జన్మోత్సవం 👆 *జాపాలి హనుమాన్ కు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పణ* తిరుమల, 2026 మే 12: హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరపున ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం ఉదయం పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో, అదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు సింధూర వస్త్రంతో ఈవో, అదనపు ఈవోలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమజ్జయంతి రోజున జాపాలి హనుమాన్ కు టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు జరుగుతున్నాయని, భక్తులందరూ సంతోషంగా దర్శనాలు చేసుకుంటున్నారని చెప్పారు. భక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు టీటీడీ ఈఓ మరియు అదనపు ఈఓ లు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారి మూలమూర్తికి జరిగిన ప్రత్యేక అభిషేకంలో కూడా పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.