తమిళనాడు రాజకీయాలు 🚩🥱

P.Venkateswara Rao
584 views
10 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *ఊరంతా ఓ దారి – ఈ ప్రేమలతది మరో దారి – రోతనిధికి జైకొట్టే దారి‼️* August 5, 2026🎯 వల్గర్ నిధి… ఇప్పుడు కొత్తేమీ కాదు… శశికళ- పళనిస్వామి మీద- తరువాత సనాతన ధర్మం మీద – టీవీకే ఎమ్మెల్యేల మీద… అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్ మరణాల మీద… ఇప్పుడు త్రిష- విజయ్ మీద… మధ్యమధ్యలో చాలా వికారాలున్నాయి… అధికార మదం, ధన మదం వంటి చాలా ‘మదాలు’… ఈ మాట అనడానికి సందేహించనక్కర్లేదు… బహిరంగసభలో… ఓ ప్రతిపక్షనేత హోదాలో ఉండి… కావేరీ జలాల సున్నిత సమస్య మీద నిరసన సభ నిర్వహిస్తూ… ఎంత హుందాగా ఉండాలి..? డబుల్ మీనింగు మాటలతో తన అసలు రోతతత్వాన్ని ప్రదర్శించుకున్నాడు..? దాదాపు మహిళా సెలబ్రిటీలందరూ, ఇతర పార్టీల నేతలందరూ థూత్కరించారు అతన్ని..! విజయ్ ఆ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి… తన వ్యక్తిగత జీవితంపై ఆ సందర్భంలో వెగటు వ్యాఖ్యలేమిటి..? సరే, డీఎంకే సమర్థించింది… తప్పదు… స్టాలిన్ కస్సుమన్నాడు విజయ్ మీద, దద్దమ్మ ప్రభుత్వం, అహంకారంతో నాశనమైపోతావ్ అంటూ… కానీ ఒకప్పుడు డీఎంకేతో అంటకాగిన ఏ పార్టీ కూడా వల్గర్ నిధిని సమర్థించలేదు… ఒకే ఒక్కరు తప్ప!! అదీ ఓ మహిళ కావడం ఆశ్చర్యం! మరీ అంతగా స్టాలిన్ పాదపూజ అవసరమా..? ఆమె పేరు ప్రేమలత… విజయకాంత్ అనే సినిమా హీరో కమ్ రాజకీయ నాయకుడు, డీఎండీకే పార్టీ అధినేత గుర్తున్నాడు కదా… తన భార్య ఈమె… ఆయన మరణం తరువాత ఈమే పార్టీ బాధ్యతలు చూస్తోంది… ఆమె వల్గర్ నిధి వ్యాఖ్యలపై ఏమని స్పందించిందో తెలుసా..? ప్రతిపక్ష గొంతును అణచివేయడమే: ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ప్రజాస్వామ్యంలో వ్యతిరేక గొంతులను అణచివేయడానికి ప్రభుత్వం పోలీసులను దుర్వినియోగం చేస్తోందని ఆమె తీవ్రంగా ఖండించింది. అభిప్రాయ స్వేచ్ఛ: ఒక రాజకీయ నాయకుడిగా లేదా పౌరుడిగా ఎవరైనా తమ అభిప్రాయాలను లేదా విమర్శలను వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని, దాన్ని నేరంగా పరిగణించి అరెస్టులు చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడింది. రాజకీయంగానే ఎదుర్కోవాలి: రాజకీయ విమర్శలను రాజకీయాల ద్వారానే ఎదుర్కోవాలి తప్ప, ఇలా అరెస్టుల బాట పట్టడం వల్ల స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని, ఇది ప్రభుత్వ వ్యతిరేక అసంతృప్తిని మరింత పెంచుతుందని ప్రేమలత హెచ్చరించింది… తమది నీటి పోరాటం అట, విజయ్‌ది నటి పోరాటం అట… అదీ ఈ మహిళా నేత బాష్యం… ఖర్మ !! …… ఇవి వింటుంటే ఆమె మేధోస్థాయి అర్థమవుతోంది కదా… అమ్మా, తోటి మహిళపై కారుకూతలు కూశాడు, నువ్వు కీర్తిస్తున్న నాయకుడు… ఇందులో ప్రతిపక్షాల గొంతుల్ని అణిచివేయడం ఏముంది..? ప్రతిపక్షనేత అంటే కారుకూతలు, రోతమాటల కర్తవ్యం కాదమ్మా… అభిప్రాయ స్వేచ్ఛ అంటే ఇది కాదు… పోనీ, నిన్ను ఇలాగే ఎవరైనా నిందిస్తే, జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తే, దాన్నీ అభిప్రాయ స్వేచ్ఛ అని వదిలేస్తావా..? ఇందులో రాజకీయంగా ఎదుర్కునేది ఏముంది..? మీ ఆరాధ్య యువనేత చేసింది తప్పు, నేరం, ప్రభుత్వం స్పందించింది, దమ్ముంది, అరెస్టు చేసింది… ఎటొచ్చీ నువ్వే విజయకాంత్ పేరును భ్రష్టుపట్టిస్తున్నావమ్మా..!!
P.Venkateswara Rao
587 views
1 months ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *స్టాలిన్ పుణ్యమా అని.. అలర్ట్ అవుతున్న విజయ్❗* 29.06.2926🎯 తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీకి చెందిన మరొక ఎమ్మెల్యే, మాజీ మంత్రి విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన గతంలో అన్నా డీఎంకే సర్కారులో రవాణాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. విజయ్ ముఖ్యమంత్రిగా టీవీకే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇది ఆరవ రాజీనామా కావడం గమనార్హం. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు టీవీకే లో చేరి ఉప ఎన్నికల్లో నెగ్గుతారనే ప్రచారం తమిళనాడు రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ప్రభుత్వానికి ప్రస్తుతం సరిపడా బలం ఉన్నప్పటికీ.. ఎందుకు ఇన్ని రాజీనామాలు జరుగుతున్నాయి? ఇంకా ప్రతిపక్షాల నుంచి తమ జట్టులోకి ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ముఖ్యమంత్రి విజయ్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అనే చర్చ కూడా తమిళనాడు నడుస్తోంది. కాస్త లోతుగా గమనిస్తే మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ పుణ్యమా అని.. ముఖ్యమంత్రి విజయ్ జాగ్రత్త పడుతున్నట్లుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు! డీఎంకే కూటమిలో భాగంగా ఉన్న వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ కూడా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మద్దతు ఇచ్చాయి. తమిళనాడులో తక్షణం మళ్లీ ఎన్నికలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే తాము మద్దతు ఇచ్చినట్లుగా వామపక్షాలు ప్రకటించాయి. విసికె, ఐయుఎంఎల్ పార్టీలు ప్రభుత్వంలో భాగమయ్యాయి. తమిళనాడు అధికారానికి 118 సీట్లు అవసరం కాగా ప్రస్తుతం అవసరమైన మెజారిటీ ప్రభుత్వానికి ఉంది. అయితే టీవీకేకు ఉన్న సొంత బలం 107 సీట్లు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ డిఎంకెను విడిచిపెట్టి విజయ్ జట్టులో చేరింది గనుక వారి ఐదు సీట్లు కలుపుకుంటే.. 112 అనుకోవచ్చు! డీఎంకే జట్టుకు చెందిన రెండు పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ బొటాబొటీ మెజారిటీతోనే సర్కారు నడుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని, మరికొన్ని నెలలు కొనసాగడమే ఎక్కువని, ఏ క్షణమైనా కూలిపోవచ్చునని స్టాలిన్ రకరకాల బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంటే స్టాలిన్ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు- తన మాట వినే పార్టీల మద్దతు మొత్తం ఉపసంహరించుకునేలా చేసినట్లయితే గనుక ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంటుంది. స్టాలిన్ సైలెంట్ గా ఉండకుండా ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నందున విజయ్ కూడా అలర్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. అసలు కాంగ్రెస్ మినహా మరొక పార్టీపై ఆధారపడే అవసరమే రాకుండా ఉండేలాగా సొంత బలం కలిగి ఉండాలనే వ్యూహంతో విజయ్ పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకెలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి తమలో కలుపుకోవాలని ఆలోచిస్తున్నట్లు స్పష్టంగానే కనిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ మనుగడ ఉండాలనే ఉద్దేశంతో ఫిరాయింపులను ప్రోత్సహించకుండా తద్వారా వచ్చే చికాకులకు దూరంగా ఉండటం కోసం విజయ్ వారితో రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికల బరిలోకి దించి స్పష్టమైన మెజారిటీ కూడగట్టుకునే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. స్టాలిన్ హెచ్చరికలు లేకపోతే గనుక విజయ్ ఇంత వేగంగా స్పందించేవారు కాదేమో అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలు పూర్తికాగా మరికొన్ని రాజీనామాలకు కూడా రంగం సిద్ధమవుతున్నట్లు పుకార్లున్నాయి. అన్నింటికీ కలిపి ఉపఎన్నికలు జరిగితే అప్పుడిక టీవీకే సారథి విజయ్ తిరుగులేని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని నిశ్చింతగా కొనసాగిస్తారని విశ్లేషకులు అంటున్నారు
P.Venkateswara Rao
663 views
1 months ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *సాహసి CM విజయ్! బెరుకు లేదు- పెరియార్ భావజాలానికి తిరస్కృతి‼️* June 24, 2026🎯 తమిళనాడు పాలిటిక్స్, సంస్కారరాహిత్యాలు ఏపీ పాలిటిక్స్‌కన్నా ఓ ఆకు ఎక్కువే… స్టాలిన్ కొడుకు ఉదయనిధి అనే ప్రబుద్ధుడు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాక మరింత కాలుష్యం, జాడ్యం పెరిగింది… ఈసారి ఎన్నికల్లో గెలవగానే తను సీఎం అయిపోవాలనీ, నాన్నను కేంద్ర రాజకీయాల్లోకి పంపించేయాలని అనుకున్న ఈ సనాతన ద్వేషికి విధి ఎదురుతన్నింది. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా సీఎం జోసెఫ్ విజయ్ మీద చూపిస్తున్నాడు. ఆల్రెడీ సనాతనం మీద వైరస్ అని ద్వేష వ్యాఖ్యలు చేసిన నైజం తెలుసు కదా, ఇప్పుడు విజయ్ వ్యక్తిగత జీవితాంశాలను అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చాడు. తనను జస్ట్ ఓ సినిమా నటుడిగా తీసిపారేశాడు కదా స్టాలిన్ అంటూ విజయ్, స్టాలిన్‌ను మిమిక్ చేస్తూ విమర్శించాడు. అసలే ఉదయనిధి కదా, ఎక్కడో మండింది. విజయ్ విడాకుల అంశాన్ని ప్రస్తావించాడు. కోర్టులో భర్త కోసం వెతుక్కుంటున్న భార్య కథ అందరికీ తెలిసిందేనంటూ ఘాటుగా దాడికి దిగాడు. పక్కాగా ఇది పర్సనల్ అటాక్, ఉదయనిధి నుంచి ఇంతకుమించి పరిణతి ఆశించడం వృథా… (నిజంగానే విజయ్ పాలన మీద, ప్రభుత్వం మీద అంత అక్కసు ఉంటే… మీ కూటమికే చెందిన పార్టీలతో మద్దతు ఉపసంహరించపజేయొచ్చుగా… అది మాత్రం చేయడు, ఎందుకంటే, వెంటనే అన్నాడీఎంకే విజయ్‌తో జతకట్టి కుర్చీ ఎక్కుతుందని భయం…) మరో ఇంపార్టెంట్ విషయానికి వస్తే… విజయ్ ఏమంటాడంటే..? ‘‘ద్రవిడ రాజకీయాలకు ప్రధానసూత్రంగా ఉండే పెరియార్ భావజాలాన్ని గౌరవిస్తాం, కానీ నాస్తికత్వం, మతవిశ్వాసాలపై ఆయన ధోరణికి భిన్నంగా ఉంటాం. ఎందుకంటే మేం దేవుడిని నమ్ముతాం, విశ్వాసులం. అలాగే అంబేడ్కర్, కామరాజ్ చూపిన బాటల్లో నడుస్తాం. ఎంజీఆర్, అన్నాదురై ప్రభుత్వాల బాటే మా బాట’’ తమిళనాడు రాజకీయాల్లో పెరియార్ మార్క్ నాస్తికత్వం మాకు అక్కర్లేదు అని శాసనసభలోనే చెప్పిన తొలి ముఖ్యమంత్రి కావచ్చు విజయ్ బహుశా… సాహసి… (ఒకవైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అలాగే నాస్తిక పార్టీలు వీసీకే, లెఫ్ట్ సపోర్టుతో ఉండీ విజయ్ నా బాట నాది అని చెప్పడం విశేషమే) ఇలాంటి భావజాలం, ప్రకటనకు సంబంధించి మాజీ అన్నాడీఎంకే నేత, ప్రస్తుతం విజయ్ కేబినెట్ మంత్రి, టీవీకే ముఖ్య సమన్వయకర్త కేఏ సెంగోట్టయాన్ ప్రభావం, మార్గదర్శనం ఉండొచ్చు. అంతేకాదు, టీవీకే ప్రధాన రాజకీయ సలహాదారు జాన్ అరోకియాసామి (Jhon Arokiasamy) పాత్ర కూడా ఉండొచ్చు. ఎస్, జోసెఫ్ విజయ్ పుట్టుకతో క్రిస్టియన్, ఇప్పటికీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, అధికారంలోకి రాగానే కర్నాటకలోని ఉడుపి జిల్లా, కొల్లూరులోని మూకాంబిక గుడికి వెళ్లి, 1.6 కిలోల వెండి ఖడ్గాన్ని సమర్పించుకున్నాడు. అది సౌత్ పొలిటిషియన్లు బాగా నమ్మే గుడి… ఇటు క్రిస్టియానిటీ- అటు హిందూ ఆధ్యాత్మికత మీద బ్యాలెన్స్ చేస్తున్నాడు సరే… కానీ ఓ పరీక్ష ఉంది తనకు. (జగన్ గుర్తొస్తున్నాడా?) తిరుప్పరంకుండ్రం కొండపైని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యస్వామి (మురుగన్) గుహాలయం దగ్గర కార్తీకదీపం వివాదం. చెన్నై హైకోర్టు అనుమతించాల్సిందే అని ఆదేశించింది… స్టాలిన్ పట్టించుకోకుండా ఏకంగా ఆ తీర్పు చెప్పిన జడ్జినే అభిశంసించే దురాలోచనకు దిగాడు. (ఇండి కూటమి మద్దతు పలికింది) తను నాస్తికుడైతే ప్రజలందరూ తనలాగే ఉండాలా, అదీ కేవలం హిందువులు మాత్రమే తమ మతవిశ్వాసాలకు దూరంగా ఉండాలా? ఆమధ్య విజయ్ అధిాకారంలోకి వచ్చాక హైకోర్టు ఈ తీర్పు అమలుపై మీ స్టాండ్ ఏమిటని ప్రశ్నించింది. చూడాలిక, నాస్తిక ధోరణులకు దూరంగా, దేవుడిని నమ్ముతాను అంటున్న విజయ్ ఏం స్టాండ్ తీసుకుంటాడో!!
P.Venkateswara Rao
688 views
2 months ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 👉👉 👏👏 తమిళనాడు లో ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్న దోపిడీని అరికట్టడానికి CM విజయ్ గారు తీసుకున్న నిర్ణయం ఒక విప్లవాత్మక మార్పు అనే చెప్పాలి..మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు CM లు..విజయ్ గారిని ఆదర్శంగా తీసుకొని అదే బాటలోనే ప్రైవేట్ Schools లో ఫీజులు, Books పేరుతో జరుగుతున్న వ్యాపార దోపిడీని అరికట్టాలి..కేవలం ఉచిత పథకాలు ఇస్తేనే ఓట్లు పడవు..ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకొని ప్రజలకు మేలు చేసినప్పుడే ప్రజలు ఓట్లు వేస్తారు..👈👈 👉👉 దీన్ని support చేసే వారు SHARE చేసి support చేయండి..👈👈
P.Venkateswara Rao
596 views
2 months ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *నో, నో… అన్నా మలై బుద్దిలేని బొద్దింక కాదు… తన రూటే సపరేట్…‼️* June 8, 2026🎯 12 గంటల్లో 8 లక్షలు… 24 గంటల్లో 14 లక్షలు… 2 రోజుల్లో 16 లక్షలు… ఏమిటివి అనుకుంటున్నారా..? కాక్రోచ్ జనతా పార్టీ ఆన్‌లైన్ ఫాలోయింగ్ సంఖ్యలని అంచనా వేస్తున్నారా..? కాదు, అన్నామలై స్టార్ట్ చేసిన wetheleaders పోర్టల్‌కు రిజిష్టరైన వారి సంఖ్య అది… నో, నో, అన్నామలై నాటెటాల్ ఏ కాక్రోచ్… డిజిటల్ సెటైర్ వేదిక అసలే కాదు… ఎందుకు కాదు..? ఏమిటి తేడా అంటారా..? సీజేపీ గురించి పదే పదే మాట్లాడటమే వేస్ట్… అదొక తుక్‌డే తుక్‌డే జాతివ్యతిరేక ముఠాల సమూహం… ఇంకా వివరంగా అవసరం లేదు… కానీ అన్నామలై..? తన ఐపీఎస్ కెరీర్‌ను వదిలిపెట్టి… తమిళనాడులో ఓ కొత్త దశ రాజకీయాల్ని నడపాలనుకుని, బీజేపీకి చేతకాక, పళనిస్వామి పిచ్చి కోరికలకు హైకమాండ్ బలిపెట్టిన ఓ కొత్తతరం నాయకుడు… ఒంటరివాడిని చేస్తే, ఒంటరిగానే ఫైట్ చేస్తానని స్థిరంగా నిలబడి, బీజేపీ ఆఫర్ చేసిన ఎంపీ సీటును ఎడమకాలితో తన్నేసి, జనంలోనే ఉంటానంటూ జనంలోకి వచ్చిన అరుదైన కేరక్టర్… (ఒక్కసారి తెలంగాణలో ఐపీఎస్ వదిలేసి, పాపం, కేసీయార్ గడీస్వామ్యంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తితో పోల్చండి… ఎంత తేడా..?) అబ్బో, అన్నామలైలో ఏమిటంత స్పెషాలిటీ అంటారా..? తనకు డీఎంకే, అన్నాడీఎంకే ద్రవిడ రాజకీయాల బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు… బీజేపీ భంగపడనుందనీ తెలుసు… పళని స్వామి కోసం… బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్, గురుమూర్తి, తమిళిసైల కోసం తనను ఎలా బలిపెట్టారో తెలుసు…అభిప్రాయాలు ఆ పరాభావాల నుంచి పారిపోదలుచుకోలేదు… నిలబడి పోరాడటానికే నిశ్చయించాడు… గెలుపో ఓటమో జానదేవ్… ఏ ఫైటర్… సో, ఏ కోణం చూసినా ఆ బుర్రల్లేని బొద్దింకలన్నా, సొంత పార్టీల నిర్మాణాలు- ఉద్యమాలు మరిచి ఆ డిజిటల్ పొంగు వెనుక పరుగులు తీసే భ్రమాత్మక లెఫ్ట్, ఆప్ తదితర పార్టీలకన్నా అన్నామలై అనేకానేక రెట్లు బెటర్… అన్నామలై ఏదో నిన్నమొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు… తమిళనాడు రాజకీయాల ప్రధాన ప్రవాహంలో ఏళ్లుగా ఢక్కామొక్కీలు తిన్నవాడు… విమర్శలు ఎదుర్కొన్నాడు… సొంత పార్టీలోనే అవమానాలు భరించాడు… ప్రత్యర్థుల దాడులు చూశాడు… మీడియా నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నాడు… అయినా రాజకీయ రంగం నుంచి వెనక్కి తగ్గలేదు… పై ఫోటో చూశారా… అన్నా మలైని బలిస్తున్నట్టుగా నడిరోడ్డు మీద నరికివేత… ఆ రేంజులో తన మీద వ్యతిరేకతను కనబరిచాయి ద్రవిడ పార్టీలు… తను భయపడలేదు… స్టిల్ హి ఈజ్ ఫరమ్ ఆన్ హిజ్ స్టాండ్… విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండేట్టు లేదు అని స్టాలిన్ అంటున్నాడు… తన దయాదాక్షిణ్యాల మీదే విజయ్ ప్రభుత్వం మనుగడ అని తనకు తెలుసు… దాన్నెప్పుడు కూల్చేస్తారో తెలియదు… ఈలోపు తదుపరి పరిణామాలకు ఎలా ప్రిపేరై ఉండాలో బీజేపీకి తెలియదు… అసలు దానికి టిపికల్ సౌత్ పాలిటిక్స్ అర్థం కావు… అన్నాడీఎంకే పళనిస్వామి నాయకత్వంలో నానాటికీ ఇక జనం నుంచి దూరమై, మనుగడ కోసం పోరాడే స్థితి వస్తుందనీ అన్నామలైకి తెలుసు… ఇప్పుడప్పుడే డీఎంకే బలం పుంజుకోదనీ తెలుసు… దానికి ఉదయనిధి వంటి కుర్ర కూతకారులే ప్రధాన శాపమనీ తెలుసు… అందుకే ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు అన్నామలై…అభిప్రాయాలు తను ఈ ప్రస్థానంలో గెలుస్తాడా లేదానేది వేరే సంగతి… తన పోరాటస్పూర్తిని ఇక్కడ చెప్పుకుంటున్నాం.,.. అందుకే ఈ 16 లక్షల సంఖ్యను ఎన్నికల ఫలితంగా కాకుండా, ఒక రాజకీయ సంకేతంగా చూడాలి… ఫలితం ఏమవుతుంది? ఎవరూ చెప్పలేరు… అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ ఆశావహుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడం… నటుడు రాఘవ లారెన్స్ రాజకీయ రంగప్రవేశం గురించి వార్తలు వస్తున్నాయి… ఆయన కుమార్తె రాజకీయ అరంగేట్రం గురించీ చర్చ నడుస్తోంది… మరోవైపు రజినీకాంత్ రాజకీయాలకు దూరమయ్యారని అనుకున్న సమయంలో ఆయన కుటుంబం చుట్టూ మళ్లీ రాజకీయ చర్చలు మొదలయ్యాయి… ఆయన సతీమణి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది… ఎండిపోయిన ఆ పిరికి బట్టతల మీద మళ్లీ ఆశల వెంట్రుకలు మొలుస్తున్నాయి… తమిళనాడు రాజకీయాలు మళ్లీ ఒక సంధికాలంలోకి ప్రవేశిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి… అయితే ఇక్కడ ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి… అందరూ విజయ్‌లు కాలేరు… సినిమా స్టార్‌గా ఉన్న ప్రజాదరణను రాజకీయ మూలధనంగా మార్చుకోవడం అందరికీ సాధ్యం కాదు… రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కేవలం అభిమానులు సరిపోరు… సంస్థ కావాలి… నాయకత్వం కావాలి… సహనం కావాలి… అదృష్టం కూడా కావాలి… కానీ అందరూ విజయ్‌లు కాలేరని చెప్పడం ఎంత నిజమో, కొత్త కలలు కనొద్దని చెప్పడం కూడా అంతే తప్పు… రాజకీయాలు చివరికి ఆశల మీదే నడుస్తాయి… ఆ ఆశలే ఒకప్పుడు ఎంజీఆర్‌ను తీసుకొచ్చాయి… జయలలితను నిలబెట్టాయి… విజయ్‌కాంత్‌ను ఎదిగించాయి… ఇప్పుడు విజయ్‌ను రాజకీయాల కేంద్రబిందువుగా మార్చాయి… అదే ఆశ ఇప్పుడు అన్నామలైలో కనిపిస్తోంది… రాఘవ లారెన్స్‌లో కనిపిస్తోంది… ఇంకెవరిలోనో కనిపించొచ్చు… వాళ్లలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో కాలమే చెబుతుంది… కానీ ఆశలను మాత్రం ఎవరూ చంపలేరు…
P.Venkateswara Rao
639 views
2 months ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 #విద్యా వ్యవస్థ *📕తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలల ఫీజు ఫిక్స్..❗* తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూల్ ఫీజులపై ఇలాంటి నియంత్రణ వస్తే..? తమిళనాడు నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ! 07 జూన్ 2026, చెన్నై ఒక చిన్న ఫోటో.. కానీ అది లేవనెత్తిన చర్చ మాత్రం చాలా పెద్దది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోలో తమిళనాడులోని పాఠశాలల ఫీజు నిర్మాణానికి సంబంధించిన బోర్డు కనిపిస్తోంది. ఆ బోర్డులో వివిధ తరగతులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను స్పష్టంగా ప్రదర్శించారు. ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత విద్య, ప్రైవేట్ పాఠశాలల ఫీజులు, మధ్యతరగతి కుటుంబాల భారం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. తమిళనాడులో ఫీజుల నియంత్రణకు సంబంధించిన ఈ విధానం అమలవుతున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లు "మన దగ్గర కూడా ఇలాంటి వ్యవస్థ ఉంటే ఎంత బాగుంటుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా కుటుంబాలు పిల్లల విద్య కోసం తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, తమిళనాడులో ఈ విధానం అమలుకు సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి వచ్చే అభ్యంతరాలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లిన విధానం ప్రశంసలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో అనేక మంది ఈ నిర్ణయాన్ని ప్రజా ప్రయోజనాలకు అనుకూలమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. విద్య అనేది వ్యాపారం కాకుండా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాల్సిన ప్రాథమిక హక్కు అనే వాదన కూడా ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఇంకా, ప్రైవేట్ పాఠశాలల ఫీజులు నియంత్రణలో ఉంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఫీజుల పెంపు కారణంగా తల్లిదండ్రులు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదే కారణంగా సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇక, ఈ చర్చ కేవలం ఫీజులకే పరిమితం కాలేదు. ప్రభుత్వాలు విద్యా రంగంలో ఎంతవరకు జోక్యం చేసుకోవాలి అనే ప్రశ్న కూడా ముందుకు వచ్చింది. కొందరు విద్యా సంస్థలకు స్వేచ్ఛ అవసరమని వాదిస్తుంటే, మరికొందరు విద్య పేరుతో అధిక ఫీజులు వసూలు చేయడాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ రెండు అభిప్రాయాల మధ్య సమతుల్యత సాధించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలుగా మారింది. అయితే, ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులపై పడుతున్న భారం తగ్గించాలనే ఆలోచన ప్రజల్లో బలంగా పెరుగుతోంది. అందుకే తమిళనాడులో అమలవుతున్న ఈ విధానాన్ని చాలా మంది ఆదర్శంగా చూస్తున్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే విద్యా రంగంలో సానుకూల మార్పులు రావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇంకా, విద్య అనేది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన అంశం కాదు. అది సమాజ భవిష్యత్తును నిర్ణయించే రంగం. అందుకే ఫీజుల నియంత్రణ, నాణ్యమైన విద్య, అందుబాటులో ఉండే విద్యా వ్యవస్థ వంటి అంశాలపై ప్రజలు ఎక్కువగా చర్చించడం సహజమే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో కూడా అదే చర్చకు నాంది పలికింది. ఇక, సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రధాన అభిప్రాయం ఏమిటంటే.. విద్యా వ్యవస్థలో పారదర్శకత పెరిగితే తల్లిదండ్రుల విశ్వాసం కూడా పెరుగుతుందని. అందుకే తమిళనాడులో తీసుకున్న ఈ చర్యపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి నమూనాలను పరిశీలిస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది మన విశ్లేషణ. ఇది కేవలం వార్త కాదు.. సమాజం ఆలోచించాల్సిన విషయం. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలా? తెలుగు రాష్ట్రాల్లో కూడా తమిళనాడు తరహా ఫీజు నియంత్రణ విధానం అమలు చేయాలా? #TamilNadu, #SchoolFees, #EducationSystem, #PrivateSchools, #SchoolFeeRegulation, #EducationReforms
P.Venkateswara Rao
639 views
2 months ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 #భారతీయ జనతా పార్టీ bjp *అసలు సమస్యలు వేరు… అవి వదిలేసి బీజేపీ హైకమాండ్ తంటాలు…❗* June 4, 2026🪷 తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు… బీజేపీ హైకమాండ్ పూర్తిగా పక్కనపెట్టిన నాయకుడు అన్నామలై వ్యవహారం ఇంకా సస్పెన్స్… తను రాజీనామా చేయడానికే ఢిల్లీ వెళ్లాడు… తమిళనాట బీజేపీ వైఖరి తనకు నచ్చడం లేదు… అసలు తమిళ రాజకీయాలే బీజేపీకి అర్థం కావడం లేదు, ఇక తంటాలు, అవమానాలు దేనికని… మొదట ఓ జాతీయవాద ఉద్యమం మొదలుపెట్టి, తరువాత ఓ ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు పోవాలనేది తన ప్లాన్… బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిశాడు, రాజీనామా పత్రం ఇచ్చాడు, తరువాత అమిత్ షాను కలిశాడు, తనే కదా పార్టీ వ్యవహారాల కీలకస్థానం… బీఎల్ సంతోష్‌ను కలిశాడు… కానీ ఇంకా రాజీనామాకు ఆమోదం లభించలేదు… బుజ్జగిస్తున్నారు… ఆర్ఎస్ఎస్ ముఖ్యులను కూడా ఢిల్లీకి రప్పించారు… మాట్లాడుతున్నారు, రేపో, ఈ సాయంత్రమో మోదీని కూడా కలవనున్నట్టు వార్తలు.., అంతా బీట్ అరౌండ్ ది బుష్… అంటే అసలు విషయం తేలకుండా, ఏదో కాలయాపన చేయడం..! తమిళనాడులో అన్నామలై ఖచ్చితంగా బీజేపీకి కాస్త జోష్ తీసుకొచ్చాడు… కానీ తనకు పార్టీలోనే పెద్ద వ్యతిరేకవర్గం, ఇన్నేళ్లూ వాళ్లదే తమిళ బీజేపీ మీద ఆధిపత్యం, వాళ్లు ఉద్దరించేది లేదు, అన్నామలై కాళ్లలో కట్టెలు పెట్టడం తప్ప… వాళ్లు ప్రస్తుత అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్, తమిళిసై… అదొక వర్గం… అన్నామలై కాదని, నైనార్ పేరు కూడా పళనిస్వామి సూచించాడని అంటారు… (తెలంగాణలో బండి సంజయ్‌ను తీసేసిన తీరుగానే)… అన్నామలై అంటే పడదు వాళ్లకు… అన్నామలైని పార్టీలోనే కొనసాగేలా చేసినా… వాళ్లు పడనిస్తారా..? రోజూ తలనొప్పులే… ఈ ముగ్గురినీ ఇప్పుడు ఢిల్లీకి పిలిపించారు అర్జెంటుగా… అసలు సమస్య పళనిస్వామి… అన్నాడీఎంకేతో పొత్తు… ఇప్పటికిప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోలేదు అన్నామలై కోసం… పళనిస్వామి అన్నామలైని సహించడు… ఇవీ అసలు సమస్యలు… తమిళిసై గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, గత లోకసభ ఎన్నికల నుంచే ఈమెకూ అన్నామలైకీ పడటం లేదు… కోల్డ్ వార్… ఆమె ఏమైనా ఉద్దరించే స్థితిలో ఉందా..? జీరో… 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానైనా సరే జాతీయవాద ఎజెండాతో దూసుకెళ్లాలని, ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడాలని అన్నామలై భావించాడు… అది కుదరలేదు, మరి ఇప్పుడు అన్నా మలైని రిటెయిన్ చేసుకోవడం (పార్టీలో ఉంచుకోవడం) అమిత్ షా, మోదీ ద్వయానికి పెద్ద సవాలే… ఎందుకంటే అన్నామలై కేవలం పదవి కోసం ఆశపడే వ్యక్తి కాదు, దానికి ఆయన ఐపీఎస్ ఉద్యోగాన్నే వదిలేశాడు… కాబట్టి ఆయనను బుజ్జగించడానికి కేంద్ర నాయకత్వం మూడు ప్రధాన హామీలను టేబుల్ మీద పెట్టినట్లు సమాచారం… – ఇకపై తమిళనాడు బీజేపీలో సీనియర్ల పెత్తనం చెల్లకుండా, అన్నామలై చెప్పిందే వేదంగా సాగేలా “ఫ్రీ హ్యాండ్” ఇవ్వడం… నైనార్ నాగేంద్రన్, తమిళిసై, వనతి వంటి సీనియర్లకు ఢిల్లీ నుంచే గట్టి వార్నింగ్ ఇచ్చి, స్టేట్ యూనియన్‌లో అన్నామలై వ్యూహాలకు అడ్డురాకుండా చేయడం… – ఇప్పుడు విజయ్ గెలిచినా, తమిళనాడులో పాత ద్రావిడ శకం (DMK/AIADMK) ముగింపు దశకు వచ్చింది… తదుపరి టార్గెట్ మనదే” అని అన్నామలైకి నచ్చజెప్పడం… పార్లమెంట్ ఎన్నికల నాటికి తమిళనాడులో అన్నాడీఎంకేతో సంబంధం లేకుండా ఒంటరిగా ఎదిగేలా, పార్టీ ఓటు బ్యాంకుని పెంచే పూర్తి బాధ్యత ఆయనకే అప్పగించడం… – అవసరమైతే ఆయనకు జాతీయ స్థాయిలో లేదా కేంద్ర క్యాబినెట్‌లో కీలక బాధ్యతలు ఇవ్వడం, లేదంటే తమిళనాడులో సరికొత్త క్యాడర్‌ను ఆయనే స్వంతంగా రిక్రూట్ చేసుకునేలా సంస్థాగత మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం… ఢిల్లీ పెద్దలు అన్నామలైని వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేరు… ఎందుకంటే తమిళనాడులో బీజేపీకి కాస్తో కూస్తో క్రేజ్ తెచ్చింది ఆయనే… పొత్తుల విషయంలో జరిగిన తప్పును ఒప్పుకుంటూనే, భవిష్యత్తు తమిళనాడును అన్నామలై చేతుల్లో పెట్టడమే ఏకైక మార్గమని అమిత్ షా భావిస్తున్నాడు… భేటీ తర్వాత అన్నామలై నిర్ణయం ఎలా ఉండబోతున్నదో..!
P.Venkateswara Rao
538 views
2 months ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…‼️* June 2, 2026🎯 నిజం… ఒక దశలో బీజేపీ తురుఫు ముక్కగా కనిపించిన అన్నామలై… ఇప్పుడు అనేక కారణాల రీత్యా ఆ బీజేపీ బంధనాలు తెంచుకుని, ఇక స్వేచ్ఛగా తనదైన దూకుడుతో వెళ్లనున్నాడు… ఈ ధోరణి, తన కార్యాచరణ ఫస్ట్ పళనిస్వామి అనబడే ఓ విఫలనేతకు చుక్కలు చూపించబోతోంది… ఇన్నాళ్లు పళనిస్వామిని పట్టుకుని వేలాడి, తన షరతులకు సాగిలబడి, అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, టికెట్టు కూడా ఇవ్వక, ప్రచారానికీ అనుమతించక అన్నిరకాలుగా తనను దూరం పెట్టింది… (తెలంగాణలో కేసీయార్ కోసం బండి సంజయ్‌ను పక్కన పెట్టేసి భంగపడినట్టు…) సౌత్‌లో బీజేపీ వ్యూహాలన్నీ తల్లకిందులే… పళనిస్వామిని పట్టుకుని వేలాడితే ఆ ద్రవిడ బరిలో ఎంతోకొంత కాళ్లూనుకోవచ్చునని భ్రమపడింది… డీఎంకే మీద వ్యతిరేకత, విజయ్ చీల్చే వోట్లు ఎన్డీయే కూటమికి ఫాయిదా తీసుకొస్తాయని అనుకుంది… కానీ అసలు అన్నాడీఎంకేలోనే పళనిస్వామికి తీవ్ర వ్యతిరేకత ఉంది… మొన్న విజయ్ గెలిచాక, మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువ పడితే ముందుగా రెడీ అయిపోయింది అన్నాడీఎంకేలోని పళనిస్వామి వ్యతిరేకవర్గమే… (అనర్హత వేటు వేస్తామనే బెదిరింపుతో పళనిస్వామి వాళ్లందరినీ మళ్లీ అదుపులోకి తెచ్చుకున్నాడు, కానీ అది లోలోపల మండుతూనే ఉంది)… రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, లోకసభ ఎన్నికల్లో గానీ పళనిస్వామితో బీజేపీ ఒనగూరిందేమిటి..? పే-ద్ద జీరో..! ఐనా పళనిస్వామిని వదలదు… ఇక తన కెరీర్ ఏమిటో పునర్ నిర్వచించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నామలైకి… బీజేపీ- పళనిస్వామి బంధం ఉన్నన్ని రోజులూ తనకు బంధనాలే… అందుకే తెంపుకున్నాడు, రాజీనామా చేశాడు… ముందుగా తన వైపు వచ్చేది అన్నాడీఎంకేలోని పళనిస్వామి వ్యతిరేకులే… పళనిస్వామి- అన్నామలై సేమ్ ఏరియా, సేమ్ కేస్ట్… ఇప్పుడిక బీజేపీ కూడా వారించలేదు… వారించినా తను ఆగేది లేదు… తను ఎలాగూ రైటిస్టే కదా, పైగా చెప్పి మరీ రాజీనామా చేశాడు, అమిత్ షాను కలుస్తున్నాడు, రైటిస్టు… ఎప్పుడైనా మనవాడే… అందుకని లోలోపల బీజేపీ ‘వోకే గో ఎహెడ్’ అంటుంది తప్ప, వారించదు… ఒకవేళ అన్నామలై బీజేపీలోనే ఉన్నా సరే, పళనిస్వామి కోసం తనను ఎంకరేజ్ చేసే సీన్ కూడా లేదు… అందుకని బీజేపీ సైలెంటుగా ఉండబోతోంది… అన్నామలై సరైన దీర్ఘదృష్టితోనే ఉన్నాడు… తమిళనాట జనం ద్రవిడ పార్టీలంటే విముఖత చూపిస్తున్నారు… అది వాస్తవం… స్టాలిన్, పళనిస్వామి చతికిలపడ్డారంటే అదే కారణం… ఏదో ఓ కొత్తతరహా రాజకీయాలు కోరుతున్నారు తమిళజనం… దాన్ని బీజేపీ అర్థం చేసుకోలేకపోయింది… ఆ స్పేసులోకి విజయ్ దూరిపోయాడు… గెలిచాడు… సో, ఇప్పుడిక అక్కడ బీజేపీ సొంతంగా చేయడానికి ఏమీ లేదు… ఒక శూన్యత ఆవరించింది… అందుకే అన్నామలై రాజ్యసభ సభ్యత్వమూ వద్దన్నాడు… ప్రజాక్షేత్రంలోనే పోరాడదలుచుకున్నాడు… మంచి నిర్ణయం… విజయ్ అధికారం డీఎంకే కూటమి చెప్పుచేతల్లో ఉంది, జనానికి నాలుగురోజుల్లో విసుగు, వ్యతిరేకత రావడం ఖాయం… ఇప్పుడప్పుడే డీఎంకే మళ్లీ పుంజుకునే చాన్స్ లేదు, అన్నాడీఎంకేకు అసలే లేదు… సో, మెల్లిగా ఒక స్పేస్ క్రియేట్ కానుంది… అందులోకి ఒక ధనుష్ వంటి కొత్తవాళ్లు ప్రవేశించే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్లందరికన్నా అన్నామలైకి మంచి చాన్స్… తనకు తమిళ రాజకీయాలు, ఆ పార్టీల బలాబలాలపై మంచి అవగాహన ఉంది… దూకుడు ఉంది… వెంటనే ఓ ప్రాంతీయ పార్టీ పెడతాడా..? లేక యువతరం, మార్పు కోరుకునే జనం కోసం ఏదైనా ఓ మూమెంట్ స్టార్ట్ చేసి, దాన్ని రాజకీయాల వైపు తీసుకెళ్తాడా ఇప్పుడే తెలియదు… తనే చెబుతాడు… విజయమో, స్తబ్దతో… డెస్టినీ చెబుతుంది… కానీ అన్నామలై తనదంటూ ఓ ముద్ర వేయగలడు… రాజకీయాల్లో ఓ ఫోర్స్‌లా మనగలడు… ఆల్ ది బెస్ట్…!!
P.Venkateswara Rao
573 views
2 months ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *కామరాజ్ టు విజయ్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ❗* 29.05.2026🎯 తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ సాధించిన విజయం అనేక చర్చలకు తెరలేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ సాధించిన విజయం అనేక చర్చలకు తెరలేపుతోంది. సంప్రదాయ పార్టీలను మట్టి కరిపించి విజయ్ సంచలనం విజయం సాధించారు. దీనిపై రకరకాల విశ్లేషణలు వ్యక్తం అవుతుండగా, హీరో సూర్య తండ్రి సీనియర్ నటుడు శివకుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ’ప్రజల తీర్పు ఎప్పుడూ ఒకేలా ఉండదు, దానికి నిదర్శనమే కామరాజ్ ఓటమే’ అంటూ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 1954లో తొలిసారిగా సీఎం అయిన కామరాజ్ సుమారు 9 ఏళ్ల 172 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఈ కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు తమిళనాడు దశ, దిశను సమూలంగా మార్చేశాయి. దీంతో తరాలు మారుతున్నా తమిళనాట కామరాజ్ ను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలో విజయ్ గెలుపుపై శివకుమార్ స్పందన మరోసారి కామరాజ్ రూలింగును స్మరించుకునేలా చేసిందని అంటున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రను కామరాజ్ పాలనకు ముందు, ఆ తర్వాత అని విభజించి చూస్తారని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంస్కరణలు, ముఖ్యంగా 'మధ్యాహ్న భోజన పథకం'తో విద్యా విప్లవం తీసుకువచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చేశారని ప్రశంసిస్తుంటారు. అయితే ఆయన గొప్పదనం పాలనలో మాత్రమే కాదని, ఆయన జీవించిన విధానంలో కూడా ఉందని కామరాజ్ మరణాంతరం వెల్లడైంది. తమిళనాడుతోపాటు దేశ రాజకీయాల్లో 'కింగ్ మేకర్'గా చక్రం తిప్పిన కామరాజ్ మరణించినప్పుడు, ఆయన పడుకునే దిండు కింద కేవలం రూ. 140 మాత్రమే లభ్యమైంది. కొన్ని ఖాదీ షర్టులు, పంచెలు తప్ప ఆయన సొంత ఆస్తి అంటూ ఏమీ కూడబెట్టు కోలేదని చెబుతారు. అధికారం ఉంటే కోట్లు సంపాదించుకోవచ్చనే నేటి రోజుల్లో, కామరాజ్ జీవితం ఒక నమ్మలేని నిజంగా కీర్తిస్తుంటారు. ప్రస్తుతం విజయ్ ఇమేజ్‌ను కామరాజ్ వంటి మహానేతలతో పోల్చడంపై తమిళనాడులోని ప్రముఖ చానళ్లు, పొలిటికల్ అనలిస్టుల మధ్య ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. కామరాజ్ ప్రజల మధ్యే ఉంటూ, కింది స్థాయి నుండి ఎదిగిన నాయకుడు అయితే విజయ్ తన అపారమైన సినీ గ్లామర్, యూత్ ఫాలోయింగ్ ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి వీరిద్దరి శైలికి అస్సలు పోలిక లేదనేది ఒక వర్గం వాదన. అంతేకాకుండా లీడింగ్ పార్టీలపై ఉన్న సహజమైన వ్యతిరేకత, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న యువత ఓట్లు విజయ్‌ను గెలిపించాయని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో కామరాజ్ లాంటి నిస్వార్థపరుడిని పక్కన పెట్టి ద్రావిడ సిద్ధాంతాలకు పట్టం కట్టిన తమిళ ప్రజలు, నేడు మళ్లీ మార్పు కోసం సాంప్రదాయ ద్రావిడ పార్టీలను కాదని విజయ్ వైపు మొగ్గు చూపడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసినా కూడా ప్రజలు మార్పు వైపే నిలబడ్డారని, ఇది తమిళనాడు ఓటర్ల విలక్షణతకు నిదర్శనమని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. కామరాజ్ ఓటమి పాఠం.. విజయ్ కి సవాల్ నిష్కళంక చరిత్ర ఉన్న కామరాజ్‌నే 1967 ఎన్నికల్లో తమిళ ప్రజలు ఓడించారు. అప్పట్లో ద్రావిడ సిద్ధాంతాల ఉధృతి ముందు కామరాజ్ చేసిన మంచి పనులు కూడా కొట్టుకుపోయాయి. ప్రజాదరణ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పడానికి కామరాజ్ ఓటమే అతిపెద్ద ఉదాహరణగా చెబుతుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ గెలవడాన్ని స్వాగతిస్తూనే ఆయన భవిష్యత్తులో కామరాజ్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సివుందని శివకుమార్ వంటి వారు హెచ్చరిస్తున్నారు. దళపతి సాధించిన విజయం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, గ్లామర్ తోపాటు మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన విజయ్, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? కామరాజ్ ఆశయాలైన పారదర్శకత, నిస్వార్థ సేవను ఎంతవరకు ఆచరణలో చూపిస్తారు? అనే దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
P.Venkateswara Rao
808 views
2 months ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *సింహాసనం విజయ్‌ది.. వ్యూహం కాంగ్రెస్‌ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..❗* 25.05.2026🎯 తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం(క్యాబినెట్)లో భాగస్వామి అయింది. విజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కాంగ్రెస్ భవిష్యత్ పొలిటికల్ వ్యూహంలో భాగం అని చెప్పవచ్చు. దీనిలో విజయ్ కూడా పొలిటికల్ గా మాస్టర్ మైండ్ ఉపయోగించినట్లు క్లియర్ గా తెలుస్తోంది. విశ్వాస పరీక్షలో సీఎం విజయ్‌కు మద్దతుగా ఓటు వేసిన 25 మంది ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను విజయ్ తెలివిగా పక్కన పెట్టారు. మంత్రి పదవులపై ఆశలతో వచ్చిన తిరుగుబాటు నేతలకు (వేలుమణి, షణ్ముగం వర్గం) మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, ప్రజావ్యతిరేకత కారణంగా విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల తిరుగుబాటుదారులు ఇప్పుడు అటు పదవులు లేక, ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS)ని ఎదిరించలేక నట్టేట మునిగారు. మైనారిటీ లేదా స్వల్ప మెజారిటీతో ఉన్న తన ప్రభుత్వానికి భవిష్యత్తులో మిత్రపక్షాల నుండి ఎలాంటి ముప్పు రాకుండా ఉండటానికి విజయ్ సరికొత్త ప్లాన్ వేశారు. కూటమి పార్టీలను (కాంగ్రెస్, త్వరలో చేరబోయే విసికె, ఐయూఎంఎల్) నేరుగా ప్రభుత్వంలో భాగస్వాములను చేయడం ద్వారా వారు ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ‘రాజకీయ భీమా’ కల్పించుకున్నారు. గతంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే వైపు ఉన్న బలమైన ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ కూటమి ఈ నిర్ణయంతో అధికారికంగా ముక్కలైంది. తమిళనాడులో బీజేపీ వ్యతిరేక ఓట్లకు కేవలం డీఎంకే ఒక్కటే దిక్కు కాదనే సందేశాన్ని విజయ్ ఇచ్చారు. గత 60 ఏళ్లుగా తమిళనాడులో డీఎంకే లేదా ఏఐఏడీఎంకేలు ఒంటరిగా పూర్తి మెజారిటీతో పాలిస్తూ, చిన్న పార్టీలకు అధికారంలో వాటా ఇచ్చేవి కావు. కానీ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఈ పాత సంప్రదాయాన్ని బద్దలు కొట్టి, చిన్న పార్టీలను ప్రభుత్వంలో చేర్చుకోవడం ద్వారా తమిళనాడును 'కూటమి ప్రభుత్వాల' యుగం వైపు తీసుకెళ్లింది. ఈ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో పుంజుకోవడానికి, 2029 లోక్‌సభ ఎన్నికల్లో టీవీకే-కాంగ్రెస్ బలమైన కూటమిగా ఏర్పడటానికి ఒక పునాదిగా మారింది.