భారత్ లో నేటి రాజకీయం

𝐑𝐎𝐖𝐃𝐘 𝐁𝐀𝐁𝐘...🔥
0 view
21 days ago
AI indicator
𝐀𝐝𝐡𝐢... 𝐑𝐞𝐧𝐝𝐮 𝐢𝐥𝐥𝐮 𝐮𝐧𝐧𝐚 𝐞𝐡𝐡 𝐢𝐧𝐭𝐢𝐤𝐢 𝐬𝐨𝐧𝐭𝐡𝐚𝐦 𝐤𝐚𝐧𝐢𝐝𝐡𝐞 𝐚𝐝𝐚𝐝𝐡𝐚𝐧𝐢 𝐣𝐢𝐯𝐢𝐭𝐡𝐚𝐦... 🤧 ##emotional love #💔 బ్రేకప్ ఫీలింగ్స్ #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #😢 ఎమోషనల్ స్టేటస్ 😢 ##telugu emotional status
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
661 views
3 months ago
రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజం - ప్రజా తీర్పు ముందు ఎంతటి వారైనా తోక మూడవాల్సిందే! లేదా అధికారం శాశ్వతం కాదు,అది మూడు నాళ్ల ముచ్చటే - అంతిమంగా ప్రజా తీర్పు శాశ్వతం - ప్రజాగర్జన ముందు కాకలుతీరిన పాలకులు సైతం మట్టికరచాల్సిందే ఈ మారు అధికారం మేం ఛేజిక్కించుకున్నాం కదా అని మిడిసిపడితే మాత్రం ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు కాక తప్పదు. అంటే ఏ ప్రజలైతే మీకు బ్రహ్మరథం పట్టారో అదే ప్రజల చేతిలో మీకు భంగపాటు,శృంగభంగం తప్పదు.కాబట్టి ఓట్లు వేసి మిమల్ని గెలిపించిన ప్రజల పట్ల భాద్యతగా వ్యవహరించి నేటి పాలకులు వారి ఋణం తీర్చుకోవాలి గాని,ఏదో ఎలక్షన్ల ముందు అధికారం ఛేజిక్కించుకోవడం కోసం ఏదో అరచేతిలో వైకుంఠం చూపించినట్లుగా,ఆచరణ సాధ్యం కాని అనేక హామీలను ప్రజలకు ఇచ్చి తీరా గెలిచిన తరువాత వాటిని అమలు చేయకుండా ప్రభుత్వ ఖజానా ఖాళీగా వుంది మేము ఏమి చేస్తుము సోమలింగం అని ప్రజలకు ఊసడప్పు కబుర్లు చెప్పి ,వారి చెవిలో పువ్వు పెట్టి మరీ వారిని మభ్యపెట్టాలని చూస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా వజ్రాయుధం వంటి తమ ఓటు ద్వారా మీకు తగిన గుణపాఠం చెప్పి తీరతారు.అదేమాదిరి ప్రజలను వెర్రి బాగోళ్ళను చేసి వారితో సెంటిమెంట్ రాజకీయాలు నడిపాలని చూస్తే మాత్రం ప్రజల చేతిలో ఏ పాలకులకు అయిన చావుదెబ్బ తప్పదు.సరిగ్గా ఇప్పుడు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే రెండో విడత ప్రజల ముందుకు వెళ్లి చతికిల పడ్డారు అయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పినరయి విజయన్,స్టాలిన్, మమతా బెనర్జీ (దీదీ ).ఇక వీరిని ప్రజలు ఎందుకు ఓడించారు అనే దానికి సవాలక్ష కారణాలు వున్నాయి. అన్నింటికి మించి వీరి ఓటమికి ప్రదాన కారణం ఏమంటే కోట్లాదిమంది హిందు ప్రజల ఆరాధ్య దైవాలను అడుగడుగునా అవమానాల పాలు చేశారు ఈ ముగ్గురు పాలకులు.కేరళ గత కమ్యూనిస్ట్ ప్రభుత్వ పాలకుడు విజయన్ అయితే కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న,ఎంతో మహిమ గల క్షేత్రం సాక్షాత్తు అయ్యప్పస్వామి కొలువై ఉన్న శబరిమల దేవాలయంలో దొంగతనం జరిగితే చేసినవారు ఎవరో ఆచూకీ కనుగొనడంలో తీవ్ర కాలయాపన,జాప్యం చేసి మిన్నకుండి పోవడం,ఇక తమిళనాడు రాష్ట్ర గత ప్రభుత్వ డీఎంకే పార్టీ పాలకుడు స్టాలిన్ సోదరుడు అయిన ఉదయనిది స్టాలిన్ అయితే హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి పదే పదే చిన్నబుచ్చేలా మాట్లాడుతూ,దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను చాలా తీవ్ర స్థాయిలో దెబ్బతినేలా వ్యవహరించడం,ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గత ప్రభుత్వ పాలన విషయానికి వస్తే దీదీ గా పేరుపడ్డ తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గారు గౌరవనీయమైన సీఎం హోదాలో వుంటూ ఓక నియంతలా పాలనచేసి హిందూ సోదర,సోదరీమణుల అత్యంత పెద్ద,ప్రతిష్టాత్మక పండుగ అయిన దసరా పండుగ ఉత్సవాలు సక్రమంగా జరుగనీయకుండా పదే పదే అడ్డంకులు సృష్టించి హిందూ ఆత్మీయ సోదరుల భక్తిభావాన్ని కించపరిచేలా వ్యవహరించడంతో ఆ శాపం ఇప్పుడు ఈవిడగారికి తగిలి ఆమె గారు ఓటమి పాలు అయ్యారు అనే మాట అక్షర సత్యం. ఏదిఏమైన అధికారం వుంది కదా అని ఓట్లు వేసిన ప్రజలను వెర్రిబాగోళ్లను,వెంగలాయప్పలను చేసి ఆటలాడుకోవాలని చూస్తే మాత్రం ఫలితాలు ఇలాగే అత్యంత చేదుగా ఉంటాయి అనే దానికి ఈ ముగ్గురు దిగ్గజ కాకలుతీరిన రాజకీయ పాలకులు వారి వారి రాష్ట్రాల్లో అన్యూహంగా ఓటమి పాలు కావడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం కాక మరేమిటి.అదేమాదిరి ఏ పాలకుడు అయిన ఓట్లు వేసిన ప్రజల ఆశలు,కోరికలు,ఆకాంక్షల మేరా వాటికి అనుగుణంగా పాలన చేయాలి గాని ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలకు ఆజ్యం పోసి వాటిని పెంచి పోషిస్తే మాత్రం ప్రజల ఆగ్రావేశాలకు,వారి కన్నెర్రకు ఎంతటి పేరుమోసిన పాలకుడు అయిన మట్టికరవక తప్పదు.ఏమైనా గతంతో పోలిస్తే ఓట్లు వేసే ప్రజలు ఎంతో పరిణతి చెందారు,ఓక విధంగా వారి ప్రజాతీర్పు అంచనా వేయడం ఎవ్వరి తరం కాదు,అంతగా వారు వివేకంలో అరితేరిపోయారు.వారికి ఏ పాలకుడు అయిన తాము ఇష్టపడేలా పాలన అందిస్తే వారిని అందలం ఎక్కిస్తారు,వారికి జేజేలు కొడతారు,అదే పాలకులు ఓట్లు వేసిన ప్రజలను పట్టించుకోకుండా వారిని ఇబ్బంది పెట్టేలా,విసిగించేలా పాలన సాగిస్తే మాత్రం వారు తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పి తీరతారు అనే విషయం ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా మరోసారి చాలా స్పష్టంగా గూడీ అయ్యింది.ఓక విధంగా చెప్పాలంటే ఈ సంచలనాత్మక ఫలితాలు ముమ్మాటికీ ప్రజావిజయానికి తార్కాణం వంటిది అనే మాట అక్షర సత్యం.జయ జయహో ఓటర్స్!ఈ ప్రజాస్వామ్యంలోని యావత్తు,అశేష ప్రజలు వర్ధిల్లాలి మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా. #భారత్ లో నేటి రాజకీయం