*
#భోగాపురం క్రెడిట్ జగన్ దే*
130 కోర్టు కేసులను అధిగమించి,
ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం
రూ.960 కోట్లు వ్యయం చేసి
నిర్వాసితులకు భరోసా ఇచ్చి
2023 మే 3న శంకుస్థాపన చేసిన
మాజీ సీఎం వైఎస్ జగన్
2026లో మొదటి ఫ్లైట్
ల్యాండ్ అవుతుందని శంకుస్థాపన రోజే ప్రకటన
భోగాపురం ఎయిర్పోర్టుపై
క్రెడిట్ చోరీకి పాల్ప డుతూ హస్తిన వేదికగా
పచ్చి అబద్ధాలు ఆడు తున్న చంద్రబాబుకు
రాష్ట్ర ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
టీడీపీకి చెందిన
ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
2014-18 మధ్య పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు.
భోగాపురం ఎయిర్పోర్టుకు
కర్త, కర్మ, క్రియ బాబే అయితే
అప్పుడు ఎందుకు అనుమతులు తెచ్చుకోలేకపోయారు?
నాడు పౌర విమాన యాన శాఖ
మంత్రిగా ఉన్నది మీ పార్టీ నేతే కదా?
మీరు అనుమతులు తెచ్చి,
మీరే పనులు చేసి, మీరే న్యాయ సమస్యలను
అధిగమిస్తే..మరి జగన్ ప్రభుత్వం భూసేకరణ కోసం
రూ.960 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుంది?
2014-19 మధ్య ఎయిర్పోర్టు నిర్మాణానికి
తొలుత 10 వేల ఎకరాలు అవసరమని,
తర్వాత 5 వేల ఎకరాలు కావాలని అన్నది
మీరు కాదా బాబూ?
కోర్టు కేసులను అధిగమించి..
నిర్వాసితులకు భరోసా కల్పించి
ఎయిర్పోర్టు 2,200 ఎకరాలు,
ఏరోసిటీకి 500 ఎక రాలు కలిపి
మొత్తం 2,700 ఎకరాల్లో భోగాపురం
ఎయిర్పోర్టును నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసి
కేంద్రం నుంచి అప్పటి జగన్ ప్రభుత్వం అనుమతులు తెచ్చింది.
130 కోర్టు కేసులను అధిగమించి,
భూసేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేసి,
నిర్వాసితులకు భూములను కేటాయించి,
3 గ్రామాల్లో సుమారు 400 మంది కుటుంబాలకు
వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా కల్పించింది.
ఇవన్నీ కప్పిపుచ్చుతూ రెండే ళ్లలో
అంతా తానే చేసినట్లు దేశ రాజధానిలో చం ద్రబాబు
ప్రగల్భాలు పలకడం చూసి ప్రజలంతా అవాక్కవుతున్నారు.
#BhogapuramAirport