#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు (21.11.2025) మధ్యాహ్నం శ్రీ అమ్మవారి వసంతోత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు, భక్తులు వసంతం (పసుపు నీళ్ళు) చల్లుకుంటూ ఆనందం పంచుకున్నారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

