మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం
AP: కర్నూల్లో స్లీపర్ బస్సు అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి ముళ్ళ కంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్డేట్స్💬

