_*"వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి చిత్ర పటాలను పూజిస్తే ధనలక్ష్మీ ప్రసన్నం" శివలోకం మీ కోసం....*_
🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔
🌹చేసుకున్న వాళ్లకు..చేసుకున్నంత మహాదేవా..అనీ..
మన కర్మలు బట్టీ మన యోగాలు ఉంటాయి..
🌹లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి.
🌹ఎవరికి ఐశ్యర్యం సిద్ధించాలన్నా,
ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం.
🌹అందుకే వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలు పూజిస్తారు.
కానీ కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్ర పటాలను పూజిస్తే
ధనం రాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో..
అలాగే వెళ్ళి పోతుందట.
🌹గుడ్లగూబపై లక్ష్మీ దేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మను పూజించకూడదు.
దీంతో అంతా అశుభమే జరుగుతుందట.
ధనం వచ్చింది వచ్చినట్టు పోతుంది.
🌹శేషతల్పంపై విష్ణువు పడుకుని ఉండగా,
ఆయన కాళ్ల వద్ద లక్ష్మీ దేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట.
🌹అదే తామర పూవుపై లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో కాకుండా కూర్చున్నట్టుగా ఉన్న ఫొటోను పూజించాలట.
🌹కుబేరుని విగ్రహం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే, దాంతో లక్ష్మీ దేవి మరింత సంతృప్తి చెంది
ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట.
🌹గరుత్మంతునిపై విష్ణువుతోపాటు లక్ష్మీ దేవి
కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా
మిక్కిలిగా ధనం లభిస్తుందట.
అంతా మంచే జరుగుతుందట.
🌹పాదరసంతో తయారుచేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని
పూజిస్తే దాంతో అన్నీ శుభాలే కలుగుతాయట.
ధనం కూడా బాగా సమకూరుతుందట.
🪔దీపావళి రోజున స్ఫటిక శ్రీయంత్రాన్ని
ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని
మీ మనీ లాకర్లో పెట్టాలి.
దీంతో ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది.
🌹లక్ష్మీ పూజ చేసేటప్పుడు తులసి ఆకులు, ధూపం, దివ్వెలు, పూవులను ఎక్కువగా వాడి పూజ చేయాలి. దీంతో అనుకున్నది జరుగుతుంది.
🪔దీపావళి రోజున లక్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంతరం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
దీని వల్ల భక్తులకు అనుకున్నది నెరవేరుతుంది.
🪷🌹🎻🪷🌹🎻🪷
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే
ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా.
🪷🌹🎻🪷🌹🎻🪷
మీ.... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి
