ShareChat
click to see wallet page
search
6️⃣ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_ఆరవ భాగం_* *_యోగమాయ జననం: -_* *శ్రీ మహావిష్ణువు సృష్టి జరగాలంటే యోగమాయ శక్తి అవసరమని తలచాడు. విష్ణువు సంకల్పం చేయగానే వక్షస్థల వామభాగం నుంచి ఒక స్త్రీ శక్తి ఉద్భవించింది*. *చతుర్భుజాలతో జగన్మోహన రూపం గల యోగమాయ చేతులు జోడించి తన సృష్టికర్త మహావిష్ణువుకి నమస్కరించింది*. *మహావిష్ణువు మానసము నుండి కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము, దర్పము, అహంకారం, త్వక్తు, ఘ్రాణము, శ్రవణము, వాక్కు, జిహ్వ, తమము, రజము, సత్త్వము, అవిద్య, విద్య అనే పద్దెనిమిది గుణాలు ఉద్భవించి యోగమాయలో కలసిపోయాయి. మరుక్షణం ఆమె పద్దెనిమిది బాహువులతో ఉగ్రరూపణిగా విరాటస్వరూపిణిగా మారింది. విష్ణువుతో “ఎవరు నేను" అని భీకర స్వరంతో అడిగింది*. *శ్రీమహావిష్ణువు ఆమెతో "నీవు విశ్వవిరాట స్వరూపిణి అయిన యోగమాయవు. నా సంకల్పంతో సృష్టి కోసం అవతరించావు. మంగళ, చండి, కాళి అనేవి నీకు ప్రత్యాయ నామాలు. జయించ శక్యం గాని దుర్గమమైన దుర్గవు నీవు. నా మానసము నుండి జనించిన కామ మోహ క్రోధాది అష్టాదశగుణాలు నీలో కలిసాయి. అష్టాదశ గుణాలకు నీవు అధిష్టాన దేవతవి. నీతో పాటు ఈ గుణాలు అదృశ్యంగా విశ్వ మంతా వ్యాపిస్తాయి*. *సృష్టి ప్రారంభమైనపుడు నీవు మాయవై అదృశ్యంగా ఉండి ఈ అష్టాదశ గుణాలు సకల జీవులలో ప్రవేశపెట్టి, గుణాలతోపాటు నీవు సృష్టి జీవులను ఆశ్రయించి ఉంటావు. జీవులను నడిపించే శక్తివి అవుతావు. నీవు లేకపోతే ఏ జీవి జీవించలేదు" అని కీర్తించాడు.* *యోగమాయ పొంగిపోయి "నేను జీవులను ఆడించే మహాశక్తిని! విశ్వాన్ని శాసించే మహాకాళిని" అని వికటాట్టహాసము చేసింది.* *మరుక్షణం విద్య అవిద్య సత్త్వము రజము తమము జిహ్వ వాక్కు శ్రవణము ఘ్రాణము త్వక్తు అనే పది గుణములకు ప్రతీకలైన యోగ మాయ పదిబాహువులు అదృశ్య మయ్యాయి*. *అష్టభుజి అయిన యోగమాయ ఖిన్నురాలై "నా బాహువులెందుకు మాయమై నాయి" అని విష్ణువుని అడిగింది*. *విష్ణువు నవ్వుతూ "నీ లోని దశగుణాలు అదృశరూపంతో విశ్వమంతా వ్యాపించాయి*. *ఇప్పుడు నీవు అష్టభుజాలు గల చండివి. నీ చండికాశక్తి ఆపగల వారు విశ్వములో లేరు" అని ప్రకటించాడు*. *ఆ ప్రశంసకు గర్వం, అహంకారం పొంది చండి "నా చండ చండికా శక్తిజయించగలవారువిశ్వములో లేరు" అని గర్జించింది*. *మరుక్షణం అహంకారం దర్పము మదము మాత్సర్యము ప్రతీకలైన నాలుగు బాహువుల అదృశ్యమయ్యాయి.* *చతుర్భుజి అయిన ఆమె విష్ణువుని "ఇప్పుడు ఇదేమిటి?" అని విస్మయంగా అడిగింది*. *"నీలోని అహంకారదర్పమదమత్సరాలు జగమంతా వ్యాపించాయి. ఇప్పుడు నీవు శుభములు కలిగించే చతుర్భుజివి అయిన "మంగళ" వి" అన్నాడు విష్ణువు.* *మంగళాదేవి అతిశయం చెంది "సకల జీవులకు శుభములను అనుగ్రహించే మంగళాదేవిని నేను! నాకు సాటియైన వారు లేరు" అని పలికింది*. *తక్షణం క్రోధ లోభాలకు ప్రతీకలైన రెండు భుజాలు అదృశ్యమై ద్విభుజిగా మారింది. శ్రీమహావిష్ణువు ఆమె వంక ప్రసన్నంగా చూసి "యోగ మాయా! నీ అష్టాదశ శక్తులలో పదహారు శక్తులు విశ్వమంతా వ్యాపించాయి. మిగిలిన కామ మోహములకు ప్రతీకవై ప్రకృతివై ఉంటావు. బీజానికి క్షేత్రముగా నిలచి సృష్టికి మాతృదేవతవై సహకరిస్తావు. నీవు, నీ శక్తులు విశ్వవ్యాప్తం అయ్యాయి కనుక "విశ్వంభర" అనే నామంతో ప్రసిద్ధి చెందుతావు*. *యోగమాయా! సృష్టి మొత్తం నీ అష్టాదశ గుణ మాయా ప్రభా వితమై నడుస్తుంది. సకలజీవులు నీమాయామేయమైనప్రపంచంలో చిక్కుకుని జననమరణ కాలచక్ర భ్రమణంలో తిరుగాడుతుంటారు. ఈ మాయ నుండి బయటపడటం దుర్లభం. కేవలం యోగశక్తితో, తపస్సుతో మాత్రమే ఈ మాయా బంధనం నుంచి తప్పించుకోగలరు. అట్టివారు మాత్రమే జననమరణ రహిత మోక్షము పొంది నాలో లీనమవుతారు. అటువంటి వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు*. *లోకములలో గల చరాచరము లన్నింటిలో అదృశ్యంగా, అంతర్లీనంగా ఉండే మహా మాయవి నీవు. సృష్టిలో నీకు లొంగనిది, నీవు ఆవహించనది, లోబడనిది ఏది లేదు, వుండదు. విశ్వము జయింపలేని దుర్గా దేవివి నీవు! కేవలం యోగశక్తి, తపశక్తితో మాత్రమేయోగమాయ వైన నీ సత్య స్వరూపం దర్శించ గలరు. నాతో సరిసమానురాలి వైన సహోదరివి నీవు! జగత్ సృష్టి సంకల్పం కోసం నేను కొంతకాలం యోగనిద్ర పోవాలి. నీవు విష్ణుమాయవై నన్ను ఆవ హించు" అని యోగమాయను ఆహ్వానించాడు.* *మహాశక్తి యైన దుర్గాదేవి విష్ణువుకి నమస్కరించి విష్ణు మాయగా అదృశ్యరూపం దాల్చి దేవదేవుడైన మహావిష్ణువుని ఆవరించింది. మాయకు లోనైన మహావిష్ణువు అనేక యుగాలు యోగనిద్రలో ఉండిపోయాడు* #మన సంప్రదాయాలు సమాచారం