*_@లింగోద్భవ మహిమ_*
*_లింగోద్భవ సమయం (నిశిత కాల పూజ)_*
*_ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 11:55 నుండి_*
*_ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12:56 వరకు_*
*_📅 చతుర్దశి తిథి ముగింపు:_*
*_ఫిబ్రవరి 16 సాయంత్రం 05:34 వరకు_*
*ఈ పవిత్ర సమయంలో పరమేశ్వరుడు తేజోలింగ స్వరూపంగా అవతరించిన క్షణాన్ని లింగోద్భవం అంటారు*. *ఈ సమయాన శివలింగానికి చేసే అభిషేకం, పూజ అనేక రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి*.
*_లింగోద్భవ కథ సారాంశం:_*
*ఒకసారి బ్రహ్మ, విష్ణువులకు ఎవరు గొప్పవారో అన్న అహంకారం కలిగింది. వారి అహంకారాన్ని తొలగించేందుకు శివుడు అనంతమైన తేజోస్తంభం (లింగం) రూపంలో ప్రత్యక్షమయ్యాడు*.
*బ్రహ్మ హంసరూపంలో పైభాగం వెతికాడు*
*విష్ణువు వరాహరూపంలో క్రింది భాగం వెతికాడు*
*కానీ ఇద్దరికీ ఆ తేజోలింగం* *ఆద్యంతాలు కనబడలేదు*.
*బ్రహ్మ అసత్యం చెప్పి తాను అగ్రభాగం చూశానని కేతకి పువ్వును సాక్షిగా చూపించాడు*.
*విష్ణువు మాత్రం నిజాయితీగా తనకు అంతు పట్టలేదని ఒప్పుకున్నాడు*.
*శివుడు అసత్యం చెప్పిన బ్రహ్మను శిక్షించాడు, అందుకే బ్రహ్మకు ఆలయాలు తక్కువ*.
*సత్యాన్ని పలికిన విష్ణువు స్థితికారకుడిగా అందరి పూజలు పొందుతున్నాడు*.
*🚫 కేతకి పువ్వు శివపూజలో ఉపయోగించరాదు అనే నియమం కూడా అప్పుడే ఏర్పడింది*.
*ఈ కథ ఇచ్చే మహా సందేశం:*
*✔️ సత్యం శివునికి ప్రియమైనది*
*✔️ అహంకారం నాశనానికి కారణం*
*✔️ నిజాయితీ ఉన్నవారికి దైవకృప తప్పకుండా లభిస్తుంది*
*ఈ లింగోద్భవ సమయంలో*
*శివలింగానికి అభిషేకం*
*ఓం నమః శివాయ జపం*
*_శివధ్యానం_*
*చేస్తే అనేక జన్మల పాపాలు నశించి, శివానుగ్రహం లభిస్తుంది* #మన సంప్రదాయాలు సమాచారం

