ShareChat
click to see wallet page
search
*వేగంగా వ్యాపిస్తున్నా "షుగర్ డాడీ" కల్చర్* *భారత్‌లో 3.38 లక్షల మంది* *ఏపీలో వేగంగా వ్యాప్తి* *యువతకు హెచ్చరిక* మనం ఆధునిక భారత్ గురించి మాట్లాడుకుంటాం. టెక్నాలజీ పురోగతి, స్టార్టప్ క్రాంతి, యువత సాధికారత గురించి గర్వంగా చెప్పుకుంటాం. కానీ అదే సమాజంలో నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఒక చీకటి వాస్తవం ఉంది. అదే షుగర్ డాడీ కల్చర్. భారత్‌లో 3,38,000 మంది షుగర్ డాడీలు ఉన్నారు.ఆసియాలోనే అత్యధికంగా ఇండోనేషియా 60,250 మంది, మలేషియా 32,500 మంది ఉండేవారు. కానీ భారత్ ఈ గణాంకాలను మించిపోయింది. ఈ లెక్కలు కేవలం గణాంకాలు కావు, వాటి వెనుక లక్షల మంది యువతుల జీవితాలు, కలలు, కుటుంబాలు ఉన్నాయి. అసలు ఈ 'షుగర్ డాడీ' అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే ఇది డబ్బుతో కొనుగోలు చేసే సంబంధాల మార్కెట్. సాధారణంగా 40 ఏళ్లకు పైబడిన ఆర్థికంగా స్థిరపడిన పురుషులు (షుగర్ డాడీలు) యువతులకు (షుగర్ బేబీలకు) డబ్బు, బహుమతులు, విదేశ పర్యటనలు, లగ్జరీ జీవనశైలి అందిస్తారు. బదులుగా సమయం, సహవాసం తీసుకుంటారు. దీన్ని 'మ్యూచువల్ బెనిఫిట్ రిలేషన్‌షిప్' అని అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇది ఆర్థిక అవసరతలను దోపిడీ చేసే, భావోద్వేగాలను వ్యాపారం చేసే వ్యవస్థ. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు Seeking.com (గతంలో Seeking Arrangement) ప్రపంచవ్యాప్తంగా 46 మిలియన్ల మందిని కనెక్ట్ చేస్తోంది. భారత్‌లో 2020లో 75,000 మంది సభ్యులున్నప్పుడు, కరోనా కాలంలో ఒక్కసారిగా 158% పెరిగింది. 39% కొత్త సభ్యులు రాత్రికి రాత్రే చేరారు. లాక్‌డౌన్‌లో ఉద్యోగాలు పోయాయి, ఆర్థిక సంక్షోభం వచ్చింది. చాలా మందికి ఇది 'తాత్కాలిక పరిష్కారం' అనిపించింది. SugarDaddyMeet, WhatsYourPrice వంటి సైట్లు భారతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ముంబై (21,464 డాడీలు, 6,200 బేబీలు), ఢిల్లీ (13,127), హైదరాబాద్ (11,000 పైగా) టాప్ సిటీలు. ఇవి కేవలం 2020 గణాంకాలు మాత్రమే. ఇప్పుడు ఈ సంఖ్యలు రెట్టింపు అయి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ఇప్పటికే ఈ కల్చర్ పెరిగిపోయింది. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఇది కొత్తగా పెరుగుతోంది. ఐటీ హబ్స్, కార్పొరేట్ ఆఫీస్‌లు, ఎన్‌ఆర్‌ఐ కనెక్షన్లు ఉన్న చోట్ల ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. టెక్ ప్రొఫెషనల్స్, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, వ్యాపారవేత్తలు షుగర్ డాడీలుగా రిజిస్టర్ అవుతున్నారు. అదే సమయంలో కాలేజీ విద్యార్థినులు, యంగ్ ప్రొఫెషనల్స్, ఇంజినీరింగ్, మెడికల్, ఎంబీఏ చదువుతున్న అమ్మాయిలు ఫీజులు, అద్దెలు, లైఫ్‌స్టైల్ ఖర్చులు భరించలేక ఈ దారి ఎంచుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు..? ప్రైవేట్ కాలేజీల్లో ఏడాదికి 5నుంచి 10 లక్షల రుపాయల ఫీజులు. నగరాల్లో 15 నుంచి 20 వేల అద్దెలు ఎందుకు ఒక కారణంగా ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాల పిల్లలు విద్యార్థి రుణాల భారంలో మునిగిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో లగ్జరీ లైఝ్‌స్టైల్ వీడియోలు చూసి 'నేను కూడా అలా జీవించాలి' అనే తపన యువతల్లో పెరిగింది. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన రెస్టారెంట్లు, విదేశ ట్రిప్పులు ఇవన్నీ సక్సెస్ యొక్క పర్యాయపదాలుగా మారాయి. ఆర్థిక స్వాతంత్ర్యం పేరుతో నైతిక హద్దులు క్షీణిస్తున్నాయి. 'నా శరీరం, నా నిర్ణయం' అనే స్లోగన్ పెరిగింది. ఈ ప్లాట్‌ఫామ్‌ల మెరుగుదల వెనుక భయంకరమైన నిజాలు దాగి ఉన్నాయి. అనేక కేసుల్లో వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. పోలీసు కేసులు పెట్టడానికి అమ్మాయిలు సిగ్గుపడతారు. ప్రారంభంలో 'ఈజీ మనీ' అనిపించినా తర్వాత అపరాధ భావం(ఈ స్టోరీ రాస్తుంది సీనియర్ జర్నలిస్ట్, కె. కిరణ్ కుమార్), డిప్రెషన్, ఆత్మగౌరవం కోల్పోవడం సాధారణం మారింది. ఇది ప్రేమ కాదు, లావాదేవీ. కానీ చాలా మంది యువతులు భావోద్వేగంగా అటాచ్ అవుతారు, తర్వాత మోసపోతారు. చాలా సందర్భాల్లో ఇది 'క్వాసీ-ప్రాస్టిట్యూషన్' పిలవబడుతుంది. సమాజ ప్రభావం ఈ ట్రెండ్ కేవలం వ్యక్తిగత ఎంపికల విషయం కాదు. ఇది మన సమాజం, కుటుంబ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. వివాహం, నమ్మకం, సంబంధాల పవిత్రత ఇవన్నీ ప్రశ్నార్థకం అవుతున్నాయి. ఆర్థిక అసమానతలు వ్యక్తిగత సంబంధాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. 3.38 లక్షల మంది షుగర్ డాడీలు ఉన్న దేశంలో మనం జీవిస్తున్నాం. ఇది గర్వించదగ్గ గణాంక కాదు. సిగ్గుపడాల్సిన వాస్తవం. ఆధునికత పేరుతో మనం నైతికతను, మానవ విలువలను వదులుకుంటున్నాం. ఏపీలోని ప్రతి తల్లిదండ్రి, ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు. మీ కూతురు, సోదరి, స్నేహితురాలు ఎవరైనా సరే ఈ ప్రమాదంలో పడకుండా హెచ్చరించండి. #తెలుసుకుందాం #👌social awareness 👌 #Social Awareness #awareness
తెలుసుకుందాం - శ NO శ NO - ShareChat