#🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు
09-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పేదల పెన్నిధి అయిన బాబా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానముగా చేయడానికి వచ్చారు, కావున మీరు సదా వారి శ్రీమతముపై నడవండి’’
ప్రశ్న:-మొట్టమొదట మీరు అందరికీ ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేయించాలి?
జవాబు:-బాప్ దాదా గురించి. ఇక్కడ మనము బాప్ దాదా వద్దకు వచ్చామని మీకు తెలుసు. వీరిరువురూ కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, బ్రహ్మా ఆత్మ కూడా ఉంది. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. కావున మొట్టమొదట బాప్ దాదా ఇరువురూ కలిసే ఉన్నారు అన్న గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి. వీరు (దాదా) భగవంతుడు కాదు. మనిషి భగవంతుడు కాలేరు. భగవంతుడు అని నిరాకారుడిని అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి.
పాట:-చివరికి ఆ రోజు రానే వచ్చింది...
ఓంశాంతి. తండ్రి, దాదా ద్వారా అనగా శివబాబా, బ్రహ్మా దాదా ద్వారా అర్థం చేయిస్తారు, ఇది పక్కా చేసుకోండి. లౌకిక సంబంధములో తండ్రి వేరుగా, దాదా (తాతగారు) వేరుగా ఉంటారు. తండ్రి ద్వారా తాతగారి వారసత్వము లభిస్తుంది. తాతగారి వారసత్వాన్ని తీసుకుంటున్నామని అంటారు. వారు పేదల పెన్నిధి. ఎవరైతే వచ్చి పేదవారిని కిరీటధారులుగా తయారుచేస్తారో, వారిని పేదల పెన్నిధి అని అంటారు. కావున మొట్టమొదట వీరు ఎవరు అన్నది పక్కా నిశ్చయము ఉండాలి. వీరు చూడడానికి సాకార మానవుడే, వీరిని ఇక్కడ అందరూ బ్రహ్మా అని అంటారు. మీరందరూ బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు. మాకు శివబాబా నుండి వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. వారసత్వము ఇచ్చేందుకు సర్వుల తండ్రి వచ్చారు. తండ్రి సుఖపు వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత రావణుడు దుఃఖమనే శాపాన్ని ఇస్తాడు. భక్తి మార్గములో భగవంతుడిని వెతకడానికి భ్రమిస్తారు. కానీ వారు ఎవరికీ లభించరు. మీరు తల్లి-తండ్రి... అని భారతవాసులు పాడుతారు. ఇంకా, మీరెప్పుడైతే వస్తారో, అప్పుడు మాకు మీరొక్కరే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు, ఇంకెవ్వరి పట్ల మేము మమకారము పెట్టుకోము, మాకైతే శివబాబా ఒక్కరే అని అంటారు. ఈ తండ్రి పేదల పెన్నిధి అని మీకు తెలుసు. పేదవారిని షావుకారులుగా చేసే వీరు, గవ్వలను వజ్ర సమానముగా తయారుచేస్తారు అనగా కలియుగములోని పతిత నిరుపేదల నుండి సత్యయుగములోని కిరీటధారులుగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు. ఇక్కడ మనము బాప్ దాదా వద్దకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. వీరిరువురూ కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, బ్రహ్మా ఆత్మ కూడా ఉంది, కావున ఇద్దరున్నట్లు కదా. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. మీరంతా ఆత్మలు. ఆత్మలు-పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారని అంటూ ఉంటారు. మొదటి నంబరులో ఆత్మలైన మీరు కలుసుకుంటారు అనగా ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు పరమాత్మ తండ్రిని కలుసుకుంటారు, వారినే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మీరు వారి పిల్లలు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వము లభిస్తుంది. తండ్రి అంటారు, కిరీటధారిగా ఉన్న భారత్ ఇప్పుడు ఎంత నిరుపేదగా అయ్యింది. ఇప్పుడు నేను మళ్ళీ పిల్లలైన మిమ్మల్ని కిరీటధారులుగా చేయడానికి వచ్చాను. మీరు డబల్ కిరీటధారులుగా అవుతారు. ఒకటి పవిత్రతా కిరీటము ఉంటుంది, దానిని ప్రకాశములా చూపిస్తారు. రెండవది రత్నజడిత కిరీటము. కావున మొట్టమొదట బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారనే గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి. వీరు భగవంతుడు కారు. మనిషి భగవంతుడు కారు. భగవంతుడు అని నిరాకారుడిని అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి. అక్కడ ఆత్మలైన మీరందరూ ఉంటారు, దానిని నిర్వాణధామము లేక వానప్రస్థము అని అంటారు, ఆ తర్వాత ఆత్మలైన మీరు శరీరాన్ని ధరించి ఇక్కడ పాత్రను అభినయించవలసి ఉంటుంది. అర్ధకల్పము సుఖము యొక్క పాత్ర, అర్ధకల్పము దుఃఖము యొక్క పాత్ర. దుఃఖము ఎప్పుడైతే అంతమయ్యేది ఉందో, అప్పుడు నేను వస్తాను అని తండ్రి అంటారు. ఈ డ్రామా తయారై ఉంది. పిల్లలైన మీరు ఇక్కడకు భట్టీకి వస్తారు. ఇక్కడ బయటవేవీ గుర్తుకు రాకూడదు. ఇక్కడ ఉన్నదే తల్లి, తండ్రి మరియు పిల్లలు. ఇక్కడ శూద్ర సాంప్రదాయము లేదు. ఎవరైతే బ్రాహ్మణులు కారో, వారిని శూద్రులని అంటారు. వారి సాంగత్యమైతే ఇక్కడ లేనే లేదు. ఇక్కడ ఉన్నదే బ్రాహ్మణుల సాంగత్యము. శివబాబా బ్రహ్మా ద్వారా మమ్మల్ని నరకము నుండి బయటకు తీసి స్వర్గ రాజధానికి యజమానులుగా చేయడానికి వచ్చారని బ్రాహ్మణ పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము యజమానులము కాదు ఎందుకంటే మనము పతితులుగా ఉన్నాము. మనము పావనముగా ఉండేవారము, మళ్ళీ 84 జన్మల చక్రములో తిరిగి సతో-రజో-తమోలలోకి వచ్చాము. మెట్ల చిత్రములో 84 జన్మల లెక్క వ్రాయబడి ఉంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఏ పిల్లలనైతే మొట్టమొదట కలుసుకుంటారో, వారే సత్యయుగములోకి మొట్టమొదట వస్తారు. మీరు 84 జన్మలను తీసుకున్నారు. రచయిత మరియు రచనల జ్ఞానమంతా ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. వారే మనుష్య సృష్టికి బీజరూపుడు. ఈ వృక్షము యొక్క ఉత్పత్తి, పాలన మరియు వినాశనము ఎలా జరుగుతుంది అన్న జ్ఞానము తప్పకుండా బీజములోనే ఉంటుంది. ఇది తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. భారతవాసులైన మనము పేదవారిగా ఉన్నామని మీకిప్పుడు తెలుసు. దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు ఎంత షావుకారులుగా ఉండేవారము. వజ్రాలతో ఆడుకునేవారము. వజ్రాల మహళ్ళలో నివసించేవారము. మీరు 84 జన్మలను ఎలా తీసుకుంటారు అనే స్మృతిని ఇప్పుడు తండ్రి కలిగిస్తున్నారు. ఓ పతిత-పావనా, పేదల పెన్నిధి అయిన బాబా రండి అని పిలుస్తారు కూడా. పేదవారిగా ఉన్న మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా మళ్ళీ తయారుచేయండి. స్వర్గములో అపారమైన సుఖముండేది, ఇప్పుడు అపారమైన దుఃఖముంది. ఈ సమయములో అందరూ పూర్తిగా పతితులుగా అయిపోయారని పిల్లలకు తెలుసు. ఇప్పుడిది కలియుగ అంతిమము, ఆ తర్వాత సత్యయుగము కావాలి. మొదట భారత్ లో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమొక్కటే ఉండేది, ఇప్పుడు అది కనుమరుగైపోయింది, మిగిలిన వారందరూ తమను తాము హిందువులని చెప్పుకుంటున్నారు. ఈ సమయములో క్రిస్టియన్లు పెరిగిపోయారు, ఎందుకంటే హిందూ ధర్మము వారు చాలామంది అందులోకి కన్వర్ట్ అయిపోయారు. వాస్తవానికి దేవీ-దేవతలైన మీ కర్మలు శ్రేష్ఠముగా ఉండేవి. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా ఉండేవారు. ఇప్పుడు రావణ రాజ్యములో పతిత ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా అయిపోయారు, అందుకే దుఃఖితులుగా ఉన్నారు. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. అది శివబాబా స్థాపించిన స్వర్గము. తండ్రి అంటారు, నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసి మీకు సూర్యవంశ, చంద్రవంశ రాజధానుల వారసత్వాన్ని ఇస్తాను. వీరు బాప్ దాదా, వీరిని మర్చిపోకండి. శివబాబా బ్రహ్మా ద్వారా మనల్ని స్వర్గానికి యోగ్యులుగా తయారుచేస్తున్నారు ఎందుకంటే పతిత ఆత్మలు పావనముగా అవ్వనంత వరకు ముక్తిధామానికి వెళ్ళలేరు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను వచ్చి మీకు పావనముగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తాను. నేను మిమ్మల్ని పదమపతులుగా, స్వర్గానికి యజమానులుగా తయారుచేసి వెళ్ళాను, మేము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మీకు తప్పకుండా స్మృతి కలిగింది. ఆ సమయములో మనము చాలా కొద్దిమందిమే ఉండేవారము. ఇప్పుడైతే ఎంతమంది మనుష్యులున్నారు. సత్యయుగములో 9 లక్షల మంది ఉంటారు, కావున తండ్రి అంటారు, నేను వచ్చి బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను, శంకరుని ద్వారా వినాశనాన్ని చేయిస్తాను. కల్పక్రితము వలె అందరూ తయారీ చేసుకుంటున్నారు. ఎన్ని బాంబులను తయారుచేస్తున్నారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ మహాభారత యుద్ధము జరిగింది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించి మనుష్యులను నరుని నుండి నారాయణునిగా తయారుచేసారు కావున తప్పకుండా కలియుగీ పాత ప్రపంచము యొక్క వినాశనము జరగాలి. మొత్తం ప్రపంచము అంతటికీ నిప్పు అంటుకుంటుంది. లేకపోతే వినాశనము ఎలా జరుగుతుంది? ఈరోజుల్లో బాంబులలో అగ్ని కూడా నింపుతున్నారు. కుండపోత వర్షాలు, భూకంపాలు మొదలైనవన్నీ జరుగుతాయి, అప్పుడే వినాశనము జరుగుతుంది. పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇది సంగమయుగము. రావణ రాజ్యము అంతరించి పోతుంది, రామ రాజ్యము ‘జిందాబాద్’ అవుతుంది (వర్ధిల్లుతుంది). కొత్త ప్రపంచములో శ్రీకృష్ణుని రాజ్యముండేది. లక్ష్మీ-నారాయణుల బదులు శ్రీకృష్ణుని పేరును తీసుకుంటారు ఎందుకంటే శ్రీకృష్ణుడు సుందరమైనవారు, అందరికంటే ప్రియమైన బాలుడు. మనుష్యులకైతే తెలియదు కదా. శ్రీకృష్ణుడు వేరే రాజధానికి చెందినవారు, రాధ వేరే రాజధానికి చెందినవారు. భారత్ కిరీటధారిగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా ఉంది, మళ్ళీ తండ్రి వచ్చి కిరీటధారిగా తయారుచేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, పవిత్రముగా అవ్వండి మరియు నన్నొక్కరినే స్మృతి చేయండి, అప్పుడు మీరు సతోప్రధానముగా అవుతారు. ఎవరైతే సేవ చేసి తమ సమానముగా తయారుచేస్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు, డబల్ కిరీటధారులుగా అవుతారు. సత్యయుగములో రాజు, రాణి మరియు ప్రజలు అందరూ పవిత్రముగా ఉంటారు. ఇప్పుడు ఉన్నదే ప్రజల రాజ్యము. రెండు కిరీటాలు లేవు. తండ్రి అంటారు, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడే నేను వస్తాను. ఇప్పుడు నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నేనే పతిత-పావనుడిని. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ నుండి మాలిన్యము తొలగిపోతుంది. అప్పుడు మీరు సతోప్రధానముగా అయిపోతారు. ఇప్పుడు శ్యామము నుండి సుందరముగా అవ్వాలి. బంగారములో మాలిన్యము చేరడముతో నల్లగా అయిపోతుంది, కావున ఇప్పుడు ఆ మాలిన్యాన్ని తొలగించాలి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు కామ చితిపై కూర్చుని నల్లగా అయిపోయారు, ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చోండి మరియు అందరి నుండి మమకారాన్ని తొలగించండి. మీరు ప్రియుడినైన నా ఒక్కనికి ప్రేయసులు. భక్తులంతా భగవంతుడిని స్మృతి చేస్తారు. సత్య, త్రేతాయుగాలలో భక్తి ఉండదు. అక్కడైతే జ్ఞాన ప్రారబ్ధము ఉంటుంది. తండ్రి వచ్చి జ్ఞానము ద్వారా రాత్రిని పగలుగా చేస్తారు. అంతేకానీ శాస్త్రాలు చదివితే పగలు అయిపోతుందని కాదు. అది భక్తి మార్గపు సామాగ్రి. జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే, వారు వచ్చి సృష్టి చక్ర జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు మరియు యోగాన్ని నేర్పిస్తారు. ఈశ్వరునితో యోగాన్ని జోడించేవారు యోగయోగేశ్వరులుగా అవుతారు మరియు ఆ తర్వాత రాజరాజేశ్వరులుగా, రాజరాజేశ్వరీలుగా అవుతారు. మీరు ఈశ్వరుని ద్వారా రాజులకే రాజులుగా అవుతారు. పావన రాజులుగా ఉన్నవారే మళ్ళీ పతితులుగా అవుతారు. మీరే పూజ్యులుగా, మళ్ళీ మీరే పూజారులుగా అవుతారు. ఇప్పుడు ఎంత వీలైతే అంత స్మృతియాత్రలో ఉండాలి. ఉదాహరణకు ప్రేయసి ప్రియుడిని తలచుకుంటుంది కదా. కన్యకు నిశ్చితార్థము జరిగిన తర్వాత ఒకరినొకరు తలచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రియునికైతే భక్తి మార్గములో ఎంతోమంది ప్రేయసులు ఉన్నారు. ఓ భగవంతుడా, దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అందరూ దుఃఖములో తండ్రిని తలచుకుంటారు. ఇక్కడైతే శాంతి లేదు, సుఖము లేదు. సత్యయుగములో రెండూ ఉన్నాయి.
ఆత్మలమైన మనము 84 జన్మల పాత్రను ఎలా అభినయిస్తాము అన్నది ఇప్పుడు మీకు తెలుసు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. 84 జన్మల మెట్ల వరుస బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. కర్మలు చేస్తూ కూడా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. బాబా నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఎంతగా స్మృతి చేస్తే, అంతగా పవిత్రతా ప్రకాశము వస్తూ ఉంటుంది. మాలిన్యము తొలగిపోతూ ఉంటుంది. పిల్లలు ఎంత వీలైతే అంత సమయము తీసి స్మృతి చేయడానికి ఉపాయాలను రచించాలి. ఉదయాన్నే సమయము బాగా లభిస్తుంది. ఈ పురుషార్థము చేయాలి. గృహస్థ వ్యవహారములో ఉండండి, పిల్లలు మొదలైనవారిని సంభాళించండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వండి. కామ చితిపైకి ఎక్కకండి. ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చుని ఉన్నారు. ఈ చదువు చాలా ఉన్నతమైనది, దీని కోసం బంగారు పాత్ర కావాలి. మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే బంగారు పాత్రగా అవుతారు. స్మృతిని మర్చిపోతే మళ్ళీ ఇనుప పాత్రగా అయిపోతారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా సహజము. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పవిత్రముగా అవుతారు మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు ఇళ్ళు-వాకిళ్ళను వదలకూడదు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. తండ్రి అంటారు, 63 జన్మలు మీరు పతిత ప్రపంచములో ఉన్నారు, ఇప్పుడు శివాలయమైన అమరలోకానికి వెళ్ళేందుకు ఈ ఒక్క జన్మ మీరు పవిత్రముగా ఉంటే ఏమవుతుంది? చాలా సంపాదన జరుగుతుంది. 5 వికారాలపై విజయము పొందాలి, అప్పుడే జగత్ జీతులుగా అవుతారు. లేకపోతే పదవిని పొందలేరు. తండ్రి అంటారు, అందరూ మరణించవలసిందే, ఇది అంతిమ జన్మ, మీరు మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. వజ్ర-వైఢూర్యాల గనులు నిండుగా అయిపోతాయి. అక్కడ మీరు వజ్ర-వైఢూర్యాలతో ఆడుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి తండ్రికి చెందినవారిగా అయి వారి మతముపై కూడా నడుచుకోవాలి కదా. శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్ఠముగా అవుతారు. రావణుడి మతము ద్వారా మీరు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి శ్రీమతముపై నడుస్తూ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వరు. భక్తి మార్గములోనైతే మీరు ఎంతగానో భ్రమించారు. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే మీరు 21 జన్మల కొరకు చక్రవర్తి రాజులుగా అవుతారు. అనేక సార్లు మీరు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖము ఉంటుంది. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము సంగమములో వస్తాను, మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తాను. మనము చక్రములో ఎలా తిరుగుతాము అనేది ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞాన సాగరుడు. మీరు ఇక్కడ అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు ప్రజాపిత బ్రహ్మా ద్వారా మీకు వారసత్వాన్ని ఇస్తారు. కావున, ఇప్పుడు వినాశనము జరిగే కన్నా ముందే తండ్రిని స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. నిరంతరము తండ్రి స్మృతిలో ఉండేందుకు బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. కర్మలు చేస్తూ కూడా తండ్రి స్మృతి ఉండాలి, స్మృతి ద్వారానే పవిత్రతా ప్రకాశము వస్తుంది.
2. మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు. డ్రామా రహస్యాన్ని యథార్థముగా అర్థం చేసుకోవాలి. భట్టీలో బయటకు సంబంధించినవేవీ గుర్తుకు రాకూడదు.
వరదానము:-పరస్పరములో ఒకరి విశేషతలను ఒకరు చూసే మరియు వర్ణన చేసే శ్రేష్ఠతా సంపన్నమైన హోలీహంస భవ
సంగమయుగములో పిల్లలు ప్రతి ఒక్కరికీ జ్ఞానము ద్వారా ఏదో ఒక విశేష గుణము తప్పకుండా ప్రాప్తించింది. అందుకే హోలీహంసలుగా అయి ప్రతి ఒక్కరి విశేషతలను చూడండి మరియు వర్ణన చేయండి. ఏ సమయములోనైనా ఎవరి బలహీనతలనైనా చూస్తే లేక వింటే - ఈ బలహీనత వీరిది కాదు, నాది అని భావించండి. ఎందుకంటే మనమందరము ఒక్క తండ్రికి చెందినవారము, ఒకే పరివారము వారము, ఒకే మాలలోని మణులము. ఏ విధముగా మీ బలహీనతను ప్రసిద్ధము చేయాలనుకోరో అదే విధముగా ఇతరుల బలహీనతలను కూడా వర్ణన చేయకండి. హోలీహంసలు అనగా విశేషతలను గ్రహించడము మరియు బలహీనతలను తొలగించడము.
స్లోగన్:-సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు.
అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి
ఏ విధముగా మణులకు విశేషత ఉంటుంది - ఒకే రకమైన మణులు మాలలో ఒకే దారములో కూర్చబడతాయి, అదే విధముగా వైజయంతి మాలలోని మణులైన మీరందరూ కూడా ఎప్పుడైతే ఏకమతములో, ఒక్కరి లగనములోనే, ఏకరస స్థితి కలిగి ఒక్కరిగా కనిపిస్తారో, అప్పుడే మాలలో కూర్చబడతారు. ఒకవేళ పరస్పరములో రెండు మతాలు ఉన్నట్లయితే వారు వేరే మాలలో అనగా 16000 మాలలోని మణులుగా అవుతారు.
"

