v. v. guptha
ShareChat
click to see wallet page
@299580595
299580595
v. v. guptha
@299580595
ఐ లవ్ షేర్ చాట్
https://youtube.com/watch?v=oHEFyvR6cwQ&si=extylm95KPV6kDPk #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱
youtube-preview
https://youtube.com/watch?v=H8bqaTBWro4&si=JE_Zjwlviv2oaDKU #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
https://youtube.com/watch?v=FpCV1jpmlQA&si=1UvBGXZ8LjsCg2nS #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా
youtube-preview
#🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 09-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - పేదల పెన్నిధి అయిన బాబా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానముగా చేయడానికి వచ్చారు, కావున మీరు సదా వారి శ్రీమతముపై నడవండి’’ ప్రశ్న:-మొట్టమొదట మీరు అందరికీ ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేయించాలి? జవాబు:-బాప్ దాదా గురించి. ఇక్కడ మనము బాప్ దాదా వద్దకు వచ్చామని మీకు తెలుసు. వీరిరువురూ కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, బ్రహ్మా ఆత్మ కూడా ఉంది. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. కావున మొట్టమొదట బాప్ దాదా ఇరువురూ కలిసే ఉన్నారు అన్న గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి. వీరు (దాదా) భగవంతుడు కాదు. మనిషి భగవంతుడు కాలేరు. భగవంతుడు అని నిరాకారుడిని అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి. పాట:-చివరికి ఆ రోజు రానే వచ్చింది... ఓంశాంతి. తండ్రి, దాదా ద్వారా అనగా శివబాబా, బ్రహ్మా దాదా ద్వారా అర్థం చేయిస్తారు, ఇది పక్కా చేసుకోండి. లౌకిక సంబంధములో తండ్రి వేరుగా, దాదా (తాతగారు) వేరుగా ఉంటారు. తండ్రి ద్వారా తాతగారి వారసత్వము లభిస్తుంది. తాతగారి వారసత్వాన్ని తీసుకుంటున్నామని అంటారు. వారు పేదల పెన్నిధి. ఎవరైతే వచ్చి పేదవారిని కిరీటధారులుగా తయారుచేస్తారో, వారిని పేదల పెన్నిధి అని అంటారు. కావున మొట్టమొదట వీరు ఎవరు అన్నది పక్కా నిశ్చయము ఉండాలి. వీరు చూడడానికి సాకార మానవుడే, వీరిని ఇక్కడ అందరూ బ్రహ్మా అని అంటారు. మీరందరూ బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు. మాకు శివబాబా నుండి వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. వారసత్వము ఇచ్చేందుకు సర్వుల తండ్రి వచ్చారు. తండ్రి సుఖపు వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత రావణుడు దుఃఖమనే శాపాన్ని ఇస్తాడు. భక్తి మార్గములో భగవంతుడిని వెతకడానికి భ్రమిస్తారు. కానీ వారు ఎవరికీ లభించరు. మీరు తల్లి-తండ్రి... అని భారతవాసులు పాడుతారు. ఇంకా, మీరెప్పుడైతే వస్తారో, అప్పుడు మాకు మీరొక్కరే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు, ఇంకెవ్వరి పట్ల మేము మమకారము పెట్టుకోము, మాకైతే శివబాబా ఒక్కరే అని అంటారు. ఈ తండ్రి పేదల పెన్నిధి అని మీకు తెలుసు. పేదవారిని షావుకారులుగా చేసే వీరు, గవ్వలను వజ్ర సమానముగా తయారుచేస్తారు అనగా కలియుగములోని పతిత నిరుపేదల నుండి సత్యయుగములోని కిరీటధారులుగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు. ఇక్కడ మనము బాప్ దాదా వద్దకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. వీరిరువురూ కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, బ్రహ్మా ఆత్మ కూడా ఉంది, కావున ఇద్దరున్నట్లు కదా. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. మీరంతా ఆత్మలు. ఆత్మలు-పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారని అంటూ ఉంటారు. మొదటి నంబరులో ఆత్మలైన మీరు కలుసుకుంటారు అనగా ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు పరమాత్మ తండ్రిని కలుసుకుంటారు, వారినే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మీరు వారి పిల్లలు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వము లభిస్తుంది. తండ్రి అంటారు, కిరీటధారిగా ఉన్న భారత్ ఇప్పుడు ఎంత నిరుపేదగా అయ్యింది. ఇప్పుడు నేను మళ్ళీ పిల్లలైన మిమ్మల్ని కిరీటధారులుగా చేయడానికి వచ్చాను. మీరు డబల్ కిరీటధారులుగా అవుతారు. ఒకటి పవిత్రతా కిరీటము ఉంటుంది, దానిని ప్రకాశములా చూపిస్తారు. రెండవది రత్నజడిత కిరీటము. కావున మొట్టమొదట బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారనే గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి. వీరు భగవంతుడు కారు. మనిషి భగవంతుడు కారు. భగవంతుడు అని నిరాకారుడిని అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి. అక్కడ ఆత్మలైన మీరందరూ ఉంటారు, దానిని నిర్వాణధామము లేక వానప్రస్థము అని అంటారు, ఆ తర్వాత ఆత్మలైన మీరు శరీరాన్ని ధరించి ఇక్కడ పాత్రను అభినయించవలసి ఉంటుంది. అర్ధకల్పము సుఖము యొక్క పాత్ర, అర్ధకల్పము దుఃఖము యొక్క పాత్ర. దుఃఖము ఎప్పుడైతే అంతమయ్యేది ఉందో, అప్పుడు నేను వస్తాను అని తండ్రి అంటారు. ఈ డ్రామా తయారై ఉంది. పిల్లలైన మీరు ఇక్కడకు భట్టీకి వస్తారు. ఇక్కడ బయటవేవీ గుర్తుకు రాకూడదు. ఇక్కడ ఉన్నదే తల్లి, తండ్రి మరియు పిల్లలు. ఇక్కడ శూద్ర సాంప్రదాయము లేదు. ఎవరైతే బ్రాహ్మణులు కారో, వారిని శూద్రులని అంటారు. వారి సాంగత్యమైతే ఇక్కడ లేనే లేదు. ఇక్కడ ఉన్నదే బ్రాహ్మణుల సాంగత్యము. శివబాబా బ్రహ్మా ద్వారా మమ్మల్ని నరకము నుండి బయటకు తీసి స్వర్గ రాజధానికి యజమానులుగా చేయడానికి వచ్చారని బ్రాహ్మణ పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము యజమానులము కాదు ఎందుకంటే మనము పతితులుగా ఉన్నాము. మనము పావనముగా ఉండేవారము, మళ్ళీ 84 జన్మల చక్రములో తిరిగి సతో-రజో-తమోలలోకి వచ్చాము. మెట్ల చిత్రములో 84 జన్మల లెక్క వ్రాయబడి ఉంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఏ పిల్లలనైతే మొట్టమొదట కలుసుకుంటారో, వారే సత్యయుగములోకి మొట్టమొదట వస్తారు. మీరు 84 జన్మలను తీసుకున్నారు. రచయిత మరియు రచనల జ్ఞానమంతా ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. వారే మనుష్య సృష్టికి బీజరూపుడు. ఈ వృక్షము యొక్క ఉత్పత్తి, పాలన మరియు వినాశనము ఎలా జరుగుతుంది అన్న జ్ఞానము తప్పకుండా బీజములోనే ఉంటుంది. ఇది తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. భారతవాసులైన మనము పేదవారిగా ఉన్నామని మీకిప్పుడు తెలుసు. దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు ఎంత షావుకారులుగా ఉండేవారము. వజ్రాలతో ఆడుకునేవారము. వజ్రాల మహళ్ళలో నివసించేవారము. మీరు 84 జన్మలను ఎలా తీసుకుంటారు అనే స్మృతిని ఇప్పుడు తండ్రి కలిగిస్తున్నారు. ఓ పతిత-పావనా, పేదల పెన్నిధి అయిన బాబా రండి అని పిలుస్తారు కూడా. పేదవారిగా ఉన్న మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా మళ్ళీ తయారుచేయండి. స్వర్గములో అపారమైన సుఖముండేది, ఇప్పుడు అపారమైన దుఃఖముంది. ఈ సమయములో అందరూ పూర్తిగా పతితులుగా అయిపోయారని పిల్లలకు తెలుసు. ఇప్పుడిది కలియుగ అంతిమము, ఆ తర్వాత సత్యయుగము కావాలి. మొదట భారత్ లో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమొక్కటే ఉండేది, ఇప్పుడు అది కనుమరుగైపోయింది, మిగిలిన వారందరూ తమను తాము హిందువులని చెప్పుకుంటున్నారు. ఈ సమయములో క్రిస్టియన్లు పెరిగిపోయారు, ఎందుకంటే హిందూ ధర్మము వారు చాలామంది అందులోకి కన్వర్ట్ అయిపోయారు. వాస్తవానికి దేవీ-దేవతలైన మీ కర్మలు శ్రేష్ఠముగా ఉండేవి. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా ఉండేవారు. ఇప్పుడు రావణ రాజ్యములో పతిత ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా అయిపోయారు, అందుకే దుఃఖితులుగా ఉన్నారు. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. అది శివబాబా స్థాపించిన స్వర్గము. తండ్రి అంటారు, నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసి మీకు సూర్యవంశ, చంద్రవంశ రాజధానుల వారసత్వాన్ని ఇస్తాను. వీరు బాప్ దాదా, వీరిని మర్చిపోకండి. శివబాబా బ్రహ్మా ద్వారా మనల్ని స్వర్గానికి యోగ్యులుగా తయారుచేస్తున్నారు ఎందుకంటే పతిత ఆత్మలు పావనముగా అవ్వనంత వరకు ముక్తిధామానికి వెళ్ళలేరు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను వచ్చి మీకు పావనముగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తాను. నేను మిమ్మల్ని పదమపతులుగా, స్వర్గానికి యజమానులుగా తయారుచేసి వెళ్ళాను, మేము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మీకు తప్పకుండా స్మృతి కలిగింది. ఆ సమయములో మనము చాలా కొద్దిమందిమే ఉండేవారము. ఇప్పుడైతే ఎంతమంది మనుష్యులున్నారు. సత్యయుగములో 9 లక్షల మంది ఉంటారు, కావున తండ్రి అంటారు, నేను వచ్చి బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను, శంకరుని ద్వారా వినాశనాన్ని చేయిస్తాను. కల్పక్రితము వలె అందరూ తయారీ చేసుకుంటున్నారు. ఎన్ని బాంబులను తయారుచేస్తున్నారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ మహాభారత యుద్ధము జరిగింది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించి మనుష్యులను నరుని నుండి నారాయణునిగా తయారుచేసారు కావున తప్పకుండా కలియుగీ పాత ప్రపంచము యొక్క వినాశనము జరగాలి. మొత్తం ప్రపంచము అంతటికీ నిప్పు అంటుకుంటుంది. లేకపోతే వినాశనము ఎలా జరుగుతుంది? ఈరోజుల్లో బాంబులలో అగ్ని కూడా నింపుతున్నారు. కుండపోత వర్షాలు, భూకంపాలు మొదలైనవన్నీ జరుగుతాయి, అప్పుడే వినాశనము జరుగుతుంది. పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇది సంగమయుగము. రావణ రాజ్యము అంతరించి పోతుంది, రామ రాజ్యము ‘జిందాబాద్’ అవుతుంది (వర్ధిల్లుతుంది). కొత్త ప్రపంచములో శ్రీకృష్ణుని రాజ్యముండేది. లక్ష్మీ-నారాయణుల బదులు శ్రీకృష్ణుని పేరును తీసుకుంటారు ఎందుకంటే శ్రీకృష్ణుడు సుందరమైనవారు, అందరికంటే ప్రియమైన బాలుడు. మనుష్యులకైతే తెలియదు కదా. శ్రీకృష్ణుడు వేరే రాజధానికి చెందినవారు, రాధ వేరే రాజధానికి చెందినవారు. భారత్ కిరీటధారిగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా ఉంది, మళ్ళీ తండ్రి వచ్చి కిరీటధారిగా తయారుచేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, పవిత్రముగా అవ్వండి మరియు నన్నొక్కరినే స్మృతి చేయండి, అప్పుడు మీరు సతోప్రధానముగా అవుతారు. ఎవరైతే సేవ చేసి తమ సమానముగా తయారుచేస్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు, డబల్ కిరీటధారులుగా అవుతారు. సత్యయుగములో రాజు, రాణి మరియు ప్రజలు అందరూ పవిత్రముగా ఉంటారు. ఇప్పుడు ఉన్నదే ప్రజల రాజ్యము. రెండు కిరీటాలు లేవు. తండ్రి అంటారు, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడే నేను వస్తాను. ఇప్పుడు నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నేనే పతిత-పావనుడిని. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ నుండి మాలిన్యము తొలగిపోతుంది. అప్పుడు మీరు సతోప్రధానముగా అయిపోతారు. ఇప్పుడు శ్యామము నుండి సుందరముగా అవ్వాలి. బంగారములో మాలిన్యము చేరడముతో నల్లగా అయిపోతుంది, కావున ఇప్పుడు ఆ మాలిన్యాన్ని తొలగించాలి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు కామ చితిపై కూర్చుని నల్లగా అయిపోయారు, ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చోండి మరియు అందరి నుండి మమకారాన్ని తొలగించండి. మీరు ప్రియుడినైన నా ఒక్కనికి ప్రేయసులు. భక్తులంతా భగవంతుడిని స్మృతి చేస్తారు. సత్య, త్రేతాయుగాలలో భక్తి ఉండదు. అక్కడైతే జ్ఞాన ప్రారబ్ధము ఉంటుంది. తండ్రి వచ్చి జ్ఞానము ద్వారా రాత్రిని పగలుగా చేస్తారు. అంతేకానీ శాస్త్రాలు చదివితే పగలు అయిపోతుందని కాదు. అది భక్తి మార్గపు సామాగ్రి. జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే, వారు వచ్చి సృష్టి చక్ర జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు మరియు యోగాన్ని నేర్పిస్తారు. ఈశ్వరునితో యోగాన్ని జోడించేవారు యోగయోగేశ్వరులుగా అవుతారు మరియు ఆ తర్వాత రాజరాజేశ్వరులుగా, రాజరాజేశ్వరీలుగా అవుతారు. మీరు ఈశ్వరుని ద్వారా రాజులకే రాజులుగా అవుతారు. పావన రాజులుగా ఉన్నవారే మళ్ళీ పతితులుగా అవుతారు. మీరే పూజ్యులుగా, మళ్ళీ మీరే పూజారులుగా అవుతారు. ఇప్పుడు ఎంత వీలైతే అంత స్మృతియాత్రలో ఉండాలి. ఉదాహరణకు ప్రేయసి ప్రియుడిని తలచుకుంటుంది కదా. కన్యకు నిశ్చితార్థము జరిగిన తర్వాత ఒకరినొకరు తలచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రియునికైతే భక్తి మార్గములో ఎంతోమంది ప్రేయసులు ఉన్నారు. ఓ భగవంతుడా, దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అందరూ దుఃఖములో తండ్రిని తలచుకుంటారు. ఇక్కడైతే శాంతి లేదు, సుఖము లేదు. సత్యయుగములో రెండూ ఉన్నాయి. ఆత్మలమైన మనము 84 జన్మల పాత్రను ఎలా అభినయిస్తాము అన్నది ఇప్పుడు మీకు తెలుసు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. 84 జన్మల మెట్ల వరుస బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. కర్మలు చేస్తూ కూడా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. బాబా నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఎంతగా స్మృతి చేస్తే, అంతగా పవిత్రతా ప్రకాశము వస్తూ ఉంటుంది. మాలిన్యము తొలగిపోతూ ఉంటుంది. పిల్లలు ఎంత వీలైతే అంత సమయము తీసి స్మృతి చేయడానికి ఉపాయాలను రచించాలి. ఉదయాన్నే సమయము బాగా లభిస్తుంది. ఈ పురుషార్థము చేయాలి. గృహస్థ వ్యవహారములో ఉండండి, పిల్లలు మొదలైనవారిని సంభాళించండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వండి. కామ చితిపైకి ఎక్కకండి. ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చుని ఉన్నారు. ఈ చదువు చాలా ఉన్నతమైనది, దీని కోసం బంగారు పాత్ర కావాలి. మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే బంగారు పాత్రగా అవుతారు. స్మృతిని మర్చిపోతే మళ్ళీ ఇనుప పాత్రగా అయిపోతారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా సహజము. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పవిత్రముగా అవుతారు మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు ఇళ్ళు-వాకిళ్ళను వదలకూడదు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. తండ్రి అంటారు, 63 జన్మలు మీరు పతిత ప్రపంచములో ఉన్నారు, ఇప్పుడు శివాలయమైన అమరలోకానికి వెళ్ళేందుకు ఈ ఒక్క జన్మ మీరు పవిత్రముగా ఉంటే ఏమవుతుంది? చాలా సంపాదన జరుగుతుంది. 5 వికారాలపై విజయము పొందాలి, అప్పుడే జగత్ జీతులుగా అవుతారు. లేకపోతే పదవిని పొందలేరు. తండ్రి అంటారు, అందరూ మరణించవలసిందే, ఇది అంతిమ జన్మ, మీరు మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. వజ్ర-వైఢూర్యాల గనులు నిండుగా అయిపోతాయి. అక్కడ మీరు వజ్ర-వైఢూర్యాలతో ఆడుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి తండ్రికి చెందినవారిగా అయి వారి మతముపై కూడా నడుచుకోవాలి కదా. శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్ఠముగా అవుతారు. రావణుడి మతము ద్వారా మీరు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి శ్రీమతముపై నడుస్తూ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వరు. భక్తి మార్గములోనైతే మీరు ఎంతగానో భ్రమించారు. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే మీరు 21 జన్మల కొరకు చక్రవర్తి రాజులుగా అవుతారు. అనేక సార్లు మీరు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖము ఉంటుంది. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము సంగమములో వస్తాను, మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తాను. మనము చక్రములో ఎలా తిరుగుతాము అనేది ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞాన సాగరుడు. మీరు ఇక్కడ అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు ప్రజాపిత బ్రహ్మా ద్వారా మీకు వారసత్వాన్ని ఇస్తారు. కావున, ఇప్పుడు వినాశనము జరిగే కన్నా ముందే తండ్రిని స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. నిరంతరము తండ్రి స్మృతిలో ఉండేందుకు బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. కర్మలు చేస్తూ కూడా తండ్రి స్మృతి ఉండాలి, స్మృతి ద్వారానే పవిత్రతా ప్రకాశము వస్తుంది. 2. మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు. డ్రామా రహస్యాన్ని యథార్థముగా అర్థం చేసుకోవాలి. భట్టీలో బయటకు సంబంధించినవేవీ గుర్తుకు రాకూడదు. వరదానము:-పరస్పరములో ఒకరి విశేషతలను ఒకరు చూసే మరియు వర్ణన చేసే శ్రేష్ఠతా సంపన్నమైన హోలీహంస భవ సంగమయుగములో పిల్లలు ప్రతి ఒక్కరికీ జ్ఞానము ద్వారా ఏదో ఒక విశేష గుణము తప్పకుండా ప్రాప్తించింది. అందుకే హోలీహంసలుగా అయి ప్రతి ఒక్కరి విశేషతలను చూడండి మరియు వర్ణన చేయండి. ఏ సమయములోనైనా ఎవరి బలహీనతలనైనా చూస్తే లేక వింటే - ఈ బలహీనత వీరిది కాదు, నాది అని భావించండి. ఎందుకంటే మనమందరము ఒక్క తండ్రికి చెందినవారము, ఒకే పరివారము వారము, ఒకే మాలలోని మణులము. ఏ విధముగా మీ బలహీనతను ప్రసిద్ధము చేయాలనుకోరో అదే విధముగా ఇతరుల బలహీనతలను కూడా వర్ణన చేయకండి. హోలీహంసలు అనగా విశేషతలను గ్రహించడము మరియు బలహీనతలను తొలగించడము. స్లోగన్:-సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి ఏ విధముగా మణులకు విశేషత ఉంటుంది - ఒకే రకమైన మణులు మాలలో ఒకే దారములో కూర్చబడతాయి, అదే విధముగా వైజయంతి మాలలోని మణులైన మీరందరూ కూడా ఎప్పుడైతే ఏకమతములో, ఒక్కరి లగనములోనే, ఏకరస స్థితి కలిగి ఒక్కరిగా కనిపిస్తారో, అప్పుడే మాలలో కూర్చబడతారు. ఒకవేళ పరస్పరములో రెండు మతాలు ఉన్నట్లయితే వారు వేరే మాలలో అనగా 16000 మాలలోని మణులుగా అవుతారు. "
"శివ బాబా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 09-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - పేదల పెన్నిధి అయిన బాబా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానముగా చేయడానికి వచ్చారు, కావున మీరు సదా వారి శ్రీమతముపై నడవండి’’ ప్రశ్న:-మొట్టమొదట మీరు అందరికీ ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేయించాలి? జవాబు:-బాప్ దాదా గురించి. ఇక్కడ మనము బాప్ దాదా వద్దకు వచ్చామని మీకు తెలుసు. వీరిరువురూ కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, బ్రహ్మా ఆత్మ కూడా ఉంది. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. కావున మొట్టమొదట బాప్ దాదా ఇరువురూ కలిసే ఉన్నారు అన్న గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి. వీరు (దాదా) భగవంతుడు కాదు. మనిషి భగవంతుడు కాలేరు. భగవంతుడు అని నిరాకారుడిని అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి. పాట:-చివరికి ఆ రోజు రానే వచ్చింది... ఓంశాంతి. తండ్రి, దాదా ద్వారా అనగా శివబాబా, బ్రహ్మా దాదా ద్వారా అర్థం చేయిస్తారు, ఇది పక్కా చేసుకోండి. లౌకిక సంబంధములో తండ్రి వేరుగా, దాదా (తాతగారు) వేరుగా ఉంటారు. తండ్రి ద్వారా తాతగారి వారసత్వము లభిస్తుంది. తాతగారి వారసత్వాన్ని తీసుకుంటున్నామని అంటారు. వారు పేదల పెన్నిధి. ఎవరైతే వచ్చి పేదవారిని కిరీటధారులుగా తయారుచేస్తారో, వారిని పేదల పెన్నిధి అని అంటారు. కావున మొట్టమొదట వీరు ఎవరు అన్నది పక్కా నిశ్చయము ఉండాలి. వీరు చూడడానికి సాకార మానవుడే, వీరిని ఇక్కడ అందరూ బ్రహ్మా అని అంటారు. మీరందరూ బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు. మాకు శివబాబా నుండి వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. వారసత్వము ఇచ్చేందుకు సర్వుల తండ్రి వచ్చారు. తండ్రి సుఖపు వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత రావణుడు దుఃఖమనే శాపాన్ని ఇస్తాడు. భక్తి మార్గములో భగవంతుడిని వెతకడానికి భ్రమిస్తారు. కానీ వారు ఎవరికీ లభించరు. మీరు తల్లి-తండ్రి... అని భారతవాసులు పాడుతారు. ఇంకా, మీరెప్పుడైతే వస్తారో, అప్పుడు మాకు మీరొక్కరే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు, ఇంకెవ్వరి పట్ల మేము మమకారము పెట్టుకోము, మాకైతే శివబాబా ఒక్కరే అని అంటారు. ఈ తండ్రి పేదల పెన్నిధి అని మీకు తెలుసు. పేదవారిని షావుకారులుగా చేసే వీరు, గవ్వలను వజ్ర సమానముగా తయారుచేస్తారు అనగా కలియుగములోని పతిత నిరుపేదల నుండి సత్యయుగములోని కిరీటధారులుగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు. ఇక్కడ మనము బాప్ దాదా వద్దకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. వీరిరువురూ కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, బ్రహ్మా ఆత్మ కూడా ఉంది, కావున ఇద్దరున్నట్లు కదా. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. మీరంతా ఆత్మలు. ఆత్మలు-పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారని అంటూ ఉంటారు. మొదటి నంబరులో ఆత్మలైన మీరు కలుసుకుంటారు అనగా ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు పరమాత్మ తండ్రిని కలుసుకుంటారు, వారినే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మీరు వారి పిల్లలు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వము లభిస్తుంది. తండ్రి అంటారు, కిరీటధారిగా ఉన్న భారత్ ఇప్పుడు ఎంత నిరుపేదగా అయ్యింది. ఇప్పుడు నేను మళ్ళీ పిల్లలైన మిమ్మల్ని కిరీటధారులుగా చేయడానికి వచ్చాను. మీరు డబల్ కిరీటధారులుగా అవుతారు. ఒకటి పవిత్రతా కిరీటము ఉంటుంది, దానిని ప్రకాశములా చూపిస్తారు. రెండవది రత్నజడిత కిరీటము. కావున మొట్టమొదట బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారనే గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి. వీరు భగవంతుడు కారు. మనిషి భగవంతుడు కారు. భగవంతుడు అని నిరాకారుడిని అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి. అక్కడ ఆత్మలైన మీరందరూ ఉంటారు, దానిని నిర్వాణధామము లేక వానప్రస్థము అని అంటారు, ఆ తర్వాత ఆత్మలైన మీరు శరీరాన్ని ధరించి ఇక్కడ పాత్రను అభినయించవలసి ఉంటుంది. అర్ధకల్పము సుఖము యొక్క పాత్ర, అర్ధకల్పము దుఃఖము యొక్క పాత్ర. దుఃఖము ఎప్పుడైతే అంతమయ్యేది ఉందో, అప్పుడు నేను వస్తాను అని తండ్రి అంటారు. ఈ డ్రామా తయారై ఉంది. పిల్లలైన మీరు ఇక్కడకు భట్టీకి వస్తారు. ఇక్కడ బయటవేవీ గుర్తుకు రాకూడదు. ఇక్కడ ఉన్నదే తల్లి, తండ్రి మరియు పిల్లలు. ఇక్కడ శూద్ర సాంప్రదాయము లేదు. ఎవరైతే బ్రాహ్మణులు కారో, వారిని శూద్రులని అంటారు. వారి సాంగత్యమైతే ఇక్కడ లేనే లేదు. ఇక్కడ ఉన్నదే బ్రాహ్మణుల సాంగత్యము. శివబాబా బ్రహ్మా ద్వారా మమ్మల్ని నరకము నుండి బయటకు తీసి స్వర్గ రాజధానికి యజమానులుగా చేయడానికి వచ్చారని బ్రాహ్మణ పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము యజమానులము కాదు ఎందుకంటే మనము పతితులుగా ఉన్నాము. మనము పావనముగా ఉండేవారము, మళ్ళీ 84 జన్మల చక్రములో తిరిగి సతో-రజో-తమోలలోకి వచ్చాము. మెట్ల చిత్రములో 84 జన్మల లెక్క వ్రాయబడి ఉంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఏ పిల్లలనైతే మొట్టమొదట కలుసుకుంటారో, వారే సత్యయుగములోకి మొట్టమొదట వస్తారు. మీరు 84 జన్మలను తీసుకున్నారు. రచయిత మరియు రచనల జ్ఞానమంతా ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. వారే మనుష్య సృష్టికి బీజరూపుడు. ఈ వృక్షము యొక్క ఉత్పత్తి, పాలన మరియు వినాశనము ఎలా జరుగుతుంది అన్న జ్ఞానము తప్పకుండా బీజములోనే ఉంటుంది. ఇది తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. భారతవాసులైన మనము పేదవారిగా ఉన్నామని మీకిప్పుడు తెలుసు. దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు ఎంత షావుకారులుగా ఉండేవారము. వజ్రాలతో ఆడుకునేవారము. వజ్రాల మహళ్ళలో నివసించేవారము. మీరు 84 జన్మలను ఎలా తీసుకుంటారు అనే స్మృతిని ఇప్పుడు తండ్రి కలిగిస్తున్నారు. ఓ పతిత-పావనా, పేదల పెన్నిధి అయిన బాబా రండి అని పిలుస్తారు కూడా. పేదవారిగా ఉన్న మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా మళ్ళీ తయారుచేయండి. స్వర్గములో అపారమైన సుఖముండేది, ఇప్పుడు అపారమైన దుఃఖముంది. ఈ సమయములో అందరూ పూర్తిగా పతితులుగా అయిపోయారని పిల్లలకు తెలుసు. ఇప్పుడిది కలియుగ అంతిమము, ఆ తర్వాత సత్యయుగము కావాలి. మొదట భారత్ లో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమొక్కటే ఉండేది, ఇప్పుడు అది కనుమరుగైపోయింది, మిగిలిన వారందరూ తమను తాము హిందువులని చెప్పుకుంటున్నారు. ఈ సమయములో క్రిస్టియన్లు పెరిగిపోయారు, ఎందుకంటే హిందూ ధర్మము వారు చాలామంది అందులోకి కన్వర్ట్ అయిపోయారు. వాస్తవానికి దేవీ-దేవతలైన మీ కర్మలు శ్రేష్ఠముగా ఉండేవి. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా ఉండేవారు. ఇప్పుడు రావణ రాజ్యములో పతిత ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా అయిపోయారు, అందుకే దుఃఖితులుగా ఉన్నారు. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. అది శివబాబా స్థాపించిన స్వర్గము. తండ్రి అంటారు, నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసి మీకు సూర్యవంశ, చంద్రవంశ రాజధానుల వారసత్వాన్ని ఇస్తాను. వీరు బాప్ దాదా, వీరిని మర్చిపోకండి. శివబాబా బ్రహ్మా ద్వారా మనల్ని స్వర్గానికి యోగ్యులుగా తయారుచేస్తున్నారు ఎందుకంటే పతిత ఆత్మలు పావనముగా అవ్వనంత వరకు ముక్తిధామానికి వెళ్ళలేరు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను వచ్చి మీకు పావనముగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తాను. నేను మిమ్మల్ని పదమపతులుగా, స్వర్గానికి యజమానులుగా తయారుచేసి వెళ్ళాను, మేము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మీకు తప్పకుండా స్మృతి కలిగింది. ఆ సమయములో మనము చాలా కొద్దిమందిమే ఉండేవారము. ఇప్పుడైతే ఎంతమంది మనుష్యులున్నారు. సత్యయుగములో 9 లక్షల మంది ఉంటారు, కావున తండ్రి అంటారు, నేను వచ్చి బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను, శంకరుని ద్వారా వినాశనాన్ని చేయిస్తాను. కల్పక్రితము వలె అందరూ తయారీ చేసుకుంటున్నారు. ఎన్ని బాంబులను తయారుచేస్తున్నారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ మహాభారత యుద్ధము జరిగింది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించి మనుష్యులను నరుని నుండి నారాయణునిగా తయారుచేసారు కావున తప్పకుండా కలియుగీ పాత ప్రపంచము యొక్క వినాశనము జరగాలి. మొత్తం ప్రపంచము అంతటికీ నిప్పు అంటుకుంటుంది. లేకపోతే వినాశనము ఎలా జరుగుతుంది? ఈరోజుల్లో బాంబులలో అగ్ని కూడా నింపుతున్నారు. కుండపోత వర్షాలు, భూకంపాలు మొదలైనవన్నీ జరుగుతాయి, అప్పుడే వినాశనము జరుగుతుంది. పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇది సంగమయుగము. రావణ రాజ్యము అంతరించి పోతుంది, రామ రాజ్యము ‘జిందాబాద్’ అవుతుంది (వర్ధిల్లుతుంది). కొత్త ప్రపంచములో శ్రీకృష్ణుని రాజ్యముండేది. లక్ష్మీ-నారాయణుల బదులు శ్రీకృష్ణుని పేరును తీసుకుంటారు ఎందుకంటే శ్రీకృష్ణుడు సుందరమైనవారు, అందరికంటే ప్రియమైన బాలుడు. మనుష్యులకైతే తెలియదు కదా. శ్రీకృష్ణుడు వేరే రాజధానికి చెందినవారు, రాధ వేరే రాజధానికి చెందినవారు. భారత్ కిరీటధారిగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా ఉంది, మళ్ళీ తండ్రి వచ్చి కిరీటధారిగా తయారుచేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, పవిత్రముగా అవ్వండి మరియు నన్నొక్కరినే స్మృతి చేయండి, అప్పుడు మీరు సతోప్రధానముగా అవుతారు. ఎవరైతే సేవ చేసి తమ సమానముగా తయారుచేస్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు, డబల్ కిరీటధారులుగా అవుతారు. సత్యయుగములో రాజు, రాణి మరియు ప్రజలు అందరూ పవిత్రముగా ఉంటారు. ఇప్పుడు ఉన్నదే ప్రజల రాజ్యము. రెండు కిరీటాలు లేవు. తండ్రి అంటారు, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడే నేను వస్తాను. ఇప్పుడు నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నేనే పతిత-పావనుడిని. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ నుండి మాలిన్యము తొలగిపోతుంది. అప్పుడు మీరు సతోప్రధానముగా అయిపోతారు. ఇప్పుడు శ్యామము నుండి సుందరముగా అవ్వాలి. బంగారములో మాలిన్యము చేరడముతో నల్లగా అయిపోతుంది, కావున ఇప్పుడు ఆ మాలిన్యాన్ని తొలగించాలి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు కామ చితిపై కూర్చుని నల్లగా అయిపోయారు, ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చోండి మరియు అందరి నుండి మమకారాన్ని తొలగించండి. మీరు ప్రియుడినైన నా ఒక్కనికి ప్రేయసులు. భక్తులంతా భగవంతుడిని స్మృతి చేస్తారు. సత్య, త్రేతాయుగాలలో భక్తి ఉండదు. అక్కడైతే జ్ఞాన ప్రారబ్ధము ఉంటుంది. తండ్రి వచ్చి జ్ఞానము ద్వారా రాత్రిని పగలుగా చేస్తారు. అంతేకానీ శాస్త్రాలు చదివితే పగలు అయిపోతుందని కాదు. అది భక్తి మార్గపు సామాగ్రి. జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే, వారు వచ్చి సృష్టి చక్ర జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు మరియు యోగాన్ని నేర్పిస్తారు. ఈశ్వరునితో యోగాన్ని జోడించేవారు యోగయోగేశ్వరులుగా అవుతారు మరియు ఆ తర్వాత రాజరాజేశ్వరులుగా, రాజరాజేశ్వరీలుగా అవుతారు. మీరు ఈశ్వరుని ద్వారా రాజులకే రాజులుగా అవుతారు. పావన రాజులుగా ఉన్నవారే మళ్ళీ పతితులుగా అవుతారు. మీరే పూజ్యులుగా, మళ్ళీ మీరే పూజారులుగా అవుతారు. ఇప్పుడు ఎంత వీలైతే అంత స్మృతియాత్రలో ఉండాలి. ఉదాహరణకు ప్రేయసి ప్రియుడిని తలచుకుంటుంది కదా. కన్యకు నిశ్చితార్థము జరిగిన తర్వాత ఒకరినొకరు తలచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రియునికైతే భక్తి మార్గములో ఎంతోమంది ప్రేయసులు ఉన్నారు. ఓ భగవంతుడా, దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అందరూ దుఃఖములో తండ్రిని తలచుకుంటారు. ఇక్కడైతే శాంతి లేదు, సుఖము లేదు. సత్యయుగములో రెండూ ఉన్నాయి. ఆత్మలమైన మనము 84 జన్మల పాత్రను ఎలా అభినయిస్తాము అన్నది ఇప్పుడు మీకు తెలుసు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. 84 జన్మల మెట్ల వరుస బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. కర్మలు చేస్తూ కూడా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. బాబా నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఎంతగా స్మృతి చేస్తే, అంతగా పవిత్రతా ప్రకాశము వస్తూ ఉంటుంది. మాలిన్యము తొలగిపోతూ ఉంటుంది. పిల్లలు ఎంత వీలైతే అంత సమయము తీసి స్మృతి చేయడానికి ఉపాయాలను రచించాలి. ఉదయాన్నే సమయము బాగా లభిస్తుంది. ఈ పురుషార్థము చేయాలి. గృహస్థ వ్యవహారములో ఉండండి, పిల్లలు మొదలైనవారిని సంభాళించండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వండి. కామ చితిపైకి ఎక్కకండి. ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చుని ఉన్నారు. ఈ చదువు చాలా ఉన్నతమైనది, దీని కోసం బంగారు పాత్ర కావాలి. మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే బంగారు పాత్రగా అవుతారు. స్మృతిని మర్చిపోతే మళ్ళీ ఇనుప పాత్రగా అయిపోతారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా సహజము. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పవిత్రముగా అవుతారు మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు ఇళ్ళు-వాకిళ్ళను వదలకూడదు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. తండ్రి అంటారు, 63 జన్మలు మీరు పతిత ప్రపంచములో ఉన్నారు, ఇప్పుడు శివాలయమైన అమరలోకానికి వెళ్ళేందుకు ఈ ఒక్క జన్మ మీరు పవిత్రముగా ఉంటే ఏమవుతుంది? చాలా సంపాదన జరుగుతుంది. 5 వికారాలపై విజయము పొందాలి, అప్పుడే జగత్ జీతులుగా అవుతారు. లేకపోతే పదవిని పొందలేరు. తండ్రి అంటారు, అందరూ మరణించవలసిందే, ఇది అంతిమ జన్మ, మీరు మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. వజ్ర-వైఢూర్యాల గనులు నిండుగా అయిపోతాయి. అక్కడ మీరు వజ్ర-వైఢూర్యాలతో ఆడుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి తండ్రికి చెందినవారిగా అయి వారి మతముపై కూడా నడుచుకోవాలి కదా. శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్ఠముగా అవుతారు. రావణుడి మతము ద్వారా మీరు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి శ్రీమతముపై నడుస్తూ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వరు. భక్తి మార్గములోనైతే మీరు ఎంతగానో భ్రమించారు. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే మీరు 21 జన్మల కొరకు చక్రవర్తి రాజులుగా అవుతారు. అనేక సార్లు మీరు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖము ఉంటుంది. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము సంగమములో వస్తాను, మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తాను. మనము చక్రములో ఎలా తిరుగుతాము అనేది ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞాన సాగరుడు. మీరు ఇక్కడ అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు ప్రజాపిత బ్రహ్మా ద్వారా మీకు వారసత్వాన్ని ఇస్తారు. కావున, ఇప్పుడు వినాశనము జరిగే కన్నా ముందే తండ్రిని స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. నిరంతరము తండ్రి స్మృతిలో ఉండేందుకు బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. కర్మలు చేస్తూ కూడా తండ్రి స్మృతి ఉండాలి, స్మృతి ద్వారానే పవిత్రతా ప్రకాశము వస్తుంది. 2. మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు. డ్రామా రహస్యాన్ని యథార్థముగా అర్థం చేసుకోవాలి. భట్టీలో బయటకు సంబంధించినవేవీ గుర్తుకు రాకూడదు. వరదానము:-పరస్పరములో ఒకరి విశేషతలను ఒకరు చూసే మరియు వర్ణన చేసే శ్రేష్ఠతా సంపన్నమైన హోలీహంస భవ సంగమయుగములో పిల్లలు ప్రతి ఒక్కరికీ జ్ఞానము ద్వారా ఏదో ఒక విశేష గుణము తప్పకుండా ప్రాప్తించింది. అందుకే హోలీహంసలుగా అయి ప్రతి ఒక్కరి విశేషతలను చూడండి మరియు వర్ణన చేయండి. ఏ సమయములోనైనా ఎవరి బలహీనతలనైనా చూస్తే లేక వింటే - ఈ బలహీనత వీరిది కాదు, నాది అని భావించండి. ఎందుకంటే మనమందరము ఒక్క తండ్రికి చెందినవారము, ఒకే పరివారము వారము, ఒకే మాలలోని మణులము. ఏ విధముగా మీ బలహీనతను ప్రసిద్ధము చేయాలనుకోరో అదే విధముగా ఇతరుల బలహీనతలను కూడా వర్ణన చేయకండి. హోలీహంసలు అనగా విశేషతలను గ్రహించడము మరియు బలహీనతలను తొలగించడము. స్లోగన్:-సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి ఏ విధముగా మణులకు విశేషత ఉంటుంది - ఒకే రకమైన మణులు మాలలో ఒకే దారములో కూర్చబడతాయి, అదే విధముగా వైజయంతి మాలలోని మణులైన మీరందరూ కూడా ఎప్పుడైతే ఏకమతములో, ఒక్కరి లగనములోనే, ఏకరస స్థితి కలిగి ఒక్కరిగా కనిపిస్తారో, అప్పుడే మాలలో కూర్చబడతారు. ఒకవేళ పరస్పరములో రెండు మతాలు ఉన్నట్లయితే వారు వేరే మాలలో అనగా 16000 మాలలోని మణులుగా అవుతారు. "
#🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 08-02-2026 ప్రాత:మురళిఓంశాంతి‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 31-12-08 మధువనం ‘‘ఈ కొత్త సంవత్సరములో పరివర్తన శక్తి యొక్క వరదానము ద్వారా నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేసి సంకల్పాలను, శ్వాసను, సమయాన్ని సఫలము చేసుకోండి, సఫలతా మూర్తులుగా అవ్వండి’’ ఈ రోజు కొత్త జీవితాన్ని ఇచ్చే తండ్రి తమ నలువైపులా ఉన్న కొత్త జీవితాన్ని ధారణ చేసే పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఈ కొత్త జీవితము ఉన్నదే కొత్త యుగాన్ని తయారుచేయడానికి. మనుష్యులు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు మరియు మీరందరూ కొత్త జీవితము కల పిల్లలు, మీరు ఆత్మలందరికీ అభినందనలను కూడా తెలియజేస్తారు మరియు దానితో పాటు కొత్త యుగము ఇక వచ్చేసినట్లే అన్న శుభవార్తను కూడా తెలియజేస్తారు. పిల్లలైన మీ అందరికీ అయితే బాబా వారసత్వము రూపములో బంగారు ప్రపంచము యొక్క కానుకను ఇచ్చారు. ఆ బంగారు ప్రపంచములో అనేక బంగారు కానుకలు ఉండనే ఉన్నాయి. ఆ బంగారు ప్రపంచము అనే కానుక అయితే మా జన్మ సిద్ధ అధికారము అని మీ అందరికీ ఇదే నషా ఉంది కదా. ఈనాటి ప్రపంచములో ఎవరు ఎవరికి ఎంత గొప్ప కానుకను ఇచ్చినా కానీ, అంత గొప్ప కానుక ఏమి ఇస్తారు! కిరీటము లేక సింహాసనము. కానీ బంగారు ప్రపంచము అనే మీ కానుక ముందు అది ఏపాటిది? అదేమైనా పెద్దదా! మా తండ్రి మాకు అన్నిటికన్నా ఉన్నతోన్నతమైన కొత్త యుగాన్ని కానుకగా ఇచ్చారు అని మీ హృదయములో సంతోషము ఉంది. నిశ్చయము ఉంది మరియు ఇది నిశ్చితము. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. ఈ అచంచల నిశ్చయము సదా స్మృతిలో ఉంటుందా! అది సదా ఉంటుందా లేక అప్పుడప్పుడూ తగ్గిపోతుందా? జన్మ సిద్ధ అధికారము అన్నప్పుడు జన్మ సిద్ధ అధికారాన్ని ఎప్పుడూ తప్పించలేరు. ఈ రోజు మీరందరూ వేరు-వేరు స్థానాల నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. ఈ కొత్త సంవత్సరములో ఏ లక్ష్యము పెట్టుకున్నారు? ఈ కొత్త సంవత్సరములో విశేషముగా ఏం చేయాలి? ఈ కొత్త సంవత్సరము యొక్క విశేషత ఏమిటంటే - బాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వవలసిందే. ఏ పురుషార్థము చేయవలసి వచ్చినా కానీ బాబా సమానముగా అవ్వవలసిందే అన్నది నిశ్చితము. మరి చెప్పండి, అందరి మనసులలో ఈ పక్కా సంకల్పమే ఉంది కదా! ఉందా? తల ఊపండి. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానముగా అవ్వాలి అన్నదే బాబా కూడా కోరుకుంటున్నారు. బాబా అయితే బాబాయే, కానీ పిల్లలు తండ్రికన్నా ఉన్నతులు. మరి బాబా సమానముగా అవ్వాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి బాబాను ఫాలో చెయ్యవలసి ఉంటుంది. ఆలోచించండి, బాబా, బ్రహ్మాబాబా సంపూర్ణముగా ఎలా అయ్యారు? వారి విశేషత ఏమిటి? సంపూర్ణతకు విశేషముగా ఏది ఆధారముగా నిలిచింది? బ్రహ్మాబాబా తమ ప్రతి సమయాన్ని సఫలము చేసారు, శ్వాస-శ్వాసను, క్షణ-క్షణమును సఫలము చేసారు. మరి బాబా సమానముగా అవ్వడానికి ఈ సంవత్సరము ఏ లక్ష్యాన్ని పెట్టుకుంటారు? సఫలము చేయాలి మరియు సఫలతామూర్తులుగా అవ్వవలసిందే. సఫలత మన మెడలోని హారము. సఫలత మన తండ్రి ఇచ్చిన వారసత్వము. కావున ఈ లక్ష్యముతో చెక్ చేసుకోండి, ప్రతి రోజూ స్వయాన్ని చెక్ చేసుకోండి - సఫలతామూర్తులుగా అయి సమయాన్ని, శ్వాసను, ఖజానాలను, శక్తులను, గుణాలను, అన్నింటినీ సఫలము చేసామా? ఎందుకంటే ఇప్పటి సఫలతతో భవిష్యత్తు కూడా జమ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సఫలము చేస్తారో, దాని ఫలము 21 జన్మల కొరకు జమ అవుతుంది. తెలుసు కదా! ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నాము. ఒకవేళ మీరు సమయాన్ని సఫలము చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు రాజ్య భాగ్యము యొక్క పూర్తి సమయమంతా రాజ్య భాగ్యము ప్రాప్తిస్తుంది. శ్వాసను సఫలము చేసుకుంటే 21 జన్మలు ఆరోగ్యముగా ఉంటారు. ఎప్పుడూ ఏ విధముగానూ ఆరోగ్యములో లోటు ఉండదు. అలాగే ఏ ఖజానాలైతే జమ చేసుకుంటారో, అన్నింటికన్నా పెద్ద ఖజానా జ్ఞానము. జ్ఞానము అనగా వివేకము లేక అవగాహన. జ్ఞానము యొక్క ఖజానాను సఫలము చేసుకోవడముతో భవిష్యత్తులో మీరు ఎంత తెలివైనవారిగా అవుతారంటే ఇక మీకు ఎటువంటి మంత్రుల సలహా తీసుకోవాల్సిన అవసరము ఉండదు. స్వయమే అఖండమైన, అచంచలమైన రాజ్యాన్ని నడిపిస్తారు మరియు మీ రాజ్యములో ఎటువంటి విఘ్నాలు ఉండవు. నిర్విఘ్నము, అఖండముగా, అచంచలముగా ఉంటుంది. జ్ఞాన ఖజానాను జమ చేసుకోవడము వలన లభించే ఫలము ఇది. ఒక్క జన్మ సఫలము చేసుకుని అనేక జన్మలు సఫలత యొక్క ఫలాన్ని అనుభవిస్తారు. అదే విధముగా ఏవైతే శక్తులు ప్రాప్తించాయో, వాటిని స్వయము పట్ల మరియు ఇతరుల పట్ల సఫలము చేసుకుంటే, అప్పుడు భవిష్యత్తులో మీ రాజ్యములో సర్వశక్తులు ఉంటాయి, ఎప్పుడూ శక్తి తగ్గదు. ఏ శక్తి యొక్క లోటు ఉండదు. అలాగే ఒకవేళ గుణాలను దానము చేస్తే మీ అంతిమ 84వ జన్మ వరకు కూడా ఏవైతే జడ చిత్రాలను తయారుచేస్తారో, అక్కడ అంతిమము వరకు మీ మహిమను ఏమని చేస్తారు? సర్వగుణ సంపన్నులు. ఇలా ఒక్కొక్క సఫలతా ప్రాప్తికి అనేక జన్మలు అధికారులుగా అవుతారు. మరి ఈ సంవత్సరము ఏమి చేయాలి? ఒక్క శ్వాస, ఒక్క క్షణము కూడా అసఫలము అవ్వకూడదు, జమ చేసుకోవాలి అని లక్ష్యము పెట్టుకోవాలి. జమ చేసుకునే సమయము ఒక చిన్నని జన్మ మరియు ఫలము పొందే సమయము 21 జన్మలు. మరి ఈ సంవత్సరములో బాబా సమానముగా అయ్యే లక్ష్యము ఉందా? బాబా సమానంగా అవ్వాల్సిందే అని అందరికీ లక్ష్యము ఉందా? అవ్వాలి అని కాదు, అవ్వవలసిందే. అవ్వవలసిందే అన్నదానిని అండర్ లైన్ చేయండి. అచ్ఛా. పిల్లలు కూడా అవుతారా? చిన్న-చిన్న పిల్లలు కూడా అవుతారు. పిల్లల కిరీటము బాగుంది. (పిల్లలందరూ కిరీటము ధరించి ఉన్నారు). చాలా బాగా అనిపిస్తుంది. మరి ఈ సంవత్సరానికి లక్ష్యము కూడా తీసుకున్నారు, అలాగే దానితో పాటు బాబాను ఫాలో చేసే మంత్రము కూడా చేపట్టారు, అదేమిటంటే - సఫలము చేసి సఫలతామూర్తులుగా అవ్వాలి. ఇందుకోసం బాప్ దాదా పిల్లలకు ఎక్కువ శ్రమ చేసే కష్టము కూడా ఇవ్వరు. చాలా సహజమైన విధిని తెలియజేస్తారు, సహజమైన విధి ఏమిటి? ఏ సంకల్పము చేసినా కూడా, ముందుగా చెక్ చేసుకోండి - బాబాకు ఈ సంకల్పము ఉండేదా! మాట మాట్లాడినప్పుడు చెక్ చేసుకోండి. బాబా సమానముగా అవ్వాలి కదా! కావున సంకల్పాలు, మాటలు మరియు కర్మలు, సంబంధ-సంపర్కాలలో ముందుగా ఆలోచించండి మరియు చెక్ చేసుకోండి - బాబాది ఇలా ఉండేదా? మరియు అటువంటి స్వరూపముగానే అవ్వండి. బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. ఫాలో ఫాదర్ అని అంటూ ఉంటారు కదా! కొంతమంది పిల్లలు చాలా మంచి-మంచి ఆటలను చూపిస్తూ ఉంటారు. ఎటువంటి ఆటలను చూపిస్తారో తెలుసా? ఫాలో చెయ్యరు, కానీ ఏమంటారు? కావాలనుకోలేదు కానీ, అలా అయిపోయింది. ముందు ఆలోచించి, కేవలం ఆలోచించడమే కాక స్వరూపముగా అవ్వండి. ఒకవేళ స్వరూపముగా అయిపోతే, ఇక - అనుకోలేదు కానీ అయిపోయింది అని అనరు. చేసేది, ఆలోచించేది శ్రేష్ఠ ఆత్మలైన మీరు. మీరు యజమానులు. అలా అయిపోయింది అని అంటున్నారంటే దాని అర్థము - కర్మేంద్రియాలపై కంట్రోల్ (నియంత్రణ) లేదు అని. ఈ కొత్త సంవత్సరములో ఇదే స్లోగన్ ను గుర్తుంచుకోండి - బాబా సమానముగా చెయ్యాల్సిందే, అవ్వవలసిందే. కష్టమైతే కాదు కదా? బాబా ఏ విధముగానైతే చేసారో అదే విధముగా చేయాలి. కాపీ చెయ్యడమైతే సహజమే కదా! ఆలోచించవలసిన అవసరమే ఉండదు. అంతేకాక, ఏ విధముగా బాబా, బ్రహ్మాబాబా ఫరిశ్తాగా అయ్యారో, అలాగే మీరందరూ ఫరిశ్తా సో దేవతగా అవ్వవలసిందే అన్నది నిశ్చితము. మీరు కూడా ఫరిశ్తా సో దేవతగా అవ్వవలసిందే. కొంతమంది పిల్లలు అంటారు - నడుస్తూ, నడుస్తూ అపోజిషన్ చాలా జరుగుతుంది అని. అపోజిషన్ కారణముగా పొజిషన్ నుండి కిందకు వచ్చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, బాబా సమానముగా అవ్వాలంటే స్థాపన ఆదిలో బ్రహ్మాబాబా ఎన్ని అపోజిషన్లను పొజిషన్ లోకి పరివర్తన చేసారు? ప్రతి విషయము కొత్తదిగా, ఛాలెంజ్ గా ఉండేది. ఇప్పుడైతే కాలము ఎంతో మారిపోయింది కానీ ఒంటరిగా బ్రహ్మాబాబా ఎంతగా స్వమానము అనే సీట్ పై కూర్చుని పొజిషన్ ద్వారా అపోజిషన్ ను ఎదుర్కొన్నారు! ఎక్కడైతే పొజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ ఏమీ చేయలేదు. ఇంతకుముందు ఏమనేవారు? హంగామా చేస్తున్నారు అని అనేవారు. ఇప్పుడు ఏమి అంటున్నారు? అద్భుతము చేస్తున్నారు అని అంటున్నారు. ఇంత తేడా వచ్చింది. కారణము ఏమిటి? బ్రహ్మాబాబా స్వయము స్వమానము అనే సీట్ మరియు దృఢ నిశ్చయము అనే శస్త్రాల ద్వారా అపోజిషన్ ను సమాప్తము చేసారు. మరి మీరు ఈ సంవత్సరములో ఏమి చేస్తారు? సమానముగా అవ్వాలి కదా! ఒకవేళ అపోజిషన్ ఉన్నా కూడా మీరు స్వమానమనే సీట్ పై కూర్చుండిపోండి, అప్పుడు అపోజిషన్ అనేది పొజిషన్ లోకి మారిపోతుంది. ఉందా ధైర్యము? బ్రహ్మాబాబా సమానముగా అవ్వవలసిందే అన్న విషయములోనైతే చేతులెత్తారు, కానీ అంతటి ధైర్యముందా? ముందు స్వ పరివర్తన, ఆ తర్వాత సంబంధ-సంపర్కములోని అనేక ఆత్మలు మరియు ఆ తర్వాత విశ్వములోని ఆత్మలు. వీరందరినీ మీ మనసా శుభ భావన, శుభ కామన ద్వారా, దృఢ సంకల్పము ద్వారా పరివర్తన చేయండి. ఈ సంవత్సరములో బాప్ దాదా విశేషముగా ఒక శక్తి యొక్క వరదానాన్ని కూడా ఇస్తున్నారు. నా బాబా అని హృదయపూర్వకముగా అంటే శక్తి హాజరవుతుంది. ఊరికే నా బాబా అని అనటము కాదు. హృదయపూర్వకముగా అంటే, అధికారము ఉంచితే, నా బాబా అనగానే శక్తి మీ ఎదుట హాజరు అయిపోతుంది. అది ఏ శక్తి? పరివర్తన శక్తి. పరివర్తన శక్తితో విశేషముగా నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేయండి. నెగెటివ్ సంకల్పాలను, నెగిటివ్ నడవడికను చూస్తూ పాజిటివ్ లోకి పరివర్తన చేయండి. పాజిటివ్ చూడటము, మాట్లాడటము, చెయ్యటము కేవలం శుభ భావన మరియు శుభ కామన ద్వారానే సహజమవుతుంది ఎందుకంటే ఈ అపోజిషన్ అయితే వస్తుంది, కానీ మీ పరివర్తన శక్తి మీకు సహజముగా సఫలతను ఇప్పిస్తుంది. మరి అర్థమయిందా, ఈ సంవత్సరము యొక్క విశేష వరదానమైన పరివర్తన శక్తిని దృఢ సంకల్పముతో కార్యములో వినియోగించండి. చేయగలరు కదా పరివర్తన? మీరు ఛాలెంజ్ చేసారు, గుర్తుంది కదా! మీరు విశ్వ పరివర్తకులు కదా! మీ టైటిల్ యే విశ్వ పరివర్తకులు అని ఉంది, మరి అటువంటప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవడము కష్టమా! మనసులో ఎటువంటి కష్టమైన విషయము వచ్చినా కానీ, వాస్తవానికి అది కష్టమైన విషయము కాదు కానీ మీరు దానిని అలా చేసేస్తారు. మాస్టర్ సర్వశక్తివంతుల ఎదురుగా ఏది కష్టము? కానీ మీరు ఒక పొరపాటు చేసి దానిని కష్టముగా చేసేసుకుంటారు. ఉదాహరణకు చూడండి, ఒకవేళ ఇక్కడ అకస్మాత్తుగా అంధకారము ఏర్పడితే ఎవరైనా పొరపాటున అంధకారాన్ని పారద్రోలాలని చూస్తే అంధకారము పోతుందా? సరైన విధి ఏమిటంటే మీరు ప్రకాశాన్ని ఇచ్చే స్విచ్ ను ఆన్ చేయండి, అప్పుడు అంధకారము క్షణములో పారిపోతుంది. మీరు కూడా ఇదే పొరపాటు చేస్తారు. ఏ విషయమైతే అయిపోయిందో, దానికి ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా... ఈ క్యూ లోకి వెళ్ళిపోతారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటారు, మరి పెద్ద విషయమంటే కష్టముగానే అనిపిస్తుంది. చిన్న విషయముగా చేసుకున్నట్లయితే సహజమవుతుంది. బాబా ఏ శక్తినైనా కార్యములో వినియోగించేందుకు చాలా సహజమైన విధిని తెలియజేసారు, అదేమిటంటే - ‘‘నేను మాస్టర్ సర్వశక్తివంతుడను’’, మీ ఈ స్మృతి అనే సీట్ పై కూర్చోండి. ఒకవేళ ఈ సీట్ పై కూర్చున్నట్లయితే అప్సెట్ అవ్వరు (డిస్టర్బ్ అవ్వరు). సీట్ లేకపోతే అప్సెట్ అవుతారు, సీట్ ఉంటే అప్సెట్ అవ్వరు. 63 జన్మల సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. 63 జన్మలు ఎలా ఉన్నాయి? ఇప్పుడిప్పుడే సెట్, ఇప్పుడిప్పుడే అప్సెట్. కావున సదా స్వమానము అనే సీట్ పై సెట్ అయి ఉండండి. అంతేకాక ఈ సంవత్సరములో ఏమి చేస్తారు? కొత్త సంవత్సరములో కానుకలనైతే అందరికీ ఇస్తారు కదా. మరి ఏ కానుకను ఇస్తారు? అభినందనలను కూడా ఇస్తారు మరియు దానితోపాటు కానుక ఏమి ఇస్తారు? కానుకలైతే మీ వద్ద చాలానే ఉన్నాయి. ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వవచ్చు. స్థూలమైన కానుక అయితే అల్పకాలము కొరకు ఉంటుంది, కానీ అవినాశీ బాబా సమానముగా అయ్యే మీరు అవినాశీ కానుకను ఇవ్వండి. మనసా ద్వారా శక్తుల కానుకను ఇవ్వండి, వాచా ద్వారా జ్ఞానము యొక్క కానుకను ఇవ్వండి మరియు కర్మణా ద్వారా గుణాల కానుకను ఇవ్వండి. ఇవి అందరి వద్ద ఉన్నాయి కదా? ఉంటే తల ఊపండి. ఖజానాలు ఎన్నో ఉన్నాయి కదా, తక్కువైతే లేవు కదా. ఎవరితో కార్యములోకి వచ్చినా సరే, కార్యములోకి రావలసి ఉంటుంది కదా, వారికి ఈ సంవత్సరము బాగా కానుకలను ఇవ్వండి. కానీ అవినాశీ కానుకలను ఇవ్వండి. వినిపించాము కదా, ఎవ్వరినీ ఖాళీగా వెళ్ళనివ్వద్దు. మనసా కానుకనైనా ఇవ్వండి, లేక వాణి, కర్మ ఏదైనా ఇవ్వవచ్చు. దీని కోసం మీరు సదా ఒక అటెన్షన్ ను పెట్టవలసి ఉంటుంది, అదేమిటంటే - ప్రతి సమయము మనసులో శక్తుల స్టాక్ ను ఇమర్జ్ చేసుకుని ఉంచుకోవలసి ఉంటుంది. ఎన్ని శక్తులు ఉన్నాయి? లిస్ట్ అయితే ఉంది కదా! వాచా కారణముగా సదా మనసులో మనన శక్తిని, జ్ఞానాన్ని మననము చేసే శక్తిని, స్మృతిలో ఉంచుకోవలసి ఉంటుంది. నడవడికలో, ముఖములో, కర్మలలో గుణాల స్వరూపముగా అవ్వవలసి ఉంటుంది. సదా స్వయాన్ని గుణమూర్తిగా, జ్ఞానమూర్తిగా, శక్తి స్వరూపముగా ఇమర్జ్ చేసుకుని ఉంచుకోవలసి ఉంటుంది. అంతేకానీ శక్తులైతే ఎలాగూ ఉన్నాయి కదా, జ్ఞానమైతే ఎలాగూ ఉంది కదా అని అనుకోవడము కాదు. స్వరూపముగా అవ్వవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరినీ ఈశ్వరీయ పరివారము అనే దృష్టితో, వృత్తితో చూడవలసి ఉంటుంది. ఈ సంవత్సరము సమానముగా అవ్వవలసిందే అన్నప్పుడు, అందులో అయితే చేతులెత్తారు, బాప్ దాదా యొక్క వతనములో అందరి చేతులు కనిపిస్తాయి. అక్కడ ఈ చిన్న టి.వి. ఉండదు, చాలా పెద్దది ఉంది. ఒక్క క్షణములో అన్ని సెంటర్ల రిజల్టును చూడగలరు. కావున బాప్ దాదా - బాబా సమానముగా అవ్వాల్సిందే అన్న మీ ఉత్సాహము ఏదైతే ఉందో, అందుకు సంతోషిస్తున్నారు. మీరు అదృష్టవంతులు, సంతోషకరమైన ముఖము కలవారు, ఎప్పుడూ ఆవేశపు ముఖాన్ని పెట్టుకోకండి. మిమ్మల్ని ఎవరు చూసినా మీరు సదా సంతోషముగా కనిపించాలి, మీరు ఎంతగా పనిలో బిజీగా ఉన్నా కానీ, పొరపాటును సరిదిద్దుతున్నా కానీ, అర్థం చేయిస్తూ ఉన్నా కానీ, ఆవేశముతో ఉన్న ముఖము, మాటలు ఉండకూడదు. ఈ సంవత్సరములో ఈ పరివర్తనను చేసి చూపించండి. ప్రైజ్ ఇస్తాము. పూర్తి సంవత్సరములో ఎటువంటి విషయము వచ్చినా కానీ ఎవరైతే సదా చిరునవ్వుతో ఉంటారో... అందరూ ఆత్మిక సంభాషణ అయితే చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కొంతమంది సోదరీ-సోదరులు ఏమంటారంటే - ఒకవేళ ఆవేశముతో చెప్పకపోతే అర్థం చేసుకోరు, మారనే మారరు అని. మీరు ముందుగానే వీరు మారరు అన్న భావన పెట్టుకున్నప్పుడు ఇక వారికి మీ వైబ్రేషన్ ముందుగానే చేరుకుంటుంది. అందుకే ఈ సంవత్సరములో క్రోధానికి, దాని పిల్లా-పాపలకు వీడ్కోలు ఇవ్వాలి. వీలవుతుందా? ఆవేశము కూడా వద్దు. బాబా ప్రశ్నిస్తున్నారు, ఎప్పటికప్పుడు ఎవరైతే పని కావడానికి, బాగు చెయ్యడానికి క్రోధము చేస్తున్నారో, అది బాగవుతుందా? క్రోధము చేయడము వలన ఎవరైనా మారారా? ఆ లిస్ట్ చూపించండి. వారు మరింత విసుగు చెందుతారు, బాగుపడరు. మనసులో అపోజిషన్ చేస్తారు. ఒకవేళ పెద్దవారైతే మనసులో అపోజిషన్ చేస్తారు, చెప్పలేరు కదా. చిన్నవారైతే ఏడవడము మొదలుపెడతారు. కావున ఈ సంవత్సరము ఏమేమి చేయాలి అని అన్నీ వినిపిస్తున్నాము. ఇష్టమేనా? చేస్తారా? ఇప్పుడు చేతులెత్తండి. చేస్తారా? టి.వి. వారు, ఈ ఫోటోను తీయండి. చేతులెత్తండి. కొంచెం ఎత్తి ఉంచండి. టి.వి. వారు తీస్తున్నారు. అచ్ఛా! సమయమనుసారముగా బాప్ దాదా చూస్తున్నారు - సమయము యొక్క వేగము ఈ సమయములో తీవ్రముగా ఉంది. మరి సమయాన్ని ఎవరు ఎదుర్కోగలరు? మీరే కదా. దుఃఖితుల పిలుపును, భక్తుల పిలుపును, సమయపు పిలుపును పిల్లలు తక్కువగా వింటున్నారు అన్నది బాప్ దాదా చూసారు. పాపం వారు ధైర్యహీనులు, వారికి రెక్కలను ఇస్తే కదా ఎగరగలరు. ధైర్యము అనే రెక్కలు, ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలను ఇవ్వండి. అచ్ఛా! నలువైపులా ఉన్న పిల్లలు ఇప్పుడు బాప్ దాదా ఇచ్చిన హోమ్ వర్కును ప్రాక్టికల్ లో చేసి ఋజువును చూపించే సుపుత్రులుగా తమ ప్రభావాన్ని చూపిస్తారు. నలువైపులా ఉన్న పిల్లలు చాలా-చాలా హృదయపూర్వక ప్రేమను మరియు హృదయపూర్వకముగా పదమాల రెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి. ఇటువంటి యోగ్యులైన పిల్లలకు, శ్రేష్ఠమైన పిల్లలకు బాప్ దాదాల నమస్తే. ఈ సంవత్సరములోని ప్రతి రోజును స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన రూపములో జరుపుకుంటూ ఉండండి. ప్రతి రోజూ కొత్త పరివర్తన, ప్రతి రోజూ కొత్త సేవ, ప్రతి రోజూ సదా ఉల్లాస-ఉత్సాహాలు. ఒక్క రోజు కూడా చింత, చింతన ఉండకూడదు, ఎల్లప్పుడూ ఉల్లాస-ఉత్సాహాలతో రాత్రింబవళ్లను గడపండి. ఈ కొత్త సంవత్సరములో ప్రతి రోజూ ఏదో ఒక కొత్తది స్వయము పట్ల మరియు విశ్వము పట్ల, సేవ పట్ల చేయవలసిందే. ఇటువంటి దృఢ సంకల్పము చేసి సమయాన్ని సమీపముగా తీసుకువస్తూ సంపూర్ణముగా తండ్రి సమానముగా అయి ఎగరాలి మరియు ఎగిరేలా చేయాలి. అచ్ఛా! ఓం శాంతి. వరదానము:-ప్రతి ఒక్కరి సలహాకు గౌరవాన్ని ఇస్తూ విశ్వము ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే బాలక్ సో మాలిక్ భవ చిన్నవారైనా లేక పెద్దవారైనా - మీరు ప్రతి ఒక్కరి సలహాకు తప్పకుండా గౌరవాన్ని ఇవ్వండి ఎందుకంటే ఎవరి సలహానైనా తిరస్కరించడము అనగా మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవడమే, అందుకే ఒకవేళ ఎవరి వ్యర్థాన్ని అయినా కట్ చేయాలన్నా ముందుగా వారికి గౌరవాన్ని ఇవ్వండి, స్వమానము ఇవ్వండి, ఆ తర్వాత శిక్షణను ఇవ్వండి. ఇది కూడా విధానము వంటిది. ఎప్పుడైతే ఈ విధముగా గౌరవాన్ని ఇచ్చే సంస్కారము నిండుతుందో, అప్పుడు విశ్వము నుండి మీకు గౌరవము లభిస్తుంది. దీని కొరకు బాలకుల నుండి యజమానులుగా, యజమానుల నుండి బాలకులుగా అవ్వండి. బుద్ధి అనంతములో శుభ కళ్యాణ భావనతో సంపన్నముగా ఉండాలి. స్లోగన్:-మస్తకముపై సదా తోడు యొక్క స్మృతి తిలకాన్ని పెట్టుకోవడము - ఇదే సౌభాగ్యానికి గుర్తు.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి ఏకతను తీసుకువచ్చేందుకు రెండు విషయాలను ధారణ చెయ్యాల్సి ఉంటుంది - ఒకటేమో ఏకనామీగా అయ్యి సదా ప్రతి విషయములో ఒక్కరి పేరే తీసుకోండి, మరొకటి - సంకల్పాలు, సమయము మరియు జ్ఞాన ఖజానా యొక్క ఎకానమీ (పొదుపు) చేయండి. ఎప్పుడైతే అందరూ ఇటువంటి ఏకనామీ మరియు ఎకానమీ కలవారిగా అవుతారో, అప్పుడు ఒక్క బాబాలో అన్ని రకాల భిన్నత్వాలు ఇమిడిపోతాయి. "
https://youtube.com/watch?v=NrAht8nXRno&si=eZtjlRn7ZCjMhi8u #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱
youtube-preview
#🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 07-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - బుద్ధిలో స్థిరముగా ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉంటే, అది కూడా అహో సౌభాగ్యము’’ ప్రశ్న:-ఏ పిల్లలకైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారి గుర్తులేమిటి? జవాబు:-వారు నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు. వారు ఆత్మిక సేవలో తమ ఎముక-ఎముకను స్వాహా చేస్తారు. వారికి ఆత్మిక జ్ఞానాన్ని వినిపించడములో చాలా సంతోషము కలుగుతుంది. వారు సంతోషములోనే నాట్యము చేస్తూ ఉంటారు. వారు తమ కన్నా పెద్దవారికి చాలా గౌరవాన్ని ఇస్తారు, వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు. పాట:-ఈ ప్రపంచము మారినా... ▶ ఓంశాంతి. పిల్లలు పాటలోని రెండు లైన్లు విన్నారు. ఇది ప్రతిజ్ఞకు సంబంధించిన పాట. ఎవరికైనా నిశ్చితార్థము జరిగినప్పుడు, స్త్రీ-పురుషులు ఒకరినొకరు ఎప్పుడూ విడిచిపెట్టమని ప్రతిజ్ఞ చేస్తారు. కొంతమందికి ఒకరితో ఒకరికి పడకపోతే విడిచిపెట్టేస్తారు కూడా. ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు? ఈశ్వరునితో. వారితోనే పిల్లలైన మీకు లేక ప్రేయసులైన మీకు నిశ్చితార్థము జరిగింది, కానీ ఈ విధముగా విశ్వానికి యజమానులుగా తయారుచేసేవారిని కూడా విడిచిపెట్టేస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు, ఇప్పుడు అనంతమైన బాప్ దాదా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇక్కడ మీకు ఏ అవస్థ అయితే ఉంటుందో, అది అక్కడ సెంటర్ లో ఉన్నప్పుడు ఉండదు. ఇక్కడ బాప్ దాదా వచ్చి ఉన్నారని మీరు భావిస్తారు. అక్కడ సెంటర్ లో ఉన్నప్పుడు బాబా వినిపించిన మురళీ వచ్చిందని భావిస్తారు. ఇక్కడికి మరియు అక్కడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అనంతమైన తండ్రి సమ్ముఖములో మీరు కూర్చొన్నారు. అక్కడైతే సమ్ముఖముగా ఉండరు. సమ్ముఖముగా వెళ్ళి మురళీ వినాలని కోరుకుంటారు. బాబా వచ్చి ఉన్నారని ఇక్కడ పిల్లల బుద్ధిలోకి వచ్చింది. ఇతర సత్సంగాలలో, ఫలానా స్వామీజీ వస్తారని భావిస్తారు కదా. కానీ ఈ ఆలోచన కూడా అందరికీ ఏకరసముగా ఉండదు. చాలామంది బుద్ధియోగమైతే వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. కొంతమందికి పతి గుర్తుకువస్తారు, కొంతమందికి సంబంధీకులు గుర్తుకువస్తారు. ఆ ఒక్క గురువుపై కూడా బుద్ధియోగము నిలవదు. స్వామీజీ స్మృతిలో కూర్చుని ఉండేవారు ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ కూడా అలాగే. అందరూ శివబాబా స్మృతిలో ఉంటారని కూడా కాదు. బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తుకువస్తూ ఉంటారు. మొత్తం సమయమంతా ఒక్క శివబాబా స్మృతిలోనే ఉంటే ఇక అది అహో సౌభాగ్యము. కానీ స్థిరమైన స్మృతిలో ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ తండ్రి సమ్ముఖములో ఉన్నట్లయితే చాలా సంతోషముండాలి. అతీంద్రియ సుఖము గురించి గోపీ వల్లభుని గోప-గోపికలను అడగండి, ఇది ఇక్కడి గాయనమే. ఇక్కడ మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఇప్పుడు మనము ఈశ్వరుని ఒడిలో ఉన్నామని, తర్వాత దైవీ ఒడిలో ఉంటామని మీకు తెలుసు. ఈ చిత్రములో ఈ కరెక్షన్ చేయాలి, ఇది వ్రాయాలి అని కొంతమంది బుద్ధిలో సేవ యొక్క ఆలోచనలు కూడా నడుస్తూ ఉంటాయి. కానీ మంచి పిల్లలెవరైతే ఉంటారో వారు - ఇప్పుడైతే తండ్రి నుండి వినాలని భావిస్తారు, ఇంకే సంకల్పాలను రానివ్వరు. తండ్రి జ్ఞాన రత్నాలతో జోలిని నింపడానికి వచ్చారు కనుక తండ్రితోనే బుద్ధియోగాన్ని జోడించాలి. నంబరువారుగా ధారణ చేసేవారైతే తప్పకుండా ఉంటారు. కొంతమంది మంచి రీతిలో విని ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు. బుద్ధియోగము వేరే వైపులకు పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు, కచ్చాగానే (అపరిపక్వముగానే) ఉండిపోతారు. 1-2 సార్లు మురళీ విన్నా కూడా ధారణ జరగకపోతే, ఇక ఆ అలవాటు పక్కా అయిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ఎంతగా వింటూ ఉన్నా సరే, వారికి ధారణ జరగదు, వారు ఎవ్వరికీ వినిపించలేకపోతారు. ఎవరికైతే ధారణ జరుగుతుందో, వారికి సేవ పట్ల అభిరుచి ఉంటుంది. అటువంటివారు ఉత్సాహముతో ఉప్పొంగుతూ ఉంటారు. మేము వెళ్ళి జ్ఞాన ధనాన్ని దానము చేయాలని అనుకుంటారు ఎందుకంటే ఈ ధనము ఒక్క తండ్రి వద్ద తప్ప ఇంకెవ్వరి వద్ద లేదు. అందరికీ ఒకే విధముగా ధారణ జరగదని, అందరూ ఒకే విధముగా ఉన్నత పదవిని పొందలేరని కూడా తండ్రికి తెలుసు, అందుకే బుద్ధి వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. అటువంటివారి భవిష్య భాగ్యము అంత ఉన్నతముగా తయారవ్వదు. కొంతమంది స్థూల సేవలో తమ ఎముక-ఎముకను ఇస్తారు. అందరినీ సంతుష్టపరుస్తారు. భోజనము తయారుచేస్తూ, తినిపిస్తూ ఉంటారు, ఇది కూడా ఒక సబ్జెక్టు కదా. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు నోటితో జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు. అప్పుడు బాబా చూస్తారు కూడా - వీరికి దేహాభిమానమైతే లేదు కదా, పెద్దవారి పట్ల గౌరవాన్ని ఉంచుతున్నారా లేదా అని. పెద్ద మహారథుల పట్ల గౌరవము ఉంచవలసి ఉంటుంది. అయితే కొంతమంది చిన్నవారు కూడా తెలివైనవారిగా అయిపోతారు, అప్పుడు పెద్దవారు కూడా చిన్నవారికి గౌరవాన్ని ఇవ్వవలసి ఉండవచ్చు, ఎందుకంటే ఆ చిన్నవారి బుద్ధి గ్యాలప్ చేస్తుంది (వేగముగా ముందుకు వెళ్తుంది). సేవ పట్ల ఉన్న అభిరుచిని చూసి, వీరు మంచి సేవ చేస్తారని తండ్రి అయితే సంతోషిస్తారు కదా. రోజంతా ప్రదర్శనీలలో అర్థం చేయించే అభ్యాసము చేయాలి. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు కదా, ఇంకే ఉపాయము లేదు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, రాజులు, రాణులు, ప్రజలు అందరూ ఇక్కడే తయారవుతారు. ఎంత సేవ చేయాలి. ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యామనైతే పిల్లల బుద్ధిలో ఉంది. ఇంటిలో గృహస్థములో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ, ఎవరి అవస్థ వారిది ఉంటుంది కదా. అలాగని ఇళ్ళు-వాకిళ్ళనైతే వదిలిపెట్టకూడదు. తండ్రి అంటారు, ఇంటిలో ఉండండి కానీ బుద్ధిలో ఈ నిశ్చయము ఉంచుకోవాలి - పాత ప్రపంచము సమాప్తమయ్యే ఉంది అని. మనకు ఇప్పుడు తండ్రితోనే పని ఉంది. కల్పక్రితము ఎవరైతే జ్ఞానాన్ని తీసుకున్నారో, వారే తీసుకుంటారని కూడా మీకు తెలుసు. క్షణము తర్వాత క్షణము యథావిధిగా రిపీట్ అవుతోంది. ఆత్మలో జ్ఞానముంటుంది కదా. తండ్రి వద్ద కూడా జ్ఞానముంటుంది. పిల్లలైన మీరు కూడా తండ్రి వలె తయారవ్వాలి. పాయింట్లను ధారణ చేయాలి. అన్ని పాయింట్లూ ఒకే సమయములో అర్థం చేయించడము జరగదు. వినాశనము కూడా ఎదురుగా ఉంది. ఇది ఇంతకుముందు జరిగిన అదే వినాశనము. సత్య, త్రేతాయుగాలలోనైతే ఎటువంటి యుద్ధము జరగదు. చాలా ధర్మాలు ఏర్పడిన తర్వాత, సైన్యాలు మొదలైనవి ఏర్పడినప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి. మొట్టమొదట ఆత్మలు సతోప్రధాన స్థితిలో దిగుతాయి, ఆ తర్వాత సతో, రజో, తమో స్థితులలోకి వస్తాయి. రాజధాని ఏ విధముగా స్థాపనవుతోంది అనేదంతా కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు, శివబాబా వచ్చి మాకు ఖజానాలను ఇస్తున్నారని బుద్ధిలో ఉంచుకోవాలి, వాటిని బుద్ధిలో ధారణ చేయాలి. మంచి-మంచి పిల్లలు నోట్స్ వ్రాస్తారు, వ్రాయడము మంచిదే, అప్పుడు బుద్ధిలోకి టాపిక్స్ వస్తాయి. ఈ రోజు ఫలానా టాపిక్ పై అర్థం చేయించాలని భావిస్తారు. తండ్రి అంటారు, నేను మీకు ఎంత ఖజానాను ఇచ్చాను. సత్య, త్రేతాయుగాలలో మీ వద్ద అపారమైన ధనముండేది, ఆ తర్వాత వామ మార్గములోకి వెళ్ళడముతో ఆ ధనము తగ్గిపోతూ వచ్చింది. సంతోషము కూడా తగ్గిపోతూ వచ్చింది. ఏదో ఒక వికర్మ జరగడము మొదలవుతుంది. కిందికి దిగుతూ-దిగుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. సతోప్రధాన, సతో, రజో, తమో స్థితులు ఉంటాయి. సతో నుండి రజోలోకి వస్తారు, అప్పుడు ఒక్కసారిగా వచ్చేస్తారని కాదు, మెల్లమెల్లగా దిగుతారు. తమోప్రధానములో కూడా మెల్లమెల్లగా మెట్లు దిగుతూ వస్తారు, కళలు తగ్గుతూ ఉంటాయి, రోజురోజుకు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు జంప్ చేయాలి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. దీని కోసం సమయము కూడా కావాలి. ఎక్కితే వైకుంఠ రసాన్ని చవి చూస్తారు... అని అంటూ ఉంటారు. కామము యొక్క చెంపదెబ్బ తగలడముతో పూర్తిగా చూర్ణమైపోతారు, ఎముక-ఎముక విరిగిపోతుంది. కొంతమంది మనుష్యులు స్వయాన్ని జీవహత్య చేసుకుంటారు, అది ఆత్మహత్య కాదు, దానిని జీవహత్య అని అంటారు. ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి, తండ్రిని స్మృతి చేయాలి, ఎందుకంటే తండ్రి నుండి రాజ్యాధికారము లభిస్తుంది. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను తండ్రిని స్మృతి చేసి భవిష్యత్తు కోసం ఎంత సంపాదన చేసుకున్నాను? ఎంతగా అంధులకు చేతికర్రగా అయ్యాను? ఈ పాత ప్రపంచము మారుతోంది అని ఇంటి-ఇంటికీ సందేశాన్ని ఇవ్వాలి. తండ్రి కొత్త ప్రపంచము కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మెట్ల చిత్రములో అంతా చూపించారు. ఈ చిత్రాలు తయారుచేయడములో కృషి చేయవలసి ఉంటుంది. ఎవరైనా సరే సహజముగా అర్థం చేసుకునే విధముగా ఈ చిత్రాలను తయారుచేయాలని, రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ప్రపంచములోని వారంతా అయితే ఇక్కడకు రారు. దేవీ-దేవతా ధర్మమువారే వస్తారు. మీ సేవ అయితే ఎంతగానో జరగనున్నది. మన ఈ క్లాస్ ఎప్పటివరకు నడుస్తోంది అనేది మీకు తెలుసు. వారైతే కల్పము యొక్క ఆయుష్షు లక్షల సంవత్సరాలని భావిస్తారు. అందుకే శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. అంతిమము వచ్చినప్పుడు సర్వుల సద్గతిదాత వస్తారని, మా శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి గతి ఏర్పడుతుందని, ఆ తర్వాత మేము కూడా వెళ్ళి జ్యోతిలో కలిసిపోతామని వారు భావిస్తారు. కానీ అలా జరగదు. మనము అమరుడైన తండ్రి ద్వారా సత్యాతి-సత్యమైన అమరకథను వింటున్నామని మీకు ఇప్పుడు తెలుసు. కావున అమరుడైన తండ్రి ఏదైతే చెప్తారో, దానిని అంగీకరించాలి కూడా, వారు కేవలం - నన్ను స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి అని చెప్తున్నారు. లేకపోతే శిక్షలు కూడా చాలా అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా తక్కువది లభిస్తుంది. సేవలో కృషి చేయాలి. దధీచి ఋషి ఉదాహరణ ఉంది కదా. వారు ఎముకలను కూడా సేవలో పెట్టారు. తమ శరీరము పట్ల కూడా ధ్యాస పెట్టకుండా రోజంతా సేవలో ఉండడము, దీనినే సేవలో ఎముకలను ఇవ్వడమని అంటారు. ఒకటి, ఎముకలతో చేసే దైహిక సేవ, రెండవది, ఎముకలతో చేసే ఆత్మిక సేవ. ఆత్మిక సేవ చేసేవారు ఆత్మిక జ్ఞానాన్నే వినిపిస్తూ ఉంటారు. ధనాన్ని దానము చేస్తూ సంతోషములో నాట్యము చేస్తూ ఉంటారు. ప్రపంచములో మనుష్యులేదైతే సేవ చేస్తూ ఉంటారో, అదంతా దైహిక సేవ. వారు శాస్త్రాలను వినిపిస్తారు, అది ఆత్మిక సేవ కాదు. ఆత్మిక సేవనైతే కేవలం తండ్రి మాత్రమే వచ్చి నేర్పిస్తారు. స్పిరిచ్యుల్ తండ్రియే వచ్చి స్పిరిచ్యుల్ పిల్లలను (ఆత్మలను) చదివిస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు సత్యయుగీ కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ మీ ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు. అది ఉన్నదే రామ రాజ్యము. అక్కడ ఉండేది కొద్దిమంది మాత్రమే. ఇప్పుడైతే రావణ రాజ్యములో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా కూడా మీ బుద్ధిలో నంబరువారు పురుషార్థానుసారముగా ఉంది. ఈ మెట్ల చిత్రములోనే జ్ఞానమంతా వచ్చేస్తుంది. తండ్రి అంటారు, ఈ అంతిమ జన్మ పవిత్రముగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీరు ఏ విధముగా అర్థం చేయించాలంటే, దానితో మనుష్యులకు - మేము సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యాము, స్మృతియాత్రతోనే మళ్ళీ సతోప్రధానముగా అవుతాము అని తెలియాలి. ఇది చూసినప్పుడు - ఈ జ్ఞానము ఇంకెవ్వరి వద్దా లేదని అర్థమవుతుంది. ఈ మెట్ల చిత్రములో ఇతర ధర్మాల సమాచారము ఎక్కడ ఉందని అంటారు. ఆ విషయాలు ఈ సృష్టి చక్రము చిత్రములో వ్రాయబడి ఉన్నాయి. ఇతర ధర్మాలవారు కొత్త ప్రపంచములోకైతే రారు, వారికి శాంతి లభిస్తుంది. భారతవాసులే స్వర్గములో ఉండేవారు కదా. తండ్రి కూడా భారత్ లోకే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, అందుకే భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని అందరూ కోరుకుంటారు. తప్పకుండా కొత్త ప్రపంచములో కేవలం భారత్ యే ఉండేదని ఈ చిత్రాల ద్వారా వారు స్వయం కూడా అర్థం చేసుకుంటారు. తమ ధర్మము గురించి కూడా అర్థం చేసుకుంటారు. ధర్మ స్థాపన చేయడానికి క్రైస్ట్ వచ్చారు కానీ ఈ సమయములో వారు కూడా తమోప్రధానముగా ఉన్నారు. రచయిత మరియు రచన యొక్క ఈ జ్ఞానము ఎంత గొప్పది. మీరు ఈ విధముగా చెప్పవచ్చు - మాకు ఎవరి ధనము అవసరము లేదు, ధనాన్ని మేమేమి చేసుకుంటాము, మీరు కూడా వినండి, ఇతరులకు కూడా వినిపించండి, ఈ చిత్రాలు మొదలైనవి ముద్రించండి. ఈ చిత్రాలను ఉపయోగించుకోవాలి. ఈ జ్ఞానము వినిపించేందుకు హాల్ కట్టించండి, ఇకపోతే మేము ధనము తీసుకుని ఏమి చేస్తాము, మీ ఇంటి కళ్యాణమే జరుగుతుంది, మీరు కేవలం ఏర్పాట్లు చేయండి. రచయిత మరియు రచనల జ్ఞానము చాలా బాగుందని చాలామంది వచ్చి చెప్తారు. ఇదంతా మనుష్యులే అర్థం చేసుకోవాలి. విదేశీయులు ఈ జ్ఞానాన్ని విని చాలా ఇష్టపడతారు, చాలా సంతోషిస్తారు. మేము కూడా తండ్రితో యోగాన్ని జోడించినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని భావిస్తారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ జ్ఞానాన్ని అయితే భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకుంటారు. ఖుదా స్వర్గాన్ని స్థాపన చేసారని అంటారు కానీ వారు ఎలా వస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. మీ మాటలు విని సంతోషిస్తారు, ఆ తర్వాత పురుషార్థము చేసి యోగము నేర్చుకుంటారు, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. సేవ కోసమైతే ఎంతగానో ఆలోచించాలి. భారత్ లో నైపుణ్యాన్ని చూపిస్తే బాబా విదేశాలకు కూడా పంపిస్తారు. ఈ సంస్థ విదేశాలకు కూడా వెళ్తుంది. ఇప్పుడింకా సమయముంది కదా. కొత్త ప్రపంచము తయారయ్యేందుకు సమయమేమీ పట్టదు. ఎక్కడైనా భూకంపాలు మొదలైనవి జరిగితే, 2-3 సంవత్సరాలలో పూర్తిగా కొత్త ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తారు. పనివారు చాలా మంది ఉండి, మొత్తం సామానంతా సిద్ధముగా ఉన్నట్లయితే, ఇక తయారవ్వడానికి సమయమేమీ పట్టదు. విదేశాలలో ఇళ్ళు ఎలా తయారవుతాయి - మినిట్ మోటర్ (నిమిషములో తయారవుతాయి). మరి స్వర్గములో ఇంకెంత త్వరగా తయారవుతూ ఉండవచ్చు. అక్కడ బంగారము, వెండి మొదలైనవి మీకు చాలా లభిస్తాయి, మీరు గనుల నుండి బంగారము, వెండి, వజ్రాలు తీసుకుని వస్తారు. అన్ని నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఇక్కడ సైన్స్ వారి గర్వము ఎంతగా ఉంది. ఈ సైన్స్ మళ్ళీ అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకున్నవారు మళ్ళీ తర్వాత జన్మను అక్కడ తీసుకుని దీనిని ఉపయోగిస్తారు. ఆ సమయములోనైతే మొత్తము ప్రపంచమంతా కొత్తగా అవుతూ ఉంటుంది, రావణ రాజ్యము సమాప్తమైపోతుంది, పంచ తత్వాలు కూడా నియమానుసారముగా మన సేవలో ఉంటాయి. స్వర్గము తయారవుతుంది. అక్కడ ఎటువంటి ఉపద్రవాలు జరగవు, రావణ రాజ్యమే ఉండదు, అందరూ సతోప్రధానముగా ఉంటారు. అన్నింటికంటే మంచి విషయమేమిటంటే - పిల్లలైన మీకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. తండ్రి ఖజానాను ఇస్తారు, దానిని ధారణ చేసి ఇతరులకు దానమివ్వాలి. ఎంతగా దానమిస్తారో, అంతగా జమ అవుతూ ఉంటుంది. సేవే చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది? సేవలో బుద్ధిని ఉపయోగించాలి. సేవ అయితే చాలా ఎక్కువ చేయడానికి అవకాశముంది. రోజురోజుకు ఉన్నతిని పొందాలి. స్వయము యొక్క ఉన్నతిని కూడా చేసుకోవాలి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. సదా ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. జ్ఞాన ధనాన్ని దానము చేసి సంతోషములో నాట్యము చేయాలి. స్వయము ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి. 2. తండ్రి ఏదైతే జ్ఞాన ఖజానాను ఇస్తారో, దానితో తమ జోలిని నింపుకోవాలి. నోట్స్ వ్రాసుకోవాలి. ఆ తర్వాత టాపిక్స్ పై అర్థం చేయించాలి. జ్ఞాన ధనాన్ని దానము చేయడానికి ఉత్సాహముతో ఉప్పొంగుతూ ఉండాలి. వరదానము:-సత్యత యొక్క మహానత ద్వారా సదా సంతోషపు ఊయలలో ఊగే అథారిటీ స్వరూప భవ సత్యత యొక్క అథారిటీ స్వరూపము కల పిల్లల యొక్క గాయనము ఏమిటంటే - సత్యము ఉన్న చోట మనసు ఆనందముతో నాట్యము చేస్తుంది. సత్యము అనే నావ కదులుతుంది కానీ మునిగిపోదు. మిమ్మల్ని కూడా ఎవరు ఎంతగా కదిలించేందుకు ప్రయత్నించినా కానీ మీరు సత్యత యొక్క మహానత ద్వారా ఇంకా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు. వారు మిమ్మల్ని కదిలించడము లేదు, కానీ మీ ఊయలను ఊపుతున్నారు. ఇది కదిలించడము కాదు, ఊపడము వంటిది. అందుకే మీరు వారికి ధన్యవాదాలు తెలపండి - మీరు ఊపుతూ ఉండండి మరియు మేము తండ్రితో కలిసి ఊగుతూ ఉంటాము అని. స్లోగన్:-సర్వ శక్తుల లైట్ సదా తోడుగా ఉన్నట్లయితే మాయ సమీపముగా రాలేదు.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి ఏకత, స్వచ్ఛత, సూక్ష్మత, మధురత మరియు మనసు-వాణి-కర్మలలో మహానత - ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరి యొక్క ప్రతి అడుగులో కనిపించినట్లయితే బాబా ప్రత్యక్షత సహజముగా జరుగుతుంది. ఇప్పటివరకు సంస్కారాలలో ఏదైతే భిన్నత్వము కనిపిస్తుందో, దానిని ఏకతలోకి తీసుకురావాలి. ఏకత కోసం ఇతరుల సలహాలకు గౌరవాన్ని ఇవ్వండి, (హాజీ-హాజీ) సరేనండి, సరేనండి అంటూ మీ ఆలోచనలను తప్పకుండా చెప్పండి, ఆ తర్వాత ఏకత యొక్క బంధములో బంధింపబడండి, ఈ ఏకతయే సఫలతకు సాధనము. "
https://youtube.com/watch?v=WT1fL-E_lWs&si=2ef3edp31mRkUS8A #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి
youtube-preview
#🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 06-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఎక్కే కళ యొక్క సమయము, భారత్ నిరుపేద నుండి షావుకారుగా అవుతుంది, మీరు తండ్రి నుండి సత్యయుగీ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని తీసుకోండి’’ ప్రశ్న:-తండ్రి యొక్క ఏ టైటిల్ ను శ్రీకృష్ణునికి ఇవ్వలేరు? జవాబు:-తండ్రి పేదల పెన్నిధి. శ్రీకృష్ణుడిని అలా అనరు. వారు చాలా ధనవంతుడు, వారి రాజ్యములో అందరూ షావుకారులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు అందరికన్నా నిరుపేదగా ఉన్నది భారత్. భారత్ నే షావుకారుగా తయారుచేస్తారు. మన భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు అలా లేదు, మళ్ళీ ఆ విధముగా తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పెన్నిధి అయిన బాబాయే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. పాట:-చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరము ప్రత్యక్షముగా ఉంటుంది. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేము, అది గుప్తముగా ఉంది. ఆత్మ తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరముతో కప్పబడి ఉంది, అందుకే ఆత్మ గుప్తముగా ఉందని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది - నేను నిరాకారిని, ఇక్కడ సాకారములోకి వచ్చి గుప్తము అయ్యాను. ఆత్మలది నిరాకారీ ప్రపంచము, అక్కడైతే గుప్తముగా ఉండే విషయమేమీ లేదు. పరమపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్ అని అంటారు, వారు ఉన్నతోన్నతమైన ఆత్మ, అతీతముగా ఉండే పరమ ఆత్మ. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు గుప్తముగా ఉన్నారో, అలాగే నేను కూడా గుప్తముగా రావలసి ఉంటుంది. నేను గర్భ జైలులోకి రాను. నాకు శివ అన్న ఒక్క పేరే కొనసాగుతూ వస్తుంది. నేను ఈ తనువులోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మకు ఏదైతే శరీరము ఉందో, ఆ శరీరము యొక్క పేరు మారుతుంది. నన్ను అయితే శివ అనే అంటారు - నేను ఆత్మలందరికీ తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరములో గుప్తముగా ఉన్నారు, ఈ శరీరము ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తముగా ఉన్నాను. ఆత్మ ఈ శరీరముతో కప్పబడి ఉంది అని పిల్లలకు ఈ జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తముగా ఉంది, శరీరము ప్రత్యక్షముగా ఉంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరము ద్వారా వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైనవారే, శరీరము ద్వారా వింటారు. భారత్ ను మళ్ళీ నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మీరు - మా భారత్ అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ-తమ రాష్ట్రాల విషయములో - మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది-మాది అని అనడము వలన దాని పట్ల మోహము కలుగుతుంది. మన భారత్ నిరుపేదగా ఉంది అని అందరూ అనుకుంటారు, కానీ మన భారత్ షావుకారుగా ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది అనేది వారికి తెలియదు. పిల్లలైన మీకు చాలా నషా ఉంటుంది. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది, దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యయుగములో వేరే ఏ ధర్మమూ ఉండేది కాదు, ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ తండ్రి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు. భారత్ సత్యయుగములో చాలా షావుకారుగా ఉండేది, అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది, మరి ఆ రాజ్యము ఏమైపోయింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా, మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటారు, సత్యయుగములో కూడా దేవీ-దేవతలకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉండేది కాదు. మేము మెట్లు దిగుతూ కలియుగములోకి వెళ్ళిపోతామని - ఒకవేళ దేవతలకు కూడా ఈ జ్ఞానమున్నట్లయితే ఇక వారికి రాజ్యాధికారము యొక్క సుఖము ఉండదు, చింత కలుగుతుంది. మేము సతోప్రధానముగా ఉండేవారము, మళ్ళీ మేము సతోప్రధానముగా ఎలా అవ్వాలి అనే చింత మీకు ఉంది. ఆత్మలమైన మనము నిరాకారీ ప్రపంచములో ఉండేవారము, అక్కడ నుండి మళ్ళీ సుఖధామములోకి ఎలా వచ్చాము, ఈ జ్ఞానము కూడా మీకు ఉంది. మనము ఇప్పుడు ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. డ్రామానుసారముగా ప్రతి ఒక్క పాత్రధారి నంబరువారుగా తమ-తమ సమయమనుసారముగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిధి అని ఎవరిని అంటారు అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇది ప్రపంచానికి తెలియదు. పాటలో కూడా విన్నారు - భక్తులందరూ ఏ రోజు కోసమైతే వేచి ఉన్నారో, చివరికి ఆ రోజు నేడు వచ్చింది... భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గము నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా ఈ శరీరములోకి మళ్ళీ వచ్చేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు అంటే వారు తప్పకుండా వస్తారు. నేను శ్రీకృష్ణుడి తనువులోకి వస్తానని కూడా వారు అనరు. అలా కాదు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది, వారి అనేక జన్మల అంతిమములో ఇది అంతిమ జన్మ. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారిప్పుడు చివరిలో ఉన్నారు, తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). నేనైతే సాధారణ తనువులోకి వస్తాను, మీరు 84 జన్మలను ఎలా అనుభవించారు అన్నది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. సిక్కులు కూడా ఏక్ ఓంకార్, పరమపిత పరమాత్మ అయిన తండ్రి అని భావిస్తారు, వారు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు. మరి మనము కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు. ఎవరైతే ఇంతకుముందు దేవతలుగా అయ్యి ఉంటారో, వారు తండ్రికి పూర్తిగా అతుక్కుపోతారు. స్వయాన్ని దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది, కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, మరికొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మమువారే స్వర్గములోకి వస్తారు, ఇతర ధర్మాల వారు తర్వాతే వస్తారు. దేవతా ధర్మమువారు కూడా డ్రామానుసారముగా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ కన్వర్ట్ అయ్యి తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గాన్ని స్థాపన చేసేవారు కావున మేము స్వర్గములో ఎందుకు ఉండము, మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. ఇలా భావించేవారు మన ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది. అలా కానీ వారు ఇక్కడకు రానే రారు. వారు పరాయి ధర్మములోకి మేము ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో దేవతలకు చాలా సుఖముండేదని, అక్కడ బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరములో ఎంత బంగారముండేది. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు. సోమనాథ మందిరమంతటి భారీ మందిరము ఇంకేదీ ఉండదు, అందులో చాలా వజ్ర-వైఢూర్యాలుండేవి. బుద్ధుడు మొదలైనవారికి వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేసారో, వారికి మీరు ఎంత గౌరవాన్ని ఇచ్చారు! గౌరవాన్ని ఇవ్వడము జరుగుతుంది కదా. మంచి కర్మలు చేసి వెళ్ళారని భావిస్తారు. అన్నింటికన్నా మంచి కర్మ పతిత-పావనుడైన తండ్రియే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమ సేవను అనంతమైన తండ్రే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారో, వారినిప్పుడు ఎవరూ గౌరవించడము లేదు. ఉన్నతోన్నతమైన మందిరము అని గాయనము చేయబడిన దానిని దోచుకుని వెళ్ళిపోయారు. లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని ఎప్పుడూ ఎవ్వరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గములో కూడా చాలా ధనవంతులుంటారు. రాజులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారు ఉంటారో, వారికి తక్కువ పదవి వారు గౌరవాన్ని ఇస్తారు. దర్బారులో కూడా నంబరువారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుంది - వారి వద్ద ఇంత ధనముందంటే వారి ఇళ్ళు కూడా అంత బాగుంటాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపనను చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనము స్వర్గము యొక్క మహారాజా-మహారాణులుగా అవుతాము, మళ్ళీ మనము పడిపోతూ, పడిపోతూ భక్తులుగా అవుతాము, అప్పుడు మొట్టమొదట శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసారో, వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా షావుకార్లుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత పేదగా ఉంది, ఏ భూమినైతే ఇంతకుముందు 500 రూపాయలకు తీసుకున్నామో, ఈ రోజు దాని విలువ 5000 రూపాయల కన్నా కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కృత్రిమమైన ధరలు. అక్కడైతే భూమికి ధర ఉండదు, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది, మధురమైన నదుల వద్ద మీ మహళ్ళు ఉంటాయి. మనుష్యులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. ఫలాలు, పుష్పాలు మంచి-మంచివి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది, అయినా కానీ భోజనము లభించదు. మనుష్యులు చాలా ఆకలి, దప్పికలతో మరణిస్తుంటారు. పాట వినడముతో మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. పేదల పెన్నిధి యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు కదా! ఎవరిని షావుకార్లుగా తయారుచేస్తారు? వారు ఎక్కడికైతే వస్తారో, తప్పకుండా అక్కడున్నవారినే షావుకార్లుగా తయారుచేస్తారు కదా. మనము పావనము నుండి పతితముగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితము నుండి పావనముగా తయారుచేస్తారు, ఉన్నతోన్నతముగా తయారుచేస్తారు, ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, నేను మీ వాడిని అని అంటారు. బాబా అంటారు - బిడ్డ, నీవు విశ్వానికి యజమానిగా ఉండేవాడివి. కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు, ఎంత సంతోషము కలుగుతుంది. కూతురిని చూస్తే ముఖము కిందకు దిగిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ కొడుకులు. 5 వేల సంవత్సరాల క్రితము మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని అలా తయారుచేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని జరుపుకుంటారు, కేవలం లింగాన్ని పెట్టి పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కానీ వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేసారు అన్నది ఏమీ తెలియదు, దీనిని అంధ విశ్వాసము, అంధ శ్రద్ధ అని అంటారు. మన ధర్మము ఏది, ఎప్పుడు స్థాపనయ్యింది అన్నది వారికి తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి ధర్మము గురించి తెలుసు, బుద్ధుడు ఎప్పుడు వచ్చారు, తిథి-తారీఖులు ఏమిటి అన్నది కూడా వారికి తెలుసు. శివబాబాకు, లక్ష్మీ-నారాయణులకు ఎటువంటి తిథి, తారీఖులు లేవు. 5 వేల సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. లక్షల సంవత్సరాల విషయమనేట్పపటికి ఎవరికి గుర్తుకొస్తుంది? భారత్ లో దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు ఉండేది అనేది అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల లెక్కలోనైతే భారత్ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు, ఇప్పటికి లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోయి ఉండాలి. కానీ అంతమందైతే లేరు, ఇంకా జనాభా తగ్గిపోయింది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను మనుష్యులు విన్నప్పుడు ఏమంటారంటే - ఈ విషయాలనైతే మేము ఎప్పుడూ వినలేదు, అలాగే ఏ శాస్త్రాలలోనూ చదవలేదు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రము యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు. ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో వారు ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. ఆత్మలైన మీకిప్పుడు శిక్షణ లభిస్తోంది. ఆత్మ చెవుల ద్వారా వింటున్నప్పుడు శరీరము ఊగుతుంది ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము తప్పకుండా 84 జన్మలు తీసుకుంటాము, 84 జన్మలలో 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు, ఇది కూడా లెక్క కదా. మనము 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది, అలాగే తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేసారు అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీ విషయములో కనీసం 84 జన్మలు అని అయినా అంటారు కానీ నా కోసమైతే లెక్కలేనన్ని, అనేక జన్మలని అంటారు. కణకణములోకి, రాయిరప్పలలోకి నన్ను తోసేసారు. ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. మథుర, బృందావనములో ఈ విధముగా అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధ వర్గానికి చెందినవారు ఎక్కడ చూసినా రాధయే రాధ, నీవు రాధయే, నేను రాధయే అని అంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. ఏ భారత్ అయితే అన్నింటికన్నా షావుకారుగా ఉండేదో, ఇప్పుడది అన్నింటికన్నా పేదదిగా అయ్యింది, అందుకే నేను భారత్ లోకే రావలసి ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఏ మాత్రము తేడా రాదు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే జరిగిపోయిందో, అది యథావిధిగా రిపీట్ అవుతుంది, ఇందులో పైసా అంత తేడా కూడా రాదు. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా. అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడినే అనుకుంటారు, శ్రీకృష్ణుడిని అనుకోరు. శ్రీకృష్ణుడైతే ధనవంతుడిగా, సత్యయుగ రాకుమారుడిగా అవుతారు. భగవంతునికైతే తనదంటూ శరీరము లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారుచేస్తారు, మీకు రాజయోగము యొక్క శిక్షణనిస్తారు. చదువుతో బ్యారిస్టరు మొదలైనవారిగా అయి, ఆ తర్వాత సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా. అంతేకానీ స్వర్గము సముద్రము నుండి బయటకు వస్తుందని కాదు. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ సమయములో కంసపురి మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుని పేరు ఎంతగా గాయనము చేయబడుతుంది, అతని తండ్రికి అంతటి గాయనము లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు? తప్పకుండా శ్రీకృష్ణుడు ఎవరో ఒకరికి కుమారుడు కదా. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఆ పతితులు కూడా పూర్తిగా సమాప్తమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు సింహాసనముపై కూర్చుంటారు, తన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, అప్పటినుండే వారి కాలము ప్రారంభమవుతుంది. లక్ష్మీ-నారాయణుల నుండే ఆ కాలము ప్రారంభమవుతుంది. వీరి రాజ్యము ఇంత సమయము ఉంటుంది, ఆ తర్వాత వారిది ఇంత సమయము ఉంటుంది అని మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. ఈ కల్పము ఆయువు పెద్దదిగా ఉండదని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. నిన్న మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తండ్రియే మనల్ని అలా తయారుచేసారు, అందుకే మనము వారి శివజయంతిని జరుపుకుంటున్నాము. మీకు అందరి గురించి తెలుసు. క్రైస్టు, గురునానక్ మొదలైనవారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న జ్ఞానము మీకు ఉంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గము గురించి తెలుసు. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ అవినాశీ ఖండము. భారత్ కు ఉన్నంత మహిమ ఇంకెవ్వరికీ ఉండదు. అందరినీ పతితుల నుండి పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ అన్ని చింతలను వదిలేయాలి. సతోప్రధానముగా అవ్వాలన్న ఒక్క చింతనే పెట్టుకోవాలి. 2. పేదల పెన్నిధి అయిన బాబా భారత్ ను నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు, వారికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి. తమ కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటూ సదా సంతోషముగా ఉండాలి. వరదానము:-హృదయములో సదా ఒక్క రాముడినే ఇముడ్చుకొని సత్యమైన సేవను చేసే మాయాజీత్, విజయీ భవ హనుమంతుడి విశేషతను ఏమని చూపిస్తారంటే - అతను సదా సేవాధారిగా, మహావీరునిగా ఉండేవారు, అందుకే స్వయము కాలిపోకుండా తోక ద్వారా లంకను కాల్చేసారు అని. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారిగా ఉంటారో, వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తము చేయగలుగుతారు. ఎవరైతే సేవాధారి కారో, వారు మాయా రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయములో సదా ఒక్క రాముడే నివసించేవారు, అదే విధముగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ హృదయములో ఉండకూడదు, మీ దేహపు స్మృతి కూడా ఉండకూడదు, అప్పుడే మాయాజీతులుగా, విజయులుగా అవుతారు. స్లోగన్:-ఏ విధముగా ఆత్మ మరియు శరీరము కంబైండ్ గా ఉన్నాయో, అదే విధముగా మీరు తండ్రితోపాటు కంబైండ్ గా ఉండండి.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి సంగఠనలో ప్రతి ఒక్కరి విశేషతలను చూడటము, విశేషతలనే గ్రహించటము మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నము చెయ్యటము - ఇదే ఏకతతో కూడిన సంగఠనను ధృఢము చేసేందుకు విధి. ఏ విధముగానైతే మీ అందరి యొక్క లేవడము, మాట్లాడటము, నడవటము ఒకే విధముగా ఉన్నాయో, అందరివీ ఒకే విధమైన మాటలు, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉన్నాయో, అదే విధముగా సంస్కారాలు కూడా సమానముగా కనిపించాలి. భిన్నత్వము ఉన్నప్పటికీ పరస్పరము ఒకరి పట్ల ఒకరు విశ్వాసము ఉంచి, అందరి ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి, ఇదే ఏకతకు ఆధారము. "