v. v. guptha
ShareChat
click to see wallet page
@299580595
299580595
v. v. guptha
@299580595
ఐ లవ్ షేర్ చాట్
https://youtube.com/watch?v=W9vguBu2PKE&si=6d7387KoJywp8Sdu #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🛕అయోధ్య రామ మందిరం🙏
youtube-preview
https://youtube.com/watch?v=ryw_NzguBjU&si=OH-HNYoZMLZrlm1D #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా
youtube-preview
#🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా 21-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానసాగరుడైన తండ్రి, పిల్లలైన మీ సమ్ముఖములో జ్ఞాన డాన్స్ చేయడానికి వచ్చారు, మీరు తెలివైనవారిగా, సేవాధారులుగా అయినట్లయితే జ్ఞాన డాన్స్ కూడా బాగా జరుగుతుంది’’ ప్రశ్న:-సంగమయుగములో పిల్లలైన మీరు ఏ హాబీ (అలవాటు) ను అలవాటు చేసుకుంటారు? జవాబు:-స్మృతిలో ఉండే హాబీను అలవాటు చేసుకుంటారు. ఇదే ఆత్మిక హాబీ. ఈ హాబీతో పాటుగా మీరు దివ్యమైన మరియు అలౌకికమైన కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు, మీరు అందరికీ సత్యాతి-సత్యమైన కథను తప్పకుండా వినిపించాలి. సేవ చేసే హాబీ కూడా పిల్లలైన మీకు ఉండాలి. పాట:-ఓర్పు వహించు మానవా... ▶ ఓంశాంతి. హాస్పిటల్ లో ఎవరైనా అనారోగ్యముతో ఉన్నట్లయితే, ఆ పేషెంట్ దుఃఖము నుండి విముక్తునిగా అవ్వాలని ఆశిస్తాడు. నా పరిస్థితి ఎలా ఉంది, ఈ అనారోగ్యము ఎప్పుడు నయమవుతుంది అని డాక్టరును అడుగుతారు. అవన్నీ హద్దులోని విషయాలు. ఇది అనంతమైన విషయము. తండ్రి వచ్చి పిల్లలకు సలహానిస్తారు. ఇది నిజంగానే సుఖము మరియు దుఃఖము యొక్క ఆట అని పిల్లలు తెలుసుకున్నారు. వాస్తవానికి పిల్లలైన మీకు సత్యయుగములోకి వెళ్ళేకంటే కూడా ఎక్కువ లాభము ఇక్కడే ఉంది ఎందుకంటే మీకు తెలుసు, ఈ సమయములో మనము ఈశ్వరీయ ఒడిలో ఉన్నాము, మనము ఈశ్వరీయ సంతానము. ఈ సమయములో మనకు ఎంతో ఉన్నతోన్నతమైన గుప్తమైన మహిమ ఉంది. మనుష్యమాత్రులు తండ్రిని శివుడు, ఈశ్వరుడు, భగవంతుడు అని కూడా అంటారు కానీ వారి గురించి తెలియదు, కేవలం అలా పిలుస్తూ ఉంటారు. డ్రామానుసారముగానే ఇలా జరుగుతుంది. జ్ఞానము మరియు అజ్ఞానము, పగలు మరియు రాత్రి అని కూడా పాడుతూ వచ్చారు కానీ బుద్ధి ఎంత తమోప్రధానముగా అయిపోయిందంటే, తమను తాము తమోప్రధానమని భావించనే భావించరు. ఎవరి భాగ్యములోనైతే తండ్రి యొక్క వారసత్వము ఉంటుందో, వారి బుద్ధిలోనే కూర్చోగలదు. మేము పూర్తిగా ఘోర అంధకారములో ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున ఎంతటి ప్రకాశము లభించింది. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే అర్థం చేయిస్తారో, అది ఏ వేద-శాస్త్రాలలోనూ, గ్రంథాలు మొదలైనవాటిలోనూ లేదు. ఇది కూడా తండ్రి నిరూపించి తెలియజేస్తారు. పిల్లలైన మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల ప్రకాశాన్ని ఇస్తాను, అది తర్వాత కనుమరుగైపోతుంది. నా ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా జ్ఞానము లభించదు, ఈ జ్ఞానము తర్వాత కనుమరుగైపోతుంది. కలియుగము గతించిపోయింది, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని అర్థమవుతుంది. ఇది కొత్త విషయము. ఇది శాస్త్రాలలో లేదు. తండ్రి అయితే ఈ జ్ఞానాన్ని అందరికీ ఒకే విధముగా చదివిస్తారు కానీ ధారణలో నంబరువారుగా ఉన్నారు. కొంతమంది మంచి సర్వీసబుల్ పిల్లలు వచ్చినప్పుడు బాబా యొక్క డ్యాన్స్ కూడా అలాగే జరుగుతుంది. డ్యాన్సింగ్ గర్ల్ (నృత్యము చేసే నర్తకి) ఎదురుగా, చాలా అభిరుచితో చూసేవారు ఉన్నట్లయితే, ఆమె కూడా సంతోషముతో చాలా బాగా నాట్యము చేస్తుంది. కొద్దిమందే కూర్చుని ఉంటే, సాధారణ రీతిలో కొద్దిగా డాన్స్ చేస్తుంది. వాహ్-వాహ్ అనేవారు చాలామంది ఉంటే, ఆమెకు కూడా ఉత్సాహము పెరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మురళీని పిల్లలందరూ వింటారు, కానీ సమ్ముఖముగా వినడము వేరు కదా. శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసేవారని కూడా చూపిస్తారు. కానీ డ్యాన్స్ అంటే స్థూలమైన డ్యాన్స్ కాదు. వాస్తవానికి ఇది జ్ఞాన డ్యాన్స్. శివబాబా స్వయంగా చెప్తున్నారు - నేను జ్ఞాన డ్యాన్స్ చేయడానికి వస్తాను, నేను జ్ఞాన సాగరుడిని, కావున మంచి-మంచి పాయింట్లు వెలువడతాయి. ఇది జ్ఞాన మురళీ, అంతేకానీ చెక్క మురళీ కాదు. పతిత-పావనుడైన తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారా లేక చెక్క మురళీని వాయిస్తారా? తండ్రి వచ్చి ఈ విధముగా రాజయోగాన్ని నేర్పిస్తారు అన్నది ఎవరి ఆలోచనలోనూ ఉండదు. ఇప్పుడు ఈ విషయము మీకు తెలుసు, ఇక మిగిలిన మనుష్యమాత్రులెవ్వరి బుద్ధిలోకీ ఈ విషయము రాదు. వచ్చేవారు కూడా నంబరువారుగా పదవిని పొందుతారు. కల్పక్రితం చేసినట్లుగానే ఇప్పుడు కూడా పురుషార్థము చేస్తూ ఉంటారు. తండ్రి కల్పక్రితం వలె వస్తారని, వచ్చి పిల్లలకు అన్ని రహస్యాలను విడమర్చి చెప్తారని మీకు తెలుసు. వారు అంటారు, నేను కూడా బంధనములో బంధింపబడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారు. సత్యయుగములో ఏదైతే జరిగిందో, అదే మళ్ళీ జరుగుతుంది. ఎన్నో రకాల యోనులు ఉన్నాయి. సత్యయుగములో ఇన్ని యోనులు ఉండవు. అక్కడ కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటాయి. ధర్మాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి కదా. సత్యయుగములోనైతే ఇన్ని ధర్మాలు ఉండేవి కావు. సత్యయుగములో ఏవైతే ఉండేవో, వాటిని మళ్ళీ సత్యయుగములోనే చూస్తారు. సత్యయుగములో ఛీ-ఛీగా మురికి చేసేవేవీ ఉండవు. ఆ దేవీ-దేవతలను భగవాన్-భగవతీ అని అంటారు. వేరే ఏ ఖండములోనూ ఎప్పుడూ ఎవరినీ గాడ్-గాడెస్ అని అనలేరు. ఆ దేవతలు తప్పకుండా స్వర్గములో రాజ్యము చేసేవారు. వారికి ఎంత మహిమ ఉందో చూడండి. పిల్లలైన మీకిప్పుడు ఓర్పు కలిగింది. మా పదవి ఎంతో ఉన్నతమైనదని లేదా ఎంతో తక్కువైనదని, మేము ఇన్ని మార్కులతో పాస్ అవుతాము అని మీకు తెలుసు. ఫలానావారు మంచి సేవను చేస్తున్నారని ప్రతి ఒక్కరు మీకు మీరు అర్థం చేసుకోగలరు కదా. అయితే, నడుస్తూ-నడుస్తూ తుఫానులు కూడా వస్తాయి. తండ్రి అంటారు, పిల్లలకు ఎటువంటి గ్రహచారము గాని, తుఫానులు మొదలైనవి గాని రాకూడదు. మాయ మంచి-మంచి పిల్లలను కూడా పడేస్తుంది. కనుక ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని తండ్రి ఓర్పునందిస్తూ ఉంటారు. మీరు సేవను కూడా చేయాలి. స్థాపన జరిగిపోయినట్లయితే ఇక వెళ్ళాల్సిందే. ఇందులో ఒక్క సెకండు కూడా ముందు-వెనుక అవ్వలేదు. ఈ రహస్యాన్ని పిల్లలే అర్థం చేసుకోగలరు. మనము డ్రామాలోని పాత్రధారులము, ఇందులో మనది ముఖ్యమైన పాత్ర. గెలుపు-ఓటముల ఆట భారత్ పైనే తయారుచేయబడింది. భారత్ యే పావనముగా ఉండేది, ఎంతో శాంతి, పవిత్రత ఉండేవి. ఇది నిన్నటి విషయమే. నిన్న మనమే పాత్రను అభినయించాము. 5 వేల సంవత్సరాల పాత్ర పూర్తిగా నిశ్చితమై ఉంది. మనము చక్రములో తిరిగి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ తండ్రితో యోగాన్ని జోడిస్తాము, దీనితోనే మాలిన్యము తొలగుతుంది. తండ్రి గుర్తుకు వచ్చినట్లయితే, వారసత్వము కూడా తప్పకుండా గుర్తుకువస్తుంది. మొట్టమొదట అల్ఫ్ (భగవంతుడు) ను తెలుసుకోవాలి. తండ్రి అంటారు, మీరు నన్ను తెలుసుకోవడముతో నా ద్వారా అంతా తెలుసుకుంటారు. జ్ఞానమైతే చాలా సులువైనది, ఇది ఒక్క సెకండుకు సంబంధించినది. అయినా కూడా అర్థం చేయిస్తూ ఉంటారు, పాయింట్లు ఇస్తూ ఉంటారు. ముఖ్యమైన పాయింటు, మన్మనాభవ, ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. దేహాభిమానము రావడముతో అనేక రకాలు ఇబ్బందులు పడతారు, అవి యోగములో ఉండనివ్వవు. భక్తి మార్గములో శ్రీకృష్ణుని స్మృతిలో కూర్చుంటారు కానీ బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెడుతుంది. భక్తిలో అందరికీ ఈ అనుభవముంది. ఇది ఈ జన్మ యొక్క విషయమే. ఈ జన్మ గురించి తెలుసుకుంటే, ఎంతోకొంత గత జన్మల గురించి కూడా తెలుసుకోగలుగుతారు. తండ్రిని స్మృతి చేయడము అనేది పిల్లలకు హాబీగా అయిపోయింది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషము పెరుగుతుంది. దీనితో పాటు దివ్యమైన అలౌకిక కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు. మీరు సత్యనారాయణ కథను, అమరకథను వినిపిస్తారు. ముఖ్యమైన విషయము ఒక్కటే - అందులోనే అన్నీ వచ్చేస్తాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ ఒక్క హాబీయే ఆత్మికమైనది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, జ్ఞానమైతే చాలా సహజమైనది. కన్యల పేరు కూడా మహిమ చేయబడింది. అదర్ కుమారీ, కుమారీ కన్య, ఇలా కుమారీల పేరు అందరికన్నా ఎక్కువ ప్రసిద్ధమైననది. వారికి ఎటువంటి బంధనము లేదు. ఆ పతి అయితే వికారీగా తయారుచేస్తాడు. ఈ తండ్రి అయితే స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు అలంకరిస్తారు, మధురమైన సాగరములోకి తీసుకువెళ్తారు. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచాన్ని పాత దేహము సహితముగా పూర్తిగా మర్చిపోండి. ఆత్మ అంటుంది - నేనైతే 84 జన్మలను పూర్తి చేసాను, ఇప్పుడు మళ్ళీ నేను తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాను. ధైర్యము ఉంచుతారు, అయినా కానీ మాయతో యుద్ధమైతే జరుగుతుంది. ముందైతే ఈ బాబా ఉన్నారు, మాయా తుఫానులు ఎక్కువగా వీరి వద్దకు వస్తాయి. బాబా, మాకు ఇలా అవుతుంది అని చాలామంది వచ్చి అడుగుతుంటారు. బాబా అంటారు - పిల్లలూ, ఈ తుఫానులైతే తప్పకుండా వస్తాయి, ఇవి ముందు నా వద్దకు వస్తాయి. అంతిమములో అందరూ కర్మాతీత అవస్థను పొందుతారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పక్రితము కూడా ఇలా జరిగింది. డ్రామాలో పాత్రను అభినయించారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. ఈ పాత ప్రపంచము నరకమని పిల్లలకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు క్షీరసాగరములో ఉండేవారని అంటారు కూడా. వీరికి ఎంత మంచి-మంచి మందిరాలను నిర్మిస్తారు. ప్రారంభములో మందిరాలను నిర్మించేటప్పుడు, పాలతోనే కొలనును తయారుచేసి, విష్ణు మూర్తిని పెట్టి ఉంటారు. చాలా మంచి-మంచి చిత్రాలను తయారుచేసి పూజించేవారు. ఆ సమయములోనైతే అన్నీ చాలా చౌకగా ఉండేవి. బాబా ఇవన్నీ చూసారు. ఈ భారత్ నిజంగా ఎంత పవిత్రముగా, క్షీరసాగరము వలె ఉండేది. పాల నదులు, నేతి నదుల ఉన్నట్లు ఉండేవి. ఈ విధముగా మహిమ చేశారు. స్వర్గము పేరు తీసుకోవడముతోనే, నోటిలో నీరు ఊరుతుంది. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. కనుక బుద్ధికి వివేకము లభించింది. బుద్ధి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్వర్గములోకి వస్తారు. అక్కడ అన్నీ కొత్తగానే ఉంటాయి. బాబా, శ్రీ నారాయణుడి మూర్తిని చూసి చాలా సంతోషపడేవారు, చాలా ప్రేమగా చూసుకునేవారు. నేనే ఇలా అవుతాను అని వారు అనుకోలేదు. ఈ జ్ఞానమైతే ఇప్పుడు బాబా నుండి లభించింది. మీకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. మనము చక్రములో ఎలా తిరుగుతాము అనేది మీకు తెలుసు. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. శరీరానికైతే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారముగా మీకు సుఖమయమైన రోజులు వస్తాయి. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని చూస్తున్నారు. మీకు మూడవ నేత్రము లభించింది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించి మీకు మంచి రీతిలో తెలుసు. ఈ స్వదర్శన చక్రము మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది, సంతోషము కలుగుతుంది. ఈ సమయములో అనంతమైన తండ్రి మనకు టీచరుగా అయి చదివిస్తారు. కానీ ఇది కొత్త విషయమైన కారణముగా పదే-పదే మర్చిపోతుంటారు. లేకపోతే బాబా అని అనడముతోనే సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కాలి. రామతీర్థుడు శ్రీకృష్ణుని భక్తునిగా ఉండేవారు కనుక శ్రీకృష్ణుని దర్శనము కోసం ఎంత చేసేవారు. అతనికి సాక్షాత్కారము కలిగింది, సంతోషపడ్డారు. కానీ దాని వలన ఏమి జరిగింది, ఏమీ లభించలేదు. ఇక్కడైతే పిల్లలైన మీకు సంతోషము కూడా ఉంది ఎందుకంటే మనము 21 జన్మల కొరకు ఇంతటి ఉన్నతమైన పదవిని పొందుతామని మీకు తెలుసు. మూడు వంతులు అయితే మీరు సుఖముగా ఉంటారు. ఒకవేళ సగం-సగం ఉన్నట్లయితే ఇక లాభము లేనట్లు. మీరు మూడు వంతులు సుఖములో ఉంటారు. మీ అంతటి సుఖాన్ని ఎవ్వరూ చూడలేరు. మీకైతే అపారమైన సుఖముంటుంది. మహాన్ సుఖములోనైతే దుఃఖము గురించి తెలియదు. ఇప్పుడు మేము దుఃఖము నుండి సుఖములోకి వెళ్తున్నామని సంగమములో మీరు రెండింటి గురించి తెలుసుకుంటారు. ముఖము పగలు వైపు మరియు కాళ్ళు రాత్రి వైపు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని కాలదన్నాలి అనగా బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని ఆత్మకు తెలుసు, చాలా పాత్రను అభినయించారు. ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగానే తుప్పు తొలగుతుంది. ఎంతగా తండ్రి సేవలో ఉంటూ తమ సమానముగా తయారుచేస్తారో, అంతగానే తండ్రిని ప్రత్యక్షము చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉంది. కనుక ఇంటినే స్మృతి చేయాలి. పాత ఇల్లు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఇల్లు ఎక్కడ, పాత ఇల్లు ఎక్కడ. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. ఇది అదే విషయ-వైతరణి నది. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు, గొడవపడుతూ ఉంటారు. ఇకపోతే తండ్రి వచ్చినప్పుడు కూడా చాలా గొడవలు మొదలయ్యాయి. ఒకవేళ పత్ని వికారాలను అందించకపోతే ఎంతగా విసిగిస్తారు, ఎంతగా తల కొట్టుకుంటారు. కల్పక్రితం కూడా అత్యాచారాలు జరిగాయి. ఇప్పటి విషయాల గురించే చెప్పుకుంటారు. ఎంతగా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు అనేది చూస్తుంటారు. డ్రామాలోని అదే పాత్ర మళ్ళీ నడుస్తుంది. ఇది తండ్రికి తెలుసు మరియు పిల్లలకు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మున్ముందు అందరికీ అర్థమవుతుంది. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత తండ్రి అని పాడుతారు కూడా. భారత్ స్వర్గముగా మరియు నరకముగా ఎలా అవుతుంది అనేది మీరెవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు వచ్చినట్లయితే మేము మీకు మొత్తము ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాల గురించి అర్థం చేయిస్తామని చెప్పాలి. ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికాలు ఈశ్వరునికే తెలుసు మరియు ఈశ్వరుని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవడముతో, పవిత్రత, సుఖ-శాంతుల స్థాపన ఎలా జరుగుతుంది అనేదంతా మీరు తెలుసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి మీరు తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే తీసుకుంటారు. మీరు వచ్చి ఇది అర్థం చేసుకోండి. టాపిక్స్ చాలా ఉన్నాయి. పిల్లలైన మీకైతే ఇప్పుడు బుద్ధి నిండుగా అయిపోయింది. సంతోషము యొక్క పాదరసము ఎంతగా పైకి ఎక్కింది. మొత్తం జ్ఞానమంతా పిల్లలైన మీ వద్ద ఉంది. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి నాలెడ్జ్ లభిస్తోంది. ఆ తర్వాత మనమే వెళ్ళి లక్ష్మీ-నారాయణలుగా అవుతాము. అక్కడ మళ్ళీ ఈ జ్ఞానమేమీ ఉండదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన ఎంతటి గుహ్యమైన విషయాలు. పిల్లలు మెట్ల వరుస చిత్రాన్ని మంచి రీతిలో అర్థం చేసుకున్నారు కదా. ఈ చక్రము 84 జన్మలది. ఇప్పుడు మనుష్యులకు కూడా స్పష్టముగా అర్థం చేయించాలి. దీనిని ఇప్పుడు స్వర్గము లేక పావన ప్రపంచమని అనరు. సత్యయుగము వేరు, కలియుగము వేరు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది సులువుగా అర్థం చేయించవచ్చు. వివరణ మంచిగా అనిపిస్తుంది. కానీ పురుషార్థము చేసి స్మృతియాత్రలో ఉండాలి, ఇది చాలామంది చేయలేకపోతారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఈ పాత దేహాన్ని మరియు పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచి తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇప్పుడు మా సుఖమయమైన రోజులు ఇక వచ్చేసాయని సదా ఇదే సంతోషములో ఉండాలి. 2. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి ఏ నాలెడ్జ్ అయితే లభించిందో, దానిని స్మరణ చేస్తూ బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడూ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడకూడదు. వరదానము:-సదా ఏకరస స్థితి అనే సింహాసనముపై విరాజమానమై ఉండే బాప్ దాదా హృదయ సింహాసనాధికారి భవ అన్నింటికంటే శ్రేష్ఠమైన సింహాసనము బాప్ దాదా హృదయ సింహాసనాధికారిగా అవ్వడము. కానీ ఈ సింహాసనముపై కూర్చునేందుకు అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితి యొక్క సింహాసనము కావాలి. ఒకవేళ ఈ స్థితి అనే సింహాసనముపై స్థితులవ్వలేకపోతే బాప్ దాదా యొక్క హృదయము రూపీ సింహాసనముపై స్థితులవ్వలేరు. దీని కోసం తమ భృకుటి సింహాసనముపై అకాలమూర్తులుగా అయి స్థితులవ్వండి, ఈ సింహాసనముపై మాటిమాటికి అలజడి చెందకూడదు, అప్పుడే బాప్ దాదా హృదయ సింహాసనముపై విరాజమానమవ్వగలరు. స్లోగన్:-శుభ చింతన ద్వారా నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేయండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ బ్రహ్మాబాబా తన పిల్లలు ప్రతి ఒక్కరి ముఖములో, ఒకటేమో - సదా ఆత్మికతకు చెందిన చిరునవ్వును చూడాలనుకుంటారు మరియు రెండవది - నోటి నుండి సదా మధురమైన మాటలను వినాలనుకుంటారు. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు, ముఖముపై ఆత్మికత ఉండాలి, నోటిలో మధురత ఉండాలి మరియు మనసు-బుద్ధిలో సదా శుభ భావన, దయా హృదయము కల భావన, దాతాతనపు భావన ఉండాలి. ప్రతి అడుగులోనూ ఫాలో ఫాదర్ చేయాలి, ఇదే పాలనకు రిటర్న్గా ఇవ్వండి. "
https://youtube.com/watch?v=eo1dk1o8tJ4&si=0b1a2hsk1ZKawMSr #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామ మందిరం🙏
youtube-preview
#🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు 21-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానసాగరుడైన తండ్రి, పిల్లలైన మీ సమ్ముఖములో జ్ఞాన డాన్స్ చేయడానికి వచ్చారు, మీరు తెలివైనవారిగా, సేవాధారులుగా అయినట్లయితే జ్ఞాన డాన్స్ కూడా బాగా జరుగుతుంది’’ ప్రశ్న:-సంగమయుగములో పిల్లలైన మీరు ఏ హాబీ (అలవాటు) ను అలవాటు చేసుకుంటారు? జవాబు:-స్మృతిలో ఉండే హాబీను అలవాటు చేసుకుంటారు. ఇదే ఆత్మిక హాబీ. ఈ హాబీతో పాటుగా మీరు దివ్యమైన మరియు అలౌకికమైన కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు, మీరు అందరికీ సత్యాతి-సత్యమైన కథను తప్పకుండా వినిపించాలి. సేవ చేసే హాబీ కూడా పిల్లలైన మీకు ఉండాలి. పాట:-ఓర్పు వహించు మానవా... ▶ ఓంశాంతి. హాస్పిటల్ లో ఎవరైనా అనారోగ్యముతో ఉన్నట్లయితే, ఆ పేషెంట్ దుఃఖము నుండి విముక్తునిగా అవ్వాలని ఆశిస్తాడు. నా పరిస్థితి ఎలా ఉంది, ఈ అనారోగ్యము ఎప్పుడు నయమవుతుంది అని డాక్టరును అడుగుతారు. అవన్నీ హద్దులోని విషయాలు. ఇది అనంతమైన విషయము. తండ్రి వచ్చి పిల్లలకు సలహానిస్తారు. ఇది నిజంగానే సుఖము మరియు దుఃఖము యొక్క ఆట అని పిల్లలు తెలుసుకున్నారు. వాస్తవానికి పిల్లలైన మీకు సత్యయుగములోకి వెళ్ళేకంటే కూడా ఎక్కువ లాభము ఇక్కడే ఉంది ఎందుకంటే మీకు తెలుసు, ఈ సమయములో మనము ఈశ్వరీయ ఒడిలో ఉన్నాము, మనము ఈశ్వరీయ సంతానము. ఈ సమయములో మనకు ఎంతో ఉన్నతోన్నతమైన గుప్తమైన మహిమ ఉంది. మనుష్యమాత్రులు తండ్రిని శివుడు, ఈశ్వరుడు, భగవంతుడు అని కూడా అంటారు కానీ వారి గురించి తెలియదు, కేవలం అలా పిలుస్తూ ఉంటారు. డ్రామానుసారముగానే ఇలా జరుగుతుంది. జ్ఞానము మరియు అజ్ఞానము, పగలు మరియు రాత్రి అని కూడా పాడుతూ వచ్చారు కానీ బుద్ధి ఎంత తమోప్రధానముగా అయిపోయిందంటే, తమను తాము తమోప్రధానమని భావించనే భావించరు. ఎవరి భాగ్యములోనైతే తండ్రి యొక్క వారసత్వము ఉంటుందో, వారి బుద్ధిలోనే కూర్చోగలదు. మేము పూర్తిగా ఘోర అంధకారములో ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున ఎంతటి ప్రకాశము లభించింది. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే అర్థం చేయిస్తారో, అది ఏ వేద-శాస్త్రాలలోనూ, గ్రంథాలు మొదలైనవాటిలోనూ లేదు. ఇది కూడా తండ్రి నిరూపించి తెలియజేస్తారు. పిల్లలైన మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల ప్రకాశాన్ని ఇస్తాను, అది తర్వాత కనుమరుగైపోతుంది. నా ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా జ్ఞానము లభించదు, ఈ జ్ఞానము తర్వాత కనుమరుగైపోతుంది. కలియుగము గతించిపోయింది, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని అర్థమవుతుంది. ఇది కొత్త విషయము. ఇది శాస్త్రాలలో లేదు. తండ్రి అయితే ఈ జ్ఞానాన్ని అందరికీ ఒకే విధముగా చదివిస్తారు కానీ ధారణలో నంబరువారుగా ఉన్నారు. కొంతమంది మంచి సర్వీసబుల్ పిల్లలు వచ్చినప్పుడు బాబా యొక్క డ్యాన్స్ కూడా అలాగే జరుగుతుంది. డ్యాన్సింగ్ గర్ల్ (నృత్యము చేసే నర్తకి) ఎదురుగా, చాలా అభిరుచితో చూసేవారు ఉన్నట్లయితే, ఆమె కూడా సంతోషముతో చాలా బాగా నాట్యము చేస్తుంది. కొద్దిమందే కూర్చుని ఉంటే, సాధారణ రీతిలో కొద్దిగా డాన్స్ చేస్తుంది. వాహ్-వాహ్ అనేవారు చాలామంది ఉంటే, ఆమెకు కూడా ఉత్సాహము పెరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మురళీని పిల్లలందరూ వింటారు, కానీ సమ్ముఖముగా వినడము వేరు కదా. శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసేవారని కూడా చూపిస్తారు. కానీ డ్యాన్స్ అంటే స్థూలమైన డ్యాన్స్ కాదు. వాస్తవానికి ఇది జ్ఞాన డ్యాన్స్. శివబాబా స్వయంగా చెప్తున్నారు - నేను జ్ఞాన డ్యాన్స్ చేయడానికి వస్తాను, నేను జ్ఞాన సాగరుడిని, కావున మంచి-మంచి పాయింట్లు వెలువడతాయి. ఇది జ్ఞాన మురళీ, అంతేకానీ చెక్క మురళీ కాదు. పతిత-పావనుడైన తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారా లేక చెక్క మురళీని వాయిస్తారా? తండ్రి వచ్చి ఈ విధముగా రాజయోగాన్ని నేర్పిస్తారు అన్నది ఎవరి ఆలోచనలోనూ ఉండదు. ఇప్పుడు ఈ విషయము మీకు తెలుసు, ఇక మిగిలిన మనుష్యమాత్రులెవ్వరి బుద్ధిలోకీ ఈ విషయము రాదు. వచ్చేవారు కూడా నంబరువారుగా పదవిని పొందుతారు. కల్పక్రితం చేసినట్లుగానే ఇప్పుడు కూడా పురుషార్థము చేస్తూ ఉంటారు. తండ్రి కల్పక్రితం వలె వస్తారని, వచ్చి పిల్లలకు అన్ని రహస్యాలను విడమర్చి చెప్తారని మీకు తెలుసు. వారు అంటారు, నేను కూడా బంధనములో బంధింపబడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారు. సత్యయుగములో ఏదైతే జరిగిందో, అదే మళ్ళీ జరుగుతుంది. ఎన్నో రకాల యోనులు ఉన్నాయి. సత్యయుగములో ఇన్ని యోనులు ఉండవు. అక్కడ కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటాయి. ధర్మాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి కదా. సత్యయుగములోనైతే ఇన్ని ధర్మాలు ఉండేవి కావు. సత్యయుగములో ఏవైతే ఉండేవో, వాటిని మళ్ళీ సత్యయుగములోనే చూస్తారు. సత్యయుగములో ఛీ-ఛీగా మురికి చేసేవేవీ ఉండవు. ఆ దేవీ-దేవతలను భగవాన్-భగవతీ అని అంటారు. వేరే ఏ ఖండములోనూ ఎప్పుడూ ఎవరినీ గాడ్-గాడెస్ అని అనలేరు. ఆ దేవతలు తప్పకుండా స్వర్గములో రాజ్యము చేసేవారు. వారికి ఎంత మహిమ ఉందో చూడండి. పిల్లలైన మీకిప్పుడు ఓర్పు కలిగింది. మా పదవి ఎంతో ఉన్నతమైనదని లేదా ఎంతో తక్కువైనదని, మేము ఇన్ని మార్కులతో పాస్ అవుతాము అని మీకు తెలుసు. ఫలానావారు మంచి సేవను చేస్తున్నారని ప్రతి ఒక్కరు మీకు మీరు అర్థం చేసుకోగలరు కదా. అయితే, నడుస్తూ-నడుస్తూ తుఫానులు కూడా వస్తాయి. తండ్రి అంటారు, పిల్లలకు ఎటువంటి గ్రహచారము గాని, తుఫానులు మొదలైనవి గాని రాకూడదు. మాయ మంచి-మంచి పిల్లలను కూడా పడేస్తుంది. కనుక ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని తండ్రి ఓర్పునందిస్తూ ఉంటారు. మీరు సేవను కూడా చేయాలి. స్థాపన జరిగిపోయినట్లయితే ఇక వెళ్ళాల్సిందే. ఇందులో ఒక్క సెకండు కూడా ముందు-వెనుక అవ్వలేదు. ఈ రహస్యాన్ని పిల్లలే అర్థం చేసుకోగలరు. మనము డ్రామాలోని పాత్రధారులము, ఇందులో మనది ముఖ్యమైన పాత్ర. గెలుపు-ఓటముల ఆట భారత్ పైనే తయారుచేయబడింది. భారత్ యే పావనముగా ఉండేది, ఎంతో శాంతి, పవిత్రత ఉండేవి. ఇది నిన్నటి విషయమే. నిన్న మనమే పాత్రను అభినయించాము. 5 వేల సంవత్సరాల పాత్ర పూర్తిగా నిశ్చితమై ఉంది. మనము చక్రములో తిరిగి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ తండ్రితో యోగాన్ని జోడిస్తాము, దీనితోనే మాలిన్యము తొలగుతుంది. తండ్రి గుర్తుకు వచ్చినట్లయితే, వారసత్వము కూడా తప్పకుండా గుర్తుకువస్తుంది. మొట్టమొదట అల్ఫ్ (భగవంతుడు) ను తెలుసుకోవాలి. తండ్రి అంటారు, మీరు నన్ను తెలుసుకోవడముతో నా ద్వారా అంతా తెలుసుకుంటారు. జ్ఞానమైతే చాలా సులువైనది, ఇది ఒక్క సెకండుకు సంబంధించినది. అయినా కూడా అర్థం చేయిస్తూ ఉంటారు, పాయింట్లు ఇస్తూ ఉంటారు. ముఖ్యమైన పాయింటు, మన్మనాభవ, ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. దేహాభిమానము రావడముతో అనేక రకాలు ఇబ్బందులు పడతారు, అవి యోగములో ఉండనివ్వవు. భక్తి మార్గములో శ్రీకృష్ణుని స్మృతిలో కూర్చుంటారు కానీ బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెడుతుంది. భక్తిలో అందరికీ ఈ అనుభవముంది. ఇది ఈ జన్మ యొక్క విషయమే. ఈ జన్మ గురించి తెలుసుకుంటే, ఎంతోకొంత గత జన్మల గురించి కూడా తెలుసుకోగలుగుతారు. తండ్రిని స్మృతి చేయడము అనేది పిల్లలకు హాబీగా అయిపోయింది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషము పెరుగుతుంది. దీనితో పాటు దివ్యమైన అలౌకిక కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు. మీరు సత్యనారాయణ కథను, అమరకథను వినిపిస్తారు. ముఖ్యమైన విషయము ఒక్కటే - అందులోనే అన్నీ వచ్చేస్తాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ ఒక్క హాబీయే ఆత్మికమైనది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, జ్ఞానమైతే చాలా సహజమైనది. కన్యల పేరు కూడా మహిమ చేయబడింది. అదర్ కుమారీ, కుమారీ కన్య, ఇలా కుమారీల పేరు అందరికన్నా ఎక్కువ ప్రసిద్ధమైననది. వారికి ఎటువంటి బంధనము లేదు. ఆ పతి అయితే వికారీగా తయారుచేస్తాడు. ఈ తండ్రి అయితే స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు అలంకరిస్తారు, మధురమైన సాగరములోకి తీసుకువెళ్తారు. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచాన్ని పాత దేహము సహితముగా పూర్తిగా మర్చిపోండి. ఆత్మ అంటుంది - నేనైతే 84 జన్మలను పూర్తి చేసాను, ఇప్పుడు మళ్ళీ నేను తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాను. ధైర్యము ఉంచుతారు, అయినా కానీ మాయతో యుద్ధమైతే జరుగుతుంది. ముందైతే ఈ బాబా ఉన్నారు, మాయా తుఫానులు ఎక్కువగా వీరి వద్దకు వస్తాయి. బాబా, మాకు ఇలా అవుతుంది అని చాలామంది వచ్చి అడుగుతుంటారు. బాబా అంటారు - పిల్లలూ, ఈ తుఫానులైతే తప్పకుండా వస్తాయి, ఇవి ముందు నా వద్దకు వస్తాయి. అంతిమములో అందరూ కర్మాతీత అవస్థను పొందుతారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పక్రితము కూడా ఇలా జరిగింది. డ్రామాలో పాత్రను అభినయించారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. ఈ పాత ప్రపంచము నరకమని పిల్లలకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు క్షీరసాగరములో ఉండేవారని అంటారు కూడా. వీరికి ఎంత మంచి-మంచి మందిరాలను నిర్మిస్తారు. ప్రారంభములో మందిరాలను నిర్మించేటప్పుడు, పాలతోనే కొలనును తయారుచేసి, విష్ణు మూర్తిని పెట్టి ఉంటారు. చాలా మంచి-మంచి చిత్రాలను తయారుచేసి పూజించేవారు. ఆ సమయములోనైతే అన్నీ చాలా చౌకగా ఉండేవి. బాబా ఇవన్నీ చూసారు. ఈ భారత్ నిజంగా ఎంత పవిత్రముగా, క్షీరసాగరము వలె ఉండేది. పాల నదులు, నేతి నదుల ఉన్నట్లు ఉండేవి. ఈ విధముగా మహిమ చేశారు. స్వర్గము పేరు తీసుకోవడముతోనే, నోటిలో నీరు ఊరుతుంది. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. కనుక బుద్ధికి వివేకము లభించింది. బుద్ధి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్వర్గములోకి వస్తారు. అక్కడ అన్నీ కొత్తగానే ఉంటాయి. బాబా, శ్రీ నారాయణుడి మూర్తిని చూసి చాలా సంతోషపడేవారు, చాలా ప్రేమగా చూసుకునేవారు. నేనే ఇలా అవుతాను అని వారు అనుకోలేదు. ఈ జ్ఞానమైతే ఇప్పుడు బాబా నుండి లభించింది. మీకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. మనము చక్రములో ఎలా తిరుగుతాము అనేది మీకు తెలుసు. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. శరీరానికైతే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారముగా మీకు సుఖమయమైన రోజులు వస్తాయి. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని చూస్తున్నారు. మీకు మూడవ నేత్రము లభించింది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించి మీకు మంచి రీతిలో తెలుసు. ఈ స్వదర్శన చక్రము మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది, సంతోషము కలుగుతుంది. ఈ సమయములో అనంతమైన తండ్రి మనకు టీచరుగా అయి చదివిస్తారు. కానీ ఇది కొత్త విషయమైన కారణముగా పదే-పదే మర్చిపోతుంటారు. లేకపోతే బాబా అని అనడముతోనే సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కాలి. రామతీర్థుడు శ్రీకృష్ణుని భక్తునిగా ఉండేవారు కనుక శ్రీకృష్ణుని దర్శనము కోసం ఎంత చేసేవారు. అతనికి సాక్షాత్కారము కలిగింది, సంతోషపడ్డారు. కానీ దాని వలన ఏమి జరిగింది, ఏమీ లభించలేదు. ఇక్కడైతే పిల్లలైన మీకు సంతోషము కూడా ఉంది ఎందుకంటే మనము 21 జన్మల కొరకు ఇంతటి ఉన్నతమైన పదవిని పొందుతామని మీకు తెలుసు. మూడు వంతులు అయితే మీరు సుఖముగా ఉంటారు. ఒకవేళ సగం-సగం ఉన్నట్లయితే ఇక లాభము లేనట్లు. మీరు మూడు వంతులు సుఖములో ఉంటారు. మీ అంతటి సుఖాన్ని ఎవ్వరూ చూడలేరు. మీకైతే అపారమైన సుఖముంటుంది. మహాన్ సుఖములోనైతే దుఃఖము గురించి తెలియదు. ఇప్పుడు మేము దుఃఖము నుండి సుఖములోకి వెళ్తున్నామని సంగమములో మీరు రెండింటి గురించి తెలుసుకుంటారు. ముఖము పగలు వైపు మరియు కాళ్ళు రాత్రి వైపు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని కాలదన్నాలి అనగా బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని ఆత్మకు తెలుసు, చాలా పాత్రను అభినయించారు. ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగానే తుప్పు తొలగుతుంది. ఎంతగా తండ్రి సేవలో ఉంటూ తమ సమానముగా తయారుచేస్తారో, అంతగానే తండ్రిని ప్రత్యక్షము చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉంది. కనుక ఇంటినే స్మృతి చేయాలి. పాత ఇల్లు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఇల్లు ఎక్కడ, పాత ఇల్లు ఎక్కడ. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. ఇది అదే విషయ-వైతరణి నది. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు, గొడవపడుతూ ఉంటారు. ఇకపోతే తండ్రి వచ్చినప్పుడు కూడా చాలా గొడవలు మొదలయ్యాయి. ఒకవేళ పత్ని వికారాలను అందించకపోతే ఎంతగా విసిగిస్తారు, ఎంతగా తల కొట్టుకుంటారు. కల్పక్రితం కూడా అత్యాచారాలు జరిగాయి. ఇప్పటి విషయాల గురించే చెప్పుకుంటారు. ఎంతగా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు అనేది చూస్తుంటారు. డ్రామాలోని అదే పాత్ర మళ్ళీ నడుస్తుంది. ఇది తండ్రికి తెలుసు మరియు పిల్లలకు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మున్ముందు అందరికీ అర్థమవుతుంది. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత తండ్రి అని పాడుతారు కూడా. భారత్ స్వర్గముగా మరియు నరకముగా ఎలా అవుతుంది అనేది మీరెవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు వచ్చినట్లయితే మేము మీకు మొత్తము ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాల గురించి అర్థం చేయిస్తామని చెప్పాలి. ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికాలు ఈశ్వరునికే తెలుసు మరియు ఈశ్వరుని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవడముతో, పవిత్రత, సుఖ-శాంతుల స్థాపన ఎలా జరుగుతుంది అనేదంతా మీరు తెలుసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి మీరు తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే తీసుకుంటారు. మీరు వచ్చి ఇది అర్థం చేసుకోండి. టాపిక్స్ చాలా ఉన్నాయి. పిల్లలైన మీకైతే ఇప్పుడు బుద్ధి నిండుగా అయిపోయింది. సంతోషము యొక్క పాదరసము ఎంతగా పైకి ఎక్కింది. మొత్తం జ్ఞానమంతా పిల్లలైన మీ వద్ద ఉంది. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి నాలెడ్జ్ లభిస్తోంది. ఆ తర్వాత మనమే వెళ్ళి లక్ష్మీ-నారాయణలుగా అవుతాము. అక్కడ మళ్ళీ ఈ జ్ఞానమేమీ ఉండదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన ఎంతటి గుహ్యమైన విషయాలు. పిల్లలు మెట్ల వరుస చిత్రాన్ని మంచి రీతిలో అర్థం చేసుకున్నారు కదా. ఈ చక్రము 84 జన్మలది. ఇప్పుడు మనుష్యులకు కూడా స్పష్టముగా అర్థం చేయించాలి. దీనిని ఇప్పుడు స్వర్గము లేక పావన ప్రపంచమని అనరు. సత్యయుగము వేరు, కలియుగము వేరు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది సులువుగా అర్థం చేయించవచ్చు. వివరణ మంచిగా అనిపిస్తుంది. కానీ పురుషార్థము చేసి స్మృతియాత్రలో ఉండాలి, ఇది చాలామంది చేయలేకపోతారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఈ పాత దేహాన్ని మరియు పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచి తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇప్పుడు మా సుఖమయమైన రోజులు ఇక వచ్చేసాయని సదా ఇదే సంతోషములో ఉండాలి. 2. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి ఏ నాలెడ్జ్ అయితే లభించిందో, దానిని స్మరణ చేస్తూ బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడూ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడకూడదు. వరదానము:-సదా ఏకరస స్థితి అనే సింహాసనముపై విరాజమానమై ఉండే బాప్ దాదా హృదయ సింహాసనాధికారి భవ అన్నింటికంటే శ్రేష్ఠమైన సింహాసనము బాప్ దాదా హృదయ సింహాసనాధికారిగా అవ్వడము. కానీ ఈ సింహాసనముపై కూర్చునేందుకు అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితి యొక్క సింహాసనము కావాలి. ఒకవేళ ఈ స్థితి అనే సింహాసనముపై స్థితులవ్వలేకపోతే బాప్ దాదా యొక్క హృదయము రూపీ సింహాసనముపై స్థితులవ్వలేరు. దీని కోసం తమ భృకుటి సింహాసనముపై అకాలమూర్తులుగా అయి స్థితులవ్వండి, ఈ సింహాసనముపై మాటిమాటికి అలజడి చెందకూడదు, అప్పుడే బాప్ దాదా హృదయ సింహాసనముపై విరాజమానమవ్వగలరు. స్లోగన్:-శుభ చింతన ద్వారా నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేయండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ బ్రహ్మాబాబా తన పిల్లలు ప్రతి ఒక్కరి ముఖములో, ఒకటేమో - సదా ఆత్మికతకు చెందిన చిరునవ్వును చూడాలనుకుంటారు మరియు రెండవది - నోటి నుండి సదా మధురమైన మాటలను వినాలనుకుంటారు. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు, ముఖముపై ఆత్మికత ఉండాలి, నోటిలో మధురత ఉండాలి మరియు మనసు-బుద్ధిలో సదా శుభ భావన, దయా హృదయము కల భావన, దాతాతనపు భావన ఉండాలి. ప్రతి అడుగులోనూ ఫాలో ఫాదర్ చేయాలి, ఇదే పాలనకు రిటర్న్గా ఇవ్వండి. "
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా 20-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈశ్వరీయ ముక్తి దళము, మీరు అందరికీ సద్గతిని ఇవ్వాలి, అందరి ప్రీతిని ఒక్క తండ్రితో జోడింపజేయాలి’’ ప్రశ్న:-మనుష్యులు తమ బుద్ధిని ఏ విషయములో ఉపయోగిస్తారు మరియు మీరు మీ బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలి? జవాబు:-మనుష్యులు తమ బుద్ధిని ఆకాశము మరియు సృష్టి యొక్క అంతాన్ని పొందడానికి ఉపయోగిస్తున్నారు కానీ దీని వలన లాభమేమీ లేదు. వాటి అంతమైతే లభించదు. పిల్లలైన మీరు మీ బుద్ధిని పూజ్యులుగా అవ్వడానికి ఉపయోగిస్తారు. వాళ్ళను ప్రపంచము పూజించదు. పిల్లలైన మీరు పూజ్య దేవతలుగా అవుతారు. పాట:-మిమ్మల్ని పొంది మేము... ▶ ఓంశాంతి. ఇది జ్ఞాన మార్గమని, అది భక్తి మార్గమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమని తలెత్తుతుందంటే, భక్తి మార్గము మంచిదా లేక జ్ఞాన మార్గము మంచిదా? ఇవి రెండు విషయాలైనట్లు కదా. జ్ఞానముతో సద్గతి కలుగుతుందని అంటారు. తప్పకుండా భక్తి మరియు జ్ఞానము, రెండు వేర్వేరు అని అంటారు. భక్తి చేయడము వలన జ్ఞానము లభిస్తుందని, అప్పుడే సద్గతి కలుగుతుందని మనుష్యులు భావిస్తారు. భక్తి మధ్యలోకి జ్ఞానము రాలేదు. భక్తి అందరి కోసముంది, జ్ఞానము కూడా అందరి కోసముంది. ఇది కలియుగము యొక్క అంతిమ సమయము, కావున తప్పకుండా అందరి దుర్గతి జరుగుతుంది, అందుకే పిలుస్తారు కూడా మరియు ఇలా పాడుతారు కూడా - ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి ఇప్పుడు మీతోనే సాంగత్యాన్ని జోడిస్తాము అని. ఇప్పుడు ఇంతకీ వారెవరు, ఎవరితో జోడిస్తాము అనేది అర్థం చేసుకోరు. చాలా వరకు బుద్ధి శ్రీకృష్ణుని వైపుకు వెళ్తుంది, మేము సత్యమైన ప్రీతిని నీతోనే జోడిస్తామని అంటారు. కేవలం శ్రీకృష్ణుడితోనే ప్రీతిని జోడిస్తున్నప్పుడు, ఇక గురువులు మొదలైనవారి అవసరమే లేదు, శ్రీకృష్ణుడినే స్మృతి చేయాలి. శ్రీకృష్ణుడి చిత్రమైతే అందరి వద్ద ఉంది. శ్రీకృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు, ఇక ఇతరులెవ్వరి వద్దకు వెళ్ళవలసిన అవసరమే లేదు. ఏ విధముగా మీరా ఒక్కరితోనే ప్రీతిని జోడించారు కదా, పనులు చేసుకుంటూ కూడా శ్రీకృష్ణుడినే తలచుకుంటూ ఉండేవారు. ఇంటిలో ఉంటూ, అన్నీ చేసుకుంటూ, తినడం-త్రాగడము అన్నీ చేసేవారు, కానీ సత్యమైన ప్రీతిని ఒక్క శ్రీకృష్ణునితోనే జోడించారు. ఆమె ఒక ప్రేయసి మరియు శ్రీకృష్ణుడు ఒక ప్రియుడు అన్నట్లు అయిపోయారు. శ్రీకృష్ణుడిని స్మృతి చేయడము వలన ఫలం కూడా లభిస్తుంది. శ్రీకృష్ణుని గురించైతే అందరికీ తెలుసు. మేము సత్యమైన ప్రీతిని నీతోనే జోడించాము, ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలేశామని పాడుతారు కూడా. ఇప్పుడు ఉన్నతోన్నతమైనవారు, సత్యమైనవారైతే పరమపితయే. అందరికీ వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారి గురించి ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ శివ అని అంటారు కానీ వారు ఎప్పుడు వస్తారు అనేది తెలియదు. శివజయంతి జరుగుతుంది అంటే వారు తప్పకుండా వస్తూ ఉండి ఉండవచ్చు. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వచ్చి ఏమి చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. వారు సర్వులకు సద్గతినిస్తారని మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. కానీ అది ఎలా ఇస్తారు, సద్గతికి అర్థమేమిటి అన్నది ఏమీ తెలియదు! శివబాబా అయితే తప్పకుండా స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చి ఉంటారు కదా. పిల్లలైన మీరు ఆ ధర్మానికి చెందినవారిగా ఉండేవారు కానీ మీకు ఈ విషయము తెలియదు, మీరు మర్చిపోయారు, అటువంటప్పుడు ఇతరులు ఎలా తెలుసుకోగలరు. ఇప్పుడు శివబాబా ద్వారా మీరు తెలుసుకున్నారు మరియు ఇతరులకు తెలియజేస్తారు. మీరు ఈశ్వరీయ ముక్తి దళము. ముక్తి దళము అనండి లేక సద్గతినిచ్చే దళము అనండి, రెండూ ఒకటే. ఇప్పుడు పిల్లలైన మీపై బాధ్యత ఉంది. మీరు చిత్రాలపై కూడా అర్థం చేయించవచ్చు. భాషలు అనేకమున్నాయి. ముఖ్యమైన భాషలలో చిత్రాలను తయారుచేయవలసి ఉంటుంది. భాషల విషయములో కూడా చాలా జంజాటము ఉంటుంది, అందుకే ప్రదర్శనీలు కూడా తయారుచేయవలసి ఉంటుంది. చిత్రాలపై అర్థం చేయించడము చాలా సులువుగా ఉంటుంది. సృష్టి చక్రము చిత్రములో కూడా పూర్తి జ్ఞానము ఉంది, మెట్ల వరుస చిత్రము కేవలం భారతవాసుల కోసం మాత్రమే ఉంది. ఇందులో ఇతర ధర్మాలేవీ లేనే లేవు. భారత్ తమోప్రధానముగా అయినప్పుడు ఇతరులెవ్వరూ అలా అవ్వరని కాదు, తమోప్రధానముగానైతే అందరూ అవుతారు. కావున వారి కోసం కూడా ఏదైనా ఉండాలి. బుద్ధిలో సేవకు సంబంధించిన ఇలాంటి ఆలోచనలు రావాలి. ఇద్దరు తండ్రుల రహస్యాన్ని కూడా అర్థం చేయించాలి. వారసత్వము రచయిత నుండి లభిస్తుంది. లక్ష్మీ-నారాయణులు భారత్ యొక్క మొట్టమొదటి మహారాజా-మహారాణులుగా ఉండేవారని అనగా భగవాన్-భగవతీలుగా ఉండేవారని ఇది కూడా అన్ని ధర్మాల వారికి తెలుసు. అచ్ఛా, వారికి ఈ స్వర్గ రాజ్యము ఎలా లభించింది. తప్పకుండా భగవంతుని ద్వారా లభించింది. ఎలా లభించింది, ఎప్పుడు లభించింది అనేది ఎవ్వరికీ తెలియదు. గీతలో శ్రీకృష్ణుని పేరును వ్రాసారు, ప్రళయాన్ని చూపించారు, కానీ ఫలితమేమీ లేదు. ఇది పిల్లలైన మీరు అర్థం చేయించాలి. చిత్రాలైతే అన్ని చోట్ల ఉన్నాయి. లక్ష్మీ-నారాయణుల చిత్రాలు కూడా ఉంటాయి. కాకపోతే డ్రెస్, ముఖ కవళికలు మొదలైనవి వేర్వేరుగా ఉంటాయి. ఎవరికి ఎలా తోస్తే అలా తయారుచేశారు. ఈ రాధా-కృష్ణులే, శ్రీనాథుడు-శ్రీనాథిని కదా. శ్రీరాధ, శ్రీకృష్ణులైతే కిరీటధారులు కారు, అలాగని నల్లనివారూ కారు. రాజధాని లక్ష్మీ-నారాయణులది, అంతేకానీ రాధా-కృష్ణులది కాదు. మందిరాలైతే అనేక రకాలవి నిర్మించారు, కానీ పేరు అయితే కేవలం లక్ష్మీ-నారాయణ అన్నదే పెడతారు కదా. లక్ష్మీ-నారాయణుల వంశావళి అని అంటారు. సీతా-రాముల వంశావళి, లక్ష్మీ-నారాయణుల వంశావళి ఉంటాయి, అంతేకానీ రాధా-కృష్ణుల వంశావళి ఉండదు. ఈ విషయాలు మనుష్యుల ఆలోచనలలో లేనే లేవు. పిల్లలైన మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు చాలా ఉత్సాహముతో ఉంటారు. కొంతమంది - మాకు అర్థమవుతుంది అని అంటారు కానీ నెమ్మది-నెమ్మదిగా నోరు విప్పి జ్ఞానము చెప్పగలిగేలా యుక్తులను కూడా రచించవలసి ఉంటుంది. వేద-శాస్త్రాలను అధ్యయనము చేయడం వలన, యజ్ఞ-తపాదులు మొదలైనవి చేయడం వలన, తీర్థ యాత్రలు మొదలైనవి చేయడం వలన పరమాత్మను పొందగలమని చాలామంది భావిస్తారు కానీ భగవంతుడు అంటున్నారు, ఇవన్నీ నా నుండి దూరము చేసే మార్గాలు. డ్రామాలో అందరూ దుర్గతిని పొందవలసిందే, అందుకే ఇటువంటి విషయాలను చెప్తారు. ఇంతకుముందు మనము కూడా ఇలా అనేవారము - భగవంతుడు ఒక పిలక వంటివారు, ఎవరు ఎక్కడ నుండి వెళ్ళినా వారిని చేరుకోవచ్చు అని. అందుకే మనుష్యులు అనేక రకాల మార్గాలను ఎన్నుకున్నారు. భక్తి మార్గములోని మార్గాలను పట్టుకుని-పట్టుకుని అలసిపోయినప్పుడు, మళ్ళీ భగవంతుడినే పిలుస్తారు - ఓ పతితపావనా, మీరు వచ్చి పావనముగా అయ్యే మార్గాన్ని తెలియజేయండి, మీరు లేకుండా పావనముగా అవ్వలేము, అలసిపోయాము అని అంటారు. భక్తి రోజురోజుకు పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. ఇప్పుడైతే మేళాలు మొదలైనవాటి వద్దకు ఎన్ని లక్షలమంది వెళ్తారు, అక్కడ ఎంత మురికి ఉంటుంది. ఇప్పుడైతే ఇది అంతిమము. ప్రపంచము పరివర్తనవ్వాలి. వాస్తవానికి ప్రపంచము ఒక్కటే ఉంటుంది, దానిని రెండు భాగాలుగా చూపించారు. మనుష్యులు స్వర్గము, నరకము వేర్వేరు ప్రపంచాలని భావిస్తారు, కానీ ఇవి సగం-సగము ఉంటాయి. పైన సత్యయుగము, ఆ తర్వాత త్రేతా, ద్వాపర, కలియుగాలు. కలియుగములో తమోప్రధానముగా అవ్వాల్సిందే. సృష్టి పాతదిగా అవుతుంది. ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు, తికమకలో ఉన్నారు. కొంతమంది శ్రీకృష్ణుడిని భగవంతుడని, మరికొంతమంది శ్రీరాముడిని భగవంతుడని అంటారు. ఈ రోజుల్లోనైతే మనుష్యులు తమను తామే భగవంతుడని చెప్పుకుంటారు. మేము ఈశ్వరుని అవతారమని అంటారు. అంటే దేవతల కన్నా కూడా మనుష్యులు తెలివైనవారు అయిపోయినట్లు. ఎంతైనా దేవతలను దేవతలనే అంటారు, కానీ ఇక్కడ మనుష్యులను భగవంతుడని అంటారు. ఇది భక్తి మార్గము. దేవతలైతే స్వర్గములో ఉండేవారు. ఇప్పుడు ఇనుపయుగమైన కలియుగములో మనుష్యులు భగవంతునిగా ఎలా అవ్వగలరు. తండ్రి అంటారు - నేను రావడమే సంగమయుగములో వస్తాను, ఈ సమయములో నేను వచ్చి ప్రపంచాన్ని ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. కలియుగము సత్యయుగముగా అవుతుంది, మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది నిరాకారీ ప్రపంచము. ఇది సాకారీ ప్రపంచము. అర్థం చేయించేందుకు నిరాకారీ వృక్షాన్ని కూడా పెద్దదిగా తయారుచేయవలసి ఉంటుంది. ఆకాశము ఎంత పెద్దదో, బ్రహ్మమహాతత్వము కూడా అంత పెద్దదిగా ఉంటుంది, రెండింటి అంతాన్ని పొందలేరు. అక్కడికి విమానాలు మొదలైనవాటిలో వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తారు కానీ దాని అంతాన్ని పొందలేరు. సముద్రమే సముద్రము... ఆకాశమే ఆకాశము ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు. చాలానే ప్రయత్నిస్తారు కానీ ఈ విషయాలన్నింటి వలన లాభమేముంది. మేము మా బుద్ధిని ఉపయోగిస్తున్నామని భావిస్తారు. అయితే ఇది మనుష్యుల బుద్ధి, సైన్స్ యొక్క గర్వం కూడా మనుష్యులలో ఉంది. ఒకవేళ ఎవరైనా వాటి అంతాన్ని కనుగొన్నా సరే, వారినేమీ ప్రపంచమంతా పూజించదు. దేవతలకైతే పూజ జరుగుతుంది. పిల్లలైన మిమ్మల్ని తండ్రి ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. అందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తారు. మనము మూలవతనము నుండి వస్తామని అందరికీ తెలుసు కానీ ఏ విధముగా మీరు అర్థం చేసుకున్నారో, ప్రపంచానికి ఆ విధముగా తెలియదు. మూలవతనము అంటే ఏమిటి, అక్కడ ఆత్మలు ఎలా ఉంటాయి, మళ్ళీ నంబరువారుగా ఎలా వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. బ్రహ్మమహాతత్వములో నిరాకారీ వృక్షము ఉంటుంది. సత్యయుగములో కొద్దిమంది మనుష్యులే ఉంటారని, మిగిలిన ఆత్మలన్నీ మూలవతనములో ఉంటాయని వారు అర్థం చేసుకోరు. ఈ సాకార వతనము ఎలా ఉంటుందో, మూలవతనము కూడా అలాగే ఉంటుంది. వతనము ఎప్పుడూ ఖాళీ అవ్వదు. ఈ సాకార వతనము ఖాళీ అవ్వదు, ఆ మూలవతనము ఖాళీ అవ్వదు. అంతిమము వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారు. కొంతమంది ఈ వతనములో ఉంటారు, వతనము పూర్తిగా ఖాళీ అయిపోతే ఇక ప్రళయము జరిగినట్లు. కానీ ప్రళయము జరగదు. ఇది అవినాశీ ఖండము కదా. ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. మేము ఎవరో ఒకరి కళ్యాణము చేయాలి అని రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. మీకు వారితో ప్రీతి జోడింపబడింది కావున మీరు వారి పరిచయాన్ని ఇవ్వాలి కదా. వారు తండ్రి, వారి నుండి వారసత్వము లభిస్తుంది. ఎలా లభిస్తుంది అనేది మేము తెలియజేయగలము అని చెప్పండి. ఇలా చెప్పగలిగేవారు కూడా నంబరువారుగా ఉన్నారు. కొంతమందైతే చాలా మంచి రీతిలో భాషణ చేస్తారు, కొంతమంది చేయలేరు కనుక నేర్చుకోవలసి ఉంటుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ కళ్యాణాన్ని చేసుకోవాలి. మార్గము లభించినప్పుడు మరి ఇతరుల కళ్యాణము చేయాలి. ఇతరులకు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని ఇప్పించాలని, ఆత్మిక సేవ చేయాలని మనసుకు అనిపిస్తుంది. అందరూ ఇతరుల సేవ చేస్తారు. తండ్రి వచ్చి ఆత్మిక సేవను నేర్పిస్తారు, ఇతరులెవ్వరికీ ఆత్మిక సేవ గురించి తెలియదు. ఆత్మిక తండ్రియే ఆత్మల సేవను చేస్తారు. దైహిక సేవనైతే జన్మజన్మలుగా చాలానే చేశారు, ఇప్పుడు అంతిమ జన్మలో తండ్రి నేర్పించిన ఆత్మిక సేవను చేయాలి. ఇందులోనే కళ్యాణముంది, ఇంక దేనిలోనూ లాభము లేదు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి, తోడును నిర్వర్తించాలి. వారికి కూడా ఇదే అర్థం చేయించి కళ్యాణము చేయాలి. ప్రీతి ఉన్నట్లయితే ఎంతోకొంత వింటారు. కొందమందైతే, మేము కూడా సన్యాసము తీసుకోవలసి వస్తుందేమోనని భయపడతారు. ఈ రోజులలోనైతే సన్యాసులు చాలామంది ఉన్నారు కదా. కాషాయ వస్త్రాలను ధరించి రెండు మాటలు వినిపిస్తే చాలు, ఎక్కడో ఒక చోట నుండి భోజనమైతే లభించేస్తుంది. ఏ దుకాణానికి వెళ్ళినా, రెండు పూరీలైతే ఇస్తారు. తర్వాత ఇంకొకరి వద్దకు వెళ్తారు, ఇలా కడుపుకు భోజనము లభిస్తుంది. భిక్షము అడిగేవారు కూడా అనేక రకాలవారు ఉంటారు. ఈ తండ్రి నుండైతే ఒకే విధమైన వారసత్వము లభిస్తుంది. అనంతమైన రాజ్యాధికారము లభిస్తుంది, సదా నిరోగిగా అవుతారు. షావుకారులు కష్టం మీద మేలుకుంటారు. పేదవారి కళ్యాణము కూడా చేయాలి. బాబా ప్రదర్శనీలు ఎన్నో తయారుచేయిస్తున్నారు ఎందుకంటే గ్రామాలు చాలా ఉన్నాయి కదా. మినిస్టర్లు మొదలైనవారు ఈ జ్ఞానము బాగుందని భావించినట్లయితే, అందరూ వినడము ప్రారంభిస్తారు. మున్ముందు మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది, అప్పుడు చాలామంది వస్తారు. తుప్పు వదలడానికి సమయము పడుతుంది. ఎవరైనా రాత్రింబవళ్ళు ఇందులోనే నిమగ్నమైనట్లయితే బహుశా వదిలిపోవచ్చు. ఆత్మ పవిత్రముగా అయిపోతే ఇక ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించాలి. ముఖ్యమైన విషయమేమిటంటే, ఇదంతా భారత్ కు సంబంధించినది. భారత్ యొక్క ఉన్నతి జరిగినప్పుడు అందరి ఉన్నతి జరుగుతుంది. ప్రొజెక్టర్లతో కన్నా ప్రదర్శనీలతో ఎక్కువ సేవ జరగగలదు. నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. రోజురోజుకు మీ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది అని ఇలా కూడా వ్రాయాలి. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. బాబా సూచనలు ఇస్తారు కానీ పిల్లలు చాలా విషయాలను మర్చిపోతారు. ఏమి జరిగినా సరే, నేటికి 5 వేల సంత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది అని అంటారు. వాస్తవానికి ఇది చాలా స్పష్టమైన విషయము, కానీ ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా. వార్తాపత్రికలలో వేయించగలిగితే, ఎంతోకొంత అర్థం చేసుకుంటారు. జ్ఞాన మార్గములో చాలా ఫస్ట్ క్లాస్ అవస్థ కావాలి. ఇటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ హర్షితముగా కూడా ఉండవలసి ఉంటుంది. ఇది అలవాటైపోతే అవస్థ చాలా సంతోషభరితముగా ఉంటుంది. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఇతరులందరి నుండి బుద్ధి యొక్క ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి మరియు అందరి ప్రీతిని ఒక్క తండ్రితో జోడింపజేసే సేవను చేయాలి. 2. సత్యాతి-సత్యమైన ఆత్మిక సేవాధారులుగా అవ్వాలి. స్వ కళ్యాణము కూడా చేసుకోవాలి మరియు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. అవస్థను చాలా సంతోషభరితముగా తయారుచేసుకోవాలి. వరదానము:-తమ శ్రేష్ఠ వ్యవహారము ద్వారా సర్వాత్మలకు సుఖాన్ని ఇచ్చే మహాన్ ఆత్మా భవ ఎవరైతే మహాన్ ఆత్మలుగా ఉంటారో, వారి ప్రతి వ్యవహారము ద్వారా సర్వాత్మలకు సుఖము యొక్క దానము లభిస్తుంది. వారు సుఖాన్ని ఇస్తారు మరియు సుఖాన్ని తీసుకుంటారు. కావున చెక్ చేసుకోండి - మహాన్ ఆత్మ యొక్క లెక్కలో మొత్తము రోజంతటిలో అందరికీ సుఖాన్ని ఇచ్చానా, పుణ్య కర్మలు చేసానా. పుణ్యము అనగా ఎవరికైనా ఎటువంటి వస్తువును ఇవ్వాలంటే, దాని ద్వారా ఆ ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభించాలి. కావున చెక్ చేసుకోండి - ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభిస్తున్నాయా! ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా లేక ఎవరి నుండి దుఃఖాన్ని తీసుకోలేదు కదా! అప్పుడే మహాన్ ఆత్మ అని పిలవబడతారు. స్లోగన్:-చేసిన తర్వాత ఆలోచించడమే పశ్చాత్తాపము యొక్క రూపము.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ సంస్కారాలు మరియు నేచర్ అయితే ప్రతి ఒక్కరివి ఎవరివి వారికి ఉంటాయి, కానీ సర్వులకు స్నేహీలుగా మరియు అన్ని విషయాలలో, సంబంధాలలో సఫలత, మనసులో విజయము మరియు వాణిలో మధురత అనేవి ఈజీ నేచర్ ఉన్నప్పుడే వస్తాయి. ఈజీ నేచర్ అనగా ఎటువంటి సమయమో, ఎటువంటి వ్యక్తులో, ఎటువంటి పరిస్థితులో, వాటిని గమనిస్తూ స్వయాన్ని ఈజీగా చేసుకోవాలి. ఈజీ అనగా కలుపుగోలుగా ఉండటము, మౌల్డ్ అయ్యేవారు. ఈజీ అంటే నిర్లక్ష్యులుగా ఉండటము కాదు. "
https://youtube.com/watch?v=DgR2e6jp5Qw&si=FVv4YXiqcr6VlMtP #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🇮🇳 మన దేశ సంస్కృతి
youtube-preview
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 18-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి ద్వారా సమ్ముఖముగా చదువుకుంటున్నారు, మీరు సత్యయుగీ రాజ్యాధికారానికి యోగ్యులుగా అయ్యేందుకు పావనముగా తప్పకుండా అవ్వాలి’’ ప్రశ్న:-తండ్రి యొక్క ఏ కర్తవ్యము గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు? జవాబు:-మన తండ్రి, తండ్రి కూడా, టీచరు మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయడానికి, ఒక్క ఆది సనాతన ధర్మాన్ని స్థాపన చేయడానికి తండ్రి కల్పము యొక్క సంగమయుగములో వస్తారు. తండ్రి ఇప్పుడు పిల్లలైన మనల్ని, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు. ఈ కర్తవ్యము గురించి పిల్లలైన మనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. పాట:-భోళానాథుని కన్నా అతీతమైనవారు... ▶ ఓంశాంతి. ఓం శాంతి యొక్క అర్థాన్ని పిల్లలకు అనేక సార్లు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. ఇది నా ఆత్మ అని శరీరము కూడా అనవచ్చు. శివబాబా ఏ విధముగా మీరు నా వారు అని అంటారో మరియు పిల్లలు ఏ విధముగా బాబా, మీరు మా వారు అని అంటారో, అలా ఆత్మ కూడా, ఇది నా శరీరము అని అంటుంది మరియు శరీరము, ఇది నా ఆత్మ అని అంటుంది. నేను అవినాశీ అని ఇప్పుడు ఆత్మకు తెలుసు. ఆత్మ లేకుండా శరీరము ఏమీ చేయలేదు. ఆత్మకు శరీరమైతే ఉంటుంది, నా ఆత్మకు కష్టము కలిగించవద్దని అంటుంది, నా ఆత్మ పాపాత్మ అని లేదా నా ఆత్మ పుణ్యాత్మ అని ఆత్మ అంటుంది. మీ ఆత్మ సత్యయుగములో పుణ్యాత్మగా ఉండేదని మీకు తెలుసు. నేను సత్యయుగములో సతోప్రధానముగా అనగా సత్యమైన బంగారముగా ఉండేదానిని అని స్వయంగా ఆత్మ కూడా అంటుంది. నిజంగా ఆత్మ బంగారమని కాదు, ఒక ఉదాహరణగా ఇలా చెప్పడము జరుగుతుంది. నా ఆత్మ పవిత్రcgగా ఉండేది, బంగారుయుగానికి చెందినదిగా ఉండేది. ఇప్పుడు అపవిత్రముగా ఉన్నాను అని అంటారు. ప్రపంచములోని వారికి ఈ విషయము తెలియదు. మనకైతే శ్రీమతము లభిస్తుంది. మన ఆత్మ సతోప్రధానముగా ఉండేదని, ఇప్పుడు తమోప్రధానముగా అయ్యిందని మీకు ఇప్పుడు తెలుసు. ప్రతి వస్తువు ఇలా అవుతుంది. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము... ఇలా ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. ప్రపంచము కూడా మొదట బంగారుయుగముగా, సతోప్రధానముగా ఉండేది, తర్వాత తమోప్రధానముగా, ఇనుపయుగముగా అయ్యింది, కావుననే దుఃఖితులుగా ఉన్నారు. సతోప్రధానము అనగా తీర్చిదిద్దబడినది అని అర్థం, తమోప్రధానము అనగా పాడైపోయినది అని అర్థం. పాటలో కూడా, పాడైనదానిని బాగుచేసేవారు... అని అంటారు. పాత ప్రపంచము పాడైపోయింది ఎందుకంటే ఇది రావణ రాజ్యము మరియు అందరూ పతితముగా ఉన్నారు. సత్యయుగములో అందరూ పావనముగా ఉండేవారు, దానిని కొత్త నిర్వికారీ ప్రపంచము అని అంటారు. ఇది పాత వికారీ ప్రపంచము. ఇప్పుడు కలియుగము ఇనుపయుగముగా ఉంది. ఈ విషయాలన్నింటినీ ఏ స్కూలులో గానీ, కాలేజిలో గానీ చదివించడము జరగదు. భగవంతుడు వచ్చి చదివిస్తారు మరియు రాజయోగాన్ని నేర్పిస్తారు. గీతలో భగవానువాచ - శ్రీమద్భగవద్గీత అని వ్రాయబడి ఉంది. శ్రీమత్ అనగా శ్రేష్ఠమైన మతము. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు, ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. వారి ఏక్యురేట్ పేరు శివ. రుద్ర జయంతి లేక రుద్ర రాత్రి అని ఎప్పుడూ విని ఉండరు. శివరాత్రి అని అంటారు. శివుడైతే నిరాకారుడు, నిరాకారుని రాత్రిని లేక జయంతిని ఎలా జరుపుకోవాలి. శ్రీకృష్ణ జయంతి అనడము బాగానే ఉంది. ఫలానావారి బిడ్డ అని, అతని తిథి-తారీఖులను చూపిస్తారు. శివుడు ఎప్పుడు జన్మించారు అనేదైతే ఎవరికీ తెలియదు, కానీ తెలుసుకోవాలి కదా. శ్రీకృష్ణుడు సత్యయుగము ఆదిలో ఎలా జన్మ తీసుకున్నారు అనేది ఇప్పుడు అర్థమయ్యింది. అతను జన్మించి 5 వేల సంవత్సరాలు అయ్యిందని మీరు అంటారు. వారు కూడా, క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ ప్యారడైజ్ గా ఉండేదని అంటారు. ఇస్లాముల కన్నా ముందు చంద్రవంశీయులు, వారి కన్నా ముందు సూర్యవంశీయులు ఉండేవారు. శాస్త్రాలలో సత్యయుగానికి లక్షల సంవత్సరాలని చూపించారు. గీత ముఖ్యమైనది. గీత ద్వారానే దేవీ-దేవతా ధర్మము స్థాపన అయ్యింది. అది సత్య, త్రేతాయుగాల వరకు కొనసాగింది అనగా గీతా శాస్త్రము ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపనను పరమపిత పరమాత్మ చేసారు. ఆ తర్వాత అర్ధకల్పము వరకు ఏ శాస్త్రమూ లేదు, ఏ ధర్మ స్థాపకుడూ లేరు. తండ్రి వచ్చి బ్రాహ్మణులను దేవతలుగా, క్షత్రియులుగా చేసారు అనగా తండ్రి మూడు ధర్మాలను స్థాపన చేస్తారు. ఇది లీప్ ధర్మము, దీని ఆయువు తక్కువగా ఉంటుంది. సర్వశాస్త్రమయి శిరోమణి గీతను భగవంతుడు వినిపించారు. తండ్రి పునర్జన్మలలోకి రారు. వారికి జన్మ ఉంటుంది కానీ తండ్రి అంటారు - నేను గర్భములోకి రాను, నా పాలన జరగదు. సత్యయుగములో జన్మ తీసుకునే పిల్లలు కూడా గర్భ మహళ్ళలో ఉంటారు. రావణ రాజ్యములో గర్భ జైలులోకి రావలసి ఉంటుంది. పాపాలను జైలులో అనుభవిస్తారు. గర్భములో ఉన్నప్పుడు, నేను ఇక పాపము చేయను అని ప్రతిజ్ఞ చేస్తారు కానీ ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. గర్భము నుండి బయటకు రాగానే, మళ్ళీ పాపము చేయడము మొదలుపెడతారు. అక్కడి ప్రతిజ్ఞ అక్కడే ఉండిపోతుంది... ఇక్కడ కూడా చాలా ప్రతిజ్ఞలను చేస్తారు - మేము పాపాలు చేయమని, పరస్పరము కామ ఖడ్గాన్ని ఉపయోగించమని అంటారు ఎందుకంటే ఈ వికారాలు ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తాయి. సత్యయుగములో విషము ఉండదు కావున మనుష్యులు ఆదిమధ్యాంతాలు అనగా 21 జన్మలు దుఃఖాన్ని అనుభవించరు ఎందుకంటే అది రామ రాజ్యము. దాని స్థాపనను ఇప్పుడు తండ్రి మళ్ళీ చేస్తున్నారు. సంగమములోనే స్థాపన జరుగుతుంది కదా. ఎవరైతే ధర్మ స్థాపన చేయడానికి వస్తారో, వారు ఏ పాపము చేయకూడదు. అర్ధ సమయము పుణ్యాత్ములుగా ఉంటారు, మళ్ళీ అర్ధ సమయము తర్వాత పాపాత్ములుగా అవుతారు. మీరు సత్య, త్రేతాయుగాలలో పుణ్యాత్మగా ఉంటారు, తర్వాత పాపాత్మగా అవుతారు. సతోప్రధాన ఆత్మ పై నుండి వచ్చినప్పుడు, అది శిక్షలు అనుభవించదు. క్రైస్టు ఆత్మ ధర్మ స్థాపన చేయడానికి వచ్చారు, వారికి ఎటువంటి శిక్ష లభించదు. క్రైస్టును శిలువ పైకి ఎక్కించారని అంటారు కానీ ఆ ఆత్మ ఎటువంటి వికర్మలను చేయలేదు. ఆ ఆత్మ ఎవరి శరీరములోకైతే ప్రవేశిస్తుందో, వారికి దుఃఖము కలుగుతుంది, వారు సహనము చేస్తారు. ఎలాగైతే వీరిలోకి బాబా ప్రవేశిస్తారో, అక్కడ కూడా అలా జరుగుతుంది. శివబాబా అయితే ఎలాగూ సతోప్రధానమైనవారే. ఏదైనా దుఃఖము లేక కష్టము వీరి ఆత్మకు కలుగుతుంది, శివబాబాకు కలగదు. వారు సదా సుఖ, శాంతులతో ఉంటారు. వారు సదా సతోప్రధానులు. కానీ రావడమైతే ఈ పాత శరీరములోకే వస్తారు కదా. అదే విధముగా క్రైస్టు ఆత్మ ఎవరిలోకైతే ప్రవేశించారో, ఆ శరీరానికి దుఃఖము కలగవచ్చు. క్రైస్టు ఆత్మ దుఃఖాన్ని అనుభవించదు ఎందుకంటే ఇంకా సతో, రజో, తమోలలోకి రావాల్సి ఉంది. కొత్త-కొత్త ఆత్మలు వస్తుంటారు కూడా కదా. వారు ముందు తప్పకుండా సుఖాన్ని అనుభవించవలసి ఉంటుంది, వారు దుఃఖాన్ని అనుభవించలేరు. నియమము అలా లేదు. వీరిలో బాబా కూర్చుని ఉన్నారు, ఏ కష్టమైనా వీరికి (దాదాకు) కలుగుతుంది, అంతేకానీ శివబాబాకు కాదు. కానీ ఈ విషయాలు మీకు తెలుసు, ఇంకెవరికీ తెలియవు. ఈ రహస్యాలన్నింటినీ ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ సహజ రాజయోగము ద్వారానే స్థాపన జరిగింది, తర్వాత భక్తి మార్గములో ఇవే విషయాలు గాయనము చేయబడతాయి. ఈ సంగమములో ఏదైతే జరుగుతుందో, అది గాయనము చేయబడుతుంది. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు శివబాబా పూజ జరుగుతుంది. మొట్టమొదటగా భక్తి ఎవరు చేస్తారు. ఆ లక్ష్మీ-నారాయణులు ఎప్పుడైతే రాజ్యము చేస్తారో, అప్పుడు పూజ్యులుగా ఉండేవారు, ఆ తర్వాత వామ మార్గములోకి వచ్చేస్తారు, అప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నిరాకార పరమపిత పరమాత్మ వీరి ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది మొట్టమొదట పిల్లలైన మీ బుద్ధిలో రావాలి. ఈ విధముగా అర్థం చేయించేటువంటి స్థానము, మొత్తము ప్రపంచములో ఇంకెక్కడా ఉండదు. తండ్రియే వచ్చి భారత్ కు మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. త్రిమూర్తి చిత్రము కింద ఇలా వ్రాయబడి ఉంది - దైవీ ప్రపంచపు స్వరాజ్యము మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము. శివబాబా వచ్చి పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు, యోగ్యులుగా తయారుచేస్తున్నారు. బాబా మనల్ని యోగ్యులుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. మనము పతితులుగా ఉండేవారము కదా, పావనముగా అయిన తర్వాత ఇక ఈ శరీరము ఉండదు. రావణుడి ద్వారా మనము పతితులుగా అయ్యాము, మళ్ళీ పరమపిత పరమాత్మ పావనముగా తయారుచేసి పావన ప్రపంచానికి యజమానులుగా తయారుచేస్తారు. వారే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. ఈ నిరాకార బాబా మనల్ని చదివిస్తున్నారు. అందరూ కలిసి ఒకేచోట కూర్చుని చదువుకోలేరు కదా. సమ్ముఖముగా మీరు కొద్దిమందే కూర్చున్నారు. ఇక మిగిలిన పిల్లలందరికీ - ఇప్పుడు శివబాబా బ్రహ్మా తనువులో కూర్చుని సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండవచ్చు అని తెలుసు. ఆ మురళి వ్రాతపూర్వకముగా వస్తుంది. ఇతర సత్సంగాలలో ఈ విధముగా భావించరు. ఈ రోజుల్లో టేప్ రికార్డరు కూడా వెలువడింది, అందుకే టేప్ లో నింపి పంపిస్తారు. వారు, ఫలానా పేరు కల గురువు వినిపిస్తున్నారని అంటారు, వారి బుద్ధిలో మనుష్యులే ఉంటారు. ఇక్కడైతే అటువంటి విషయమేమీ లేదు. ఇక్కడ నాలెడ్జ్ ఫుల్ అయిన నిరాకార తండ్రి ఉన్నారు. మనుష్యులను నాలెడ్జ్ ఫుల్ అని అనరు. గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ ఫుల్, పీస్ ఫుల్ (శాంతి స్వరూపుడు), బ్లిస్ ఫుల్ (ఆనంద స్వరూపుడు) అని పాడుతారు, కావున వారు ఇచ్చే వారసత్వము కూడా కావాలి కదా. వారిలో ఏవైతే గుణాలు ఉన్నాయో, అవి పిల్లలకు లభించాలి, ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి. గుణాలను ధారణ చేసి మనము ఈ విధముగా లక్ష్మీ-నారాయణుల వలె అవుతున్నాము. అందరూ అయితే రాజా-రాణులుగా అవ్వరు. రాజు, రాణి, మంత్రి... అని అంటూ ఉంటారు. అక్కడ మంత్రి కూడా ఉండరు. మహారాజు-మహారాణులలో పవర్ ఉంటుంది. ఎప్పుడైతే వికారులుగా అవుతారో, అప్పుడు మంత్రులు మొదలైనవారు ఉంటారు. పూర్వము మినిస్టర్లు మొదలైనవారు కూడా ఉండేవారు కారు. అక్కడైతే ఒక్క రాజు-రాణి యొక్క రాజ్యము నడిచేది. వారికి మంత్రుల యొక్క అవసరము ఏముంది, వారు స్వయమే యజమాని అన్నప్పుడు ఇక ఇంకెవరి నుండో సలహా తీసుకోవలసిన అవసరము లేదు. ఇది చరిత్ర-భౌగోళికము. కానీ మొట్టమొదటగా లేస్తూ-కూర్చుంటూ, మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని, యోగము నేర్పిస్తున్నారని బుద్ధిలోకి రావాలి. స్మృతియాత్రలో ఉండాలి. ఇప్పుడు నాటకము పూర్తవుతోంది, మనము పూర్తిగా పతితులుగా అయిపోయాము, ఎందుకంటే వికారాలలోకి వెళ్ళాము, అందుకే పాపాత్ములని అంటారు. సత్యయుగములో పాపాత్ములు ఉండరు. అక్కడ పుణ్యాత్ములు ఉంటారు. అది ప్రారబ్ధము, దాని కోసం మీరు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. మీది స్మృతి యాత్ర, దీనిని భారత్ యొక్క యోగమని అంటారు కానీ అర్థం తెలియదు. యోగము అనగా స్మృతి, దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి, తర్వాత ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము, దానిని స్వీట్ హోమ్ అని అంటారు. నేను ఆ శాంతిధామ నివాసిని అని ఆత్మ అంటుంది. మనము అక్కడ నుండి అశరీరులుగా వచ్చాము, ఇక్కడ పాత్రను అభినయించేందుకని శరీరాన్ని తీసుకున్నాము. మాయను పంచ వికారాలు అని అంటారని కూడా అర్థం చేయించారు, ఇవి ఐదు భూతాలు. కామము భూతము, క్రోధము భూతము, నంబరువన్ భూతము దేహాభిమానము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - సత్యయుగములో ఈ వికారాలు ఉండవు, దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారు. వికారీ ప్రపంచాన్ని నిర్వికారిగా చేయడము, ఇది కేవలం తండ్రి పనే. వారినే సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు అని అంటారు. ఈ సమయములో అందరూ భ్రష్టాచారము ద్వారానే జన్మ తీసుకుంటారు. సత్యయుగములోనే నిర్వికారీ ప్రపంచము ఉంటుంది. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు వికారుల నుండి నిర్వికారులుగా అవ్వాలి. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. మృత్యులోకమే సమాప్తము అవ్వనున్నది, ఇక దీని తర్వాత వికారీ మనుష్యులు ఉండరు, అందుకే తండ్రితో పవిత్రముగా అవుతామని ప్రతిజ్ఞ చేయాలి. బాబా, మేము మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటామని అంటారు. వారు అసత్యపు ప్రమాణాలు చేస్తారు. ఏ భగవంతుని పేరు మీదైతే ప్రమాణము చేస్తారో, వారి గురించి తెలియనే తెలియదు. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వారి నామ, రూప, దేశ, కాలాలు ఏమిటి అనేది ఏమీ తెలియదు. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు మీకు పరిచయము లభిస్తూ ఉంది. ప్రపంచమంతటిలోనూ ఎవరికీ గాడ్ ఫాదర్ గురించి తెలియదు. తండ్రిని పిలుస్తారు కూడా, పూజలు కూడా చేస్తారు కానీ వారి కర్తవ్యము గురించి తెలియదు. పరమపిత పరమాత్మ మన తండ్రి, టీచరు, సద్గురువు అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ తండ్రి స్వయంగా తమ పరిచయాన్ని ఇస్తున్నారు - నేను మీ తండ్రిని, నేను ఈ శరీరములోకి ప్రవేశించాను. ప్రజాపిత బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరి స్థాపన? బ్రాహ్మణుల స్థాపన. తర్వాత బ్రాహ్మణులైన మీరు చదువుకుని దేవతలుగా అవుతారు. నేను వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తాను. తండ్రి అంటారు - నేను కల్పము యొక్క సంగమయుగములోనే వస్తాను. కల్పము 5 వేల సంవత్సరాలు ఉంటుంది. ఈ సృష్టి చక్రమైతే తిరుగుతూనే ఉంటుంది. నేను పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేయడానికి వస్తాను. నేను పాత ధర్మాలను వినాశనము చేయించి, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. నేను పిల్లలను చదివిస్తాను, మీరు చదువుకుని 21 జన్మల కొరకు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, ప్రజలు అందరూ దేవతలే. ఇకపోతే పురుషార్థమనుసారముగా ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అదే కల్ప-కల్పము నడుస్తుంది. ఇక కల్ప-కల్పము ఇటువంటి పురుషార్థమునే చేస్తామని, ఇటువంటి పదవినే పొందుతామని మీరు అర్థం చేసుకుంటారు. మమ్మల్ని నిరాకార భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారిని స్మృతి చేయడము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకుండా వికర్మలు వినాశనమవ్వవు. తాము ఎన్ని జన్మలు తీసుకుంటారు అనేది కూడా మనుష్యులకు తెలియదు. శాస్త్రాలలో ఎవరో 84 లక్షల జన్మలుంటాయని తప్పుగా వ్రాశారు. 84 జన్మలుంటాయని ఇప్పుడు మీకు తెలుసు. ఇది అంతిమ జన్మ, ఇక తర్వాత మనము స్వర్గములోకి వెళ్ళాలి. ముందు మూలవతనానికి వెళ్ళి, ఆ తర్వాత స్వర్గములోకి వస్తాము. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. పవిత్రముగా అవుతామని తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞ చేసారో, దానిపై పక్కాగా ఉండాలి. కామము, క్రోధము మొదలైన భూతాలపై తప్పకుండా విజయాన్ని పొందాలి. 2. నడుస్తూ-తిరుగుతూ, ప్రతి కార్యాన్ని చేస్తూ, చదివించే తండ్రిని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నాటకము పూర్తవుతోంది, అందుకే ఈ అంతిమ జన్మలో పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. వరదానము:-సర్వ ఖజానాలతో నిండుగా అయి తమ ముఖము ద్వారా సేవ చేసే సత్యమైన సేవాధారీ భవ ఏ పిల్లలైతే సర్వ ఖజానాలతో సదా సంపన్నముగా మరియు నిండుగా ఉంటారో, వారి నయనాలు మరియు మస్తకము ద్వారా ఈశ్వరీయ నషా కనిపిస్తుంది. వారి ముఖమే సేవ చేస్తుంది. ఎవరి వద్దనైనా ఎక్కువగా జమ అయి ఉన్నా లేక తక్కువగా జమ అయి ఉన్నా, అది కూడా వారి ముఖము ద్వారా కనిపిస్తుంది. ఏ విధముగా ఎవరైనా ఉన్నత కులానికి చెందినవారు ఉంటే, వారి ముఖము ద్వారా ఆ ప్రకాశము మరియు నషా కనిపిస్తుందో, అదే విధముగా మీ ముఖము ప్రతి సంకల్పాన్ని, ప్రతి కర్మను స్పష్టము చేయాలి, అప్పుడు సత్యమైన సేవాధారులు అని అంటారు. స్లోగన్:-సమయము మరియు సంకల్పాల ఖజానాను పొదుపు చేసి జమ ఖాతాను పెంచుకోండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ ఇతరులకు స్వీట్ తినిపించినప్పుడు వారి నోరు కొద్ది సమయము కోసం తీపిగా అవుతుంది కానీ స్వయమే మధురముగా అయిపోండి, నోటిలో సదా మధురమైన మాటలే ఉండాలి. ఏ విధముగా స్వీట్ తినేటప్పుడు మరియు తినిపించేటప్పుడు సంతోషపడతారో, అలా మధురమైన మాటలు స్వయాన్ని కూడా సంతోషపరుస్తాయి, ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. ఈ విధముగా సదా సర్వుల నోటిని తీపి చేస్తూ ఉండండి, సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు ఉండాలి. "
#🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱
🇮🇳 మన దేశ సంస్కృతి - 6338 ఆధ్యాత్మిక అమృతవాహిని కోసం ప్రపంచ దృష్టి భారత` భూమి వైపు పయనిస్తూ ఉంది: సర్వేజనా సుఖినోభవంతు ప్రతీ కావ్యం విశ్వశాంతి కోరే అనే శ్రేష్ట శబ్ధంతో ముగుస్తుంది . ఆనందమయ జీవన విధానాన్ని తెలిపే సహజ జ్ఞానం 8 ధర్మంలో నదిలా ప్రవహిస్తుంది . సనాతన ಕೃಳಯುಗ ದಂಕಯಲ್ತನ ತಿಲಕ್ಕಿ ತಿನಾರಾಯಣುಲ ಏಐತ పూజలలో గృహస్థ మార్గానికి ప్రతీక ప్రతీ గృహ ప్రవేశ ప్రథమ స్థానంలో నిలుస్తుంది : ರಾಜೆನಿಣಿ , ಜೆಏನ ಭೃಣಿ ಯುತಾ ಗ8, ಕತ್ತನ್ಯ್ ಏರಾಯಣಹ దైవం పై శరణాగతి యొక్క మార్గాన్ని తెలిపే భగవద్గీత విశ్వానికి మణిదీపంలా మెరుస్తుంది : భగవంతునితో ఆత్మీయంగా సంభాషణ చేసే విధానాన్ని తెలిపే భారత దేశపు ರಾಜೆಯಾಗ ಅಭ್ಯಾನಂ ಖವಿನ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది  కోట్లాది ఒకే భగవంతుడు; దేవిదేవతలు; లక్షల ఆధ్యాత్మిక గ్రంధాలు; వేలాది దేవాలయాలు. వందలాది పుట్టినిల్లయిన భారత భూమి విశ్వానికే  మఠాలకు తలమానికమైన వారసత్వ సంపద అవుతుంది  APRIL CELEERITE [IIIIIIERIIIIEII| BRAHMA KUMARIS 6338 ఆధ్యాత్మిక అమృతవాహిని కోసం ప్రపంచ దృష్టి భారత` భూమి వైపు పయనిస్తూ ఉంది: సర్వేజనా సుఖినోభవంతు ప్రతీ కావ్యం విశ్వశాంతి కోరే అనే శ్రేష్ట శబ్ధంతో ముగుస్తుంది . ఆనందమయ జీవన విధానాన్ని తెలిపే సహజ జ్ఞానం 8 ధర్మంలో నదిలా ప్రవహిస్తుంది . సనాతన ಕೃಳಯುಗ ದಂಕಯಲ್ತನ ತಿಲಕ್ಕಿ ತಿನಾರಾಯಣುಲ ಏಐತ పూజలలో గృహస్థ మార్గానికి ప్రతీక ప్రతీ గృహ ప్రవేశ ప్రథమ స్థానంలో నిలుస్తుంది : ರಾಜೆನಿಣಿ , ಜೆಏನ ಭೃಣಿ ಯುತಾ ಗ8, ಕತ್ತನ್ಯ್ ಏರಾಯಣಹ దైవం పై శరణాగతి యొక్క మార్గాన్ని తెలిపే భగవద్గీత విశ్వానికి మణిదీపంలా మెరుస్తుంది : భగవంతునితో ఆత్మీయంగా సంభాషణ చేసే విధానాన్ని తెలిపే భారత దేశపు ರಾಜೆಯಾಗ ಅಭ್ಯಾನಂ ಖವಿನ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది  కోట్లాది ఒకే భగవంతుడు; దేవిదేవతలు; లక్షల ఆధ్యాత్మిక గ్రంధాలు; వేలాది దేవాలయాలు. వందలాది పుట్టినిల్లయిన భారత భూమి విశ్వానికే  మఠాలకు తలమానికమైన వారసత్వ సంపద అవుతుంది  APRIL CELEERITE [IIIIIIERIIIIEII| BRAHMA KUMARIS - ShareChat