v. v. guptha
ShareChat
click to see wallet page
@299580595
299580595
v. v. guptha
@299580595
ఐ లవ్ షేర్ చాట్
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా 20-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈశ్వరీయ ముక్తి దళము, మీరు అందరికీ సద్గతిని ఇవ్వాలి, అందరి ప్రీతిని ఒక్క తండ్రితో జోడింపజేయాలి’’ ప్రశ్న:-మనుష్యులు తమ బుద్ధిని ఏ విషయములో ఉపయోగిస్తారు మరియు మీరు మీ బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలి? జవాబు:-మనుష్యులు తమ బుద్ధిని ఆకాశము మరియు సృష్టి యొక్క అంతాన్ని పొందడానికి ఉపయోగిస్తున్నారు కానీ దీని వలన లాభమేమీ లేదు. వాటి అంతమైతే లభించదు. పిల్లలైన మీరు మీ బుద్ధిని పూజ్యులుగా అవ్వడానికి ఉపయోగిస్తారు. వాళ్ళను ప్రపంచము పూజించదు. పిల్లలైన మీరు పూజ్య దేవతలుగా అవుతారు. పాట:-మిమ్మల్ని పొంది మేము... ▶ ఓంశాంతి. ఇది జ్ఞాన మార్గమని, అది భక్తి మార్గమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమని తలెత్తుతుందంటే, భక్తి మార్గము మంచిదా లేక జ్ఞాన మార్గము మంచిదా? ఇవి రెండు విషయాలైనట్లు కదా. జ్ఞానముతో సద్గతి కలుగుతుందని అంటారు. తప్పకుండా భక్తి మరియు జ్ఞానము, రెండు వేర్వేరు అని అంటారు. భక్తి చేయడము వలన జ్ఞానము లభిస్తుందని, అప్పుడే సద్గతి కలుగుతుందని మనుష్యులు భావిస్తారు. భక్తి మధ్యలోకి జ్ఞానము రాలేదు. భక్తి అందరి కోసముంది, జ్ఞానము కూడా అందరి కోసముంది. ఇది కలియుగము యొక్క అంతిమ సమయము, కావున తప్పకుండా అందరి దుర్గతి జరుగుతుంది, అందుకే పిలుస్తారు కూడా మరియు ఇలా పాడుతారు కూడా - ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి ఇప్పుడు మీతోనే సాంగత్యాన్ని జోడిస్తాము అని. ఇప్పుడు ఇంతకీ వారెవరు, ఎవరితో జోడిస్తాము అనేది అర్థం చేసుకోరు. చాలా వరకు బుద్ధి శ్రీకృష్ణుని వైపుకు వెళ్తుంది, మేము సత్యమైన ప్రీతిని నీతోనే జోడిస్తామని అంటారు. కేవలం శ్రీకృష్ణుడితోనే ప్రీతిని జోడిస్తున్నప్పుడు, ఇక గురువులు మొదలైనవారి అవసరమే లేదు, శ్రీకృష్ణుడినే స్మృతి చేయాలి. శ్రీకృష్ణుడి చిత్రమైతే అందరి వద్ద ఉంది. శ్రీకృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు, ఇక ఇతరులెవ్వరి వద్దకు వెళ్ళవలసిన అవసరమే లేదు. ఏ విధముగా మీరా ఒక్కరితోనే ప్రీతిని జోడించారు కదా, పనులు చేసుకుంటూ కూడా శ్రీకృష్ణుడినే తలచుకుంటూ ఉండేవారు. ఇంటిలో ఉంటూ, అన్నీ చేసుకుంటూ, తినడం-త్రాగడము అన్నీ చేసేవారు, కానీ సత్యమైన ప్రీతిని ఒక్క శ్రీకృష్ణునితోనే జోడించారు. ఆమె ఒక ప్రేయసి మరియు శ్రీకృష్ణుడు ఒక ప్రియుడు అన్నట్లు అయిపోయారు. శ్రీకృష్ణుడిని స్మృతి చేయడము వలన ఫలం కూడా లభిస్తుంది. శ్రీకృష్ణుని గురించైతే అందరికీ తెలుసు. మేము సత్యమైన ప్రీతిని నీతోనే జోడించాము, ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలేశామని పాడుతారు కూడా. ఇప్పుడు ఉన్నతోన్నతమైనవారు, సత్యమైనవారైతే పరమపితయే. అందరికీ వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారి గురించి ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ శివ అని అంటారు కానీ వారు ఎప్పుడు వస్తారు అనేది తెలియదు. శివజయంతి జరుగుతుంది అంటే వారు తప్పకుండా వస్తూ ఉండి ఉండవచ్చు. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వచ్చి ఏమి చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. వారు సర్వులకు సద్గతినిస్తారని మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. కానీ అది ఎలా ఇస్తారు, సద్గతికి అర్థమేమిటి అన్నది ఏమీ తెలియదు! శివబాబా అయితే తప్పకుండా స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చి ఉంటారు కదా. పిల్లలైన మీరు ఆ ధర్మానికి చెందినవారిగా ఉండేవారు కానీ మీకు ఈ విషయము తెలియదు, మీరు మర్చిపోయారు, అటువంటప్పుడు ఇతరులు ఎలా తెలుసుకోగలరు. ఇప్పుడు శివబాబా ద్వారా మీరు తెలుసుకున్నారు మరియు ఇతరులకు తెలియజేస్తారు. మీరు ఈశ్వరీయ ముక్తి దళము. ముక్తి దళము అనండి లేక సద్గతినిచ్చే దళము అనండి, రెండూ ఒకటే. ఇప్పుడు పిల్లలైన మీపై బాధ్యత ఉంది. మీరు చిత్రాలపై కూడా అర్థం చేయించవచ్చు. భాషలు అనేకమున్నాయి. ముఖ్యమైన భాషలలో చిత్రాలను తయారుచేయవలసి ఉంటుంది. భాషల విషయములో కూడా చాలా జంజాటము ఉంటుంది, అందుకే ప్రదర్శనీలు కూడా తయారుచేయవలసి ఉంటుంది. చిత్రాలపై అర్థం చేయించడము చాలా సులువుగా ఉంటుంది. సృష్టి చక్రము చిత్రములో కూడా పూర్తి జ్ఞానము ఉంది, మెట్ల వరుస చిత్రము కేవలం భారతవాసుల కోసం మాత్రమే ఉంది. ఇందులో ఇతర ధర్మాలేవీ లేనే లేవు. భారత్ తమోప్రధానముగా అయినప్పుడు ఇతరులెవ్వరూ అలా అవ్వరని కాదు, తమోప్రధానముగానైతే అందరూ అవుతారు. కావున వారి కోసం కూడా ఏదైనా ఉండాలి. బుద్ధిలో సేవకు సంబంధించిన ఇలాంటి ఆలోచనలు రావాలి. ఇద్దరు తండ్రుల రహస్యాన్ని కూడా అర్థం చేయించాలి. వారసత్వము రచయిత నుండి లభిస్తుంది. లక్ష్మీ-నారాయణులు భారత్ యొక్క మొట్టమొదటి మహారాజా-మహారాణులుగా ఉండేవారని అనగా భగవాన్-భగవతీలుగా ఉండేవారని ఇది కూడా అన్ని ధర్మాల వారికి తెలుసు. అచ్ఛా, వారికి ఈ స్వర్గ రాజ్యము ఎలా లభించింది. తప్పకుండా భగవంతుని ద్వారా లభించింది. ఎలా లభించింది, ఎప్పుడు లభించింది అనేది ఎవ్వరికీ తెలియదు. గీతలో శ్రీకృష్ణుని పేరును వ్రాసారు, ప్రళయాన్ని చూపించారు, కానీ ఫలితమేమీ లేదు. ఇది పిల్లలైన మీరు అర్థం చేయించాలి. చిత్రాలైతే అన్ని చోట్ల ఉన్నాయి. లక్ష్మీ-నారాయణుల చిత్రాలు కూడా ఉంటాయి. కాకపోతే డ్రెస్, ముఖ కవళికలు మొదలైనవి వేర్వేరుగా ఉంటాయి. ఎవరికి ఎలా తోస్తే అలా తయారుచేశారు. ఈ రాధా-కృష్ణులే, శ్రీనాథుడు-శ్రీనాథిని కదా. శ్రీరాధ, శ్రీకృష్ణులైతే కిరీటధారులు కారు, అలాగని నల్లనివారూ కారు. రాజధాని లక్ష్మీ-నారాయణులది, అంతేకానీ రాధా-కృష్ణులది కాదు. మందిరాలైతే అనేక రకాలవి నిర్మించారు, కానీ పేరు అయితే కేవలం లక్ష్మీ-నారాయణ అన్నదే పెడతారు కదా. లక్ష్మీ-నారాయణుల వంశావళి అని అంటారు. సీతా-రాముల వంశావళి, లక్ష్మీ-నారాయణుల వంశావళి ఉంటాయి, అంతేకానీ రాధా-కృష్ణుల వంశావళి ఉండదు. ఈ విషయాలు మనుష్యుల ఆలోచనలలో లేనే లేవు. పిల్లలైన మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు చాలా ఉత్సాహముతో ఉంటారు. కొంతమంది - మాకు అర్థమవుతుంది అని అంటారు కానీ నెమ్మది-నెమ్మదిగా నోరు విప్పి జ్ఞానము చెప్పగలిగేలా యుక్తులను కూడా రచించవలసి ఉంటుంది. వేద-శాస్త్రాలను అధ్యయనము చేయడం వలన, యజ్ఞ-తపాదులు మొదలైనవి చేయడం వలన, తీర్థ యాత్రలు మొదలైనవి చేయడం వలన పరమాత్మను పొందగలమని చాలామంది భావిస్తారు కానీ భగవంతుడు అంటున్నారు, ఇవన్నీ నా నుండి దూరము చేసే మార్గాలు. డ్రామాలో అందరూ దుర్గతిని పొందవలసిందే, అందుకే ఇటువంటి విషయాలను చెప్తారు. ఇంతకుముందు మనము కూడా ఇలా అనేవారము - భగవంతుడు ఒక పిలక వంటివారు, ఎవరు ఎక్కడ నుండి వెళ్ళినా వారిని చేరుకోవచ్చు అని. అందుకే మనుష్యులు అనేక రకాల మార్గాలను ఎన్నుకున్నారు. భక్తి మార్గములోని మార్గాలను పట్టుకుని-పట్టుకుని అలసిపోయినప్పుడు, మళ్ళీ భగవంతుడినే పిలుస్తారు - ఓ పతితపావనా, మీరు వచ్చి పావనముగా అయ్యే మార్గాన్ని తెలియజేయండి, మీరు లేకుండా పావనముగా అవ్వలేము, అలసిపోయాము అని అంటారు. భక్తి రోజురోజుకు పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. ఇప్పుడైతే మేళాలు మొదలైనవాటి వద్దకు ఎన్ని లక్షలమంది వెళ్తారు, అక్కడ ఎంత మురికి ఉంటుంది. ఇప్పుడైతే ఇది అంతిమము. ప్రపంచము పరివర్తనవ్వాలి. వాస్తవానికి ప్రపంచము ఒక్కటే ఉంటుంది, దానిని రెండు భాగాలుగా చూపించారు. మనుష్యులు స్వర్గము, నరకము వేర్వేరు ప్రపంచాలని భావిస్తారు, కానీ ఇవి సగం-సగము ఉంటాయి. పైన సత్యయుగము, ఆ తర్వాత త్రేతా, ద్వాపర, కలియుగాలు. కలియుగములో తమోప్రధానముగా అవ్వాల్సిందే. సృష్టి పాతదిగా అవుతుంది. ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు, తికమకలో ఉన్నారు. కొంతమంది శ్రీకృష్ణుడిని భగవంతుడని, మరికొంతమంది శ్రీరాముడిని భగవంతుడని అంటారు. ఈ రోజుల్లోనైతే మనుష్యులు తమను తామే భగవంతుడని చెప్పుకుంటారు. మేము ఈశ్వరుని అవతారమని అంటారు. అంటే దేవతల కన్నా కూడా మనుష్యులు తెలివైనవారు అయిపోయినట్లు. ఎంతైనా దేవతలను దేవతలనే అంటారు, కానీ ఇక్కడ మనుష్యులను భగవంతుడని అంటారు. ఇది భక్తి మార్గము. దేవతలైతే స్వర్గములో ఉండేవారు. ఇప్పుడు ఇనుపయుగమైన కలియుగములో మనుష్యులు భగవంతునిగా ఎలా అవ్వగలరు. తండ్రి అంటారు - నేను రావడమే సంగమయుగములో వస్తాను, ఈ సమయములో నేను వచ్చి ప్రపంచాన్ని ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. కలియుగము సత్యయుగముగా అవుతుంది, మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది నిరాకారీ ప్రపంచము. ఇది సాకారీ ప్రపంచము. అర్థం చేయించేందుకు నిరాకారీ వృక్షాన్ని కూడా పెద్దదిగా తయారుచేయవలసి ఉంటుంది. ఆకాశము ఎంత పెద్దదో, బ్రహ్మమహాతత్వము కూడా అంత పెద్దదిగా ఉంటుంది, రెండింటి అంతాన్ని పొందలేరు. అక్కడికి విమానాలు మొదలైనవాటిలో వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తారు కానీ దాని అంతాన్ని పొందలేరు. సముద్రమే సముద్రము... ఆకాశమే ఆకాశము ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు. చాలానే ప్రయత్నిస్తారు కానీ ఈ విషయాలన్నింటి వలన లాభమేముంది. మేము మా బుద్ధిని ఉపయోగిస్తున్నామని భావిస్తారు. అయితే ఇది మనుష్యుల బుద్ధి, సైన్స్ యొక్క గర్వం కూడా మనుష్యులలో ఉంది. ఒకవేళ ఎవరైనా వాటి అంతాన్ని కనుగొన్నా సరే, వారినేమీ ప్రపంచమంతా పూజించదు. దేవతలకైతే పూజ జరుగుతుంది. పిల్లలైన మిమ్మల్ని తండ్రి ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. అందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తారు. మనము మూలవతనము నుండి వస్తామని అందరికీ తెలుసు కానీ ఏ విధముగా మీరు అర్థం చేసుకున్నారో, ప్రపంచానికి ఆ విధముగా తెలియదు. మూలవతనము అంటే ఏమిటి, అక్కడ ఆత్మలు ఎలా ఉంటాయి, మళ్ళీ నంబరువారుగా ఎలా వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. బ్రహ్మమహాతత్వములో నిరాకారీ వృక్షము ఉంటుంది. సత్యయుగములో కొద్దిమంది మనుష్యులే ఉంటారని, మిగిలిన ఆత్మలన్నీ మూలవతనములో ఉంటాయని వారు అర్థం చేసుకోరు. ఈ సాకార వతనము ఎలా ఉంటుందో, మూలవతనము కూడా అలాగే ఉంటుంది. వతనము ఎప్పుడూ ఖాళీ అవ్వదు. ఈ సాకార వతనము ఖాళీ అవ్వదు, ఆ మూలవతనము ఖాళీ అవ్వదు. అంతిమము వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారు. కొంతమంది ఈ వతనములో ఉంటారు, వతనము పూర్తిగా ఖాళీ అయిపోతే ఇక ప్రళయము జరిగినట్లు. కానీ ప్రళయము జరగదు. ఇది అవినాశీ ఖండము కదా. ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. మేము ఎవరో ఒకరి కళ్యాణము చేయాలి అని రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. మీకు వారితో ప్రీతి జోడింపబడింది కావున మీరు వారి పరిచయాన్ని ఇవ్వాలి కదా. వారు తండ్రి, వారి నుండి వారసత్వము లభిస్తుంది. ఎలా లభిస్తుంది అనేది మేము తెలియజేయగలము అని చెప్పండి. ఇలా చెప్పగలిగేవారు కూడా నంబరువారుగా ఉన్నారు. కొంతమందైతే చాలా మంచి రీతిలో భాషణ చేస్తారు, కొంతమంది చేయలేరు కనుక నేర్చుకోవలసి ఉంటుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ కళ్యాణాన్ని చేసుకోవాలి. మార్గము లభించినప్పుడు మరి ఇతరుల కళ్యాణము చేయాలి. ఇతరులకు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని ఇప్పించాలని, ఆత్మిక సేవ చేయాలని మనసుకు అనిపిస్తుంది. అందరూ ఇతరుల సేవ చేస్తారు. తండ్రి వచ్చి ఆత్మిక సేవను నేర్పిస్తారు, ఇతరులెవ్వరికీ ఆత్మిక సేవ గురించి తెలియదు. ఆత్మిక తండ్రియే ఆత్మల సేవను చేస్తారు. దైహిక సేవనైతే జన్మజన్మలుగా చాలానే చేశారు, ఇప్పుడు అంతిమ జన్మలో తండ్రి నేర్పించిన ఆత్మిక సేవను చేయాలి. ఇందులోనే కళ్యాణముంది, ఇంక దేనిలోనూ లాభము లేదు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి, తోడును నిర్వర్తించాలి. వారికి కూడా ఇదే అర్థం చేయించి కళ్యాణము చేయాలి. ప్రీతి ఉన్నట్లయితే ఎంతోకొంత వింటారు. కొందమందైతే, మేము కూడా సన్యాసము తీసుకోవలసి వస్తుందేమోనని భయపడతారు. ఈ రోజులలోనైతే సన్యాసులు చాలామంది ఉన్నారు కదా. కాషాయ వస్త్రాలను ధరించి రెండు మాటలు వినిపిస్తే చాలు, ఎక్కడో ఒక చోట నుండి భోజనమైతే లభించేస్తుంది. ఏ దుకాణానికి వెళ్ళినా, రెండు పూరీలైతే ఇస్తారు. తర్వాత ఇంకొకరి వద్దకు వెళ్తారు, ఇలా కడుపుకు భోజనము లభిస్తుంది. భిక్షము అడిగేవారు కూడా అనేక రకాలవారు ఉంటారు. ఈ తండ్రి నుండైతే ఒకే విధమైన వారసత్వము లభిస్తుంది. అనంతమైన రాజ్యాధికారము లభిస్తుంది, సదా నిరోగిగా అవుతారు. షావుకారులు కష్టం మీద మేలుకుంటారు. పేదవారి కళ్యాణము కూడా చేయాలి. బాబా ప్రదర్శనీలు ఎన్నో తయారుచేయిస్తున్నారు ఎందుకంటే గ్రామాలు చాలా ఉన్నాయి కదా. మినిస్టర్లు మొదలైనవారు ఈ జ్ఞానము బాగుందని భావించినట్లయితే, అందరూ వినడము ప్రారంభిస్తారు. మున్ముందు మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది, అప్పుడు చాలామంది వస్తారు. తుప్పు వదలడానికి సమయము పడుతుంది. ఎవరైనా రాత్రింబవళ్ళు ఇందులోనే నిమగ్నమైనట్లయితే బహుశా వదిలిపోవచ్చు. ఆత్మ పవిత్రముగా అయిపోతే ఇక ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించాలి. ముఖ్యమైన విషయమేమిటంటే, ఇదంతా భారత్ కు సంబంధించినది. భారత్ యొక్క ఉన్నతి జరిగినప్పుడు అందరి ఉన్నతి జరుగుతుంది. ప్రొజెక్టర్లతో కన్నా ప్రదర్శనీలతో ఎక్కువ సేవ జరగగలదు. నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. రోజురోజుకు మీ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది అని ఇలా కూడా వ్రాయాలి. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. బాబా సూచనలు ఇస్తారు కానీ పిల్లలు చాలా విషయాలను మర్చిపోతారు. ఏమి జరిగినా సరే, నేటికి 5 వేల సంత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది అని అంటారు. వాస్తవానికి ఇది చాలా స్పష్టమైన విషయము, కానీ ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా. వార్తాపత్రికలలో వేయించగలిగితే, ఎంతోకొంత అర్థం చేసుకుంటారు. జ్ఞాన మార్గములో చాలా ఫస్ట్ క్లాస్ అవస్థ కావాలి. ఇటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ హర్షితముగా కూడా ఉండవలసి ఉంటుంది. ఇది అలవాటైపోతే అవస్థ చాలా సంతోషభరితముగా ఉంటుంది. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఇతరులందరి నుండి బుద్ధి యొక్క ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి మరియు అందరి ప్రీతిని ఒక్క తండ్రితో జోడింపజేసే సేవను చేయాలి. 2. సత్యాతి-సత్యమైన ఆత్మిక సేవాధారులుగా అవ్వాలి. స్వ కళ్యాణము కూడా చేసుకోవాలి మరియు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. అవస్థను చాలా సంతోషభరితముగా తయారుచేసుకోవాలి. వరదానము:-తమ శ్రేష్ఠ వ్యవహారము ద్వారా సర్వాత్మలకు సుఖాన్ని ఇచ్చే మహాన్ ఆత్మా భవ ఎవరైతే మహాన్ ఆత్మలుగా ఉంటారో, వారి ప్రతి వ్యవహారము ద్వారా సర్వాత్మలకు సుఖము యొక్క దానము లభిస్తుంది. వారు సుఖాన్ని ఇస్తారు మరియు సుఖాన్ని తీసుకుంటారు. కావున చెక్ చేసుకోండి - మహాన్ ఆత్మ యొక్క లెక్కలో మొత్తము రోజంతటిలో అందరికీ సుఖాన్ని ఇచ్చానా, పుణ్య కర్మలు చేసానా. పుణ్యము అనగా ఎవరికైనా ఎటువంటి వస్తువును ఇవ్వాలంటే, దాని ద్వారా ఆ ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభించాలి. కావున చెక్ చేసుకోండి - ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభిస్తున్నాయా! ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా లేక ఎవరి నుండి దుఃఖాన్ని తీసుకోలేదు కదా! అప్పుడే మహాన్ ఆత్మ అని పిలవబడతారు. స్లోగన్:-చేసిన తర్వాత ఆలోచించడమే పశ్చాత్తాపము యొక్క రూపము.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ సంస్కారాలు మరియు నేచర్ అయితే ప్రతి ఒక్కరివి ఎవరివి వారికి ఉంటాయి, కానీ సర్వులకు స్నేహీలుగా మరియు అన్ని విషయాలలో, సంబంధాలలో సఫలత, మనసులో విజయము మరియు వాణిలో మధురత అనేవి ఈజీ నేచర్ ఉన్నప్పుడే వస్తాయి. ఈజీ నేచర్ అనగా ఎటువంటి సమయమో, ఎటువంటి వ్యక్తులో, ఎటువంటి పరిస్థితులో, వాటిని గమనిస్తూ స్వయాన్ని ఈజీగా చేసుకోవాలి. ఈజీ అనగా కలుపుగోలుగా ఉండటము, మౌల్డ్ అయ్యేవారు. ఈజీ అంటే నిర్లక్ష్యులుగా ఉండటము కాదు. "
https://youtube.com/watch?v=DgR2e6jp5Qw&si=FVv4YXiqcr6VlMtP #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🇮🇳 మన దేశ సంస్కృతి
youtube-preview
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 18-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి ద్వారా సమ్ముఖముగా చదువుకుంటున్నారు, మీరు సత్యయుగీ రాజ్యాధికారానికి యోగ్యులుగా అయ్యేందుకు పావనముగా తప్పకుండా అవ్వాలి’’ ప్రశ్న:-తండ్రి యొక్క ఏ కర్తవ్యము గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు? జవాబు:-మన తండ్రి, తండ్రి కూడా, టీచరు మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయడానికి, ఒక్క ఆది సనాతన ధర్మాన్ని స్థాపన చేయడానికి తండ్రి కల్పము యొక్క సంగమయుగములో వస్తారు. తండ్రి ఇప్పుడు పిల్లలైన మనల్ని, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు. ఈ కర్తవ్యము గురించి పిల్లలైన మనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. పాట:-భోళానాథుని కన్నా అతీతమైనవారు... ▶ ఓంశాంతి. ఓం శాంతి యొక్క అర్థాన్ని పిల్లలకు అనేక సార్లు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. ఇది నా ఆత్మ అని శరీరము కూడా అనవచ్చు. శివబాబా ఏ విధముగా మీరు నా వారు అని అంటారో మరియు పిల్లలు ఏ విధముగా బాబా, మీరు మా వారు అని అంటారో, అలా ఆత్మ కూడా, ఇది నా శరీరము అని అంటుంది మరియు శరీరము, ఇది నా ఆత్మ అని అంటుంది. నేను అవినాశీ అని ఇప్పుడు ఆత్మకు తెలుసు. ఆత్మ లేకుండా శరీరము ఏమీ చేయలేదు. ఆత్మకు శరీరమైతే ఉంటుంది, నా ఆత్మకు కష్టము కలిగించవద్దని అంటుంది, నా ఆత్మ పాపాత్మ అని లేదా నా ఆత్మ పుణ్యాత్మ అని ఆత్మ అంటుంది. మీ ఆత్మ సత్యయుగములో పుణ్యాత్మగా ఉండేదని మీకు తెలుసు. నేను సత్యయుగములో సతోప్రధానముగా అనగా సత్యమైన బంగారముగా ఉండేదానిని అని స్వయంగా ఆత్మ కూడా అంటుంది. నిజంగా ఆత్మ బంగారమని కాదు, ఒక ఉదాహరణగా ఇలా చెప్పడము జరుగుతుంది. నా ఆత్మ పవిత్రcgగా ఉండేది, బంగారుయుగానికి చెందినదిగా ఉండేది. ఇప్పుడు అపవిత్రముగా ఉన్నాను అని అంటారు. ప్రపంచములోని వారికి ఈ విషయము తెలియదు. మనకైతే శ్రీమతము లభిస్తుంది. మన ఆత్మ సతోప్రధానముగా ఉండేదని, ఇప్పుడు తమోప్రధానముగా అయ్యిందని మీకు ఇప్పుడు తెలుసు. ప్రతి వస్తువు ఇలా అవుతుంది. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము... ఇలా ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. ప్రపంచము కూడా మొదట బంగారుయుగముగా, సతోప్రధానముగా ఉండేది, తర్వాత తమోప్రధానముగా, ఇనుపయుగముగా అయ్యింది, కావుననే దుఃఖితులుగా ఉన్నారు. సతోప్రధానము అనగా తీర్చిదిద్దబడినది అని అర్థం, తమోప్రధానము అనగా పాడైపోయినది అని అర్థం. పాటలో కూడా, పాడైనదానిని బాగుచేసేవారు... అని అంటారు. పాత ప్రపంచము పాడైపోయింది ఎందుకంటే ఇది రావణ రాజ్యము మరియు అందరూ పతితముగా ఉన్నారు. సత్యయుగములో అందరూ పావనముగా ఉండేవారు, దానిని కొత్త నిర్వికారీ ప్రపంచము అని అంటారు. ఇది పాత వికారీ ప్రపంచము. ఇప్పుడు కలియుగము ఇనుపయుగముగా ఉంది. ఈ విషయాలన్నింటినీ ఏ స్కూలులో గానీ, కాలేజిలో గానీ చదివించడము జరగదు. భగవంతుడు వచ్చి చదివిస్తారు మరియు రాజయోగాన్ని నేర్పిస్తారు. గీతలో భగవానువాచ - శ్రీమద్భగవద్గీత అని వ్రాయబడి ఉంది. శ్రీమత్ అనగా శ్రేష్ఠమైన మతము. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు, ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. వారి ఏక్యురేట్ పేరు శివ. రుద్ర జయంతి లేక రుద్ర రాత్రి అని ఎప్పుడూ విని ఉండరు. శివరాత్రి అని అంటారు. శివుడైతే నిరాకారుడు, నిరాకారుని రాత్రిని లేక జయంతిని ఎలా జరుపుకోవాలి. శ్రీకృష్ణ జయంతి అనడము బాగానే ఉంది. ఫలానావారి బిడ్డ అని, అతని తిథి-తారీఖులను చూపిస్తారు. శివుడు ఎప్పుడు జన్మించారు అనేదైతే ఎవరికీ తెలియదు, కానీ తెలుసుకోవాలి కదా. శ్రీకృష్ణుడు సత్యయుగము ఆదిలో ఎలా జన్మ తీసుకున్నారు అనేది ఇప్పుడు అర్థమయ్యింది. అతను జన్మించి 5 వేల సంవత్సరాలు అయ్యిందని మీరు అంటారు. వారు కూడా, క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ ప్యారడైజ్ గా ఉండేదని అంటారు. ఇస్లాముల కన్నా ముందు చంద్రవంశీయులు, వారి కన్నా ముందు సూర్యవంశీయులు ఉండేవారు. శాస్త్రాలలో సత్యయుగానికి లక్షల సంవత్సరాలని చూపించారు. గీత ముఖ్యమైనది. గీత ద్వారానే దేవీ-దేవతా ధర్మము స్థాపన అయ్యింది. అది సత్య, త్రేతాయుగాల వరకు కొనసాగింది అనగా గీతా శాస్త్రము ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపనను పరమపిత పరమాత్మ చేసారు. ఆ తర్వాత అర్ధకల్పము వరకు ఏ శాస్త్రమూ లేదు, ఏ ధర్మ స్థాపకుడూ లేరు. తండ్రి వచ్చి బ్రాహ్మణులను దేవతలుగా, క్షత్రియులుగా చేసారు అనగా తండ్రి మూడు ధర్మాలను స్థాపన చేస్తారు. ఇది లీప్ ధర్మము, దీని ఆయువు తక్కువగా ఉంటుంది. సర్వశాస్త్రమయి శిరోమణి గీతను భగవంతుడు వినిపించారు. తండ్రి పునర్జన్మలలోకి రారు. వారికి జన్మ ఉంటుంది కానీ తండ్రి అంటారు - నేను గర్భములోకి రాను, నా పాలన జరగదు. సత్యయుగములో జన్మ తీసుకునే పిల్లలు కూడా గర్భ మహళ్ళలో ఉంటారు. రావణ రాజ్యములో గర్భ జైలులోకి రావలసి ఉంటుంది. పాపాలను జైలులో అనుభవిస్తారు. గర్భములో ఉన్నప్పుడు, నేను ఇక పాపము చేయను అని ప్రతిజ్ఞ చేస్తారు కానీ ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. గర్భము నుండి బయటకు రాగానే, మళ్ళీ పాపము చేయడము మొదలుపెడతారు. అక్కడి ప్రతిజ్ఞ అక్కడే ఉండిపోతుంది... ఇక్కడ కూడా చాలా ప్రతిజ్ఞలను చేస్తారు - మేము పాపాలు చేయమని, పరస్పరము కామ ఖడ్గాన్ని ఉపయోగించమని అంటారు ఎందుకంటే ఈ వికారాలు ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తాయి. సత్యయుగములో విషము ఉండదు కావున మనుష్యులు ఆదిమధ్యాంతాలు అనగా 21 జన్మలు దుఃఖాన్ని అనుభవించరు ఎందుకంటే అది రామ రాజ్యము. దాని స్థాపనను ఇప్పుడు తండ్రి మళ్ళీ చేస్తున్నారు. సంగమములోనే స్థాపన జరుగుతుంది కదా. ఎవరైతే ధర్మ స్థాపన చేయడానికి వస్తారో, వారు ఏ పాపము చేయకూడదు. అర్ధ సమయము పుణ్యాత్ములుగా ఉంటారు, మళ్ళీ అర్ధ సమయము తర్వాత పాపాత్ములుగా అవుతారు. మీరు సత్య, త్రేతాయుగాలలో పుణ్యాత్మగా ఉంటారు, తర్వాత పాపాత్మగా అవుతారు. సతోప్రధాన ఆత్మ పై నుండి వచ్చినప్పుడు, అది శిక్షలు అనుభవించదు. క్రైస్టు ఆత్మ ధర్మ స్థాపన చేయడానికి వచ్చారు, వారికి ఎటువంటి శిక్ష లభించదు. క్రైస్టును శిలువ పైకి ఎక్కించారని అంటారు కానీ ఆ ఆత్మ ఎటువంటి వికర్మలను చేయలేదు. ఆ ఆత్మ ఎవరి శరీరములోకైతే ప్రవేశిస్తుందో, వారికి దుఃఖము కలుగుతుంది, వారు సహనము చేస్తారు. ఎలాగైతే వీరిలోకి బాబా ప్రవేశిస్తారో, అక్కడ కూడా అలా జరుగుతుంది. శివబాబా అయితే ఎలాగూ సతోప్రధానమైనవారే. ఏదైనా దుఃఖము లేక కష్టము వీరి ఆత్మకు కలుగుతుంది, శివబాబాకు కలగదు. వారు సదా సుఖ, శాంతులతో ఉంటారు. వారు సదా సతోప్రధానులు. కానీ రావడమైతే ఈ పాత శరీరములోకే వస్తారు కదా. అదే విధముగా క్రైస్టు ఆత్మ ఎవరిలోకైతే ప్రవేశించారో, ఆ శరీరానికి దుఃఖము కలగవచ్చు. క్రైస్టు ఆత్మ దుఃఖాన్ని అనుభవించదు ఎందుకంటే ఇంకా సతో, రజో, తమోలలోకి రావాల్సి ఉంది. కొత్త-కొత్త ఆత్మలు వస్తుంటారు కూడా కదా. వారు ముందు తప్పకుండా సుఖాన్ని అనుభవించవలసి ఉంటుంది, వారు దుఃఖాన్ని అనుభవించలేరు. నియమము అలా లేదు. వీరిలో బాబా కూర్చుని ఉన్నారు, ఏ కష్టమైనా వీరికి (దాదాకు) కలుగుతుంది, అంతేకానీ శివబాబాకు కాదు. కానీ ఈ విషయాలు మీకు తెలుసు, ఇంకెవరికీ తెలియవు. ఈ రహస్యాలన్నింటినీ ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ సహజ రాజయోగము ద్వారానే స్థాపన జరిగింది, తర్వాత భక్తి మార్గములో ఇవే విషయాలు గాయనము చేయబడతాయి. ఈ సంగమములో ఏదైతే జరుగుతుందో, అది గాయనము చేయబడుతుంది. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు శివబాబా పూజ జరుగుతుంది. మొట్టమొదటగా భక్తి ఎవరు చేస్తారు. ఆ లక్ష్మీ-నారాయణులు ఎప్పుడైతే రాజ్యము చేస్తారో, అప్పుడు పూజ్యులుగా ఉండేవారు, ఆ తర్వాత వామ మార్గములోకి వచ్చేస్తారు, అప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నిరాకార పరమపిత పరమాత్మ వీరి ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది మొట్టమొదట పిల్లలైన మీ బుద్ధిలో రావాలి. ఈ విధముగా అర్థం చేయించేటువంటి స్థానము, మొత్తము ప్రపంచములో ఇంకెక్కడా ఉండదు. తండ్రియే వచ్చి భారత్ కు మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. త్రిమూర్తి చిత్రము కింద ఇలా వ్రాయబడి ఉంది - దైవీ ప్రపంచపు స్వరాజ్యము మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము. శివబాబా వచ్చి పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు, యోగ్యులుగా తయారుచేస్తున్నారు. బాబా మనల్ని యోగ్యులుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. మనము పతితులుగా ఉండేవారము కదా, పావనముగా అయిన తర్వాత ఇక ఈ శరీరము ఉండదు. రావణుడి ద్వారా మనము పతితులుగా అయ్యాము, మళ్ళీ పరమపిత పరమాత్మ పావనముగా తయారుచేసి పావన ప్రపంచానికి యజమానులుగా తయారుచేస్తారు. వారే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. ఈ నిరాకార బాబా మనల్ని చదివిస్తున్నారు. అందరూ కలిసి ఒకేచోట కూర్చుని చదువుకోలేరు కదా. సమ్ముఖముగా మీరు కొద్దిమందే కూర్చున్నారు. ఇక మిగిలిన పిల్లలందరికీ - ఇప్పుడు శివబాబా బ్రహ్మా తనువులో కూర్చుని సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండవచ్చు అని తెలుసు. ఆ మురళి వ్రాతపూర్వకముగా వస్తుంది. ఇతర సత్సంగాలలో ఈ విధముగా భావించరు. ఈ రోజుల్లో టేప్ రికార్డరు కూడా వెలువడింది, అందుకే టేప్ లో నింపి పంపిస్తారు. వారు, ఫలానా పేరు కల గురువు వినిపిస్తున్నారని అంటారు, వారి బుద్ధిలో మనుష్యులే ఉంటారు. ఇక్కడైతే అటువంటి విషయమేమీ లేదు. ఇక్కడ నాలెడ్జ్ ఫుల్ అయిన నిరాకార తండ్రి ఉన్నారు. మనుష్యులను నాలెడ్జ్ ఫుల్ అని అనరు. గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ ఫుల్, పీస్ ఫుల్ (శాంతి స్వరూపుడు), బ్లిస్ ఫుల్ (ఆనంద స్వరూపుడు) అని పాడుతారు, కావున వారు ఇచ్చే వారసత్వము కూడా కావాలి కదా. వారిలో ఏవైతే గుణాలు ఉన్నాయో, అవి పిల్లలకు లభించాలి, ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి. గుణాలను ధారణ చేసి మనము ఈ విధముగా లక్ష్మీ-నారాయణుల వలె అవుతున్నాము. అందరూ అయితే రాజా-రాణులుగా అవ్వరు. రాజు, రాణి, మంత్రి... అని అంటూ ఉంటారు. అక్కడ మంత్రి కూడా ఉండరు. మహారాజు-మహారాణులలో పవర్ ఉంటుంది. ఎప్పుడైతే వికారులుగా అవుతారో, అప్పుడు మంత్రులు మొదలైనవారు ఉంటారు. పూర్వము మినిస్టర్లు మొదలైనవారు కూడా ఉండేవారు కారు. అక్కడైతే ఒక్క రాజు-రాణి యొక్క రాజ్యము నడిచేది. వారికి మంత్రుల యొక్క అవసరము ఏముంది, వారు స్వయమే యజమాని అన్నప్పుడు ఇక ఇంకెవరి నుండో సలహా తీసుకోవలసిన అవసరము లేదు. ఇది చరిత్ర-భౌగోళికము. కానీ మొట్టమొదటగా లేస్తూ-కూర్చుంటూ, మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని, యోగము నేర్పిస్తున్నారని బుద్ధిలోకి రావాలి. స్మృతియాత్రలో ఉండాలి. ఇప్పుడు నాటకము పూర్తవుతోంది, మనము పూర్తిగా పతితులుగా అయిపోయాము, ఎందుకంటే వికారాలలోకి వెళ్ళాము, అందుకే పాపాత్ములని అంటారు. సత్యయుగములో పాపాత్ములు ఉండరు. అక్కడ పుణ్యాత్ములు ఉంటారు. అది ప్రారబ్ధము, దాని కోసం మీరు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. మీది స్మృతి యాత్ర, దీనిని భారత్ యొక్క యోగమని అంటారు కానీ అర్థం తెలియదు. యోగము అనగా స్మృతి, దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి, తర్వాత ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము, దానిని స్వీట్ హోమ్ అని అంటారు. నేను ఆ శాంతిధామ నివాసిని అని ఆత్మ అంటుంది. మనము అక్కడ నుండి అశరీరులుగా వచ్చాము, ఇక్కడ పాత్రను అభినయించేందుకని శరీరాన్ని తీసుకున్నాము. మాయను పంచ వికారాలు అని అంటారని కూడా అర్థం చేయించారు, ఇవి ఐదు భూతాలు. కామము భూతము, క్రోధము భూతము, నంబరువన్ భూతము దేహాభిమానము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - సత్యయుగములో ఈ వికారాలు ఉండవు, దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారు. వికారీ ప్రపంచాన్ని నిర్వికారిగా చేయడము, ఇది కేవలం తండ్రి పనే. వారినే సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు అని అంటారు. ఈ సమయములో అందరూ భ్రష్టాచారము ద్వారానే జన్మ తీసుకుంటారు. సత్యయుగములోనే నిర్వికారీ ప్రపంచము ఉంటుంది. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు వికారుల నుండి నిర్వికారులుగా అవ్వాలి. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. మృత్యులోకమే సమాప్తము అవ్వనున్నది, ఇక దీని తర్వాత వికారీ మనుష్యులు ఉండరు, అందుకే తండ్రితో పవిత్రముగా అవుతామని ప్రతిజ్ఞ చేయాలి. బాబా, మేము మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటామని అంటారు. వారు అసత్యపు ప్రమాణాలు చేస్తారు. ఏ భగవంతుని పేరు మీదైతే ప్రమాణము చేస్తారో, వారి గురించి తెలియనే తెలియదు. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వారి నామ, రూప, దేశ, కాలాలు ఏమిటి అనేది ఏమీ తెలియదు. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు మీకు పరిచయము లభిస్తూ ఉంది. ప్రపంచమంతటిలోనూ ఎవరికీ గాడ్ ఫాదర్ గురించి తెలియదు. తండ్రిని పిలుస్తారు కూడా, పూజలు కూడా చేస్తారు కానీ వారి కర్తవ్యము గురించి తెలియదు. పరమపిత పరమాత్మ మన తండ్రి, టీచరు, సద్గురువు అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ తండ్రి స్వయంగా తమ పరిచయాన్ని ఇస్తున్నారు - నేను మీ తండ్రిని, నేను ఈ శరీరములోకి ప్రవేశించాను. ప్రజాపిత బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరి స్థాపన? బ్రాహ్మణుల స్థాపన. తర్వాత బ్రాహ్మణులైన మీరు చదువుకుని దేవతలుగా అవుతారు. నేను వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తాను. తండ్రి అంటారు - నేను కల్పము యొక్క సంగమయుగములోనే వస్తాను. కల్పము 5 వేల సంవత్సరాలు ఉంటుంది. ఈ సృష్టి చక్రమైతే తిరుగుతూనే ఉంటుంది. నేను పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేయడానికి వస్తాను. నేను పాత ధర్మాలను వినాశనము చేయించి, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. నేను పిల్లలను చదివిస్తాను, మీరు చదువుకుని 21 జన్మల కొరకు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, ప్రజలు అందరూ దేవతలే. ఇకపోతే పురుషార్థమనుసారముగా ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అదే కల్ప-కల్పము నడుస్తుంది. ఇక కల్ప-కల్పము ఇటువంటి పురుషార్థమునే చేస్తామని, ఇటువంటి పదవినే పొందుతామని మీరు అర్థం చేసుకుంటారు. మమ్మల్ని నిరాకార భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారిని స్మృతి చేయడము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకుండా వికర్మలు వినాశనమవ్వవు. తాము ఎన్ని జన్మలు తీసుకుంటారు అనేది కూడా మనుష్యులకు తెలియదు. శాస్త్రాలలో ఎవరో 84 లక్షల జన్మలుంటాయని తప్పుగా వ్రాశారు. 84 జన్మలుంటాయని ఇప్పుడు మీకు తెలుసు. ఇది అంతిమ జన్మ, ఇక తర్వాత మనము స్వర్గములోకి వెళ్ళాలి. ముందు మూలవతనానికి వెళ్ళి, ఆ తర్వాత స్వర్గములోకి వస్తాము. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. పవిత్రముగా అవుతామని తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞ చేసారో, దానిపై పక్కాగా ఉండాలి. కామము, క్రోధము మొదలైన భూతాలపై తప్పకుండా విజయాన్ని పొందాలి. 2. నడుస్తూ-తిరుగుతూ, ప్రతి కార్యాన్ని చేస్తూ, చదివించే తండ్రిని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నాటకము పూర్తవుతోంది, అందుకే ఈ అంతిమ జన్మలో పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. వరదానము:-సర్వ ఖజానాలతో నిండుగా అయి తమ ముఖము ద్వారా సేవ చేసే సత్యమైన సేవాధారీ భవ ఏ పిల్లలైతే సర్వ ఖజానాలతో సదా సంపన్నముగా మరియు నిండుగా ఉంటారో, వారి నయనాలు మరియు మస్తకము ద్వారా ఈశ్వరీయ నషా కనిపిస్తుంది. వారి ముఖమే సేవ చేస్తుంది. ఎవరి వద్దనైనా ఎక్కువగా జమ అయి ఉన్నా లేక తక్కువగా జమ అయి ఉన్నా, అది కూడా వారి ముఖము ద్వారా కనిపిస్తుంది. ఏ విధముగా ఎవరైనా ఉన్నత కులానికి చెందినవారు ఉంటే, వారి ముఖము ద్వారా ఆ ప్రకాశము మరియు నషా కనిపిస్తుందో, అదే విధముగా మీ ముఖము ప్రతి సంకల్పాన్ని, ప్రతి కర్మను స్పష్టము చేయాలి, అప్పుడు సత్యమైన సేవాధారులు అని అంటారు. స్లోగన్:-సమయము మరియు సంకల్పాల ఖజానాను పొదుపు చేసి జమ ఖాతాను పెంచుకోండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ ఇతరులకు స్వీట్ తినిపించినప్పుడు వారి నోరు కొద్ది సమయము కోసం తీపిగా అవుతుంది కానీ స్వయమే మధురముగా అయిపోండి, నోటిలో సదా మధురమైన మాటలే ఉండాలి. ఏ విధముగా స్వీట్ తినేటప్పుడు మరియు తినిపించేటప్పుడు సంతోషపడతారో, అలా మధురమైన మాటలు స్వయాన్ని కూడా సంతోషపరుస్తాయి, ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. ఈ విధముగా సదా సర్వుల నోటిని తీపి చేస్తూ ఉండండి, సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు ఉండాలి. "
#🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱
🇮🇳 మన దేశ సంస్కృతి - 6338 ఆధ్యాత్మిక అమృతవాహిని కోసం ప్రపంచ దృష్టి భారత` భూమి వైపు పయనిస్తూ ఉంది: సర్వేజనా సుఖినోభవంతు ప్రతీ కావ్యం విశ్వశాంతి కోరే అనే శ్రేష్ట శబ్ధంతో ముగుస్తుంది . ఆనందమయ జీవన విధానాన్ని తెలిపే సహజ జ్ఞానం 8 ధర్మంలో నదిలా ప్రవహిస్తుంది . సనాతన ಕೃಳಯುಗ ದಂಕಯಲ್ತನ ತಿಲಕ್ಕಿ ತಿನಾರಾಯಣುಲ ಏಐತ పూజలలో గృహస్థ మార్గానికి ప్రతీక ప్రతీ గృహ ప్రవేశ ప్రథమ స్థానంలో నిలుస్తుంది : ರಾಜೆನಿಣಿ , ಜೆಏನ ಭೃಣಿ ಯುತಾ ಗ8, ಕತ್ತನ್ಯ್ ಏರಾಯಣಹ దైవం పై శరణాగతి యొక్క మార్గాన్ని తెలిపే భగవద్గీత విశ్వానికి మణిదీపంలా మెరుస్తుంది : భగవంతునితో ఆత్మీయంగా సంభాషణ చేసే విధానాన్ని తెలిపే భారత దేశపు ರಾಜೆಯಾಗ ಅಭ್ಯಾನಂ ಖವಿನ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది  కోట్లాది ఒకే భగవంతుడు; దేవిదేవతలు; లక్షల ఆధ్యాత్మిక గ్రంధాలు; వేలాది దేవాలయాలు. వందలాది పుట్టినిల్లయిన భారత భూమి విశ్వానికే  మఠాలకు తలమానికమైన వారసత్వ సంపద అవుతుంది  APRIL CELEERITE [IIIIIIERIIIIEII| BRAHMA KUMARIS 6338 ఆధ్యాత్మిక అమృతవాహిని కోసం ప్రపంచ దృష్టి భారత` భూమి వైపు పయనిస్తూ ఉంది: సర్వేజనా సుఖినోభవంతు ప్రతీ కావ్యం విశ్వశాంతి కోరే అనే శ్రేష్ట శబ్ధంతో ముగుస్తుంది . ఆనందమయ జీవన విధానాన్ని తెలిపే సహజ జ్ఞానం 8 ధర్మంలో నదిలా ప్రవహిస్తుంది . సనాతన ಕೃಳಯುಗ ದಂಕಯಲ್ತನ ತಿಲಕ್ಕಿ ತಿನಾರಾಯಣುಲ ಏಐತ పూజలలో గృహస్థ మార్గానికి ప్రతీక ప్రతీ గృహ ప్రవేశ ప్రథమ స్థానంలో నిలుస్తుంది : ರಾಜೆನಿಣಿ , ಜೆಏನ ಭೃಣಿ ಯುತಾ ಗ8, ಕತ್ತನ್ಯ್ ಏರಾಯಣಹ దైవం పై శరణాగతి యొక్క మార్గాన్ని తెలిపే భగవద్గీత విశ్వానికి మణిదీపంలా మెరుస్తుంది : భగవంతునితో ఆత్మీయంగా సంభాషణ చేసే విధానాన్ని తెలిపే భారత దేశపు ರಾಜೆಯಾಗ ಅಭ್ಯಾನಂ ಖವಿನ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది  కోట్లాది ఒకే భగవంతుడు; దేవిదేవతలు; లక్షల ఆధ్యాత్మిక గ్రంధాలు; వేలాది దేవాలయాలు. వందలాది పుట్టినిల్లయిన భారత భూమి విశ్వానికే  మఠాలకు తలమానికమైన వారసత్వ సంపద అవుతుంది  APRIL CELEERITE [IIIIIIERIIIIEII| BRAHMA KUMARIS - ShareChat
https://youtube.com/watch?v=Ov3F3bmfzbw&si=QLpYEHZrG3-jwnEH #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
https://youtube.com/watch?v=zCHGjJFUpKE&si=si7dASbf_aVy20_9 #🇮🇳 మన దేశ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా
youtube-preview
https://youtube.com/watch?v=unj4nnR7u5s&si=Gkmstfb8GLMz-xXY #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 17-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - పావనముగా అయినట్లయితే ఆత్మిక సేవకు యోగ్యులుగా అవుతారు, దేహీ-అభిమానీ పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు మరియు ఇతరుల చేత కూడా ఇదే యాత్రను చేయిస్తారు’’ ప్రశ్న:-సంగమములో పిల్లలైన మీరు ఏదైతే సంపాదన చేసుకుంటారో, అదే సత్యమైన సంపాదన, ఎలా? జవాబు:-ఇప్పుడు చేసుకునే సంపాదన ఏదైతే ఉందో, అది 21 జన్మల వరకు కొనసాగుతుంది, అది ఎప్పుడూ దివాలా అవ్వదు. జ్ఞానాన్ని వినడము మరియు వినిపించడము, స్మృతి చేయడము మరియు చేయించడము - ఇదే సత్యాతి-సత్యమైన సంపాదన, దీనిని సత్యాతి-సత్యమైన తండ్రియే మీకు నేర్పిస్తారు. ఇటువంటి సంపాదనను మొత్తము కల్పములో ఇంకెవ్వరూ సంపాదించలేరు. వేరే సంపాదన ఏదీ మీతో పాటు రాదు. పాట:-మేము ఆ మార్గములో నడవాలి... ▶ ఓంశాంతి. భక్తి మార్గములోనైతే పిల్లలు చాలా ఎదురుదెబ్బలు తిని ఉన్నారు. భక్తి మార్గములో చాలా భావనతో యాత్రలు చేయడానికి వెళ్తారు, రామాయణము మొదలైనవి వింటారు. ఎంత ప్రేమగా కూర్చుని కథలను వింటారంటే, అవి వింటూ-వింటూ వారికి ఏడుపు కూడా వచ్చేస్తుంది. మా భగవంతుడి యొక్క భగవతి అయిన సీతను దొంగ అయిన రావణుడు అపహరించాడు అని అది వినేటప్పుడు కూర్చుని ఏడుస్తారు. ఇవన్నీ కల్పితమైన కథలు, వీటి వల్ల లాభమేమీ లేదు. ఓ పతిత-పావనా రండి, వచ్చి దుఃఖిత ఆత్మలైన మమ్మల్ని సుఖమయముగా చేయండి అని పిలుస్తారు కూడా. కానీ, ఆత్మ దుఃఖిస్తుంది అని వారు భావించరు, ఎందుకంటే వారు ఆత్మను నిర్లేపి అని అంటారు. ఆత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనదని భావిస్తారు. ఇలా ఎందుకు అంటారు? ఎందుకంటే పరమాత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనవారు కావున వారి పిల్లలు మరి సుఖ-దుఃఖాలలోకి ఎలా వస్తారు అని భావిస్తారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞాన మార్గములో కూడా అప్పుడప్పుడు గ్రహచారము కూర్చుంటుంది, అప్పుడప్పుడు ఇంకేదో జరుగుతుంది. ఒక్కోసారి చాలా ప్రసన్నముగా ఉంటారు, ఒక్కోసారి వాడిపోయిన ముఖముతో ఉంటారు. ఇది మాయతో జరిగే యుద్ధము. మాయపైనే విజయము పొందాలి. మూర్ఛితులు అయినప్పుడు ‘మన్మనాభవ’ అనే సంజీవని మూలికను ఇవ్వడము జరుగుతుంది. భక్తి మార్గములో చాలా ఆర్భాటము ఉంటుంది. దేవతల మూర్తులను ఎంతగా అలంకరిస్తారు, సత్యమైన ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ ఆభరణాలు స్వామి యొక్క ఆస్తి అయినట్లు. స్వామి ఆస్తి అనగా పూజారులది లేక ట్రస్టీలది అవుతుంది. మేము చైతన్యములో చాలా వజ్ర-వైఢూర్యాలతో అలంకరించబడి ఉండేవారమని, మళ్ళీ పూజారులుగా అయినప్పుడు కూడా చాలా ఆభరణాలను ధరిస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఏమీ లేవు. చైతన్య రూపములో కూడా ధరించారు మరియు జడమైన రూపములోనూ ధరించారు. ఇప్పుడు ఏ ఆభరణాలు లేవు. పూర్తిగా సాధారణముగా ఉన్నారు. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోకి వస్తాను, రాజరికపు ఆర్భాటమేమీ ఉండదు. సన్యాసులు మొదలైనవారిది కూడా చాలా ఆర్భాటము ఉంటుంది. తప్పకుండా సత్యయుగములో ఆత్మలమైన మనము ఏ విధముగా పవిత్రముగా ఉండేవారము అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శరీరాలు కూడా మనవి పవిత్రముగా ఉండేవి. వారి అలంకరణ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సుందరముగా ఉంటే, వారికి అలంకరించుకునే అభిరుచి కూడా ఉంటుంది. మీరు కూడా సుందరముగా ఉన్నప్పుడు చాలా మంచి-మంచి ఆభరణాలను ధరించేవారు. వజ్రాలతో పొదగబడిన పెద్ద-పెద్ద హారాలు మొదలైనవి ధరించేవారు. ఇక్కడ ప్రతి వస్తువు నల్లగా ఉంటుంది. చూడండి, గోవులు కూడా నల్లగా అవుతూ వచ్చాయి. బాబా శ్రీనాథ ద్వారానికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలా మంచి గోవులు ఉండేవి. శ్రీకృష్ణుని గోవులను చాలా సుందరముగా చూపిస్తారు. ఇక్కడైతే కొన్ని ఒకలా, కొన్ని మరోలా ఉన్నాయి చూడండి, ఎందుకంటే ఇది కలియుగము. ఇలాంటి గోవులు అక్కడ ఉండవు. పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ అలంకరణ కూడా అక్కడ అంత సుందరముగా ఉంటుంది. ఆలోచించండి - గోవులైతే అక్కడ తప్పకుండా కావాలి. అక్కడి గోవుల పేడ కూడా ఎలా ఉంటూ ఉండవచ్చు. అందులో ఎంత శక్తి ఉంటుంది. భూమికి ఎరువు కావాలి కదా. ఎరువు వేసినట్లయితే మంచి ధాన్యము పండుతుంది. అక్కడ, అన్ని వస్తువులు మంచి శక్తి కలిగినవిగా ఉంటాయి. ఇక్కడైతే ఏ వస్తువులోనూ శక్తి లేదు. ప్రతి వస్తువు పూర్తిగా పవర్ లెస్ గా (శక్తిహీనము) అయిపోయింది. కుమార్తెలు సూక్ష్మవతనములోకి వెళ్ళేవారు. అక్కడ ఎంతో మంచి-మంచి పెద్ద ఫలాలను తినేవారు, శూబీ రసము మొదలైనవి తాగేవారు. ఇవన్నీ సాక్షాత్కారము చేయించేవారు. అక్కడ తోటమాలులు ఫలాలు మొదలైనవి ఎలా కోసి ఇస్తారు. సూక్ష్మవతనములోనైతే ఫలాలు మొదలైనవి ఉండవు. ఇదంతా సాక్షాత్కారమవుతుంది. వైకుంఠమైతే ఎంతైనా ఇక్కడే ఉంటుంది కదా. వైకుంఠము ఎక్కడో పైన ఉంటుందని మనుష్యులు భావిస్తారు. వైకుంఠము సూక్ష్మవతనములోనూ ఉండదు, మూలవతనములోనూ ఉండదు. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఏవైతే సాక్షాత్కారాలలో చూస్తారో, వాటిని తర్వాత ఈ కళ్ళ ద్వారా చూస్తారు. ఎటువంటి హోదానో, అటువంటి సామాగ్రి కూడా ఉంటుంది. రాజుల మహళ్ళు ఎంత మంచి-మంచివి ఉంటాయో చూడండి. జైపూర్ లో చాలా మంచి-మంచి మహళ్ళు నిర్మించబడ్డాయి. కేవలం ఆ మహళ్ళను చూసేందుకే మనుష్యులు వెళ్తారు, దానికి కూడా టికెట్ ఉంటుంది. ఆ మహళ్ళను విశేషముగా చూడడము కోసం తెరిచి ఉంచుతారు, స్వయం వేరే మహళ్ళలో ఉంటారు. అది కూడా కలియుగములో ఇలా ఉంటుంది. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. కానీ ఎవ్వరూ తమను తాము పతితులుగా భావించరు. మేమైతే పతితులుగా ఉండేవారము, దేనికీ కొరగానివారిగా ఉండేవారము, మళ్ళీ మేము తెల్లగా అవుతామని ఇప్పుడు మీరు భావిస్తారు. ఆ ప్రపంచమే ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఇక్కడ అమెరికా మొదలైనవాటిలో ఫస్ట్ క్లాస్ మహళ్ళు ఉన్నాయి, కానీ అక్కడి వాటితో పోలిస్తే ఇవి అసలేమీ కాదు, ఎందుకంటే ఇవి అల్పకాలికమైన సుఖాన్ని ఇచ్చేటటువంటివి. అక్కడైతే ఫస్ట్ క్లాస్ మహళ్ళు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ గోవులు ఉంటాయి. అక్కడ గోపాలులు కూడా ఉంటారు. శ్రీకృష్ణుడిని గొపాలుడని అంటారు కదా. ఇక్కడ గోవులను సంభాళించేవారు ఏమని చెప్పుకుంటారంటే - మేము గోపాలులము, శ్రీకృష్ణుని వంశానికి చెందినవారము అని. వాస్తవానికి శ్రీకృష్ణుని వంశావళి అని అనరు, శ్రీకృష్ణుని రాజధానికి చెందినవారని అంటారు. షావుకారుల వద్ద గోవులుంటే, వాటిని సంభాళించే గోపాలులు కూడా ఉంటారు. ఈ గోపాలులు అనే పేరు సత్యయుగానికి చెందినది. ఇది నిన్నటి విషయమే. నిన్న మనము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, తర్వాత పతితులుగా అయ్యాము, కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటాము. మీరు ఆది సనాతన దేవి-దేవతా ధర్మము వారా లేక హిందూ ధర్మము వారా అని అడగండి. ఈ రోజులలో అందరూ హిందువులు అని వ్రాసుకున్నారు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. బాబా ప్రశ్న అడుగుతున్నారు - ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి? శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తున్నారు. రాముడు అనగా శివబాబా యొక్క శ్రీమతమనుసారముగా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము స్థాపన అయ్యింది. ఆ తర్వాత రావణ రాజ్యము మొదలవుతుంది, వికారాలలోకి వెళ్తారు. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు హిందువులని చెప్పుకోవడము మొదలుపెడతారు. ఇప్పుడు ఎవరూ తమను తాము దేవతలు అని చెప్పుకోలేరు. రావణుడు వికారులుగా చేసాడు, తండ్రి వచ్చి నిర్వికారులుగా చేస్తారు. మీరు ఈశ్వరీయ మతము ద్వారా దేవతలుగా అవుతారు. తండ్రియే వచ్చి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తారు. మెట్లు ఎలా దిగుతారు అనేది పిల్లలైన మీ బుద్ధిలో నంబరువారుగా కూర్చుంటుంది. మిగిలిన మనుష్యులందరూ ఆసురీ మతముపై నడుస్తున్నారని మరియు మీరు ఈశ్వరీయ మతముపై నడుస్తున్నారని మీకు తెలుసు. రావణుడి మతముపై నడుస్తూ మెట్లు దిగుతూ వచ్చారు. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి నంబరు జన్మ జరుగుతుంది. ఈశ్వరీయ బుద్ధి ద్వారా మీరు మొత్తము సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. మీ ఈ జీవితము చాలా అమూల్యమైనది, ఇది సాహసముతో కూడిన జీవితము. ఈ జీవితములోనే తండ్రి వచ్చి మనల్ని ఇంత పావనముగా తయారుచేస్తున్నారు. మనము ఆత్మిక సేవకు యోగ్యులుగా అవుతాము. వారు దైహిక సమాజ సేవకులు, వారు దేహాభిమానములో ఉంటారు. మీరు దేహీ-అభిమానులు. మీరు ఆత్మలను ఆత్మిక యాత్రకు తీసుకువెళ్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు. సతోప్రధానముగా ఉన్నవారిని పావనులు అని, తమోప్రధానముగా ఉన్నవారిని పతితులు అని అంటారు. ఆత్మలోనే మాలిన్యము చేరుకుంది. ఆత్మనే సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా పవిత్రముగా అవుతారు, లేదంటే తక్కువ పవిత్రముగా అవుతారు, పాపాల భారము తలపై ఉండిపోతుంది. మొదట ఆత్మలన్నీ పవిత్రముగా ఉంటాయి, ఇక తర్వాత ప్రతి ఒక్కరి పాత్ర వేరు-వేరుగా ఉంటుంది. అందరి పాత్ర ఒకేలా ఉండదు. అందరికన్నా ఉన్నతమైన పాత్ర బాబాది, తర్వాత బ్రహ్మా-సరస్వతులది ఎంతటి పాత్ర ఉంది. ఎవరైతే స్థాపన చేస్తారో, వారే పాలన కూడా చేస్తారు. పెద్ద పాత్ర వారిదే. మొదట శివబాబా, ఆ తర్వాత బ్రహ్మా-సరస్వతులు, వారు పునర్జన్మలలోకి వస్తారు. శంకరుడైతే కేవలం సూక్ష్మ రూపాన్ని ధారణ చేస్తారు. అంతేకానీ, శంకరుడు ఏదైనా శరీరాన్ని అప్పుగా తీసుకుంటారని కాదు. శ్రీకృష్ణుడికి తనదంటూ శరీరముంది. ఇక్కడ కేవలం శివబాబా మాత్రమే శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు. పతిత శరీరములోకి, పతిత ప్రపంచములోకి వచ్చి ముక్తి-జీవన్ముక్తులలోకి తీసుకువెళ్ళే సేవను చేస్తారు. మొదట ముక్తిలోకి వెళ్ళవలసి ఉంటుంది. నాలెడ్జ్ ఫుల్ అయిన తండ్రి ఒక్కరే పతిత-పావనుడు, వారినే శివబాబా అని అంటారు. శంకరుడిని బాబా అని అంటే అది శోభించదు. శివబాబా అన్న పదము చాలా మధురమైనది. శివునిపై కొందరు జిల్లేడు పుష్పాలను అర్పిస్తారు, కొందరు ఇంకేవో అర్పిస్తారు, కొందరు పాలతో కూడా అభిషేకము చేస్తారు. తండ్రి పిల్లలకు అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మొత్తము ఆధారమంతా యోగముపై ఉందని పిల్లలకు అర్థం చేయించడము జరుగుతుంది. యోగము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. యోగము చేసేవారికి జ్ఞాన ధారణ కూడా బాగా జరుగుతుంది. వారు తమ ధారణలో నడుస్తూ ఉంటారు, ఎందుకంటే వారు ఇతరులకు కూడా వినిపించవలసి ఉంటుంది. ఇది కొత్త విషయము. భగవంతుడు ఎవరికైతే డైరెక్టుగా వినిపించారో, వారే వింటారు, ఇక తర్వాత ఈ జ్ఞానము ఉండదు. ఇప్పుడు తండ్రి మీకు ఏదైతే వినిపిస్తున్నారో, అది ఇప్పుడు మీరు వింటున్నారు. ధారణ జరుగుతుంది, ఇక తర్వాత ప్రారబ్ధపు పాత్రను అభినయించవలసి ఉంటుంది. జ్ఞానము వినడము, వినిపించడము అనేది ఇప్పుడే జరుగుతుంది. సత్యయుగములో ఈ పాత్ర ఉండదు. అక్కడ ఉండేదే ప్రారబ్ధపు పాత్ర. మనుష్యులు బ్యారిస్టర్ చదువును చదువుతారు, ఇక తర్వాత బ్యారిస్టర్ గా అయి సంపాదిస్తారు. ఇది ఎంత గొప్ప సంపాదన, దీని గురించి ప్రపంచములోని వారికి తెలియదు. సత్యమైన బాబా మా చేత సత్యమైన సంపాదనను చేయిస్తున్నారని మీకు తెలుసు. ఇది ఎప్పుడూ దివాలా అవ్వదు. ఇప్పుడు మీరు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. ఇది మళ్ళీ 21 జన్మలు మీతోపాటు ఉంటుంది. లౌకిక సంపాదన మీతోపాటు రాదు. ఈ సంపాదన మీతోపాటు వస్తుంది కావున మీరు ఇటువంటి సంపాదనను ఆదరించాలి. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా కొందరు పదే-పదే మర్చిపోతూ ఉంటారు. తండ్రిని మరియు వారసత్వాన్ని మర్చిపోకూడదు. ముఖ్యమైన విషయము ఒక్కటే, తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వము లభిస్తుంది, 21 జన్మల కొరకు నిరోగి శరీరము ఉంటుంది. వృద్ధాప్యము వరకు అకాల మృత్యువు జరగదు. పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి. తండ్రి స్మృతి ముఖ్యమైనది, ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. తుఫానులు తీసుకువస్తుంది. అనేక రకాల తుఫానులు వస్తాయి. తండ్రిని స్మృతి చేయండి అని మీరు చెప్తారు కానీ చేయలేకపోతారు. స్మృతిలోనే చాలా మంది ఫెయిల్ అవుతారు. యోగము చాలామందిలో తక్కువగా ఉంది. ఎంత వీలైతే అంత యోగములో దృఢముగా అవ్వాలి. ఇకపోతే, బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానము పెద్ద విషయమేమీ కాదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేసినట్లయితే, నన్ను తెలుసుకున్నట్లయితే మీరు అంతా తెలుసుకుంటారు. స్మృతిలోనే అంతా ఇమిడి ఉంది. స్వీట్ బాబా అయిన శివబాబాను స్మృతి చేయాలి. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు వారే. వారు 21 జన్మల కోసం ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. సదా సుఖమయముగా, అమరులుగా తయారుచేస్తారు. మీరు అమరపురికి యజమానులుగా అవుతారు, కావున ఇటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయకపోతే మిగిలినవన్నీ గుర్తుకువచ్చేస్తాయి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఈ ఈశ్వరీయ జీవితము చాలా-చాలా అమూల్యమైనది, ఈ జీవితములో ఆత్మ మరియు శరీరము, రెండింటినీ పావనముగా తయారుచేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ, ఇతరులకు కూడా ఈ యాత్రను నేర్పించాలి. 2. ఎంత వీలైతే అంత, సత్యమైన సంపాదనలో నిమగ్నమైపోవాలి. నిరోగిగా అయ్యేందుకు స్మృతిలో దృఢముగా అవ్వాలి. వరదానము:-శరీరాన్ని ఈశ్వరీయ సేవ కోసం తాకట్టుగా భావిస్తూ కార్యములో ఉపయోగించే నష్టోమోహా భవ ఎలాగైతే ఎవరిదైనా తాకట్టు వస్తువు ఉంటే, ఆ తాకట్టు వస్తువు పట్ల నాది అనే భావన ఉండదు, మమకారము కూడా ఉండదు. అలాగే ఈ శరీరము కూడా ఈశ్వరీయ సేవ కోసం ఒక తాకట్టు వంటిది. ఈ తాకట్టును ఆత్మిక తండ్రి ఇచ్చారు కనుక తప్పకుండా ఆత్మిక తండ్రి స్మృతి ఉంటుంది. తాకట్టుగా భావించినట్లయితే ఆత్మికత వస్తుంది, ‘నాది’ అనే మమకారము ఉండదు. నిరంతర యోగులుగా, నష్టోమోహులుగా అయ్యేందుకు ఇదే సహజమైన ఉపాయము. కనుక ఇప్పుడు ఆత్మికత యొక్క స్థితిని ప్రత్యక్షము చేయండి. స్లోగన్:-వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలంటే దృష్టి-వృత్తిలో కూడా పవిత్రతను అండర్ లైన్ చేయండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ మీ యొక్క ప్రతి మాట మహాన్ గా ఉండాలి. ప్రతి మనసా సంకల్పము ప్రతి ఆత్మ పట్ల మధురముగా ఉండాలి. ప్రతి ఒక్కరినీ ఉన్నతిలోకి తీసుకువెళ్ళే స్వభావము, మధురతా స్వభావము, నిర్మానతా స్వభావము ఉండాలి. నా స్వభావమే అలాంటిది అన్న మాట ఎప్పుడూ మాట్లాడకండి. ‘నాది’ అనేది ఎక్కడి నుండి వచ్చింది! నాకు గట్టిగా మాట్లాడే స్వభావము ఉంది, నాకు ఆవేశములోకి వచ్చే స్వభావము ఉంది. స్వభావానికి వశమవ్వటము - ఇదే మాయ. ఇప్పుడు మాయాజీతులుగా అవ్వండి. అభిమానాన్ని లేక నిరాశపడే స్వభావాన్ని, ఈర్ష్యను మరియు ఆవేశములోకి వచ్చే స్వభావాన్ని ఇప్పుడు పరివర్తన చేయండి. "
#🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 17-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - పావనముగా అయినట్లయితే ఆత్మిక సేవకు యోగ్యులుగా అవుతారు, దేహీ-అభిమానీ పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు మరియు ఇతరుల చేత కూడా ఇదే యాత్రను చేయిస్తారు’’ ప్రశ్న:-సంగమములో పిల్లలైన మీరు ఏదైతే సంపాదన చేసుకుంటారో, అదే సత్యమైన సంపాదన, ఎలా? జవాబు:-ఇప్పుడు చేసుకునే సంపాదన ఏదైతే ఉందో, అది 21 జన్మల వరకు కొనసాగుతుంది, అది ఎప్పుడూ దివాలా అవ్వదు. జ్ఞానాన్ని వినడము మరియు వినిపించడము, స్మృతి చేయడము మరియు చేయించడము - ఇదే సత్యాతి-సత్యమైన సంపాదన, దీనిని సత్యాతి-సత్యమైన తండ్రియే మీకు నేర్పిస్తారు. ఇటువంటి సంపాదనను మొత్తము కల్పములో ఇంకెవ్వరూ సంపాదించలేరు. వేరే సంపాదన ఏదీ మీతో పాటు రాదు. పాట:-మేము ఆ మార్గములో నడవాలి... ▶ ఓంశాంతి. భక్తి మార్గములోనైతే పిల్లలు చాలా ఎదురుదెబ్బలు తిని ఉన్నారు. భక్తి మార్గములో చాలా భావనతో యాత్రలు చేయడానికి వెళ్తారు, రామాయణము మొదలైనవి వింటారు. ఎంత ప్రేమగా కూర్చుని కథలను వింటారంటే, అవి వింటూ-వింటూ వారికి ఏడుపు కూడా వచ్చేస్తుంది. మా భగవంతుడి యొక్క భగవతి అయిన సీతను దొంగ అయిన రావణుడు అపహరించాడు అని అది వినేటప్పుడు కూర్చుని ఏడుస్తారు. ఇవన్నీ కల్పితమైన కథలు, వీటి వల్ల లాభమేమీ లేదు. ఓ పతిత-పావనా రండి, వచ్చి దుఃఖిత ఆత్మలైన మమ్మల్ని సుఖమయముగా చేయండి అని పిలుస్తారు కూడా. కానీ, ఆత్మ దుఃఖిస్తుంది అని వారు భావించరు, ఎందుకంటే వారు ఆత్మను నిర్లేపి అని అంటారు. ఆత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనదని భావిస్తారు. ఇలా ఎందుకు అంటారు? ఎందుకంటే పరమాత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనవారు కావున వారి పిల్లలు మరి సుఖ-దుఃఖాలలోకి ఎలా వస్తారు అని భావిస్తారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞాన మార్గములో కూడా అప్పుడప్పుడు గ్రహచారము కూర్చుంటుంది, అప్పుడప్పుడు ఇంకేదో జరుగుతుంది. ఒక్కోసారి చాలా ప్రసన్నముగా ఉంటారు, ఒక్కోసారి వాడిపోయిన ముఖముతో ఉంటారు. ఇది మాయతో జరిగే యుద్ధము. మాయపైనే విజయము పొందాలి. మూర్ఛితులు అయినప్పుడు ‘మన్మనాభవ’ అనే సంజీవని మూలికను ఇవ్వడము జరుగుతుంది. భక్తి మార్గములో చాలా ఆర్భాటము ఉంటుంది. దేవతల మూర్తులను ఎంతగా అలంకరిస్తారు, సత్యమైన ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ ఆభరణాలు స్వామి యొక్క ఆస్తి అయినట్లు. స్వామి ఆస్తి అనగా పూజారులది లేక ట్రస్టీలది అవుతుంది. మేము చైతన్యములో చాలా వజ్ర-వైఢూర్యాలతో అలంకరించబడి ఉండేవారమని, మళ్ళీ పూజారులుగా అయినప్పుడు కూడా చాలా ఆభరణాలను ధరిస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఏమీ లేవు. చైతన్య రూపములో కూడా ధరించారు మరియు జడమైన రూపములోనూ ధరించారు. ఇప్పుడు ఏ ఆభరణాలు లేవు. పూర్తిగా సాధారణముగా ఉన్నారు. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోకి వస్తాను, రాజరికపు ఆర్భాటమేమీ ఉండదు. సన్యాసులు మొదలైనవారిది కూడా చాలా ఆర్భాటము ఉంటుంది. తప్పకుండా సత్యయుగములో ఆత్మలమైన మనము ఏ విధముగా పవిత్రముగా ఉండేవారము అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శరీరాలు కూడా మనవి పవిత్రముగా ఉండేవి. వారి అలంకరణ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సుందరముగా ఉంటే, వారికి అలంకరించుకునే అభిరుచి కూడా ఉంటుంది. మీరు కూడా సుందరముగా ఉన్నప్పుడు చాలా మంచి-మంచి ఆభరణాలను ధరించేవారు. వజ్రాలతో పొదగబడిన పెద్ద-పెద్ద హారాలు మొదలైనవి ధరించేవారు. ఇక్కడ ప్రతి వస్తువు నల్లగా ఉంటుంది. చూడండి, గోవులు కూడా నల్లగా అవుతూ వచ్చాయి. బాబా శ్రీనాథ ద్వారానికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలా మంచి గోవులు ఉండేవి. శ్రీకృష్ణుని గోవులను చాలా సుందరముగా చూపిస్తారు. ఇక్కడైతే కొన్ని ఒకలా, కొన్ని మరోలా ఉన్నాయి చూడండి, ఎందుకంటే ఇది కలియుగము. ఇలాంటి గోవులు అక్కడ ఉండవు. పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ అలంకరణ కూడా అక్కడ అంత సుందరముగా ఉంటుంది. ఆలోచించండి - గోవులైతే అక్కడ తప్పకుండా కావాలి. అక్కడి గోవుల పేడ కూడా ఎలా ఉంటూ ఉండవచ్చు. అందులో ఎంత శక్తి ఉంటుంది. భూమికి ఎరువు కావాలి కదా. ఎరువు వేసినట్లయితే మంచి ధాన్యము పండుతుంది. అక్కడ, అన్ని వస్తువులు మంచి శక్తి కలిగినవిగా ఉంటాయి. ఇక్కడైతే ఏ వస్తువులోనూ శక్తి లేదు. ప్రతి వస్తువు పూర్తిగా పవర్ లెస్ గా (శక్తిహీనము) అయిపోయింది. కుమార్తెలు సూక్ష్మవతనములోకి వెళ్ళేవారు. అక్కడ ఎంతో మంచి-మంచి పెద్ద ఫలాలను తినేవారు, శూబీ రసము మొదలైనవి తాగేవారు. ఇవన్నీ సాక్షాత్కారము చేయించేవారు. అక్కడ తోటమాలులు ఫలాలు మొదలైనవి ఎలా కోసి ఇస్తారు. సూక్ష్మవతనములోనైతే ఫలాలు మొదలైనవి ఉండవు. ఇదంతా సాక్షాత్కారమవుతుంది. వైకుంఠమైతే ఎంతైనా ఇక్కడే ఉంటుంది కదా. వైకుంఠము ఎక్కడో పైన ఉంటుందని మనుష్యులు భావిస్తారు. వైకుంఠము సూక్ష్మవతనములోనూ ఉండదు, మూలవతనములోనూ ఉండదు. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఏవైతే సాక్షాత్కారాలలో చూస్తారో, వాటిని తర్వాత ఈ కళ్ళ ద్వారా చూస్తారు. ఎటువంటి హోదానో, అటువంటి సామాగ్రి కూడా ఉంటుంది. రాజుల మహళ్ళు ఎంత మంచి-మంచివి ఉంటాయో చూడండి. జైపూర్ లో చాలా మంచి-మంచి మహళ్ళు నిర్మించబడ్డాయి. కేవలం ఆ మహళ్ళను చూసేందుకే మనుష్యులు వెళ్తారు, దానికి కూడా టికెట్ ఉంటుంది. ఆ మహళ్ళను విశేషముగా చూడడము కోసం తెరిచి ఉంచుతారు, స్వయం వేరే మహళ్ళలో ఉంటారు. అది కూడా కలియుగములో ఇలా ఉంటుంది. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. కానీ ఎవ్వరూ తమను తాము పతితులుగా భావించరు. మేమైతే పతితులుగా ఉండేవారము, దేనికీ కొరగానివారిగా ఉండేవారము, మళ్ళీ మేము తెల్లగా అవుతామని ఇప్పుడు మీరు భావిస్తారు. ఆ ప్రపంచమే ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఇక్కడ అమెరికా మొదలైనవాటిలో ఫస్ట్ క్లాస్ మహళ్ళు ఉన్నాయి, కానీ అక్కడి వాటితో పోలిస్తే ఇవి అసలేమీ కాదు, ఎందుకంటే ఇవి అల్పకాలికమైన సుఖాన్ని ఇచ్చేటటువంటివి. అక్కడైతే ఫస్ట్ క్లాస్ మహళ్ళు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ గోవులు ఉంటాయి. అక్కడ గోపాలులు కూడా ఉంటారు. శ్రీకృష్ణుడిని గొపాలుడని అంటారు కదా. ఇక్కడ గోవులను సంభాళించేవారు ఏమని చెప్పుకుంటారంటే - మేము గోపాలులము, శ్రీకృష్ణుని వంశానికి చెందినవారము అని. వాస్తవానికి శ్రీకృష్ణుని వంశావళి అని అనరు, శ్రీకృష్ణుని రాజధానికి చెందినవారని అంటారు. షావుకారుల వద్ద గోవులుంటే, వాటిని సంభాళించే గోపాలులు కూడా ఉంటారు. ఈ గోపాలులు అనే పేరు సత్యయుగానికి చెందినది. ఇది నిన్నటి విషయమే. నిన్న మనము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, తర్వాత పతితులుగా అయ్యాము, కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటాము. మీరు ఆది సనాతన దేవి-దేవతా ధర్మము వారా లేక హిందూ ధర్మము వారా అని అడగండి. ఈ రోజులలో అందరూ హిందువులు అని వ్రాసుకున్నారు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. బాబా ప్రశ్న అడుగుతున్నారు - ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి? శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తున్నారు. రాముడు అనగా శివబాబా యొక్క శ్రీమతమనుసారముగా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము స్థాపన అయ్యింది. ఆ తర్వాత రావణ రాజ్యము మొదలవుతుంది, వికారాలలోకి వెళ్తారు. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు హిందువులని చెప్పుకోవడము మొదలుపెడతారు. ఇప్పుడు ఎవరూ తమను తాము దేవతలు అని చెప్పుకోలేరు. రావణుడు వికారులుగా చేసాడు, తండ్రి వచ్చి నిర్వికారులుగా చేస్తారు. మీరు ఈశ్వరీయ మతము ద్వారా దేవతలుగా అవుతారు. తండ్రియే వచ్చి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తారు. మెట్లు ఎలా దిగుతారు అనేది పిల్లలైన మీ బుద్ధిలో నంబరువారుగా కూర్చుంటుంది. మిగిలిన మనుష్యులందరూ ఆసురీ మతముపై నడుస్తున్నారని మరియు మీరు ఈశ్వరీయ మతముపై నడుస్తున్నారని మీకు తెలుసు. రావణుడి మతముపై నడుస్తూ మెట్లు దిగుతూ వచ్చారు. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి నంబరు జన్మ జరుగుతుంది. ఈశ్వరీయ బుద్ధి ద్వారా మీరు మొత్తము సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. మీ ఈ జీవితము చాలా అమూల్యమైనది, ఇది సాహసముతో కూడిన జీవితము. ఈ జీవితములోనే తండ్రి వచ్చి మనల్ని ఇంత పావనముగా తయారుచేస్తున్నారు. మనము ఆత్మిక సేవకు యోగ్యులుగా అవుతాము. వారు దైహిక సమాజ సేవకులు, వారు దేహాభిమానములో ఉంటారు. మీరు దేహీ-అభిమానులు. మీరు ఆత్మలను ఆత్మిక యాత్రకు తీసుకువెళ్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు. సతోప్రధానముగా ఉన్నవారిని పావనులు అని, తమోప్రధానముగా ఉన్నవారిని పతితులు అని అంటారు. ఆత్మలోనే మాలిన్యము చేరుకుంది. ఆత్మనే సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా పవిత్రముగా అవుతారు, లేదంటే తక్కువ పవిత్రముగా అవుతారు, పాపాల భారము తలపై ఉండిపోతుంది. మొదట ఆత్మలన్నీ పవిత్రముగా ఉంటాయి, ఇక తర్వాత ప్రతి ఒక్కరి పాత్ర వేరు-వేరుగా ఉంటుంది. అందరి పాత్ర ఒకేలా ఉండదు. అందరికన్నా ఉన్నతమైన పాత్ర బాబాది, తర్వాత బ్రహ్మా-సరస్వతులది ఎంతటి పాత్ర ఉంది. ఎవరైతే స్థాపన చేస్తారో, వారే పాలన కూడా చేస్తారు. పెద్ద పాత్ర వారిదే. మొదట శివబాబా, ఆ తర్వాత బ్రహ్మా-సరస్వతులు, వారు పునర్జన్మలలోకి వస్తారు. శంకరుడైతే కేవలం సూక్ష్మ రూపాన్ని ధారణ చేస్తారు. అంతేకానీ, శంకరుడు ఏదైనా శరీరాన్ని అప్పుగా తీసుకుంటారని కాదు. శ్రీకృష్ణుడికి తనదంటూ శరీరముంది. ఇక్కడ కేవలం శివబాబా మాత్రమే శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు. పతిత శరీరములోకి, పతిత ప్రపంచములోకి వచ్చి ముక్తి-జీవన్ముక్తులలోకి తీసుకువెళ్ళే సేవను చేస్తారు. మొదట ముక్తిలోకి వెళ్ళవలసి ఉంటుంది. నాలెడ్జ్ ఫుల్ అయిన తండ్రి ఒక్కరే పతిత-పావనుడు, వారినే శివబాబా అని అంటారు. శంకరుడిని బాబా అని అంటే అది శోభించదు. శివబాబా అన్న పదము చాలా మధురమైనది. శివునిపై కొందరు జిల్లేడు పుష్పాలను అర్పిస్తారు, కొందరు ఇంకేవో అర్పిస్తారు, కొందరు పాలతో కూడా అభిషేకము చేస్తారు. తండ్రి పిల్లలకు అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మొత్తము ఆధారమంతా యోగముపై ఉందని పిల్లలకు అర్థం చేయించడము జరుగుతుంది. యోగము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. యోగము చేసేవారికి జ్ఞాన ధారణ కూడా బాగా జరుగుతుంది. వారు తమ ధారణలో నడుస్తూ ఉంటారు, ఎందుకంటే వారు ఇతరులకు కూడా వినిపించవలసి ఉంటుంది. ఇది కొత్త విషయము. భగవంతుడు ఎవరికైతే డైరెక్టుగా వినిపించారో, వారే వింటారు, ఇక తర్వాత ఈ జ్ఞానము ఉండదు. ఇప్పుడు తండ్రి మీకు ఏదైతే వినిపిస్తున్నారో, అది ఇప్పుడు మీరు వింటున్నారు. ధారణ జరుగుతుంది, ఇక తర్వాత ప్రారబ్ధపు పాత్రను అభినయించవలసి ఉంటుంది. జ్ఞానము వినడము, వినిపించడము అనేది ఇప్పుడే జరుగుతుంది. సత్యయుగములో ఈ పాత్ర ఉండదు. అక్కడ ఉండేదే ప్రారబ్ధపు పాత్ర. మనుష్యులు బ్యారిస్టర్ చదువును చదువుతారు, ఇక తర్వాత బ్యారిస్టర్ గా అయి సంపాదిస్తారు. ఇది ఎంత గొప్ప సంపాదన, దీని గురించి ప్రపంచములోని వారికి తెలియదు. సత్యమైన బాబా మా చేత సత్యమైన సంపాదనను చేయిస్తున్నారని మీకు తెలుసు. ఇది ఎప్పుడూ దివాలా అవ్వదు. ఇప్పుడు మీరు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. ఇది మళ్ళీ 21 జన్మలు మీతోపాటు ఉంటుంది. లౌకిక సంపాదన మీతోపాటు రాదు. ఈ సంపాదన మీతోపాటు వస్తుంది కావున మీరు ఇటువంటి సంపాదనను ఆదరించాలి. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా కొందరు పదే-పదే మర్చిపోతూ ఉంటారు. తండ్రిని మరియు వారసత్వాన్ని మర్చిపోకూడదు. ముఖ్యమైన విషయము ఒక్కటే, తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వము లభిస్తుంది, 21 జన్మల కొరకు నిరోగి శరీరము ఉంటుంది. వృద్ధాప్యము వరకు అకాల మృత్యువు జరగదు. పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి. తండ్రి స్మృతి ముఖ్యమైనది, ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. తుఫానులు తీసుకువస్తుంది. అనేక రకాల తుఫానులు వస్తాయి. తండ్రిని స్మృతి చేయండి అని మీరు చెప్తారు కానీ చేయలేకపోతారు. స్మృతిలోనే చాలా మంది ఫెయిల్ అవుతారు. యోగము చాలామందిలో తక్కువగా ఉంది. ఎంత వీలైతే అంత యోగములో దృఢముగా అవ్వాలి. ఇకపోతే, బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానము పెద్ద విషయమేమీ కాదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేసినట్లయితే, నన్ను తెలుసుకున్నట్లయితే మీరు అంతా తెలుసుకుంటారు. స్మృతిలోనే అంతా ఇమిడి ఉంది. స్వీట్ బాబా అయిన శివబాబాను స్మృతి చేయాలి. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు వారే. వారు 21 జన్మల కోసం ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. సదా సుఖమయముగా, అమరులుగా తయారుచేస్తారు. మీరు అమరపురికి యజమానులుగా అవుతారు, కావున ఇటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయకపోతే మిగిలినవన్నీ గుర్తుకువచ్చేస్తాయి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఈ ఈశ్వరీయ జీవితము చాలా-చాలా అమూల్యమైనది, ఈ జీవితములో ఆత్మ మరియు శరీరము, రెండింటినీ పావనముగా తయారుచేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ, ఇతరులకు కూడా ఈ యాత్రను నేర్పించాలి. 2. ఎంత వీలైతే అంత, సత్యమైన సంపాదనలో నిమగ్నమైపోవాలి. నిరోగిగా అయ్యేందుకు స్మృతిలో దృఢముగా అవ్వాలి. వరదానము:-శరీరాన్ని ఈశ్వరీయ సేవ కోసం తాకట్టుగా భావిస్తూ కార్యములో ఉపయోగించే నష్టోమోహా భవ ఎలాగైతే ఎవరిదైనా తాకట్టు వస్తువు ఉంటే, ఆ తాకట్టు వస్తువు పట్ల నాది అనే భావన ఉండదు, మమకారము కూడా ఉండదు. అలాగే ఈ శరీరము కూడా ఈశ్వరీయ సేవ కోసం ఒక తాకట్టు వంటిది. ఈ తాకట్టును ఆత్మిక తండ్రి ఇచ్చారు కనుక తప్పకుండా ఆత్మిక తండ్రి స్మృతి ఉంటుంది. తాకట్టుగా భావించినట్లయితే ఆత్మికత వస్తుంది, ‘నాది’ అనే మమకారము ఉండదు. నిరంతర యోగులుగా, నష్టోమోహులుగా అయ్యేందుకు ఇదే సహజమైన ఉపాయము. కనుక ఇప్పుడు ఆత్మికత యొక్క స్థితిని ప్రత్యక్షము చేయండి. స్లోగన్:-వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలంటే దృష్టి-వృత్తిలో కూడా పవిత్రతను అండర్ లైన్ చేయండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ మీ యొక్క ప్రతి మాట మహాన్ గా ఉండాలి. ప్రతి మనసా సంకల్పము ప్రతి ఆత్మ పట్ల మధురముగా ఉండాలి. ప్రతి ఒక్కరినీ ఉన్నతిలోకి తీసుకువెళ్ళే స్వభావము, మధురతా స్వభావము, నిర్మానతా స్వభావము ఉండాలి. నా స్వభావమే అలాంటిది అన్న మాట ఎప్పుడూ మాట్లాడకండి. ‘నాది’ అనేది ఎక్కడి నుండి వచ్చింది! నాకు గట్టిగా మాట్లాడే స్వభావము ఉంది, నాకు ఆవేశములోకి వచ్చే స్వభావము ఉంది. స్వభావానికి వశమవ్వటము - ఇదే మాయ. ఇప్పుడు మాయాజీతులుగా అవ్వండి. అభిమానాన్ని లేక నిరాశపడే స్వభావాన్ని, ఈర్ష్యను మరియు ఆవేశములోకి వచ్చే స్వభావాన్ని ఇప్పుడు పరివర్తన చేయండి. "
https://youtube.com/watch?v=cu8RGIEHOjo&si=85m0Xne7p39BWdO2 #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి
youtube-preview