#🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు
21-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానసాగరుడైన తండ్రి, పిల్లలైన మీ సమ్ముఖములో జ్ఞాన డాన్స్ చేయడానికి వచ్చారు, మీరు తెలివైనవారిగా, సేవాధారులుగా అయినట్లయితే జ్ఞాన డాన్స్ కూడా బాగా జరుగుతుంది’’
ప్రశ్న:-సంగమయుగములో పిల్లలైన మీరు ఏ హాబీ (అలవాటు) ను అలవాటు చేసుకుంటారు?
జవాబు:-స్మృతిలో ఉండే హాబీను అలవాటు చేసుకుంటారు. ఇదే ఆత్మిక హాబీ. ఈ హాబీతో పాటుగా మీరు దివ్యమైన మరియు అలౌకికమైన కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు, మీరు అందరికీ సత్యాతి-సత్యమైన కథను తప్పకుండా వినిపించాలి. సేవ చేసే హాబీ కూడా పిల్లలైన మీకు ఉండాలి.
పాట:-ఓర్పు వహించు మానవా...
▶
ఓంశాంతి. హాస్పిటల్ లో ఎవరైనా అనారోగ్యముతో ఉన్నట్లయితే, ఆ పేషెంట్ దుఃఖము నుండి విముక్తునిగా అవ్వాలని ఆశిస్తాడు. నా పరిస్థితి ఎలా ఉంది, ఈ అనారోగ్యము ఎప్పుడు నయమవుతుంది అని డాక్టరును అడుగుతారు. అవన్నీ హద్దులోని విషయాలు. ఇది అనంతమైన విషయము. తండ్రి వచ్చి పిల్లలకు సలహానిస్తారు. ఇది నిజంగానే సుఖము మరియు దుఃఖము యొక్క ఆట అని పిల్లలు తెలుసుకున్నారు. వాస్తవానికి పిల్లలైన మీకు సత్యయుగములోకి వెళ్ళేకంటే కూడా ఎక్కువ లాభము ఇక్కడే ఉంది ఎందుకంటే మీకు తెలుసు, ఈ సమయములో మనము ఈశ్వరీయ ఒడిలో ఉన్నాము, మనము ఈశ్వరీయ సంతానము. ఈ సమయములో మనకు ఎంతో ఉన్నతోన్నతమైన గుప్తమైన మహిమ ఉంది. మనుష్యమాత్రులు తండ్రిని శివుడు, ఈశ్వరుడు, భగవంతుడు అని కూడా అంటారు కానీ వారి గురించి తెలియదు, కేవలం అలా పిలుస్తూ ఉంటారు. డ్రామానుసారముగానే ఇలా జరుగుతుంది. జ్ఞానము మరియు అజ్ఞానము, పగలు మరియు రాత్రి అని కూడా పాడుతూ వచ్చారు కానీ బుద్ధి ఎంత తమోప్రధానముగా అయిపోయిందంటే, తమను తాము తమోప్రధానమని భావించనే భావించరు. ఎవరి భాగ్యములోనైతే తండ్రి యొక్క వారసత్వము ఉంటుందో, వారి బుద్ధిలోనే కూర్చోగలదు. మేము పూర్తిగా ఘోర అంధకారములో ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున ఎంతటి ప్రకాశము లభించింది. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే అర్థం చేయిస్తారో, అది ఏ వేద-శాస్త్రాలలోనూ, గ్రంథాలు మొదలైనవాటిలోనూ లేదు. ఇది కూడా తండ్రి నిరూపించి తెలియజేస్తారు. పిల్లలైన మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల ప్రకాశాన్ని ఇస్తాను, అది తర్వాత కనుమరుగైపోతుంది. నా ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా జ్ఞానము లభించదు, ఈ జ్ఞానము తర్వాత కనుమరుగైపోతుంది. కలియుగము గతించిపోయింది, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని అర్థమవుతుంది. ఇది కొత్త విషయము. ఇది శాస్త్రాలలో లేదు.
తండ్రి అయితే ఈ జ్ఞానాన్ని అందరికీ ఒకే విధముగా చదివిస్తారు కానీ ధారణలో నంబరువారుగా ఉన్నారు. కొంతమంది మంచి సర్వీసబుల్ పిల్లలు వచ్చినప్పుడు బాబా యొక్క డ్యాన్స్ కూడా అలాగే జరుగుతుంది. డ్యాన్సింగ్ గర్ల్ (నృత్యము చేసే నర్తకి) ఎదురుగా, చాలా అభిరుచితో చూసేవారు ఉన్నట్లయితే, ఆమె కూడా సంతోషముతో చాలా బాగా నాట్యము చేస్తుంది. కొద్దిమందే కూర్చుని ఉంటే, సాధారణ రీతిలో కొద్దిగా డాన్స్ చేస్తుంది. వాహ్-వాహ్ అనేవారు చాలామంది ఉంటే, ఆమెకు కూడా ఉత్సాహము పెరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మురళీని పిల్లలందరూ వింటారు, కానీ సమ్ముఖముగా వినడము వేరు కదా. శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసేవారని కూడా చూపిస్తారు. కానీ డ్యాన్స్ అంటే స్థూలమైన డ్యాన్స్ కాదు. వాస్తవానికి ఇది జ్ఞాన డ్యాన్స్. శివబాబా స్వయంగా చెప్తున్నారు - నేను జ్ఞాన డ్యాన్స్ చేయడానికి వస్తాను, నేను జ్ఞాన సాగరుడిని, కావున మంచి-మంచి పాయింట్లు వెలువడతాయి. ఇది జ్ఞాన మురళీ, అంతేకానీ చెక్క మురళీ కాదు. పతిత-పావనుడైన తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారా లేక చెక్క మురళీని వాయిస్తారా? తండ్రి వచ్చి ఈ విధముగా రాజయోగాన్ని నేర్పిస్తారు అన్నది ఎవరి ఆలోచనలోనూ ఉండదు. ఇప్పుడు ఈ విషయము మీకు తెలుసు, ఇక మిగిలిన మనుష్యమాత్రులెవ్వరి బుద్ధిలోకీ ఈ విషయము రాదు. వచ్చేవారు కూడా నంబరువారుగా పదవిని పొందుతారు. కల్పక్రితం చేసినట్లుగానే ఇప్పుడు కూడా పురుషార్థము చేస్తూ ఉంటారు. తండ్రి కల్పక్రితం వలె వస్తారని, వచ్చి పిల్లలకు అన్ని రహస్యాలను విడమర్చి చెప్తారని మీకు తెలుసు. వారు అంటారు, నేను కూడా బంధనములో బంధింపబడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారు. సత్యయుగములో ఏదైతే జరిగిందో, అదే మళ్ళీ జరుగుతుంది. ఎన్నో రకాల యోనులు ఉన్నాయి. సత్యయుగములో ఇన్ని యోనులు ఉండవు. అక్కడ కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటాయి. ధర్మాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి కదా. సత్యయుగములోనైతే ఇన్ని ధర్మాలు ఉండేవి కావు. సత్యయుగములో ఏవైతే ఉండేవో, వాటిని మళ్ళీ సత్యయుగములోనే చూస్తారు. సత్యయుగములో ఛీ-ఛీగా మురికి చేసేవేవీ ఉండవు. ఆ దేవీ-దేవతలను భగవాన్-భగవతీ అని అంటారు. వేరే ఏ ఖండములోనూ ఎప్పుడూ ఎవరినీ గాడ్-గాడెస్ అని అనలేరు. ఆ దేవతలు తప్పకుండా స్వర్గములో రాజ్యము చేసేవారు. వారికి ఎంత మహిమ ఉందో చూడండి.
పిల్లలైన మీకిప్పుడు ఓర్పు కలిగింది. మా పదవి ఎంతో ఉన్నతమైనదని లేదా ఎంతో తక్కువైనదని, మేము ఇన్ని మార్కులతో పాస్ అవుతాము అని మీకు తెలుసు. ఫలానావారు మంచి సేవను చేస్తున్నారని ప్రతి ఒక్కరు మీకు మీరు అర్థం చేసుకోగలరు కదా. అయితే, నడుస్తూ-నడుస్తూ తుఫానులు కూడా వస్తాయి. తండ్రి అంటారు, పిల్లలకు ఎటువంటి గ్రహచారము గాని, తుఫానులు మొదలైనవి గాని రాకూడదు. మాయ మంచి-మంచి పిల్లలను కూడా పడేస్తుంది. కనుక ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని తండ్రి ఓర్పునందిస్తూ ఉంటారు. మీరు సేవను కూడా చేయాలి. స్థాపన జరిగిపోయినట్లయితే ఇక వెళ్ళాల్సిందే. ఇందులో ఒక్క సెకండు కూడా ముందు-వెనుక అవ్వలేదు. ఈ రహస్యాన్ని పిల్లలే అర్థం చేసుకోగలరు. మనము డ్రామాలోని పాత్రధారులము, ఇందులో మనది ముఖ్యమైన పాత్ర. గెలుపు-ఓటముల ఆట భారత్ పైనే తయారుచేయబడింది. భారత్ యే పావనముగా ఉండేది, ఎంతో శాంతి, పవిత్రత ఉండేవి. ఇది నిన్నటి విషయమే. నిన్న మనమే పాత్రను అభినయించాము. 5 వేల సంవత్సరాల పాత్ర పూర్తిగా నిశ్చితమై ఉంది. మనము చక్రములో తిరిగి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ తండ్రితో యోగాన్ని జోడిస్తాము, దీనితోనే మాలిన్యము తొలగుతుంది. తండ్రి గుర్తుకు వచ్చినట్లయితే, వారసత్వము కూడా తప్పకుండా గుర్తుకువస్తుంది. మొట్టమొదట అల్ఫ్ (భగవంతుడు) ను తెలుసుకోవాలి. తండ్రి అంటారు, మీరు నన్ను తెలుసుకోవడముతో నా ద్వారా అంతా తెలుసుకుంటారు. జ్ఞానమైతే చాలా సులువైనది, ఇది ఒక్క సెకండుకు సంబంధించినది. అయినా కూడా అర్థం చేయిస్తూ ఉంటారు, పాయింట్లు ఇస్తూ ఉంటారు. ముఖ్యమైన పాయింటు, మన్మనాభవ, ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. దేహాభిమానము రావడముతో అనేక రకాలు ఇబ్బందులు పడతారు, అవి యోగములో ఉండనివ్వవు. భక్తి మార్గములో శ్రీకృష్ణుని స్మృతిలో కూర్చుంటారు కానీ బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెడుతుంది. భక్తిలో అందరికీ ఈ అనుభవముంది. ఇది ఈ జన్మ యొక్క విషయమే. ఈ జన్మ గురించి తెలుసుకుంటే, ఎంతోకొంత గత జన్మల గురించి కూడా తెలుసుకోగలుగుతారు. తండ్రిని స్మృతి చేయడము అనేది పిల్లలకు హాబీగా అయిపోయింది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషము పెరుగుతుంది. దీనితో పాటు దివ్యమైన అలౌకిక కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు. మీరు సత్యనారాయణ కథను, అమరకథను వినిపిస్తారు. ముఖ్యమైన విషయము ఒక్కటే - అందులోనే అన్నీ వచ్చేస్తాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ ఒక్క హాబీయే ఆత్మికమైనది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, జ్ఞానమైతే చాలా సహజమైనది. కన్యల పేరు కూడా మహిమ చేయబడింది. అదర్ కుమారీ, కుమారీ కన్య, ఇలా కుమారీల పేరు అందరికన్నా ఎక్కువ ప్రసిద్ధమైననది. వారికి ఎటువంటి బంధనము లేదు. ఆ పతి అయితే వికారీగా తయారుచేస్తాడు. ఈ తండ్రి అయితే స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు అలంకరిస్తారు, మధురమైన సాగరములోకి తీసుకువెళ్తారు. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచాన్ని పాత దేహము సహితముగా పూర్తిగా మర్చిపోండి. ఆత్మ అంటుంది - నేనైతే 84 జన్మలను పూర్తి చేసాను, ఇప్పుడు మళ్ళీ నేను తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాను. ధైర్యము ఉంచుతారు, అయినా కానీ మాయతో యుద్ధమైతే జరుగుతుంది. ముందైతే ఈ బాబా ఉన్నారు, మాయా తుఫానులు ఎక్కువగా వీరి వద్దకు వస్తాయి. బాబా, మాకు ఇలా అవుతుంది అని చాలామంది వచ్చి అడుగుతుంటారు. బాబా అంటారు - పిల్లలూ, ఈ తుఫానులైతే తప్పకుండా వస్తాయి, ఇవి ముందు నా వద్దకు వస్తాయి. అంతిమములో అందరూ కర్మాతీత అవస్థను పొందుతారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పక్రితము కూడా ఇలా జరిగింది. డ్రామాలో పాత్రను అభినయించారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. ఈ పాత ప్రపంచము నరకమని పిల్లలకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు క్షీరసాగరములో ఉండేవారని అంటారు కూడా. వీరికి ఎంత మంచి-మంచి మందిరాలను నిర్మిస్తారు. ప్రారంభములో మందిరాలను నిర్మించేటప్పుడు, పాలతోనే కొలనును తయారుచేసి, విష్ణు మూర్తిని పెట్టి ఉంటారు. చాలా మంచి-మంచి చిత్రాలను తయారుచేసి పూజించేవారు. ఆ సమయములోనైతే అన్నీ చాలా చౌకగా ఉండేవి. బాబా ఇవన్నీ చూసారు. ఈ భారత్ నిజంగా ఎంత పవిత్రముగా, క్షీరసాగరము వలె ఉండేది. పాల నదులు, నేతి నదుల ఉన్నట్లు ఉండేవి. ఈ విధముగా మహిమ చేశారు. స్వర్గము పేరు తీసుకోవడముతోనే, నోటిలో నీరు ఊరుతుంది. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. కనుక బుద్ధికి వివేకము లభించింది. బుద్ధి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్వర్గములోకి వస్తారు. అక్కడ అన్నీ కొత్తగానే ఉంటాయి. బాబా, శ్రీ నారాయణుడి మూర్తిని చూసి చాలా సంతోషపడేవారు, చాలా ప్రేమగా చూసుకునేవారు. నేనే ఇలా అవుతాను అని వారు అనుకోలేదు. ఈ జ్ఞానమైతే ఇప్పుడు బాబా నుండి లభించింది. మీకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. మనము చక్రములో ఎలా తిరుగుతాము అనేది మీకు తెలుసు. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. శరీరానికైతే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారముగా మీకు సుఖమయమైన రోజులు వస్తాయి. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని చూస్తున్నారు. మీకు మూడవ నేత్రము లభించింది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించి మీకు మంచి రీతిలో తెలుసు. ఈ స్వదర్శన చక్రము మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది, సంతోషము కలుగుతుంది. ఈ సమయములో అనంతమైన తండ్రి మనకు టీచరుగా అయి చదివిస్తారు. కానీ ఇది కొత్త విషయమైన కారణముగా పదే-పదే మర్చిపోతుంటారు. లేకపోతే బాబా అని అనడముతోనే సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కాలి. రామతీర్థుడు శ్రీకృష్ణుని భక్తునిగా ఉండేవారు కనుక శ్రీకృష్ణుని దర్శనము కోసం ఎంత చేసేవారు. అతనికి సాక్షాత్కారము కలిగింది, సంతోషపడ్డారు. కానీ దాని వలన ఏమి జరిగింది, ఏమీ లభించలేదు. ఇక్కడైతే పిల్లలైన మీకు సంతోషము కూడా ఉంది ఎందుకంటే మనము 21 జన్మల కొరకు ఇంతటి ఉన్నతమైన పదవిని పొందుతామని మీకు తెలుసు. మూడు వంతులు అయితే మీరు సుఖముగా ఉంటారు. ఒకవేళ సగం-సగం ఉన్నట్లయితే ఇక లాభము లేనట్లు. మీరు మూడు వంతులు సుఖములో ఉంటారు. మీ అంతటి సుఖాన్ని ఎవ్వరూ చూడలేరు. మీకైతే అపారమైన సుఖముంటుంది. మహాన్ సుఖములోనైతే దుఃఖము గురించి తెలియదు. ఇప్పుడు మేము దుఃఖము నుండి సుఖములోకి వెళ్తున్నామని సంగమములో మీరు రెండింటి గురించి తెలుసుకుంటారు. ముఖము పగలు వైపు మరియు కాళ్ళు రాత్రి వైపు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని కాలదన్నాలి అనగా బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని ఆత్మకు తెలుసు, చాలా పాత్రను అభినయించారు. ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగానే తుప్పు తొలగుతుంది. ఎంతగా తండ్రి సేవలో ఉంటూ తమ సమానముగా తయారుచేస్తారో, అంతగానే తండ్రిని ప్రత్యక్షము చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉంది. కనుక ఇంటినే స్మృతి చేయాలి. పాత ఇల్లు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఇల్లు ఎక్కడ, పాత ఇల్లు ఎక్కడ. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. ఇది అదే విషయ-వైతరణి నది. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు, గొడవపడుతూ ఉంటారు. ఇకపోతే తండ్రి వచ్చినప్పుడు కూడా చాలా గొడవలు మొదలయ్యాయి. ఒకవేళ పత్ని వికారాలను అందించకపోతే ఎంతగా విసిగిస్తారు, ఎంతగా తల కొట్టుకుంటారు. కల్పక్రితం కూడా అత్యాచారాలు జరిగాయి. ఇప్పటి విషయాల గురించే చెప్పుకుంటారు. ఎంతగా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు అనేది చూస్తుంటారు. డ్రామాలోని అదే పాత్ర మళ్ళీ నడుస్తుంది. ఇది తండ్రికి తెలుసు మరియు పిల్లలకు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మున్ముందు అందరికీ అర్థమవుతుంది. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత తండ్రి అని పాడుతారు కూడా. భారత్ స్వర్గముగా మరియు నరకముగా ఎలా అవుతుంది అనేది మీరెవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు వచ్చినట్లయితే మేము మీకు మొత్తము ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాల గురించి అర్థం చేయిస్తామని చెప్పాలి. ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికాలు ఈశ్వరునికే తెలుసు మరియు ఈశ్వరుని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవడముతో, పవిత్రత, సుఖ-శాంతుల స్థాపన ఎలా జరుగుతుంది అనేదంతా మీరు తెలుసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి మీరు తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే తీసుకుంటారు. మీరు వచ్చి ఇది అర్థం చేసుకోండి. టాపిక్స్ చాలా ఉన్నాయి. పిల్లలైన మీకైతే ఇప్పుడు బుద్ధి నిండుగా అయిపోయింది. సంతోషము యొక్క పాదరసము ఎంతగా పైకి ఎక్కింది. మొత్తం జ్ఞానమంతా పిల్లలైన మీ వద్ద ఉంది. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి నాలెడ్జ్ లభిస్తోంది. ఆ తర్వాత మనమే వెళ్ళి లక్ష్మీ-నారాయణలుగా అవుతాము. అక్కడ మళ్ళీ ఈ జ్ఞానమేమీ ఉండదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన ఎంతటి గుహ్యమైన విషయాలు. పిల్లలు మెట్ల వరుస చిత్రాన్ని మంచి రీతిలో అర్థం చేసుకున్నారు కదా. ఈ చక్రము 84 జన్మలది. ఇప్పుడు మనుష్యులకు కూడా స్పష్టముగా అర్థం చేయించాలి. దీనిని ఇప్పుడు స్వర్గము లేక పావన ప్రపంచమని అనరు. సత్యయుగము వేరు, కలియుగము వేరు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది సులువుగా అర్థం చేయించవచ్చు. వివరణ మంచిగా అనిపిస్తుంది. కానీ పురుషార్థము చేసి స్మృతియాత్రలో ఉండాలి, ఇది చాలామంది చేయలేకపోతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత దేహాన్ని మరియు పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచి తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇప్పుడు మా సుఖమయమైన రోజులు ఇక వచ్చేసాయని సదా ఇదే సంతోషములో ఉండాలి.
2. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి ఏ నాలెడ్జ్ అయితే లభించిందో, దానిని స్మరణ చేస్తూ బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడూ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడకూడదు.
వరదానము:-సదా ఏకరస స్థితి అనే సింహాసనముపై విరాజమానమై ఉండే బాప్ దాదా హృదయ సింహాసనాధికారి భవ
అన్నింటికంటే శ్రేష్ఠమైన సింహాసనము బాప్ దాదా హృదయ సింహాసనాధికారిగా అవ్వడము. కానీ ఈ సింహాసనముపై కూర్చునేందుకు అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితి యొక్క సింహాసనము కావాలి. ఒకవేళ ఈ స్థితి అనే సింహాసనముపై స్థితులవ్వలేకపోతే బాప్ దాదా యొక్క హృదయము రూపీ సింహాసనముపై స్థితులవ్వలేరు. దీని కోసం తమ భృకుటి సింహాసనముపై అకాలమూర్తులుగా అయి స్థితులవ్వండి, ఈ సింహాసనముపై మాటిమాటికి అలజడి చెందకూడదు, అప్పుడే బాప్ దాదా హృదయ సింహాసనముపై విరాజమానమవ్వగలరు.
స్లోగన్:-శుభ చింతన ద్వారా నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేయండి.
అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
బ్రహ్మాబాబా తన పిల్లలు ప్రతి ఒక్కరి ముఖములో, ఒకటేమో - సదా ఆత్మికతకు చెందిన చిరునవ్వును చూడాలనుకుంటారు మరియు రెండవది - నోటి నుండి సదా మధురమైన మాటలను వినాలనుకుంటారు. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు, ముఖముపై ఆత్మికత ఉండాలి, నోటిలో మధురత ఉండాలి మరియు మనసు-బుద్ధిలో సదా శుభ భావన, దయా హృదయము కల భావన, దాతాతనపు భావన ఉండాలి. ప్రతి అడుగులోనూ ఫాలో ఫాదర్ చేయాలి, ఇదే పాలనకు రిటర్న్గా ఇవ్వండి.
"

