#📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱
17-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు అమరలోకాన్ని స్థాపన చేయడానికి నిమిత్తులు, అక్కడ ఎటువంటి దుఃఖము లేక పాపము ఉండదు, అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము’’
ప్రశ్న:-గాడ్లీ ఫ్యామిలీలోని అద్భుతమైన ప్లాన్ ఏది?
జవాబు:-గాడ్లీ ఫ్యామిలీ యొక్క ప్లాన్ ఏమిటంటే - ‘‘ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) చేయడము’’. ఒక్క సత్య ధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మాలను వినాశనము చేయడము. మనుష్యులు కుటుంబ నియంత్రణ చేయడానికి ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు, తండ్రి అంటారు, వారి ప్లాన్లు సఫలమవ్వవు. నేనే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను, అప్పుడు ఇతర ఆత్మలందరూ పైన ఉన్న ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది ఆత్మలే మిగిలి ఉంటారు.
ఓంశాంతి. ఇది ఇల్లు కూడా, విశ్వవిద్యాలయము కూడా మరియు సంస్థ కూడా. వారు శివబాబా అని పిల్లలైన, ఆత్మలైన మీకు తెలుసు. ఆత్మలు సాలిగ్రామాలు. ఇది ఆత్మ యొక్క శరీరము. ఇది నా ఆత్మ అని శరీరము చెప్పదు. ఇది నా శరీరమని ఆత్మ చెప్తుంది. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మన బాబా శివుడు, వారు సుప్రీమ్ తండ్రి. వారు మన సుప్రీమ్ బాబా కూడా అని ఆత్మకు తెలుసు. వారే సుప్రీమ్ టీచర్ కూడా, సుప్రీమ్ గురువు కూడా. ఓ గాడ్ ఫాదర్ అని భక్తి మార్గములో కూడా పిలుస్తారు. మరణించే సమయములో కూడా - ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా అని అంటారు. పిలుస్తారు కదా. కానీ ఎవరి బుద్ధిలోనూ యథార్థముగా కూర్చోదు. ఆత్మలందరికీ తండ్రి అయితే ఒక్కరే, వారినే ఓ పతిత-పావనా అని అంటారు. అంటే వారు గురువుగా కూడా అయినట్లు. దుఃఖము నుండి మమ్మల్ని విడిపించి శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు. కావున వారు తండ్రి కూడా మరియు పతిత-పావనుడైన సద్గురువు కూడా. తర్వాత సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, మనుష్యులు 84 జన్మలను ఎలా తీసుకుంటారు, ఆ అనంతమైన చరిత్ర-భౌగోళికాన్ని వినిపిస్తారు కావున వారు సుప్రీమ్ టీచరుగా కూడా అయినట్లు. అజ్ఞాన కాలములో తండ్రి వేరు, టీచరు వేరు, గురువు వేరుగా ఉంటారు. ఇక్కడ అనంతమైన తండ్రి, టీచరు, గురువు అన్నీ ఒక్కరే. ఎంత తేడా ఉంది. అనంతమైన తండ్రి తమ పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఆ తండ్రి కూడా హద్దు వారసత్వాన్ని ఇస్తారు. ఆ చదువు కూడా హద్దులోనిది. ప్రపంచ చరిత్ర-భౌగోళికము గురించి ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీ-నారాయణులు రాజ్యాన్ని ఎలా పొందారు, ఆ రాజ్యము ఎంత సమయము కొనసాగింది, ఆ తర్వాత త్రేతాలో సీతా-రాములు ఎంత సమయము రాజ్యము చేసారు అనేది ఎవరికీ ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి మనల్ని చదివించడానికి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు. అలాగే బాబా సద్గతి యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ పతితులుగా అవుతారు. ఇప్పుడు పావనముగా అవ్వాలి. ఇది తమోప్రధానమైన ప్రపంచము. ప్రతి వస్తువు సతో, రజో, తమోలలోకి వస్తుంది. ఈ సృష్టికి కూడా ఆయువు ఉంది, కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఇది అందరికీ తెలుసు. సత్యయుగములో భారత్ యే ఉండేది, అందులో దేవీ-దేవతల రాజ్యముండేది. గాడ్-గాడెస్ యొక్క రాజ్యముండేది. అచ్ఛా, తర్వాత ఏం జరిగింది? వారు పునర్జన్మలు తీసుకున్నారు. సతోప్రధానము నుండి సతో, సతో నుండి రజో, తమోలలోకి వచ్చారు. ఇన్ని-ఇన్ని జన్మలు తీసుకున్నారు. భారత్ లో 5 వేల సంవత్సరాల క్రితము లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు అక్కడ మనుష్యుల ఆయుష్షు సుమారుగా 125-150 సంవత్సరాలు ఉంటుంది. దానిని అమరలోకమని అంటారు. అక్కడ అకాల మృత్యువులు ఎప్పుడూ జరగవు. ఇది మృత్యులోకము. అమరలోకములో మనుష్యులు అమరులుగా ఉంటారు, ఆయుష్షు ఎక్కువ ఉంటుంది. సత్యయుగములో పవిత్ర గృహస్థ ఆశ్రమముండేది. దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారు. ఇప్పుడిది వికారీ ప్రపంచము. మేము శివబాబా సంతానమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారసత్వము శివబాబా నుండి లభిస్తుంది. ఇతను దాదా (అన్నయ్య), వారు తాతగారు. వారసత్వము తాతగారి నుండి లభిస్తుంది. తాతగారి ఆస్తిపై అందరికీ హక్కు ఉంటుంది. బ్రహ్మాను ప్రజాపిత అని అంటారు. వారిని ఆడమ్-ఈవ్, ఆదమ్-బీబీ అని అంటారు. వారు నిరాకార గాడ్ ఫాదర్. వీరు (ప్రజాపిత) సాకార తండ్రి అయినట్లు. వీరికి తమదంటూ శరీరము ఉంది. శివబాబాకు తమదంటూ శరీరము లేదు. కావున మీకు శివబాబా నుండి బ్రహ్మా ద్వారా వారసత్వము లభిస్తుంది. తాతగారి ఆస్తి తండ్రి ద్వారా లభిస్తుంది కదా. అలా శివబాబా నుండి కూడా బ్రహ్మా ద్వారా లభిస్తుంది, మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి ఎంతో సమయము పట్టదు... అని అంటారు. అలా ఎవరు తయారుచేసారు? భగవంతుడు. గ్రంథ్ లో (సిక్కుల ధర్మ గ్రంథములో) ఈ విధముగా మహిమ చేస్తారు కదా. వారికి చాలా మహిమ ఉంది. అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేస్తే బే అనగా రాజ్యాధికార వారసత్వము మీకు లభిస్తుంది అని బాబా అంటారు కదా. అదే విధముగా గురునానక్ కూడా సాహెబ్ ను జపిస్తే సుఖము లభిస్తుంది అని అంటారు. ఆ నిరాకార అకాలమూర్తి అయిన తండ్రి మహిమనే పాడుతారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తే సుఖము లభిస్తుంది. ఇప్పుడు తండ్రినే స్మృతి చేస్తారు. యుద్ధము పూర్తి అయిన తర్వాత లక్ష్మీ-నారాయణుల రాజ్యములో ఒకే ధర్మముంటుంది. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. భగవానువాచ - పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు అని భగవంతుడిని అనడము జరుగుతుంది. వారే దుఃఖహర్త-సుఖకర్త. మనము ఆ తండ్రికి పిల్లలము కావున తప్పకుండా మనము సుఖములో ఉండాలి. తప్పకుండా భారతవాసులు సత్యయుగములో ఉండేవారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామములో ఉండేవారు. ఇప్పుడైతే ఆత్మలందరూ ఇక్కడికి వస్తున్నారు. తర్వాత మనము వెళ్ళి దేవీ-దేవతలుగా అవుతాము. స్వర్గములో పాత్రను అభినయిస్తాము. ఈ పాత ప్రపంచము దుఃఖధామము, కొత్త ప్రపంచము సుఖధామము. ఇల్లు పాతదిగా అయినప్పుడు దాని నుండి ఎలుకలు, పాములు మొదలైనవి బయటకు వస్తాయి. ఈ ప్రపంచము కూడా అటువంటిదే. ఈ కల్పము యొక్క ఆయువు 5 వేల సంవత్సరాలు. ఇప్పుడు ఇది అంతిమము. గాంధీగారు కూడా కొత్త ప్రపంచము, కొత్త ఢిల్లీ, రామ రాజ్యము ఉండాలని కోరుకునేవారు. కానీ ఇది కేవలం తండ్రి యొక్క కర్తవ్యమే. దేవతల రాజ్యాన్నే రామ రాజ్యమని అంటారు. కొత్త ప్రపంచములోనైతే తప్పకుండా లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంటుంది. మొదట రాధా-కృష్ణులు ఇరువురూ వేర్వేరు రాజధానులకు చెందినవారిగా ఉండేవారు, వారి వివాహము జరిగిన తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. వారు తప్పకుండా ఈ సమయములో అటువంటి కర్మలను చేస్తూ ఉండవచ్చు. తండ్రి కూర్చుని మీకు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తారు. రావణ రాజ్యములో మనుష్యులు ఏ కర్మలనైతే చేస్తారో, ఆ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగములో కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఉంది కానీ పేరు మార్చేసారు. ఇది పొరపాటు. కృష్ణ జయంతి సత్యయుగములో జరుగుతుంది. శివుడు నిరాకార పరమపిత, శ్రీకృష్ణుడు సాకారములో ఉన్నవారు. మొదట శివజయంతి జరుగుతుంది, ఆ తర్వాత శ్రీకృష్ణ జయంతిని భారత్ లోనే జరుపుకుంటారు. శివరాత్రి అని అంటారు. తండ్రి వచ్చి భారత్ కు స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. శివజయంతి తర్వాతనే కృష్ణ జయంతి ఉంటుంది. ఆ రెండింటికీ మధ్యన రాఖీ ఉంటుంది ఎందుకంటే పవిత్రత కావాలి. పాత ప్రపంచ వినాశనము కూడా జరగాలి. తర్వాత యుద్ధము మొదలైతే అందరూ సమాప్తమైపోతారు, అప్పుడు మీరు వచ్చి కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు. మీరు ఈ పాత ప్రపంచము, మృత్యులోకము కోసం చదవరు. మీ చదువు కొత్త ప్రపంచమైన అమరలోకము కోసం. ఇటువంటి కాలేజి ఇంకేదీ ఉండదు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇది మృత్యులోకము యొక్క అంతిమము, అందుకే త్వరగా చదువుకుని తెలివైనవారిగా అవ్వాలి. వారు తండ్రి కూడా, పతిత-పావనుడు కూడా, వారు చదివిస్తారు కూడా. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ (విశ్వవిద్యాలయము). భగవానువాచ కదా. కృష్ణుడైతే సత్యయుగ రాజకుమారుడు. వారు కూడా శివబాబా నుండి వారసత్వము తీసుకుంటారు. ఈ సమయములో అందరూ భవిష్యత్తు కోసం వారసత్వము తీసుకుంటున్నారు, ఇక ఎంత చదువుకుంటారో అంత వారసత్వము లభిస్తుంది. చదువుకోకపోతే పదవి తగ్గిపోతుంది. ఎక్కడ ఉన్నా సరే చదువుకుంటూ ఉండండి. మురళీ అయితే విదేశాలకు కూడా వెళ్ళగలదు. బాబా ప్రతి రోజూ అటెన్షన్ ను కూడా ఇప్పిస్తూ ఉంటారు. పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి, దీని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మలో ఏదైతే మాలిన్యము చేరిందో, అది తొలగిపోతుంది. ఆత్మ 100 శాతము పవిత్రముగా అవ్వనున్నది. ఇప్పుడు అపవిత్రముగా ఉంది. భక్తినైతే మనుష్యులు చాలానే చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలకు, మేళాలకు లక్షలాదిమంది మనుష్యులు వెళ్తారు. ఇది జన్మజన్మలుగా కొనసాగుతూ వస్తుంది. ఎన్ని మందిరాలు మొదలైనవి తయారుచేస్తారు, శ్రమిస్తారు. అయినా కానీ మెట్లు దిగుతూనే వస్తారు. మనము ఎక్కే కళ ద్వారా సుఖధామములోకి వెళ్తామని, మళ్ళీ మనము కిందకు దిగి రావాలని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత తప్పకుండా కొత్త ఇంటి యొక్క వైభవము తగ్గిపోతుంది. మీరు కొత్త ప్రపంచమైన సత్యయుగములో ఉండేవారు. 1250 సంవత్సరాల తర్వాత రామ రాజ్యము ప్రారంభమయ్యింది, ఇప్పుడైతే పూర్తిగా తమోప్రధానముగా ఉంది. ఎంతమంది మనుష్యులైపోయారు. ప్రపంచము పాతదైపోయింది. వాళ్ళు అయితే ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) కోసం ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు. ఎంతగా తికమకపడుతూ ఉంటారు. ఇదైతే గాడ్ ఫాదర్ (భగవంతుని) యొక్క కర్తవ్యమేనని మనము వ్రాస్తాము. సత్యయుగములో 9-10 లక్షలమంది మనుష్యులు వెళ్ళి ఉంటారు. మిగిలినవారందరూ తమ ఇల్లు అయిన స్వీట్ హోమ్ కు వెళ్ళిపోతారు. ఇది గాడ్లీ ఫ్యామిలీ ప్లానింగ్ (ఈశ్వరీయ కుటుంబ నియంత్రణ). ఏక ధర్మ స్థాపన, మిగిలిన ధర్మాలన్నిటి వినాశనము జరుగుతుంది. తండ్రి తమ కార్యాన్ని చేస్తున్నారు. బయటివారు - వికారాలలోకి వెళ్ళవచ్చు కానీ పిల్లలు కలగకూడదని అంటారు. అలా చేయడము వలన లాభమేమీ ఉండదు. ఈ ప్లానింగ్ అయితే అనంతమైన తండ్రి చేతిలో ఉంది. తండ్రి అంటారు, నేనే దుఃఖధామాన్ని సుఖధామముగా తయారుచేయడానికి వచ్చాను. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆదిలో నేను వస్తాను. ఇప్పుడిది సంగమము, ఈ సమయములో పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచముగా తయారవుతుంది. పాత ప్రపంచ వినాశనము మరియు కొత్త ప్రపంచ స్థాపన చేయడము అనేది తండ్రి కర్తవ్యమే. సత్యయుగములో ఒకే ధర్మముండేది. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా, మహారాజు-మహారాణులుగా ఉండేవారు. ఎవరి మాల తయారయ్యింది అనేది కూడా మీకు తెలుసు. పైన పుష్పము అయిన శివబాబా ఉన్నారు, ఆ తర్వాత జంట పూసలైన బ్రహ్మా-సరస్వతులు ఉన్నారు. ఎవరైతే విశ్వాన్ని నరకము నుండి స్వర్గముగా, పతితము నుండి పావనముగా తయారుచేస్తారో, వారిదే ఈ మాల. ఎవరైతే సేవ చేసి వెళ్తారో, వారి స్మృతే ఉంటుంది. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - వీరు సత్యయుగములో పవిత్రముగా ఉండేవారు కదా. ప్రవృత్తి మార్గము పవిత్రముగా ఉండేది. ఇప్పుడు పతితమైపోయింది. పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని పాడుతారు కూడా. సత్యయుగములో ఈ విధముగా పిలవరు. సుఖములో ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయరు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు. తండ్రి ఉన్నదే లిబరేటర్ (ముక్తిప్రదాత), దయాహృదయుడు, బ్లిస్ ఫుల్ (ఆనందసాగరుడు), వారు వచ్చి అందరికీ ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. మీరు వచ్చి స్వీట్ హోమ్ కు తీసుకువెళ్ళండి అని పిలవడము కూడా వారినే పిలుస్తారు. ఇప్పుడు సుఖము లేదు. ఇది ప్రజలపై ప్రజల రాజ్యము. సత్యయుగములోనైతే రాజు, రాణి, ప్రజలు ఉంటారు. మీరు విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు అనేది తండ్రి తెలియజేస్తున్నారు. అక్కడ మీ వద్ద అపారమైన, లెక్కలేనంత ధనముంటుంది. బంగారు ఇటుకలతో ఇళ్ళు తయారవుతాయి. మిషన్ల నుండి బంగారు ఇటుకలు వెలువడుతూ ఉంటాయి. ఇటుకలలో కూడా వజ్ర-వైఢూర్యాలను పొదుగుతారు. ద్వాపరములో కూడా ఎన్ని వజ్రాలు ఉండేవి, వాటిని దోచుకుని తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడైతే కొంచెము కూడా బంగారము కనిపించదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి అంటారు, నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను. పాత ప్రపంచ వినాశనము కోసం ఎటామిక్ బాంబులు మొదలైనవి తయారుచేయబడి ఉన్నాయి. ఇది సైన్స్. బుద్ధి ద్వారా ఎటువంటి వస్తువులను తయారుచేసారంటే, వాటి ద్వారా తమ కులము యొక్క వినాశనమే చేసుకుంటారు. బాంబులను ఉంచుకునేందుకు ఏమీ తయారుచేయరు. ఈ రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. రాజధాని స్థాపన అవ్వనంత వరకు యుద్ధము ప్రారంభమవ్వదు. ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి, వాటితోపాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇంతమంది మనుష్యులు ఉండరు.
ఇప్పుడు పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. కేవలం స్వీట్ హోమ్ ను, స్వర్గ రాజ్యాధికారాన్ని స్మృతి చేయాలి. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు బుద్ధిలో కొత్త ఇల్లే గుర్తుంటుంది కదా. ఇప్పుడు కూడా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. తండ్రి సర్వుల సద్గతిదాత. ఆత్మలందరూ వెళ్ళిపోతారు. ఇకపోతే శరీరాలు ఇక్కడే సమాప్తమైపోతాయి. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పవిత్రముగా అవుతుంది. పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. దేవతలు పవిత్రమైనవారు కదా. వారి ముందు ఎప్పుడూ కూడా బీడీ, పొగాకు మొదలైనవి ఉంచరు, వారు వైష్ణవులు. దానిని విష్ణుపురి అని అంటారు. అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము. ఇది వికారీ ప్రపంచము. ఇప్పుడు నిర్వికారీ ప్రపంచములోకి వెళ్ళాలి. ఇంకా కొంత సమయము మాత్రమే మిగిలి ఉంది. ఎటామిక్ బాంబుల ద్వారా అందరూ సమాప్తమైపోతారని స్వయము కూడా అర్థం చేసుకుంటారు. యుద్ధమైతే జరగవలసిందే. మాకు ఎవరో ప్రేరణ ఇస్తున్నారు కావున మేము వీటిని తయారుచేస్తున్నామని వారు అంటారు. వారి కులము వినాశనము అవుతుందని తెలిసినా కానీ తయారుచేయకుండా ఉండలేరు. శంకరుని ద్వారా వినాశనము, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. జ్ఞాన యజ్ఞము ద్వారా ఈ వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఈ పాత ప్రపంచము వినాశనమై కొత్తదిగా తయారవుతుంది. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. హిస్టరీ మస్ట్ రిపీట్ (చరిత్ర తప్పకుండా రిపీట్ అవ్వవలసిందే). మొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది, ఆ తర్వాత చంద్రవంశీ క్షత్రియ ధర్మము, ఆ తర్వాత ఇస్లామీయులు, బౌద్ధులు మొదలైనవారు వచ్చారు, ఆ తర్వాత తప్పకుండా మొదటి నంబరువారే వస్తారు, మిగిలినవారంతా వినాశనమైపోతారు. పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? ఆ నిరాకార శివబాబా. వారే శిక్షకుడు, సద్గురువు. వారు రాగానే చదివించడము ప్రారంభిస్తారు, అందుకే శివ జయంతియే గీతా జయంతి, గీతా జయంతియే శ్రీకృష్ణ జయంతి అని వ్రాయబడి ఉంది. శివబాబా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. కృష్ణపురి అని సత్యయుగాన్ని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని చదివించేవారు ఏ సాధువులు, సత్పురుషులు లేక మనుష్యులు కాదు. వారు దుఃఖహర్త-సుఖకర్త, అనంతమైన తండ్రి. 21 జన్మల కొరకు మీకు వారసత్వాన్ని ఇస్తారు. వినాశనమైతే జరగవలసిందే. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు... అని ఈ సమయము కోసమే అనడము జరుగుతుంది. దొంగతనాలు కూడా చాలా జరుగుతాయి, నిప్పు కూడా అంటుకోనున్నది. ఈ యజ్ఞములో అంతా స్వాహా అయిపోతుంది. ఇప్పుడు కొద్ది-కొద్దిగా నిప్పు అంటుకుంటుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇంకా కొంత సమయము మిగిలి ఉంది. అందరూ పరస్పరములో కొట్లాడుకుంటారు. విడిపించేవారు ఎవరూ ఉండరు. రక్తపు నదుల తర్వాత పాల నదులు ప్రవహిస్తాయి. దీనిని అనవసరమైన రక్తసిక్తపు ఆట అని అంటారు. పిల్లలు సాక్షాత్కారాన్ని కూడా చూసారు, తర్వాత ఈ కళ్ళతో కూడా చూస్తారు. వినాశనానికి ముందే తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతుంది. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి మిమ్మల్ని తయారుచేస్తున్నారు. రాజధాని పూర్తిగా స్థాపన అయిపోయిన తర్వాత వినాశనము జరుగుతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. విష్ణుపురిలోకి వెళ్ళేందుకు స్వయాన్ని యోగ్యులుగా తయారుచేసుకోవాలి. సంపూర్ణ పావనముగా అవ్వాలి, అశుద్ధ ఆహార-పానీయాలను త్యాగము చేయాలి. వినాశనానికి ముందే తమ సర్వస్వాన్ని సఫలము చేసుకోవాలి.
2. త్వరత్వరగా చదువుకుని తెలివైనవారిగా అవ్వాలి. వికర్మలేవీ జరగకుండా అటెన్షన్ పెట్టాలి.
వరదానము:-ఫిర్యాదులను యాద్ (స్మృతి)లోకి పరివర్తన చేసే స్వతహా మరియు నిరంతర యోగీ భవ
సంగమయుగపు విశేషత ఏమిటంటే - ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము. ఇప్పుడే స్మృతి స్వరూపము, ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవము. భవిష్యత్తు యొక్క గ్యారంటీ అయితే ఉండనే ఉంది. కానీ భవిష్యత్తు కన్నా శ్రేష్ఠ భాగ్యము ఇప్పటిదే. ఈ భాగ్యపు నషాలో ఉన్నట్లయితే స్వతహాగా స్మృతి ఉంటుంది. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదులు ఉండవు. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఇది జరగడము లేదు, కొద్దిగా సహాయము చేయండి - ఇవన్నీ ఫిర్యాదులు. కావున ఫిర్యాదులను వదిలి స్వతహా యోగులుగా, నిరంతర యోగులుగా అవ్వండి.
స్లోగన్:-ఎవరైతే స్వయాన్ని అతిథులుగా భావిస్తూ నడుచుకుంటారో వారే మహాన్ స్థితిని అనుభవము చేస్తారు.
అవ్యక్త సూచనలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి
సంగఠన యొక్క బలము, స్నేహము యొక్క బలము, ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకునే బలము మరియు సహనశీలతా బలము, వీటిని జమ చేసుకున్నట్లయితే మాయ ఎప్పుడూ దాడి చెయ్యలేదు, అప్పుడు జయజయకారాలతో కూడిన నినాదము వెలువడుతుంది. ఎప్పుడైతే ఇంతమంది అనేకులుగా ఉంటూ కూడా ఒక్కరిగా కనిపిస్తారో, ఒక్కరి లగనములో మగ్నమై, ఏకరస స్థితిలో స్థితులై ఉంటారో, అప్పుడు ప్రత్యక్షతా గుర్తులు కనిపిస్తాయి. మీ అందరి ప్రతిజ్ఞయే ప్రత్యక్షతను సమీపముగా తీసుకువస్తుంది.
"