v. v. guptha
ShareChat
click to see wallet page
@299580595
299580595
v. v. guptha
@299580595
ఐ లవ్ షేర్ చాట్
#📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 17-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు అమరలోకాన్ని స్థాపన చేయడానికి నిమిత్తులు, అక్కడ ఎటువంటి దుఃఖము లేక పాపము ఉండదు, అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము’’ ప్రశ్న:-గాడ్లీ ఫ్యామిలీలోని అద్భుతమైన ప్లాన్ ఏది? జవాబు:-గాడ్లీ ఫ్యామిలీ యొక్క ప్లాన్ ఏమిటంటే - ‘‘ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) చేయడము’’. ఒక్క సత్య ధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మాలను వినాశనము చేయడము. మనుష్యులు కుటుంబ నియంత్రణ చేయడానికి ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు, తండ్రి అంటారు, వారి ప్లాన్లు సఫలమవ్వవు. నేనే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను, అప్పుడు ఇతర ఆత్మలందరూ పైన ఉన్న ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది ఆత్మలే మిగిలి ఉంటారు. ఓంశాంతి. ఇది ఇల్లు కూడా, విశ్వవిద్యాలయము కూడా మరియు సంస్థ కూడా. వారు శివబాబా అని పిల్లలైన, ఆత్మలైన మీకు తెలుసు. ఆత్మలు సాలిగ్రామాలు. ఇది ఆత్మ యొక్క శరీరము. ఇది నా ఆత్మ అని శరీరము చెప్పదు. ఇది నా శరీరమని ఆత్మ చెప్తుంది. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మన బాబా శివుడు, వారు సుప్రీమ్ తండ్రి. వారు మన సుప్రీమ్ బాబా కూడా అని ఆత్మకు తెలుసు. వారే సుప్రీమ్ టీచర్ కూడా, సుప్రీమ్ గురువు కూడా. ఓ గాడ్ ఫాదర్ అని భక్తి మార్గములో కూడా పిలుస్తారు. మరణించే సమయములో కూడా - ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా అని అంటారు. పిలుస్తారు కదా. కానీ ఎవరి బుద్ధిలోనూ యథార్థముగా కూర్చోదు. ఆత్మలందరికీ తండ్రి అయితే ఒక్కరే, వారినే ఓ పతిత-పావనా అని అంటారు. అంటే వారు గురువుగా కూడా అయినట్లు. దుఃఖము నుండి మమ్మల్ని విడిపించి శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు. కావున వారు తండ్రి కూడా మరియు పతిత-పావనుడైన సద్గురువు కూడా. తర్వాత సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, మనుష్యులు 84 జన్మలను ఎలా తీసుకుంటారు, ఆ అనంతమైన చరిత్ర-భౌగోళికాన్ని వినిపిస్తారు కావున వారు సుప్రీమ్ టీచరుగా కూడా అయినట్లు. అజ్ఞాన కాలములో తండ్రి వేరు, టీచరు వేరు, గురువు వేరుగా ఉంటారు. ఇక్కడ అనంతమైన తండ్రి, టీచరు, గురువు అన్నీ ఒక్కరే. ఎంత తేడా ఉంది. అనంతమైన తండ్రి తమ పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఆ తండ్రి కూడా హద్దు వారసత్వాన్ని ఇస్తారు. ఆ చదువు కూడా హద్దులోనిది. ప్రపంచ చరిత్ర-భౌగోళికము గురించి ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీ-నారాయణులు రాజ్యాన్ని ఎలా పొందారు, ఆ రాజ్యము ఎంత సమయము కొనసాగింది, ఆ తర్వాత త్రేతాలో సీతా-రాములు ఎంత సమయము రాజ్యము చేసారు అనేది ఎవరికీ ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి మనల్ని చదివించడానికి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు. అలాగే బాబా సద్గతి యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ పతితులుగా అవుతారు. ఇప్పుడు పావనముగా అవ్వాలి. ఇది తమోప్రధానమైన ప్రపంచము. ప్రతి వస్తువు సతో, రజో, తమోలలోకి వస్తుంది. ఈ సృష్టికి కూడా ఆయువు ఉంది, కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఇది అందరికీ తెలుసు. సత్యయుగములో భారత్ యే ఉండేది, అందులో దేవీ-దేవతల రాజ్యముండేది. గాడ్-గాడెస్ యొక్క రాజ్యముండేది. అచ్ఛా, తర్వాత ఏం జరిగింది? వారు పునర్జన్మలు తీసుకున్నారు. సతోప్రధానము నుండి సతో, సతో నుండి రజో, తమోలలోకి వచ్చారు. ఇన్ని-ఇన్ని జన్మలు తీసుకున్నారు. భారత్ లో 5 వేల సంవత్సరాల క్రితము లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు అక్కడ మనుష్యుల ఆయుష్షు సుమారుగా 125-150 సంవత్సరాలు ఉంటుంది. దానిని అమరలోకమని అంటారు. అక్కడ అకాల మృత్యువులు ఎప్పుడూ జరగవు. ఇది మృత్యులోకము. అమరలోకములో మనుష్యులు అమరులుగా ఉంటారు, ఆయుష్షు ఎక్కువ ఉంటుంది. సత్యయుగములో పవిత్ర గృహస్థ ఆశ్రమముండేది. దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారు. ఇప్పుడిది వికారీ ప్రపంచము. మేము శివబాబా సంతానమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారసత్వము శివబాబా నుండి లభిస్తుంది. ఇతను దాదా (అన్నయ్య), వారు తాతగారు. వారసత్వము తాతగారి నుండి లభిస్తుంది. తాతగారి ఆస్తిపై అందరికీ హక్కు ఉంటుంది. బ్రహ్మాను ప్రజాపిత అని అంటారు. వారిని ఆడమ్-ఈవ్, ఆదమ్-బీబీ అని అంటారు. వారు నిరాకార గాడ్ ఫాదర్. వీరు (ప్రజాపిత) సాకార తండ్రి అయినట్లు. వీరికి తమదంటూ శరీరము ఉంది. శివబాబాకు తమదంటూ శరీరము లేదు. కావున మీకు శివబాబా నుండి బ్రహ్మా ద్వారా వారసత్వము లభిస్తుంది. తాతగారి ఆస్తి తండ్రి ద్వారా లభిస్తుంది కదా. అలా శివబాబా నుండి కూడా బ్రహ్మా ద్వారా లభిస్తుంది, మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి ఎంతో సమయము పట్టదు... అని అంటారు. అలా ఎవరు తయారుచేసారు? భగవంతుడు. గ్రంథ్ లో (సిక్కుల ధర్మ గ్రంథములో) ఈ విధముగా మహిమ చేస్తారు కదా. వారికి చాలా మహిమ ఉంది. అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేస్తే బే అనగా రాజ్యాధికార వారసత్వము మీకు లభిస్తుంది అని బాబా అంటారు కదా. అదే విధముగా గురునానక్ కూడా సాహెబ్ ను జపిస్తే సుఖము లభిస్తుంది అని అంటారు. ఆ నిరాకార అకాలమూర్తి అయిన తండ్రి మహిమనే పాడుతారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తే సుఖము లభిస్తుంది. ఇప్పుడు తండ్రినే స్మృతి చేస్తారు. యుద్ధము పూర్తి అయిన తర్వాత లక్ష్మీ-నారాయణుల రాజ్యములో ఒకే ధర్మముంటుంది. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. భగవానువాచ - పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు అని భగవంతుడిని అనడము జరుగుతుంది. వారే దుఃఖహర్త-సుఖకర్త. మనము ఆ తండ్రికి పిల్లలము కావున తప్పకుండా మనము సుఖములో ఉండాలి. తప్పకుండా భారతవాసులు సత్యయుగములో ఉండేవారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామములో ఉండేవారు. ఇప్పుడైతే ఆత్మలందరూ ఇక్కడికి వస్తున్నారు. తర్వాత మనము వెళ్ళి దేవీ-దేవతలుగా అవుతాము. స్వర్గములో పాత్రను అభినయిస్తాము. ఈ పాత ప్రపంచము దుఃఖధామము, కొత్త ప్రపంచము సుఖధామము. ఇల్లు పాతదిగా అయినప్పుడు దాని నుండి ఎలుకలు, పాములు మొదలైనవి బయటకు వస్తాయి. ఈ ప్రపంచము కూడా అటువంటిదే. ఈ కల్పము యొక్క ఆయువు 5 వేల సంవత్సరాలు. ఇప్పుడు ఇది అంతిమము. గాంధీగారు కూడా కొత్త ప్రపంచము, కొత్త ఢిల్లీ, రామ రాజ్యము ఉండాలని కోరుకునేవారు. కానీ ఇది కేవలం తండ్రి యొక్క కర్తవ్యమే. దేవతల రాజ్యాన్నే రామ రాజ్యమని అంటారు. కొత్త ప్రపంచములోనైతే తప్పకుండా లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంటుంది. మొదట రాధా-కృష్ణులు ఇరువురూ వేర్వేరు రాజధానులకు చెందినవారిగా ఉండేవారు, వారి వివాహము జరిగిన తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. వారు తప్పకుండా ఈ సమయములో అటువంటి కర్మలను చేస్తూ ఉండవచ్చు. తండ్రి కూర్చుని మీకు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తారు. రావణ రాజ్యములో మనుష్యులు ఏ కర్మలనైతే చేస్తారో, ఆ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగములో కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఉంది కానీ పేరు మార్చేసారు. ఇది పొరపాటు. కృష్ణ జయంతి సత్యయుగములో జరుగుతుంది. శివుడు నిరాకార పరమపిత, శ్రీకృష్ణుడు సాకారములో ఉన్నవారు. మొదట శివజయంతి జరుగుతుంది, ఆ తర్వాత శ్రీకృష్ణ జయంతిని భారత్ లోనే జరుపుకుంటారు. శివరాత్రి అని అంటారు. తండ్రి వచ్చి భారత్ కు స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. శివజయంతి తర్వాతనే కృష్ణ జయంతి ఉంటుంది. ఆ రెండింటికీ మధ్యన రాఖీ ఉంటుంది ఎందుకంటే పవిత్రత కావాలి. పాత ప్రపంచ వినాశనము కూడా జరగాలి. తర్వాత యుద్ధము మొదలైతే అందరూ సమాప్తమైపోతారు, అప్పుడు మీరు వచ్చి కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు. మీరు ఈ పాత ప్రపంచము, మృత్యులోకము కోసం చదవరు. మీ చదువు కొత్త ప్రపంచమైన అమరలోకము కోసం. ఇటువంటి కాలేజి ఇంకేదీ ఉండదు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇది మృత్యులోకము యొక్క అంతిమము, అందుకే త్వరగా చదువుకుని తెలివైనవారిగా అవ్వాలి. వారు తండ్రి కూడా, పతిత-పావనుడు కూడా, వారు చదివిస్తారు కూడా. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ (విశ్వవిద్యాలయము). భగవానువాచ కదా. కృష్ణుడైతే సత్యయుగ రాజకుమారుడు. వారు కూడా శివబాబా నుండి వారసత్వము తీసుకుంటారు. ఈ సమయములో అందరూ భవిష్యత్తు కోసం వారసత్వము తీసుకుంటున్నారు, ఇక ఎంత చదువుకుంటారో అంత వారసత్వము లభిస్తుంది. చదువుకోకపోతే పదవి తగ్గిపోతుంది. ఎక్కడ ఉన్నా సరే చదువుకుంటూ ఉండండి. మురళీ అయితే విదేశాలకు కూడా వెళ్ళగలదు. బాబా ప్రతి రోజూ అటెన్షన్ ను కూడా ఇప్పిస్తూ ఉంటారు. పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి, దీని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మలో ఏదైతే మాలిన్యము చేరిందో, అది తొలగిపోతుంది. ఆత్మ 100 శాతము పవిత్రముగా అవ్వనున్నది. ఇప్పుడు అపవిత్రముగా ఉంది. భక్తినైతే మనుష్యులు చాలానే చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలకు, మేళాలకు లక్షలాదిమంది మనుష్యులు వెళ్తారు. ఇది జన్మజన్మలుగా కొనసాగుతూ వస్తుంది. ఎన్ని మందిరాలు మొదలైనవి తయారుచేస్తారు, శ్రమిస్తారు. అయినా కానీ మెట్లు దిగుతూనే వస్తారు. మనము ఎక్కే కళ ద్వారా సుఖధామములోకి వెళ్తామని, మళ్ళీ మనము కిందకు దిగి రావాలని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత తప్పకుండా కొత్త ఇంటి యొక్క వైభవము తగ్గిపోతుంది. మీరు కొత్త ప్రపంచమైన సత్యయుగములో ఉండేవారు. 1250 సంవత్సరాల తర్వాత రామ రాజ్యము ప్రారంభమయ్యింది, ఇప్పుడైతే పూర్తిగా తమోప్రధానముగా ఉంది. ఎంతమంది మనుష్యులైపోయారు. ప్రపంచము పాతదైపోయింది. వాళ్ళు అయితే ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) కోసం ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు. ఎంతగా తికమకపడుతూ ఉంటారు. ఇదైతే గాడ్ ఫాదర్ (భగవంతుని) యొక్క కర్తవ్యమేనని మనము వ్రాస్తాము. సత్యయుగములో 9-10 లక్షలమంది మనుష్యులు వెళ్ళి ఉంటారు. మిగిలినవారందరూ తమ ఇల్లు అయిన స్వీట్ హోమ్ కు వెళ్ళిపోతారు. ఇది గాడ్లీ ఫ్యామిలీ ప్లానింగ్ (ఈశ్వరీయ కుటుంబ నియంత్రణ). ఏక ధర్మ స్థాపన, మిగిలిన ధర్మాలన్నిటి వినాశనము జరుగుతుంది. తండ్రి తమ కార్యాన్ని చేస్తున్నారు. బయటివారు - వికారాలలోకి వెళ్ళవచ్చు కానీ పిల్లలు కలగకూడదని అంటారు. అలా చేయడము వలన లాభమేమీ ఉండదు. ఈ ప్లానింగ్ అయితే అనంతమైన తండ్రి చేతిలో ఉంది. తండ్రి అంటారు, నేనే దుఃఖధామాన్ని సుఖధామముగా తయారుచేయడానికి వచ్చాను. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆదిలో నేను వస్తాను. ఇప్పుడిది సంగమము, ఈ సమయములో పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచముగా తయారవుతుంది. పాత ప్రపంచ వినాశనము మరియు కొత్త ప్రపంచ స్థాపన చేయడము అనేది తండ్రి కర్తవ్యమే. సత్యయుగములో ఒకే ధర్మముండేది. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా, మహారాజు-మహారాణులుగా ఉండేవారు. ఎవరి మాల తయారయ్యింది అనేది కూడా మీకు తెలుసు. పైన పుష్పము అయిన శివబాబా ఉన్నారు, ఆ తర్వాత జంట పూసలైన బ్రహ్మా-సరస్వతులు ఉన్నారు. ఎవరైతే విశ్వాన్ని నరకము నుండి స్వర్గముగా, పతితము నుండి పావనముగా తయారుచేస్తారో, వారిదే ఈ మాల. ఎవరైతే సేవ చేసి వెళ్తారో, వారి స్మృతే ఉంటుంది. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - వీరు సత్యయుగములో పవిత్రముగా ఉండేవారు కదా. ప్రవృత్తి మార్గము పవిత్రముగా ఉండేది. ఇప్పుడు పతితమైపోయింది. పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని పాడుతారు కూడా. సత్యయుగములో ఈ విధముగా పిలవరు. సుఖములో ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయరు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు. తండ్రి ఉన్నదే లిబరేటర్ (ముక్తిప్రదాత), దయాహృదయుడు, బ్లిస్ ఫుల్ (ఆనందసాగరుడు), వారు వచ్చి అందరికీ ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. మీరు వచ్చి స్వీట్ హోమ్ కు తీసుకువెళ్ళండి అని పిలవడము కూడా వారినే పిలుస్తారు. ఇప్పుడు సుఖము లేదు. ఇది ప్రజలపై ప్రజల రాజ్యము. సత్యయుగములోనైతే రాజు, రాణి, ప్రజలు ఉంటారు. మీరు విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు అనేది తండ్రి తెలియజేస్తున్నారు. అక్కడ మీ వద్ద అపారమైన, లెక్కలేనంత ధనముంటుంది. బంగారు ఇటుకలతో ఇళ్ళు తయారవుతాయి. మిషన్ల నుండి బంగారు ఇటుకలు వెలువడుతూ ఉంటాయి. ఇటుకలలో కూడా వజ్ర-వైఢూర్యాలను పొదుగుతారు. ద్వాపరములో కూడా ఎన్ని వజ్రాలు ఉండేవి, వాటిని దోచుకుని తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడైతే కొంచెము కూడా బంగారము కనిపించదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి అంటారు, నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను. పాత ప్రపంచ వినాశనము కోసం ఎటామిక్ బాంబులు మొదలైనవి తయారుచేయబడి ఉన్నాయి. ఇది సైన్స్. బుద్ధి ద్వారా ఎటువంటి వస్తువులను తయారుచేసారంటే, వాటి ద్వారా తమ కులము యొక్క వినాశనమే చేసుకుంటారు. బాంబులను ఉంచుకునేందుకు ఏమీ తయారుచేయరు. ఈ రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. రాజధాని స్థాపన అవ్వనంత వరకు యుద్ధము ప్రారంభమవ్వదు. ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి, వాటితోపాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇంతమంది మనుష్యులు ఉండరు. ఇప్పుడు పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. కేవలం స్వీట్ హోమ్ ను, స్వర్గ రాజ్యాధికారాన్ని స్మృతి చేయాలి. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు బుద్ధిలో కొత్త ఇల్లే గుర్తుంటుంది కదా. ఇప్పుడు కూడా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. తండ్రి సర్వుల సద్గతిదాత. ఆత్మలందరూ వెళ్ళిపోతారు. ఇకపోతే శరీరాలు ఇక్కడే సమాప్తమైపోతాయి. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పవిత్రముగా అవుతుంది. పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. దేవతలు పవిత్రమైనవారు కదా. వారి ముందు ఎప్పుడూ కూడా బీడీ, పొగాకు మొదలైనవి ఉంచరు, వారు వైష్ణవులు. దానిని విష్ణుపురి అని అంటారు. అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము. ఇది వికారీ ప్రపంచము. ఇప్పుడు నిర్వికారీ ప్రపంచములోకి వెళ్ళాలి. ఇంకా కొంత సమయము మాత్రమే మిగిలి ఉంది. ఎటామిక్ బాంబుల ద్వారా అందరూ సమాప్తమైపోతారని స్వయము కూడా అర్థం చేసుకుంటారు. యుద్ధమైతే జరగవలసిందే. మాకు ఎవరో ప్రేరణ ఇస్తున్నారు కావున మేము వీటిని తయారుచేస్తున్నామని వారు అంటారు. వారి కులము వినాశనము అవుతుందని తెలిసినా కానీ తయారుచేయకుండా ఉండలేరు. శంకరుని ద్వారా వినాశనము, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. జ్ఞాన యజ్ఞము ద్వారా ఈ వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఈ పాత ప్రపంచము వినాశనమై కొత్తదిగా తయారవుతుంది. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. హిస్టరీ మస్ట్ రిపీట్ (చరిత్ర తప్పకుండా రిపీట్ అవ్వవలసిందే). మొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది, ఆ తర్వాత చంద్రవంశీ క్షత్రియ ధర్మము, ఆ తర్వాత ఇస్లామీయులు, బౌద్ధులు మొదలైనవారు వచ్చారు, ఆ తర్వాత తప్పకుండా మొదటి నంబరువారే వస్తారు, మిగిలినవారంతా వినాశనమైపోతారు. పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? ఆ నిరాకార శివబాబా. వారే శిక్షకుడు, సద్గురువు. వారు రాగానే చదివించడము ప్రారంభిస్తారు, అందుకే శివ జయంతియే గీతా జయంతి, గీతా జయంతియే శ్రీకృష్ణ జయంతి అని వ్రాయబడి ఉంది. శివబాబా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. కృష్ణపురి అని సత్యయుగాన్ని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని చదివించేవారు ఏ సాధువులు, సత్పురుషులు లేక మనుష్యులు కాదు. వారు దుఃఖహర్త-సుఖకర్త, అనంతమైన తండ్రి. 21 జన్మల కొరకు మీకు వారసత్వాన్ని ఇస్తారు. వినాశనమైతే జరగవలసిందే. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు... అని ఈ సమయము కోసమే అనడము జరుగుతుంది. దొంగతనాలు కూడా చాలా జరుగుతాయి, నిప్పు కూడా అంటుకోనున్నది. ఈ యజ్ఞములో అంతా స్వాహా అయిపోతుంది. ఇప్పుడు కొద్ది-కొద్దిగా నిప్పు అంటుకుంటుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇంకా కొంత సమయము మిగిలి ఉంది. అందరూ పరస్పరములో కొట్లాడుకుంటారు. విడిపించేవారు ఎవరూ ఉండరు. రక్తపు నదుల తర్వాత పాల నదులు ప్రవహిస్తాయి. దీనిని అనవసరమైన రక్తసిక్తపు ఆట అని అంటారు. పిల్లలు సాక్షాత్కారాన్ని కూడా చూసారు, తర్వాత ఈ కళ్ళతో కూడా చూస్తారు. వినాశనానికి ముందే తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతుంది. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి మిమ్మల్ని తయారుచేస్తున్నారు. రాజధాని పూర్తిగా స్థాపన అయిపోయిన తర్వాత వినాశనము జరుగుతుంది. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. విష్ణుపురిలోకి వెళ్ళేందుకు స్వయాన్ని యోగ్యులుగా తయారుచేసుకోవాలి. సంపూర్ణ పావనముగా అవ్వాలి, అశుద్ధ ఆహార-పానీయాలను త్యాగము చేయాలి. వినాశనానికి ముందే తమ సర్వస్వాన్ని సఫలము చేసుకోవాలి. 2. త్వరత్వరగా చదువుకుని తెలివైనవారిగా అవ్వాలి. వికర్మలేవీ జరగకుండా అటెన్షన్ పెట్టాలి. వరదానము:-ఫిర్యాదులను యాద్ (స్మృతి)లోకి పరివర్తన చేసే స్వతహా మరియు నిరంతర యోగీ భవ సంగమయుగపు విశేషత ఏమిటంటే - ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము. ఇప్పుడే స్మృతి స్వరూపము, ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవము. భవిష్యత్తు యొక్క గ్యారంటీ అయితే ఉండనే ఉంది. కానీ భవిష్యత్తు కన్నా శ్రేష్ఠ భాగ్యము ఇప్పటిదే. ఈ భాగ్యపు నషాలో ఉన్నట్లయితే స్వతహాగా స్మృతి ఉంటుంది. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదులు ఉండవు. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఇది జరగడము లేదు, కొద్దిగా సహాయము చేయండి - ఇవన్నీ ఫిర్యాదులు. కావున ఫిర్యాదులను వదిలి స్వతహా యోగులుగా, నిరంతర యోగులుగా అవ్వండి. స్లోగన్:-ఎవరైతే స్వయాన్ని అతిథులుగా భావిస్తూ నడుచుకుంటారో వారే మహాన్ స్థితిని అనుభవము చేస్తారు.   అవ్యక్త సూచనలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి సంగఠన యొక్క బలము, స్నేహము యొక్క బలము, ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకునే బలము మరియు సహనశీలతా బలము, వీటిని జమ చేసుకున్నట్లయితే మాయ ఎప్పుడూ దాడి చెయ్యలేదు, అప్పుడు జయజయకారాలతో కూడిన నినాదము వెలువడుతుంది. ఎప్పుడైతే ఇంతమంది అనేకులుగా ఉంటూ కూడా ఒక్కరిగా కనిపిస్తారో, ఒక్కరి లగనములో మగ్నమై, ఏకరస స్థితిలో స్థితులై ఉంటారో, అప్పుడు ప్రత్యక్షతా గుర్తులు కనిపిస్తాయి. మీ అందరి ప్రతిజ్ఞయే ప్రత్యక్షతను సమీపముగా తీసుకువస్తుంది. "
https://youtube.com/watch?v=p4qMlXSZSE0&si=G9hdFK7F_7r9F7JR #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
https://youtube.com/watch?v=bslelDtIIWk&si=x0bIq8w1MEZvtVzY #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱
youtube-preview
https://youtube.com/watch?v=6qIXmLUReaE&si=yqjJxcRhdgbCPz0x #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
#📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి 16-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ప్రాణేశ్వరుడైన తండ్రి పిల్లలైన మీకు ప్రాణ దానమునిచ్చేందుకు వచ్చారు, ప్రాణ దానము లభించడము అనగా తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వడము’’ ప్రశ్న:-డ్రామాలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకున్న కారణముగా ఏ దృశ్యము మీకు కొత్తది కాదు? జవాబు:-ఈ సమయములో మొత్తం ప్రపంచములో ఏవైతే హంగామాలు ఉన్నాయో, వినాశన కాలములో విపరీత బుద్ధి కలవారై తమ కులాన్నే అంతము చేసేందుకు అనేక సాధనాలను తయారుచేస్తూ ఉంటారో, ఇది కొత్త విషయమేమీ కాదు ఎందుకంటే ఈ ప్రపంచమైతే మారేదే ఉందని మీకు తెలుసు. మహాభారత యుద్ధము తర్వాతనే మన కొత్త ప్రపంచము వస్తుంది. పాట:-ఈ రోజు ఉదయముదయమే ఎవరు వచ్చారు... ఓంశాంతి. ఉదయముదమయే వచ్చి మురళీని మోగించేదెవరు? ప్రపంచమైతే పూర్తిగా ఘోర అంధకారములో ఉంది. మీరిప్పుడు మురళీని వింటున్నారు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, ప్రాణేశ్వరుడైన తండ్రి నుండి వింటున్నారు. వారు ప్రాణాలను రక్షించే ఈశ్వరుడు. ఓ ఈశ్వరా, ఈ దుఃఖము నుండి రక్షించండి అని అంటారు కదా. వారు హద్దు సహాయాన్ని కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన సహాయము లభిస్తుంది ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి కదా. ఆత్మ కూడా గుప్తమైనదని మీకు తెలుసు. పిల్లల శరీరము ప్రత్యక్షముగా ఉంది. తండ్రి శ్రీమతము పిల్లల కోసం ఉన్నది. సర్వ శాస్త్రమయి శిరోమణి గీత ప్రసిద్ధమైనది. కేవలం అందులో శ్రీకృష్ణుని పేరును వేసారు. శ్రీమతము అనేది భగవానువాచ అని ఇప్పుడు మీకు తెలుసు. భ్రష్ఠాచారులను శ్రేష్ఠాచారులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రే అని - ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. వారే నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. సత్యనారాయణ కథ కూడా ఉంది. అమరకథ అని కూడా అంటూ ఉంటారు. అమరపురికి యజమానులుగా తయారుచేయడమన్నా లేక నరుని నుండి నారాయణునిగా తయారుచేయడమన్నా, విషయము ఒక్కటే. ఇది మృత్యులోకము. భారత్ యే అమరపురిగా ఉండేది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడే అమరుడైన బాబా పార్వతులకు వినిపించారు. ఒక్క పార్వతి లేక ఒక్క ద్రౌపదియే కాదు. ఈ కథను చాలామంది పిల్లలు వింటున్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా వినిపిస్తారు. తండ్రి అంటారు, నేను బ్రహ్మా ద్వారా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తాను. ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. తండ్రియే అలా తయారుచేయగలరు. ప్రపంచములో ఆత్మ జ్ఞానము తెలిసిన మనుష్యమాత్రులు ఒక్కరు కూడా లేరు. ఆత్మ జ్ఞానమే లేనప్పుడు పరమాత్మ జ్ఞానము ఎలా ఉంటుంది. ఆత్మనైన నేనే పరమాత్మ అని అంటారు. ప్రపంచమంతా ఎంత పెద్ద పొరపాటులో చిక్కుకుని ఉంది. పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. విదేశీయులు కూడా తక్కువ రాతిబుద్ధి కలవారిగా లేరు, మేము ఈ బాంబులు మొదలైనవి ఏవైతే తయారుచేస్తున్నామో, ఇవి స్వయాన్నే కాక మొత్తం ప్రపంచమంతటినీ అంతము చేయడానికి తయారుచేస్తున్నామని వారి బుద్ధిలోకి రాదు. ఈ సమయములో బుద్ధి దేనికీ పనికి రాకుండా ఉంది. తమ వినాశనము కోసమే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లలైన మీకిది కొత్త విషయమేమీ కాదు. డ్రామానుసారముగా వారి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారు. రాతిబుద్ధి కలవారు కాకపోతే ఇటువంటి పనులు చేస్తారా? మొత్తం కులాన్నంతా వినాశనము చేస్తున్నారు. అసలు వారు ఏమి చేస్తున్నారు, ఆశ్చర్యముగా ఉంది కదా. ఈ రోజు అలా కూర్చుని ఉండగా బాగానే ఉంటుంది, రేపు మిలట్రీ వారు డిస్టర్బ్ అయితే ప్రెసిడెంటును కూడా హతమార్చేస్తారు. ఇటువంటి సంగఠనలు జరుగుతూ ఉంటాయి. ఎవ్వరినీ సహించరు, శక్తివంతులు కదా. ఈనాటి ప్రపంచములో చాలా హంగామాలు ఉన్నాయి, రాతిబుద్ధి కలవారు కూడా అనేకమంది ఉన్నారు. వినాశన కాలములో ఎవరైతే తండ్రి పట్ల విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారో, వారు వినాశనమవుతారని అంటూ ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచము మారనున్నది. మహాభారత యుద్ధము తప్పకుండా జరిగిందని కూడా మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పించారు. శాస్త్రాలలోనైతే మొత్తం వినాశనమైందని చూపించారు. కానీ మొత్తం వినాశనము అవ్వదు, అలా అయితే ప్రళయము జరిగిపోతుంది, అప్పుడు మనుష్యులు ఎవ్వరూ ఉండరు, కేవలం పంచ తత్వాలు మాత్రమే మిగిలి ఉంటాయి. కానీ అలా జరగజాలదు. ప్రళయము జరిగిపోతే ఇక మనుష్యులు ఎక్కడ నుండి వస్తారు. సాగరములో రావి ఆకుపై శ్రీకృష్ణుడు బొటనవేలును చప్పరిస్తూ వచ్చినట్లుగా చూపిస్తారు. ఒక బాలుడు ఆ విధముగా ఎలా రాగలడు? శాస్త్రాలలో ఎటువంటి విషయాలను వ్రాసేశారంటే, ఇక అడగకండి. ఇప్పుడు కుమారీలైన మీ ద్వారా ఈ విద్వాంసులకు, భీష్మపితామహులు మొదలైనవారికి కూడా జ్ఞాన బాణాలు తగులుతాయి. వారు కూడా మున్ముందు వస్తారు. ఎంతెంతగా మీరు సేవలో ఫోర్సును నింపుతూ ఉంటారో, తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉంటారో, అంతగా మీ ప్రభావము పెరుగుతుంది. అయితే, విఘ్నాలు కూడా కలుగుతాయి. ఆసురీ సాంప్రదాయము వారు ఈ జ్ఞాన యజ్ఞములో ఎన్నో విఘ్నాలను కలిగిస్తారని కూడా అంటూ ఉంటారు. పాపం రాతిబుద్ధి కల మనుష్యులకు ఇది ఏమిటి అన్నది ఏ మాత్రము తెలియదు. వీరి జ్ఞానమే అతీతమైనదని అంటారు. ఇవి కొత్త ప్రపంచము కోసం కొత్త విషయాలని కూడా మీకు తెలుసు. తండ్రి అంటారు, ఈ రాజయోగాన్ని మీకు ఇంకెవ్వరూ నేర్పించలేరు. జ్ఞానాన్ని మరియు యోగాన్ని తండ్రియే నేర్పిస్తున్నారు. సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే, వారే పతిత-పావనుడు, కనుక తప్పకుండా పతితులకే జ్ఞానాన్ని ఇస్తారు కదా. మనము పారసబుద్ధి కలవారిగా అయి పారసనాథులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు ఎన్ని మందిరాలను నిర్మించారు. కానీ వారు ఎవరు, ఏమి చేసి వెళ్ళారు అనేది కొంచెము కూడా అర్థం చేసుకోరు. పారసనాథుని మందిరము కూడా ఉంది కానీ వారి గురించి ఎవ్వరికీ తెలియదు. భారత్ పారసపురిగా ఉండేది, అక్కడ బంగారము మరియు వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఇది నిన్నటి విషయము. వారు కేవలం ఒక్క సత్యయుగానికే లక్షల సంవత్సరాలని అంటారు. కానీ మొత్తం డ్రామా అంతా 5 వేల సంవత్సరాలేనని తండ్రి అంటారు. అందుకే, నేటి భారత్ ఎలా ఉంది! నిన్నటి భారత్ ఎలా ఉండేది! అని అంటారు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎవ్వరికీ గుర్తు ఉండదు. పిల్లలైన మీకిప్పుడు స్మృతి లభించింది. బాబా ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి మాకు స్మృతినిప్పిస్తున్నారని మీకు తెలుసు. పిల్లలైన మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడు ఉండేది? ఎన్ని సంవత్సరాలు అయ్యింది? అని ఎవరినైనా అడిగినట్లయితే, లక్షల సంవత్సరాలని అంటారు. ఇది 5 వేల సంవత్సరాల విషయమని మీరు అర్థం చేయించగలరు. క్రైస్టుకు ఇంత సమయము ముందు స్వర్గముండేదని అంటారు కూడా. తండ్రి భారత్ లోనే వస్తారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించారు - బాబా జయంతిని జరుపుకుంటున్నారంటే వారు తప్పకుండా ఏదో చేయడానికి వచ్చి ఉంటారు. వారు పతిత-పావనుడు కనుక తప్పకుండా వారు వచ్చి పావనముగా తయారుచేసి ఉంటారు. వారు జ్ఞానసాగరుడు కనుక తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తారు కదా. యోగములో కూర్చోండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇది జ్ఞానము కదా. వాళ్ళు హఠయోగులు. మఠం వేసుకుని కూర్చుంటారు. ఏమేమో చేస్తూ ఉంటారు. మాతలైన మీరైతే ఆ విధముగా చేయలేరు. వాళ్ళలా కూర్చోలేరు కూడా. తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, మీరు అవేవీ చేయవలసిన అవసరము లేదు. స్కూల్లో విద్యార్థులు నియమానుసారముగా కూర్చుంటారు కదా. తండ్రి అయితే అది కూడా చెప్పరు. ఎలా కావాలంటే అలా కూర్చోండి. అచ్ఛా, కూర్చొని అలసిపోతే పడుకోండి. బాబా ఏ విషయములోనూ వద్దనరు. ఇది పూర్తిగా సహజముగా అర్థం చేసుకోవలసిన విషయము. ఇందులో ఎటువంటి కష్టము లేదు. ఎంత అనారోగ్యము ఉన్నా సరే, మీరు వింటూ-వింటూ, శివబాబా స్మృతిలో ఉంటూ-ఉంటూ ప్రాణాలు తనువు నుండి వెళ్ళిపోవచ్చునేమో తెలియదు. గంగా తీరములో ఉండాలి, గంగా జలము నోటిలో ఉండాలి, అప్పుడు ప్రాణము తనువు నుండి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటారు కదా. అవన్నీ భక్తి మార్గము యొక్క విషయాలు. వాస్తవానికి ఇది జ్ఞానామృతము యొక్క విషయము. నిజంగా ప్రాణాలను అలాగే వదలనున్నామని మీకు తెలుసు. పిల్లలైన మీరు పరంధామము నుండి వస్తారు. నన్ను విడిచిపెట్టి వెళ్తారు. తండ్రి అంటారు, నేనైతే పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను, నేను వచ్చింది పిల్లలైన మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి. మీకు మీ ఇంటి గురించీ తెలియదు, ఆత్మ గురించీ తెలియదు. మాయ పూర్తిగా మీ రెక్కలను తెంచేసింది, అందుకే ఆత్మ ఎగరలేదు, ఎందుకంటే తమోప్రధానముగా ఉంది. ఎప్పటివరకైతే సతోప్రధానముగా అవ్వరో, అప్పటివరకు శాంతిధామానికి ఎలా వెళ్ళగలరు. డ్రామా ప్లాన్ అనుసారముగా అందరూ తమోప్రధానముగా అవ్వాల్సిందేనని కూడా మీకు తెలుసు. ఈ సమయములో మొత్తం వృక్షమంతా పూర్తిగా తమోప్రధానముగా శిథిలావస్థలో ఉంది. ఆత్మలందరూ తమోప్రధానముగా ఉన్నారని పిల్లలకు తెలుసు. కొత్త ప్రపంచములో సతోప్రధానముగా ఉంటారు. ఇక్కడ ఎవ్వరికీ సతోప్రధాన అవస్థ ఉండదు. ఇక్కడ ఆత్మ పవిత్రముగా అయిపోతే ఇక ఇక్కడ నిలవదు, ఒక్కసారిగా పారిపోతుంది. అందరూ భక్తి చేసేది ముక్తి కోసము లేదా శాంతిధామానికి వెళ్ళడం కోసము. కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. నియమము అలా లేదు. ధారణ చేయడము కోసమని తండ్రి ఈ రహస్యాలన్నింటినీ కూర్చుని అర్థం చేయిస్తున్నారు, అయినా ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయడము, స్వదర్శన చక్రధారులుగా అవ్వడము. బీజాన్ని స్మృతి చేసినట్లయితే మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత పెద్దదిగా అవుతూ ఉంటుంది. అనేక ధర్మాలు ఉన్నాయి కదా. మీరు ఒక్క సెకండులో తెలుసుకుంటారు. ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మనుష్య సృష్టికి బీజరూపుడైన వారొక్కరే అందరికీ తండ్రి. తండ్రి ఎప్పుడూ సర్వవ్యాపి కాలేరు. ఇది చాలా పెద్ద పొరపాటు. మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనరని మీరు అర్థం చేయిస్తారు కూడా. తండ్రి పిల్లలకు అన్ని విషయాలను సహజము చేసి అర్థం చేయిస్తారు, ఇక తర్వాత ఎవరి భాగ్యములో ఉంటే వారు, ఎవరికి నిశ్చయముంటే వారు తప్పకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. నిశ్చయము లేకపోతే వారు ఎప్పటికీ అర్థం చేసుకోరు. భాగ్యమే లేకపోతే ఇక పురుషార్థము కూడా ఏమి చేస్తారు. భాగ్యములో లేకపోతే వారు ఏమీ అర్థం కానట్లుగానే కూర్చుంటారు. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారని ఈ మాత్రము కూడా నిశ్చయము లేదు. ఎవరైనా కొత్త వ్యక్తి మెడికల్ కాలేజిలోకి వెళ్ళి కూర్చుంటే ఏమి అర్థం చేసుకుంటారు? ఏమీ అర్థం కాదు. ఇక్కడకు కూడా అలాగే వచ్చి కూర్చుంటారు. ఈ అవినాశీ జ్ఞానము వినాశనమవ్వదు. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు - రాజధాని స్థాపనవుతుంది కదా, కావున నౌకర్లు, ప్రజలు, ప్రజలకు కూడా నౌకర్లు, అందరూ కావాలి కదా, కనుక అలాంటివారు కూడా వస్తారు. కొంతమందికైతే చాలా మంచి రీతిలో అర్థమైపోతుంది. అభిప్రాయాలు కూడా వ్రాస్తారు కదా. మున్ముందు కొద్దిగా ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ సమయములో కష్టము, ఎందుకంటే ఆ సమయములోనైతే చాలా హంగామా జరుగుతుంది. రోజురోజుకు తుఫానులు పెరిగిపోతూ ఉంటాయి. ఇన్ని సెంటర్లు ఉన్నాయి. మంచి రీతిలో అర్థం చేసుకుంటారు కూడా. బ్రహ్మా ద్వారా స్థాపన అని కూడా వ్రాసి ఉంది. వినాశనాన్ని కూడా ఎదురుగా చూస్తూ ఉంటారు. వినాశనమైతే జరగవలసిందే. జనాభా తగ్గాలని గవర్నమెంట్ అంటుంది కానీ ఇందులో వారు ఏమి చేయగలరు? వృక్షము యొక్క వృద్ధి అయితే జరిగేదే ఉంది. ఎప్పటివరకైతే తండ్రి ఇక్కడ ఉంటారో, అప్పటివరకు అన్ని ధర్మాల ఆత్మలు ఇక్కడ ఉండవలసిందే. వెళ్ళే సమయము వచ్చినప్పుడు ఆత్మలు రావడము ఆగిపోతుంది. ఇప్పుడైతే అందరూ రావాల్సిందే. కానీ ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇది రావణ రాజ్యమని, మాకు రామ రాజ్యము కావాలని బాపూజీ కూడా అనేవారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు, మరి దాని అర్థం ఇది నరకమని కదా. మనుష్యులు ఈ మాత్రము కూడా అర్థం చేసుకోరు. స్వర్గవాసులుగా అయితే మంచిదే కదా. అంటే తప్పకుండా అప్పటివరకు నరకవాసులుగానే ఉన్నట్లు. బాబా అర్థం చేయిస్తున్నారు - మనుష్యుల ముఖాలు మనుష్యుల వలె ఉన్నాయి కానీ లక్షణాలు కోతుల వలె ఉన్నాయి. పతిత-పావన సీతారామ అని అందరూ పాడుతూ ఉంటారు. మనము పతితులము, పావనముగా తయారుచేసేవారు తండ్రి. వారంతా భక్తి మార్గము యొక్క సీతలు, బాబా రాముడు. ఇది ఎవరికైనా నేరుగా చెప్తే అంగీకరించరు. రాముడినే పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మూడవ నేత్రాన్ని ఇచ్చారు. మీరు వేరే ప్రపంచానికి చెందినవారిలా అయిపోయారు. పాత ప్రపంచములో ఏమేమి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు తెలివిహీనుల నుండి తెలివైనవారిగా అయ్యారు. రావణుడు మిమ్మల్ని ఎంత తెలివిహీనులుగా చేసాడు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సమయములో మనుష్యులందరూ తమోప్రధానముగా అయిపోయారు, అందుకే తండ్రి వచ్చి సతోప్రధానముగా చేస్తారు. తండ్రి అంటారు - పిల్లలైన మీరు మీ సేవను కూడా చేసుకుంటూ ఉండండి, కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - తండ్రిని స్మృతి చేయండి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే మార్గాన్ని ఇంకెవ్వరూ చెప్పలేరు. సర్వుల ఆత్మిక సర్జన్ వారొక్కరే. వారే వచ్చి ఆత్మలకు ఇంజెక్షన్ వేస్తారు ఎందుకంటే ఆత్మయే తమోప్రధానముగా అయ్యింది. తండ్రిని అవినాశీ సర్జన్ అని అంటారు. ఇప్పుడు ఆత్మ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యింది, దానికి ఇంజెక్షన్ కావాలి. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి మరియు మీ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధియోగాన్ని పైన మధురమైన ఇంటితో జోడించండి. మనము స్వీట్ సైలెన్స్ హోమ్ కు వెళ్ళాలి. నిర్వాణధామాన్ని స్వీట్ హోమ్ అని అంటారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఈ పాత ప్రపంచము వినాశనమయ్యే ఉంది, అందుకే దీని నుండి స్వయాన్ని వేరుగా భావించాలి. వృక్షము యొక్క వృద్ధితో పాటుగా, విఘ్నాల రూపీ తుఫానులు ఏవైతే వస్తాయో, వాటికి భయపడకూడదు, వాటిని దాటేయాలి. 2. ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకునేందుకు స్వయానికి జ్ఞాన-యోగాల ఇంజెక్షన్ ను ఇచ్చుకోవాలి. తమ బుద్ధియోగాన్ని స్వీట్ హోమ్ తో జోడించాలి. వరదానము:-‘‘మొదట మీరు’’ అన్న పాఠము ద్వారా కిరీటధారులుగా అయ్యే చతుర సుజన భవ (తెలివైనవారిగా కండి) ఏ విధముగా బాప్ దాదా స్వయాన్ని వినమ్రుడినైన సేవకుడిని అని చెప్పుకుంటారు, అలా సేవకుడిని అని అనడము ద్వారా కిరీటధారిగా స్వతహాగానే అయిపోతారు. అదే విధముగా పిల్లలైన మీరు కూడా స్వయము నమ్రచిత్తులుగా అయి ఇతరులకు శ్రేష్ఠమైన సీటును ఇవ్వండి. ఇతరులను సీటుపై కూర్చోబెట్టినట్లయితే వారు స్వయము దిగిపోయి మిమ్మల్ని స్వతహాగానే కూర్చోబెడతారు. ఒకవేళ మీరు కూర్చునే ప్రయత్నము చేసినట్లయితే వారు కూర్చోనివ్వరు, అందుకే కూర్చోబెట్టడమే కూర్చోవడము. కావున ‘‘మొదట మీరు’’ అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి, అప్పుడిక సంస్కారాలు కూడా సహజముగానే కలుస్తాయి, కిరీటధారులుగా కూడా అవుతారు, ఇదే చతుర సుజనులుగా (తెలివైనవారిగా) అయ్యేందుకు విధానము, ఇందులో శ్రమ కూడా లేదు, ప్రాప్తి కూడా అధికముగా ఉంది. స్లోగన్:-అవ్యక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు అంతర్ముఖులుగా, ఏకాంతవాసులుగా అవ్వండి.   అవ్యక్త సూచనలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి ఇప్పటివరకు వేర్వేరు పుష్పాలు తమ-తమ రంగులను చూపిస్తున్నారు, కానీ ఎప్పుడైతే పుష్పగుచ్ఛము రూపములో మీ సుగంధాన్ని వ్యాపింపజేస్తారో, శక్తి దళము ప్రత్యక్షమవుతుందో, అప్పుడు ఈ సంగఠన యొక్క శక్తి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తము అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరు వేర్వేరుగా ఉన్న కారణముగా శ్రమ ఎక్కువగా చెయ్యాల్సి వస్తుంది కానీ ఎప్పుడైతే సంగఠన ఏకమతము కలదిగా అవుతుందో అప్పుడు శ్రమ తక్కువ, సఫలత ఎక్కువగా ఉంటుంది. "
https://youtube.com/watch?v=CNnci69uGj4&si=ko_3bJtKryVLdK1l #🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
https://youtube.com/watch?v=S4-ESlres-M&si=r4g8pvd3EdlUEIi4 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి
youtube-preview
https://youtube.com/watch?v=0Y-pfe7MpXI&si=g_p3_AZVqs6MyGjL #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱
youtube-preview
#🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు
🎶భక్తి పాటలు🔱 - ఫిబ్రవీరి 13 అసూయపడుటకంటే నేర్చిన వారే ಅಬಯಾನಿಂದುಲ అదృష్టవంతులు . &858ீட  &छ8 ( ఫిబ్రవీరి 13 అసూయపడుటకంటే నేర్చిన వారే ಅಬಯಾನಿಂದುಲ అదృష్టవంతులు . &858ீட  &छ8 ( - ShareChat
#📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి 13-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఇక్కడ మీదంతా గుప్తము, అందుకే మీరు ఎటువంటి ఆర్భాటము చేయకూడదు, మీ కొత్త రాజధాని యొక్క నషాలో ఉండాలి’’ ప్రశ్న:-శ్రేష్ఠ ధర్మము మరియు దైవీ కర్మల స్థాపన కోసం పిల్లలైన మీరు ఏ కృషి చేస్తారు? జవాబు:-మీరు ఇప్పుడు 5 వికారాలను విడిచిపెట్టే కృషి చేస్తారు, ఎందుకంటే ఈ వికారాలే అందరినీ భ్రష్టులుగా చేసాయి. ఈ సమయములో అందరూ దైవీ ధర్మ భ్రష్టులుగా మరియు కర్మ భ్రష్టులుగా ఉన్నారని మీకు తెలుసు. తండ్రియే శ్రీమతాన్ని ఇచ్చి శ్రేష్ఠ ధర్మాన్ని మరియు శ్రేష్ఠ దైవీ కర్మలను స్థాపన చేస్తారు. మీరు శ్రీమతముపై నడుస్తూ తండ్రి స్మృతితో వికారాలపై విజయము పొందుతారు. చదువు ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. పాట:-మిమ్మల్ని పొంది... ▶ ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మిక పిల్లలే బాబా అని అంటారు. వీరు అనంతమైన తండ్రి అని, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారని అనగా వీరు అందరికీ తండ్రి అని పిల్లలకు తెలుసు. వారిని అనంతమైన పిల్లలందరూ, ఆత్మలందరూ తలచుకుంటూ ఉంటారు. ఏదో ఒక రకముగా తలచుకుంటూ ఉంటారు కానీ ఆ పరమపిత పరమాత్మ నుండి మనకు విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది అని వారికి తెలియదు. మీకు తెలుసు - తండ్రి మనకు సత్యయుగీ విశ్వ రాజ్యాధికారాన్ని ఏదైతే ఇస్తారో, అది స్థిరమైనది, అఖండమైనది, అచంచలమైనది, మన ఆ రాజ్యాధికారము 21 జన్మల కొరకు నిలిచి ఉంటుంది. మొత్తం విశ్వముపై మన రాజ్యము ఉంటుంది, దానిని ఎవ్వరూ లాక్కోలేరు, దోచుకోలేరు. మన రాజ్యము అచంచలమైనది ఎందుకంటే అక్కడ ఒకే ధర్మము ఉంటుంది, ద్వైతము ఉండదు. అది అద్వైత రాజ్యము. పిల్లలు పాటను విన్నప్పుడల్లా తమ రాజధాని యొక్క నషా కలగాలి. ఇటువంటి పాటలు ఇంటిలో ఉండాలి. మీదంతా గుప్తము. ఇతర గొప్ప-గొప్ప వ్యక్తులది చాలా ఆర్భాటము ఉంటుంది. మీకు ఎటువంటి ఆర్భాటము లేదు. బాబా ఎవరిలోనైతే ప్రవేశించారో, వారు కూడా ఎంత సాధారణముగా ఉన్నారు అనేది మీరు చూస్తున్నారు. ఇక్కడ మనుష్యులు ప్రతి ఒక్కరూ అధర్మయుక్తమైన, ఛీ-ఛీ పనులే చేస్తారని, అందుకే వారిని వివేకహీనులని అంటారని పిల్లలకు తెలుసు. బుద్ధికి పూర్తిగా తాళము పడిపోయింది. మీరు ఎంత వివేకవంతులుగా ఉండేవారు. విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మాయ ఎంతటి వివేకహీనులుగా చేసిందంటే, ఇక వారు దేనికీ పనికిరానివారిగా అయిపోయారు. తండ్రి వద్దకు వెళ్ళేందుకు యజ్ఞతపాదులు మొదలైనవి చాలా చేస్తూ ఉంటారు కానీ ఏమీ లభించదు. అలా భ్రమిస్తూనే ఉంటారు. రోజురోజుకూ అకళ్యాణమే జరుగుతూ ఉంటుంది. మనుష్యులు ఎంతెంతగా తమోప్రధానమైపోతూ ఉంటారో, అంతంతగా వారి అకళ్యాణము జరగవలసిందే. ఋషులు-మునులకు గాయనము ఉంది, వారు పవిత్రముగా ఉండేవారు. వారు భగవంతుని విషయములో - మాకు తెలియదు, మాకు తెలియదు అని అనేవారు. ఇప్పుడు వారు తమోప్రధానముగా అయిపోయారు కావున - శివోహమ్, తతత్వమ్, సర్వవ్యాపి, నీలోనూ-నాలోనూ అందరిలోనూ ఉన్నారు అని అంటున్నారు. వారు కేవలం పరమాత్మ అని అంటారు. పరమపిత అని ఎప్పుడూ అనరు. పరమపితను సర్వవ్యాపి అని అనడము తప్పు అవుతుంది, అందుకే మళ్ళీ ఈశ్వరా లేక పరమాత్మ అని అంటారు. పిత అనే పదము బుద్ధిలోకి రాదు. ఒకవేళ ఎవరైనా అన్నా కూడా, నామమాత్రముగానే అంటారు. ఒకవేళ పరమపితగా భావిస్తే, వారి బుద్ధి ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. అటువంటప్పుడు మనము నరకములో ఎందుకు పడి ఉన్నాము, ఇప్పుడు మనము ముక్తి-జీవన్ముక్తిని ఎలా పొందగలము, ఇది ఎవ్వరి బుద్ధిలోకి రాదు. ఆత్మ పతితముగా అయిపోయింది. ఆత్మ మొదట సతోప్రధానముగా, వివేకవంతముగా ఉంటుంది, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తుంది, వివేకహీనముగా అయిపోతుంది. ఇప్పుడు మీకు వివేకము లభించింది. బాబా మనకు ఈ స్మృతిని ఇప్పించారు. భారత్ కొత్త ప్రపంచముగా ఉన్నప్పుడు మన రాజ్యము ఉండేది. అక్కడ ఒకే మతము, ఒకే భాష, ఒకే ధర్మము, ఒకే మహారాజు, మహారాణుల రాజ్యముండేది, ఆ తర్వాత ద్వాపరములో వామ మార్గము ప్రారంభమవుతుంది, అప్పుడిక ప్రతి ఒక్కరి కర్మలపై ఆధారపడుతుంది. కర్మల అనుసారముగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మీకు ఎటువంటి కర్మలను నేర్పిస్తున్నానంటే, వాటి ద్వారా మీరు 21 జన్మలు రాజ్యాధికారాన్ని పొందుతారు. అక్కడ కూడా హద్దు తండ్రి ఉంటారు, కానీ - ఈ రాజ్య వారసత్వము అనంతమైన తండ్రి ఇచ్చినటువంటిది అన్న జ్ఞానము అక్కడ ఉండదు. మళ్ళీ ద్వాపరము నుండి రావణ రాజ్యము ప్రారంభమవుతుంది, సంబంధాలు వికారీ అయిపోతాయి. ఇక కర్మలనుసారముగా జన్మలు లభిస్తాయి. భారత్ లో పూజ్య రాజులు కూడా ఉండేవారు, పూజారీ రాజులు కూడా ఉండేవారు. సత్య, త్రేతాయుగాలలో అందరూ పూజ్యులుగా ఉంటారు. అక్కడ పూజ లేక భక్తి ఏదీ ఉండదు, మళ్ళీ ద్వాపరములో ఎప్పుడైతే భక్తి మార్గము ప్రారంభమవుతుందో, అప్పుడు యథా రాజా-రాణి, తథా ప్రజా పూజారులుగా, భక్తులుగా అయిపోతారు. అందరికంటే గొప్ప రాజులైన సూర్యవంశీయులు పూజ్యులుగా ఉండేవారు, తర్వాత వారే పూజారులుగా అవుతారు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతారు, దీని ప్రారబ్ధము 21 జన్మల వరకు ఉంటుంది. తర్వాత భక్తి మార్గము ప్రారంభమవుతుంది. దేవతల మందిరాలను నిర్మించి పూజిస్తూ ఉంటారు. ఇది కేవలం భారత్ లోనే జరుగుతుంది. తండ్రి 84 జన్మల కథను ఏదైతే వినిపిస్తారో, అది కూడా భారతవాసుల కోసమే. ఇతర ధర్మాల వారు రావడమే తర్వాత వస్తారు. ఇక వృద్ధి చెందుతూ, చెందుతూ అనేకమంది అయిపోతారు. వెరైటీ ధర్మాలవారి ముఖకవళికలు ప్రతి విషయములోనూ వేరు-వేరుగా ఉంటాయి. ఆచారాలు-పద్ధతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. భక్తి మార్గము కోసం సామాగ్రి కూడా కావాలి. ఎలాగైతే బీజము చిన్నదిగా ఉంటుంది కానీ వృక్షము ఎంత పెద్దదిగా ఉంటుంది. వృక్షము యొక్క ఆకులు మొదలైనవాటిని లెక్క పెట్టలేము. అదే విధముగా, భక్తి కూడా విస్తారమైపోతుంది. అనేకానేక శాస్త్రాలను తయారుచేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఈ భక్తి మార్గపు సామాగ్రి అంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి. భక్తి ప్రభావము కూడా చాలా ఉంది కదా. భక్తి ఎంత సుందరముగా ఉంటుంది, నృత్యాలు, వినోదము, పాటలు మొదలైనవి ఉంటాయి, ఎంత ఖర్చు చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, మీ ఆది సనాతన ధర్మాన్ని స్మృతి చేయండి. అనేక రకాల భక్తిని జన్మజన్మలుగా మీరు చేస్తూ వచ్చారు. సన్యాసులు కూడా ఆత్మలు నివసించే స్థానాన్ని, ఆ తత్వాన్ని పరమాత్మగా భావిస్తారు, ఆ బ్రహ్మమును లేక తత్వమునే స్మృతి చేస్తారు. వాస్తవానికి సన్యాసులు సతోప్రధానముగా ఉన్నప్పుడు, వారు అడవులకు వెళ్ళి శాంతిగా ఉండేవారు. వారు బ్రహ్మములోకి వెళ్ళి లీనమవుతారని కాదు. బ్రహ్మతత్వము యొక్క స్మృతిలో ఉన్నట్లయితే, శరీరాన్ని వదిలినట్లయితే, ఆ బ్రహ్మములో లీనమైపోతామని వారు భావిస్తారు. తండ్రి అంటారు - ఎవ్వరూ లీనమవ్వలేరు. ఆత్మ అయితే అవినాశీ కదా, అది ఎలా లీనమవ్వగలదు. భక్తి మార్గములో ఎంతగా కష్టపడుతూ ఉంటారు, ఇంకప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపములో వస్తారని అంటారు. ఇప్పుడు రైట్ ఎవరు. నివృత్తి మార్గమువారు అంటారు - మేము బ్రహ్మముతో యోగాన్ని జోడించి బ్రహ్మములో లీనమైపోతాము అని. గృహస్థ ధర్మమువారు అంటారు - భగవంతుడు ఏదో ఒక రూపములో పతితులను పావనముగా తయారుచేయడానికి వస్తారు అని. అంతేకానీ పై నుండి ప్రేరణ ద్వారానే నేర్పిస్తారని కాదు. టీచరు ఇంటిలో కూర్చుని ప్రేరణ ఇస్తారా ఏమిటి! ప్రేరణ అన్న పదమే లేదు. ప్రేరణ ద్వారా ఏ పని జరగదు. శంకరుని ప్రేరణ ద్వారా వినాశనము జరుగుతుందని అంటారు కానీ వినాశనమనేది డ్రామాలో నిశ్చితమై ఉంది. వారు ఈ మిసైల్స్ మొదలైనవి తయారుచేయవలసిందే. అది కేవలం మహిమగా చెప్పుకుంటూ ఉంటారు. ఎవ్వరికీ వారి పెద్దల మహిమ గురించి తెలియదు. ధర్మ స్థాపకులను కూడా గురువులని అంటారు, కానీ వారు కేవలం ధర్మ స్థాపన చేస్తారు. ఎవరైతే సద్గతిని ఇస్తారో, వారిని గురువని అంటారు. ఆ ధర్మ స్థాపకులు ధర్మ స్థాపన చేయడానికి వస్తారు, వారి వెనుక వారి వంశావళి వస్తూ ఉంటుంది. వారు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వరు. అటువంటప్పుడు వారిని గురువులని ఎలా అంటారు. గురువు అయితే ఒక్కరే, వారినే సర్వుల సద్గతిదాత అని అంటారు. భగవంతుడైన తండ్రే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు, ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. ఎప్పుడూ ఎవ్వరూ వారిని స్మృతి చేయడము మానలేరు. పతి పట్ల ఎంత ప్రేమ ఉన్నా సరే మళ్ళీ - ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా అని తప్పకుండా అంటారు, ఎందుకంటే వారే సర్వుల సద్గతిదాత. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఇదంతా రచన, నేను రచయిత అయిన తండ్రిని. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రియే. సోదరుడు సోదరుడికి వారసత్వాన్ని ఇవ్వలేరు. వారసత్వము ఎప్పుడూ తండ్రి నుండే లభిస్తుంది. అనంతమైన పిల్లలైన మీ అందరికీ అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను, అందుకే నన్ను - ఓ పరమపిత, క్షమించండి, దయ చూపించండి అంటూ తలచుకుంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. భక్తి మార్గములో అనేక రకాలుగా మహిమ చేస్తారు. వారు కూడా డ్రామానుసారముగా తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. తండ్రి అంటారు - నేనేమీ వారు పిలవడము వలన రాను. డ్రామా ఆ విధముగా తయారై ఉంది. డ్రామాలో నేను వచ్చే పాత్ర నిశ్చితమై ఉంది. అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన లేదా కలియుగ వినాశనము, సత్యయుగ స్థాపన చేయవలసి ఉంటుంది. నా సమయానికి నా అంతట నేనే వస్తాను. ఈ భక్తి మార్గము యొక్క పాత్ర కూడా డ్రామాలో ఉంది. ఇప్పుడు భక్తి మార్గపు పాత్ర పూర్తయ్యింది కావున నేను వచ్చాను. పిల్లలు కూడా అంటారు - ఇప్పుడు మేము తెలుసుకున్నాము, 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నాము, బాబా, కల్పక్రితము కూడా మీరు బ్రహ్మా తనువులోకే వచ్చారు. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది, ఇక మళ్ళీ ఎప్పుడూ లభించదు. ఇది జ్ఞానము, అది భక్తి. జ్ఞానము యొక్క ప్రారబ్ధము ఎక్కే కళ. క్షణములో జీవన్ముక్తి అని అంటారు. జనకుడు క్షణములో జీవన్ముక్తిని పొందారని అంటారు. కేవలం ఒక్క జనకుడే జీవన్ముక్తిని పొందారా? జీవన్ముక్తి అంటే ఈ రావణ రాజ్యము నుండి జీవితాన్ని ముక్తి చేస్తారు. పిల్లలందరికీ ఎంత దుర్గతి పట్టింది అనేది తండ్రికి తెలుసు. మళ్ళీ వారి సద్గతి జరగాలి. దుర్గతి నుండి మళ్ళీ ఉన్నతమైన గతిని, ముక్తి-జీవన్ముక్తిని పొందుతారు. మొదట ముక్తిలోకి వెళ్ళి, ఆ తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. శాంతిధామము నుండి మళ్ళీ సుఖధామములోకి వస్తారు. ఈ చక్రము యొక్క రహస్యమంతటినీ తండ్రి అర్థం చేయించారు. మీ తర్వాత వేరే ధర్మాలు కూడా వస్తూ ఉంటాయి, మనుష్య సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రి అంటారు, ఈ సమయములో ఈ మనుష్య సృష్టి యొక్క వృక్షము తమోప్రధానమై, శిథిలావస్థను చేరుకుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క పునాది పూర్తిగా శిథిలమైపోయింది. మిగిలిన ధర్మాలన్నీ నిలిచి ఉన్నాయి. భారత్ లో ఒక్కరు కూడా స్వయాన్ని ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా భావించరు. వారు దేవతా ధర్మమువారే కానీ ఈ సమయములో - మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము అని భావించరు, ఎందుకంటే దేవతలైతే పవిత్రముగా ఉండేవారు. మేమైతే పవిత్రముగా లేము, అపవిత్రముగా, పతితముగా ఉన్న మేము స్వయాన్ని దేవతలమని ఎలా చెప్పుకుంటాము అని వారు భావిస్తారు. హిందూ అని పిల్చుకోవడము కూడా డ్రామా ప్లాన్ అనుసారముగా ఒక ఆచారములా అయిపోతుంది. జనాభా లెక్కలలో కూడా హిందూ ధర్మమని వ్రాసేస్తారు. గుజరాత్ వారు అయినా కూడా హిందూ గుజరాతి అని అంటారు. హిందూ ధర్మము ఎక్కడ నుండి వచ్చింది అని వారిని అడిగి చూడండి. ఎవ్వరికీ తెలియదు. కేవలం మా ధర్మాన్ని శ్రీకృష్ణుడు స్థాపించారని అంటారు. ఎప్పుడు? ద్వాపరములో అంటారు. ద్వాపరము నుండే ఈ మనుష్యులు తమ ధర్మాన్ని మరచి హిందువులని చెప్పుకోవడము మొదలుపెట్టారు, అందుకే వారిని దైవీ ధర్మ భ్రష్టులని అంటారు. అక్కడ అందరూ మంచి కర్మలు చేస్తారు. ఇక్కడ అందరూ ఛీ-ఛీ కర్మలు చేస్తారు, అందుకే ధర్మ భ్రష్టులు మరియు కర్మ భ్రష్టులు అని అంటారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠ ధర్మము మరియు శ్రేష్ఠ దైవీ కర్మల స్థాపన జరుగుతోంది, అందుకే ఇప్పుడిక ఈ పంచ వికారాలను వదులుతూ వెళ్ళండి అని చెప్తున్నారు. ఈ వికారాలు అర్ధకల్పము నుండి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క జన్మలో వీటిని వదిలేయడము - ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. శ్రమించకుండా విశ్వ రాజ్యాధికారము లభించదు. తండ్రిని స్మృతి చేస్తేనే మీకు మీరు రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు అంటే రాజ్యానికి అధికారులుగా అవుతారు. ఎంత బాగా స్మృతిలో ఉంటే, శ్రీమతముపై నడుస్తే, అంతగా మీరు రాజులకే రాజులుగా అవుతారు. చదివించే టీచరైతే చదివించడానికి వచ్చారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల. నరుని నుండి నారాయణునిగా తయారుచేసే కథను వినిపిస్తారు. ఈ కథ ఎంత ప్రసిద్ధమైనది. దీనిని అమర కథ, సత్యనారాయణుడి కథ, మూడవ నేత్రము కథ అని కూడా అంటారు. మూడింటి అర్థాన్ని కూడా తండ్రి తెలియజేస్తారు. భక్తి మార్గములోనైతే ఎన్నో కథలు ఉన్నాయి. పాట ఎంత బాగుందో చూడండి. బాబా మనల్ని మొత్తము విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు, ఆ యజమానత్వాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. సదా ఈ స్మృతిని ఉంచుకోవాలి - మేము ఏక మతము, ఏక రాజ్యము, ఏక ధర్మ స్థాపనకు నిమిత్తులము, అందుకే ఏక మతము వారిగా అయి ఉండాలి. 2. స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు వికారాలను వదిలేందుకు కృషి చేయాలి. చదువు పట్ల పూర్తిగా ధ్యాస ఉంచాలి. వరదానము:-కర్మాతీత స్థితిలో స్థితులై నలువైపులా ఉన్న సేవలను హ్యాండిల్ చేసే సిద్ధి స్వరూప భవ మున్ముందు నలువైపులా ఉన్న సేవల విస్తారాన్ని హ్యాండిల్ చేసేందుకు భిన్న-భిన్న సాధనాలను ఉపయోగించవలసి ఉంటుంది, ఎందుకంటే ఆ సమయములో పత్ర వ్యవహారాలు లేక టెలిగ్రాములు, టెలిఫోనులు మొదలైనవి పని చేయవు. అటువంటి సమయములో వైర్ లెస్ సెట్ కావాలి, దాని కొరకు ఇప్పుడిప్పుడే కర్మయోగీ, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో స్థితులై ఉండే అభ్యాసము చేయండి. అప్పుడు నలువైపులా సంకల్ప సిద్ధి ద్వారా సేవలో సహయోగిగా అవ్వగలుగుతారు. స్లోగన్:-పరమాత్మ ప్రేమ యొక్క పాలనకు స్వరూపము మీ సహజయోగీ జీవితము.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి ప్రతి ఒక్కరూ రెండు విషయాల పట్ల విశేషమైన శ్రద్ధ పెట్టాలి - ఒకటి, సదా సంస్కారాలను కలుపుకుని వెళ్ళే యూనిటీ (ఐకమత్యము), రెండవది, ఒకరి పట్ల ఒకరు విశ్వాసాన్ని ఉంచి సదా సంతుష్టముగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టము చేయాలి. ఎప్పుడైతే ఈ రెండు విషయాల పట్ల సదా అటెన్షన్ ఉంటుందో, అప్పుడు తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో, అలా కనిపిస్తారు మరియు ప్రత్యక్షత జరుగుతుంది. "