v. v. guptha
ShareChat
click to see wallet page
@299580595
299580595
v. v. guptha
@299580595
ఐ లవ్ షేర్ చాట్
#🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🛕అయోధ్య రామ మందిరం🙏 25-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - తండ్రి పిల్లలైన మీ కోసం కొత్త రాజ్యాన్ని స్థాపన చేయడానికి దూరదేశము నుండి వచ్చారు, మీరిప్పుడు స్వర్గానికి యోగ్యులుగా అవుతున్నారు’’ ప్రశ్న:-ఏ పిల్లలకైతే శివబాబా పట్ల ఎడతెగని నిశ్చయము ఉందో వారి గుర్తులేమిటి? జవాబు:-వారు కళ్ళు మూసుకుని బాబా శ్రీమతముపై నడుస్తూ ఉంటారు, ఏ ఆజ్ఞ లభిస్తే అది స్వీకరిస్తారు. దీని వలన ఏమైనా నష్టము కలుగుతుందేమో అన్న ఆలోచన కూడా రాదు, ఎందుకంటే ఇటువంటి నిశ్చయబుద్ధి కల పిల్లల బాధ్యత తండ్రిది. వారికి ఉన్న నిశ్చయానికి బలం లభిస్తుంది. అవస్థ స్థిరముగా మరియు అచలముగా తయారవుతుంది. పాట:-నీవే తల్లివి, నీవే తండ్రివి... ▶ ఓంశాంతి. మీరు ఎవరి మహిమను విన్నారు? వారి గురించి పిల్లలైన మీకు తప్ప ఈ ప్రపంచములో ఇంకెవ్వరికీ తెలియదు. ఇది ఉన్నతోన్నతమైన తండ్రి మహిమ. ఇక మిగిలినవారెవరి మహిమను చేసినా అది వ్యర్థమే అవుతుంది. ఉన్నతోన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. కానీ తండ్రి పరిచయాన్ని ఎవరిస్తారు. వారే స్వయంగా వచ్చి ఆత్మ పరిచయాన్ని మరియు తమ పరిచయాన్ని ఇస్తారు. మహాన్ ఆత్మ, జీవాత్మ అని అంటూ ఉంటారు కానీ మనుష్యులెవ్వరికీ ఆత్మ పరిచయము లేదు. శరీరము వదిలినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుందని అంటారు. శరీరము శవమైపోతుంది, ఆత్మ అవినాశీ, అది ఎప్పుడూ అంతమవ్వదు. నక్షత్రము వలె ఉండే ఆత్మ అతి సూక్ష్మమైనది. అది ఈ కళ్ళకు కనిపించదు. కర్తవ్యాలన్నీ ఆత్మయే చేస్తుంది కానీ పదే-పదే దేహాభిమానములోకి వచ్చి, నేను ఫలానాను, నేను ఇది చేస్తాను అని అంటారు. వాస్తవానికి అంతా చేసేది ఆత్మయే. శరీరమైతే ఇంద్రియాలతో కూడినది. ఆత్మ చాలా సూక్ష్మమైనదని, అది భృకుటి మధ్యలో ఉంటుందని ఈ సాధువులు మొదలైనవారికి కూడా తెలుసు, కానీ ఆత్మలో ఈ పాత్రను అభినయించే సంస్కారాలు ఉన్నాయి అనే జ్ఞానము వారికి లేదు. కొందరు - ఆత్మలో సంస్కారాలు ఉండవు, ఆత్మ నిర్లేపి అని అంటారు. మరికొందరు - సంస్కారాల అనుసారముగా జన్మ లభిస్తుంది అని అంటారు. ఇలా అనేక అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఎటువంటి ఆత్మలు 84 జన్మలు తీసుకుంటారు అనేది కూడా ఎవరికీ తెలియదు. సూర్యవంశీయులు మాత్రమే 84 జన్మల చక్రములో తిరగవలసి ఉంటుందని మీకు తెలుసు. ఆత్మయే 84 జన్మల చక్రములో తిరిగి పతితముగా అవుతుంది, దానిని ఇప్పుడు పావనముగా ఎవరు తయారుచేయాలి. పతిత-పావనుడు, ఉన్నతోన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే, వారి మహిమ అందరికన్నా ఉన్నతమైనది. 84 జన్మలను అందరూ అయితే తీసుకోరు. వెనుక వచ్చేవారైతే 84 జన్మలను తీసుకోలేరు. అందరూ ఒకేసారి అయితే రారు. సూర్యవంశీ రాజులు మరియు ప్రజలు, ఎవరైతే మొట్టమొదట సత్యయుగములోకి వస్తారో, వారికి 84 జన్మలు ఉంటాయి. తర్వాతర్వాత మనుష్యుల సంఖ్య చాలా వృద్ధి చెందుతుంది కదా. ఇక కొంతమందికి 83, కొంతమందికి 80 జన్మలు ఉంటాయి. అక్కడ సత్యయుగములోనైతే పూర్తి 150 సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది, ఎవరూ ముందే మరణించరు. ఈ విషయాలను తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మను గురించి ఇప్పుడు ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు - మీ ఆత్మ ఎలాగైతే ఉంటుందో, అలాగే నా ఆత్మ కూడా ఉంటుంది, కానీ మీరు జనన-మరణాలలోకి వస్తారు, నేను రాను. నన్ను పిలవడము కూడా పతితులుగా అయినప్పుడు పిలుస్తారు, చాలా దుఃఖితులుగా అయినప్పుడు పిలుస్తారు. ఈ సమయములో పిల్లలైన మిమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు. పరమాత్మ వస్తారు అన్నది ఎలా నమ్మాలి అని కొంతమంది అడుగుతారు! వారికి ఇలా అర్థం చేయించాలి - ఓ పతిత-పావనా రండి అని అందరూ పిలుస్తారు, అయితే వారు నిరాకారుడు, వారికి తమదంటూ శరీరము లేదు, వారు రావడము కూడా పతిత ప్రపంచములోకి రావలసి ఉంటుంది, పావన ప్రపంచములోకైతే రారు. ఈ విధముగా అర్థం చేయించాలి. ఇది కూడా అర్థం చేయించాలి - ఏ విధముగా ఆత్మ చిన్నగా ఉంటుందో, పరమాత్మ కూడా అంతే చిన్నగా ఉంటారు, కానీ వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, నాలెడ్జ్ ఫుల్. తండ్రి అంటారు - మీరు నన్ను పరమపిత పరమాత్మ అని అంటారు, పిలుస్తారు, కావున తప్పకుండా వస్తాను కదా. దూరదేశములో నివసించేవారు పరాయి దేశములోకి వచ్చారని గాయనము కూడా ఉంది. ఇప్పుడు మనము పరాయి దేశములో అనగా రావణుడి దేశములో ఉన్నామని తండ్రి ద్వారా తెలిసింది. సత్య, త్రేతాయుగాలలో మనము ఈశ్వరీయ దేశములో అనగా మన దేశములో ఉండేవారము, తర్వాత ద్వాపరము నుండి మొదలుకుని మనము పరాయి దేశములోకి, పరాయి రాజ్యములోకి వచ్చేస్తాము, వామ మార్గములోకి వచ్చేస్తాము. అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. మొట్టమొదట శివబాబాను భక్తి చేయడము మొదలుపెడతారు, మనుష్యులు శివునికి ఎంతో పెద్ద లింగాన్ని తయారుచేస్తారు కానీ వారు అంత పెద్దగా అయితే లేరు. ఇప్పుడు మీరు, ఆత్మ మరియు పరమాత్మకు గల వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారు. వారు నాలెడ్జ్ ఫుల్, సదా పావనుడు, సుఖ సాగరుడు, ఆనంద సాగరుడు. ఇది పరమాత్ముని మహిమయే కదా. ఓ పతిత-పావనా రండి అని ఇప్పుడు పిలుస్తారు. వారు పరమపిత, వారు కల్ప-కల్పము వస్తారు. దూరదేశములో ఉండే ప్రయాణీకుడిని పిలుస్తారు, వారి మహిమను పాడుతారు. బ్రహ్మా-సరస్వతులనైతే పిలవరు, నిరాకార పరమాత్మను పిలుస్తారు. దూరదేశములో నివసించేవారు, ఇప్పుడు పరాయి దేశములోకి రండి అని ఆత్మ పిలుస్తుంది ఎందుకంటే అందరూ పతితముగా అయిపోయారు. నేను కూడా వస్తాను, రావణ రాజ్యము సమాప్తమవ్వనున్నప్పుడు వస్తాను, నేను రావడము కూడా సంగమయుగములోనే వస్తాను. ఇది ఎవరికీ తెలియదు. వారు పరమాత్ముడు బిందువు అని అంటారు కూడా. ఈ రోజుల్లోనైతే ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అంటారు కానీ ఆత్మ పరమాత్మగా కాలేదు. ఆత్మ, పరమాత్మ, ఇరువురూ వేర్వేరు. రూపము ఇరువురిది ఒకేలా ఉంటుంది. కానీ ఆత్మ పతితముగా అవుతుంది, 84 జన్మల పాత్రను అభినయించవలసి ఉంటుంది. పరమాత్మ జనన-మరణ రహితుడు. ఒకవేళ ఆత్మయే పరమాత్మ అని అంటే, మరి సతోప్రధానమైన పరమాత్మ తమోప్రధానతలోకి వస్తారా, రారు, ఈ విధముగా జరగడం సాధ్యము కాదు. తండ్రి అంటారు - నేను సర్వాత్మల సేవ చేయడానికి వస్తాను. నా జన్మ జరిగింది అని కూడా అనరు. నేను వచ్చేదే నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు. వారు మన స్వర్గాన్ని స్థాపన చేయడానికి పరాయి దేశములోకి వచ్చారు. తండ్రియే వచ్చి మనల్ని స్వర్గానికి యోగ్యులుగా తయారుచేస్తారు. మిగిలిన ఆత్మలందరికీ తమ-తమ పాత్రలు ఉన్నాయని కూడా అర్థం చేయించారు. పరమాత్మ జనన-మరణ రహితుడు. వారు రావడము కూడా తప్పకుండా వస్తారు, అందుకే శివరాత్రిని జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. మామూలుగా శివజయంతిని జరుపుకుంటూ వచ్చారు. వారు స్వర్గ స్థాపన చేయడానికి తప్పకుండా సంగమములోనే వచ్చి ఉంటారు. వారు పతితులను పావనముగా చేయడానికి తప్పకుండా సంగమములోనే వస్తారు కదా. పావన సృష్టి స్వర్గము. పతిత-పావనా రండి అని అంటారు. మరి తప్పకుండా పతిత ప్రపంచ వినాశన సమయములోనే, పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. వారు ప్రతి యుగములోనూ రారు. తండ్రి అంటారు - నేను సంగమములోనే వచ్చి పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేయవలసి ఉంటుంది. ఇది పరాయి దేశము, రావణుడి దేశము. కానీ రావణ రాజ్యము నడుస్తుందని మనుష్యులెవరికీ తెలియదు. ఈ రావణ రాజ్యము ఎప్పటినుండి ప్రారంభమయ్యింది, ఏమీ తెలియదు. మొట్టమొదటి ముఖ్యమైన విషయము - ఆత్మ మరియు పరమాత్మల రహస్యాన్ని అర్థం చేయించాలి, ఆ తర్వాత - వారు పావనముగా తయారుచేయడానికి కల్పము యొక్క సంగమయుగములో వస్తారని అర్థం చేయించాలి. ఈ పని వారిదే, అంతేకానీ శ్రీకృష్ణుడిది కాదు. శ్రీకృష్ణుడు స్వయమే 84 జన్మలను తీసుకుని కిందకు వస్తారు. సూర్యవంశీయులందరూ కిందకు దిగుతారు. వృక్షములోని సగ భాగము తాజాగా, సగ భాగము పాతదిగా ఉండదు కదా. అందరిదీ శిథిలావస్థయే ఉంటుంది. కల్పము ఆయుష్షు గురించి కూడా మనుష్యులకు తెలియదు. శాస్త్రాల్లో చాలా ఎక్కువ ఆయువును చూపించారు. ఇది తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. ఇందులో వేరే ప్రశ్నలేవీ తలెత్తవు. రచయిత అయిన తండ్రి సత్యమే చెప్తారు. మనము ఇంతమంది బి.కె.లు ఉన్నాము, అందరము నమ్ముతాము. వారు తప్పకుండా ఉన్నారు కావుననే నమ్ముతున్నాము కదా. మున్ముందు నిశ్చయము ఏర్పడిన తర్వాత అంతా అర్థమవుతుంది కూడా. మొట్టమొదట మనుష్యులకు ఇది అర్థం చేయించాలి - పరమపిత పరమాత్మ నిరాకారుడు, వారు దూరదేశము నుండి వచ్చారు. కానీ ఏ శరీరములోకి వచ్చారు, సూక్ష్మవతనములోకి వచ్చి ఏమి చేస్తారు. వారు తప్పకుండా ఇక్కడికే రావలసి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మా కూడా ఇక్కడే కావాలి. బ్రహ్మా ఎవరు, అది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. నేను ఎవరిలోనైతే ప్రవేశించానో, వారికీ ఇంతకుముందు తమ జన్మల గురించి తెలియదు, అలానే పిల్లలకు కూడా తెలియదు. పిల్లలుగా కూడా ఎప్పుడు అవుతారంటే, నేను దత్తత తీసుకున్నప్పుడు. నేను వీరి (సాకార బ్రహ్మా) సహితముగా పిల్లలను అడుగుతున్నాను - మీరు మీ జన్మలను మర్చిపోయారా? ఇప్పుడు సృష్టి చక్రము పూర్తవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. నేను పావనముగా తయారుచేసేందుకు, రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. పావనముగా అవ్వడానికి ఇంకే మార్గము లేదు. ఒకవేళ ఈ రహస్యాన్ని మనుష్యులు తెలుసుకున్నట్లయితే, ఇక గంగా మొదలైన స్థానాలకు స్నానాలు చేయడానికి, మేళాలు మొదలైనవాటికి వెళ్ళరు. ఈ నీటి నదులలోనైతే సదా స్నానాలు చేస్తూ ఉంటారు. ద్వాపరము నుండి మొదలుకుని చేస్తూనే వచ్చారు. గంగలో మునకలు వేస్తే పాపాలు నశిస్తాయని భావిస్తారు, కానీ ఎవరి పాపాలు నశించవు. మొట్టమొదట అయితే ఆత్మ మరియు పరమాత్మల రహస్యాన్నే తెలియజేయండి. ఆత్మలే తండ్రి అయిన పరమాత్మను పిలుస్తారు, వారు నిరాకారుడు, ఆత్మ కూడా నిరాకారియే. ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మ పిలుస్తుంది. భక్తి తర్వాత భగవంతుడు రావలసి ఉంటుంది, ఇది కూడా డ్రామాలోని పాత్ర. తండ్రి అంటారు - నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి రావలసి ఉంటుంది. భగవంతునికి సంకల్పము కలిగింది అని శాస్త్రాలలో కూడా ఉంది, అంటే తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారముగా వారికి సంకల్పము కలిగి ఉంటుంది. ఇంతకుముందు ఈ విషయాలను అర్థం చేసుకునేవారు కాదు. రోజురోజుకు అర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు - నేను మీకు కొత్త-కొత్త గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను, అవి వింటూ-వింటూ అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు శివబాబా చదివిస్తున్నారని అనేవారు కాదు. ఇప్పుడైతే మంచి రీతిలో అర్థం చేసుకున్నారు, ఇంకా అర్థం చేసుకోవలసినది చాలా ఉంది. ఎవరికి ఎలా అర్థం చేయించాలి అనేది రోజూ చెప్తూ ఉంటారు. ముందు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు అన్న నిశ్చయము ఏర్పడాలి, వారు తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారు. ఇందులో తికమకపడాల్సిన విషయము కూడా లేదు. పిల్లల్లో కొంతమంది పక్కాగా ఉన్నారు, కొంతమంది కచ్చాగా ఉన్నారు. కచ్చాగా ఉన్నవారు ఎవరికీ అర్థం చేయించలేరు. స్కూల్లో కూడా ఈ విధముగా నంబరువారుగా ఉంటారు. పరమపిత పరమాత్మ వచ్చి చదివిస్తున్నారు అన్నది మేము ఎలా నమ్మాలి అన్న సంశయము చాలామందికి కలుగుతుంది, ఎందుకంటే వారి బుద్ధిలో శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని వినిపించారు అన్నట్లు ఉంది. ఇప్పుడు పతిత ప్రపంచములోకైతే శ్రీకృష్ణుడు రాలేరు. పతిత ప్రపంచములోకి మరియు పతిత శరీరములోకి పరమాత్మయే రావలసి ఉంటుందని వారికి ఋజువు చేసి చెప్పండి. ప్రతి ఒక్కరికి తమ-తమ బుద్ధి ఉంటుందని కూడా తండ్రి అర్థం చేసుకుంటారు. కొంతమందైతే వెంటనే అర్థం చేసుకుంటారు. ఎంత వీలైతే అంత అర్థం చేయించాలి. బ్రాహ్మణులందరూ ఒకేలా ఉండరు. కానీ దేహాభిమానము పిల్లల్లో చాలా ఉంది. నంబరువారుగా ఉన్నారని బాబాకు కూడా తెలుసు. పిల్లలు డైరెక్షన్ల అనుసారముగా నడుచుకోవాలి. పెద్ద బాబా ఏమి చెప్పినా సరే, దానిని స్వీకరించాలి. గురువులు మొదలైనవారిదైతే స్వీకరిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు స్వర్గములోకి తీసుకువెళ్ళే తండ్రి మాటలనైతే కళ్ళు మూసుకుని స్వీకరించాలి. కానీ అంతటి నిశ్చయబుద్ధి కలవారిగా లేరు. అందులో నష్టము ఉన్నా, లాభము ఉన్నా స్వీకరించాలి. ఒకవేళ నష్టం జరిగిందనే అనుకోండి, బాబా అయితే అంటారు కదా - ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని అనుకోండి, బ్రహ్మా చెప్తున్నారని అనుకోకండి. శివబాబా బాధ్యులవుతారు. ఇది వారి రథము, వారే సరి చేస్తారు. నేను కూర్చుని ఉన్నాను అని బాబా అంటారు. ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారు అని అనుకోండి, వీరికేమీ తెలియదు. ఇలాగే అనుకోండి. ఒకవైపు ఈ నిశ్చయము పెట్టుకోవాలి. నేను చెప్పింది వింటూ ఉన్నట్లయితే, మీ కళ్యాణము జరుగుతూ ఉంటుందని శివబాబా అంటారు. ఒకవేళ ఈ బ్రహ్మా ఏదైనా చెప్పినా, దానికి కూడా నేనే బాధ్యుడిని. పిల్లలైన మీరు చింతించకండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే అవస్థ మరింత పక్కా అయిపోతుంది. నిశ్చయములో వికర్మలు కూడా వినాశనమవుతాయి, బలం కూడా లభిస్తుంది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంత ఎక్కువ బలం లభిస్తుంది. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరిస్తూ సేవ చేస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. చాలామందిలో దేహాభిమానము చాలా ఉంటుంది. బాబా పిల్లలందరితో ఎంత ప్రేమగా నడుచుకుంటారో చూడండి, అందరితోనూ మాట్లాడుతూ ఉంటారు. పిల్లలను అడుగుతుంటారు - బాగానే కూర్చున్నారా! ఏ కష్టము లేదు కదా! పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. అనంతమైన తండ్రికి పిల్లల పట్ల చాలా-చాలా ప్రేమ ఉంది. శ్రీమతమనుసారముగా ఎవరు ఎంత సేవను చేస్తారో, దాని అనుసారముగా ప్రేమ ఉంటుంది. సేవలోనే లాభము ఉంటుంది. సేవలో ఎముకలు ఇవ్వాలి. ఏదో ఒక సేవ చేస్తూ ఉన్నట్లయితే, వీరు ఫస్ట్ క్లాస్ బిడ్డ అని బాబా హృదయములో కూడా ఉంటారు. కానీ నడుస్తూ-నడుస్తూ కొంతమందిపై గ్రహచారము కూడా కూర్చుంటుంది. మాయ ఎదిరిస్తుంది కదా. గ్రహచారము కారణముగా ఇక జ్ఞానము తీసుకోలేరు. కొంతమందైతే కర్మణా సేవను అలసట లేకుండా చేస్తారు. మీ పని అందరినీ సుఖధామానికి యజమానులుగా చేయడము. ఎవరికీ దుఃఖము ఇవ్వకండి. జ్ఞానము లేకపోతే చాలా దుఃఖము ఇస్తారు. ఇక ఎంత అర్థం చేయించినా అర్థం చేసుకోరు. మొట్టమొదట ఆత్మ మరియు పరమాత్మ గురించి అర్థం చేయించాలి, ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉంది అన్నది అర్థం చేయించాలి, అది అవినాశీ పాత్ర. అది ఎప్పటికీ మారదు, డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ నిశ్చయము ఉన్నవారు ఎప్పుడూ చలించరు. చాలామంది చలించిపోతూ ఉంటారు. చివరిలో ప్రపంచానికి నిప్పు అంటుకున్నప్పుడు అచలముగా అయిపోతారు. ఇప్పుడైతే చాలా యుక్తిగా అర్థం చేయించాలి. మంచి-మంచి పిల్లలైతే సేవలో ఉంటారు, హృదయాన్ని అధిరోహించి ఉంటారు. చాలా చురుకుగా ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా కష్టపడతారు. వారికి సేవ పట్ల చాలా అభిరుచి ఉంటుంది. ఎవరిలో ఏ గుణాలైతే ఉంటాయో, వాటిని బాబా వర్ణిస్తారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. సేవలో ఎముకలను ఇవ్వాలి, ఏ విషయములోనూ సంశయము కలగకూడదు. అందరికీ సేవతో సుఖము ఇవ్వాలి, దుఃఖము ఇవ్వకూడదు. 2. నిశ్చయము యొక్క బలముతో మీ అవస్థను స్థిరముగా చేసుకోవాలి. ఏ శ్రీమతమైతే లభిస్తుందో, అందులో కళ్యాణము ఇమిడి ఉంది, ఎందుకంటే తండ్రి బాధ్యులు, అందుకే చింతించకూడదు. వరదానము:-యోగయుక్త స్థితి ద్వారా సూక్ష్మమైన మరియు కఠినమైన బంధనాలను దాటి వేసే బంధనముక్త భవ యోగయుక్తమైనవారి గుర్తు ఏమిటంటే - వారు బంధనముక్తులుగా ఉంటారు. యోగయుక్తముగా అయ్యేందుకు అన్నింటికంటే పెద్ద అంతిమ బంధనము - స్వయాన్ని తెలివైనవారిగా భావిస్తూ శ్రీమతాన్ని తమ స్వంత బుద్ధి యొక్క అద్భుతమని భావించడము అనగా శ్రీమతములో తమ బుద్ధిని మిక్స్ చేయడము, దీనినే బుద్ధి యొక్క అభిమానమని అంటారు. 2-ఎప్పుడైనా ఎవరైనా ఈ బలహీనత ఉంది అని సూచన ఇచ్చినా లేక మనల్ని నిందించినా - ఒకవేళ ఆ సమయములో ఏ కొంచెం వ్యర్థ సంకల్పాలు నడిచినా, అది కూడా బంధనమే. ఎప్పుడైతే ఈ బంధనాలను దాటి గెలుపు-ఓటమి, నింద-స్తుతిలో సమాన స్థితిని తయారుచేసుకుంటారో, అప్పుడు సంపూర్ణ బంధనముక్తులు అని అంటారు. స్లోగన్:-ముందు ఆలోచించడము, ఆ తర్వాత చేయడము - ఇదే జ్ఞానయుక్త ఆత్మల గుణము.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ ఏ విధముగా ఏమీ తెలియని చిన్న బాలుడు ఏదైనా నష్టము కలిగించే వస్తువును ఆటబొమ్మగా భావించి తీసుకుంటే ఆ బాలుడికి ఏదో ఒకటి ఇచ్చి దాని నుండి విడిపించాల్సి వస్తుందో, అదే విధముగా ఎవరైతే అల్పకాలికమైన పేరు-ప్రతిష్టలను కోరుకుంటారో మరియు అల్పకాలికమైన కోరికలను పెట్టుకుంటారో, వారికి గౌరవాన్ని ఇచ్చి స్వయం నిర్మానచిత్తులుగా అవ్వండి. ఆ సమయములో ఒకవేళ వారికి శిక్షణను ఇచ్చినట్లయితే ఘర్షణ మొదలవుతుంది, అందుకే అటువంటి సమయములో యుక్తియుక్తమైన నడవడిక ద్వారా, పరోపకారులుగా అయ్యి క్షమా భావముతో గౌరవాన్ని ఇచ్చి ముందుగా వారిని వివేకవంతులుగా చేయండి, తద్వారా ఈ విషయము నష్టపరిచేటువంటిది అని వారు స్వయమే అర్థం చేసుకుంటారు. "
https://youtube.com/shorts/rwHfvzaGbAk?si=vC06TDBSd9e9H15k #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి
#🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు 24-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే దేహభానాన్ని మరచి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి, అందరి పట్ల మమకారాన్ని తొలగించండి’’ ప్రశ్న:-సంగమయుగములో పిల్లలైన మీరు తండ్రి నుండి ఏ తెలివిని నేర్చుకుంటారు? జవాబు:-తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఎలా తయారవ్వాలి, తమ భాగ్యాన్ని ఉన్నతముగా ఎలా తయారుచేసుకోవాలి, ఈ తెలివిని ఇప్పుడే మీరు నేర్చుకుంటారు. ఎవరెంతగా యోగయుక్తముగా మరియు జ్ఞానయుక్తముగా అవుతారో, వారి ఉన్నతి అంతగా జరుగుతూ ఉంటుంది. తమ ఉన్నతిని చేసుకునే పిల్లలు ఎప్పుడూ దాగి ఉండరు. పిల్లల్లో ఎవరు తమ భాగ్యాన్ని ఉన్నతముగా తయారుచేసుకుంటున్నారు అనేది తండ్రి ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు. పాట:-నీ దారిలోనే మరణించాలి... ▶ ఓంశాంతి. పిల్లలందరూ ఈ పాటను విన్నారు. పిల్లలు అని అన్నప్పుడు బాబా బ్రాహ్మణులైన మన కోసమే అంటున్నారని అన్ని సెంటర్లలోని పిల్లలకు తెలుసు - జీవిస్తూనే మెడలోని హారముగా అయ్యేందుకని అనగా మూలవతనానికి వెళ్ళి బాబా ఇంట్లో ఉండేందుకని పిల్లలు ఈ పాటను విన్నారు. అది శివబాబా ఇల్లు కదా, అందులో సాలిగ్రామాలందరూ ఉంటారు. తప్పకుండా ఆ బాబాయే వచ్చి ఉన్నారని బ్రాహ్మణ కులభూషణులైన, స్వదర్శన చక్రధారులైన పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు అశరీరిగా అవ్వాలి అనగా దేహ భానాన్ని మర్చిపోవాలి అని వారంటారు. ఈ పాత ప్రపంచమైతే అంతమైపోతుంది. ఈ శరీరాన్ని అయితే విడిచిపెట్టాలి అనగా అందరినీ విడిచిపెట్టాలి ఎందుకంటే ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. కావున ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. పిల్లలందరికీ ఇప్పుడు సంతోషము కలుగుతుంది, ఎందుకంటే అర్ధకల్పము బట్టి ఇంటికి వెళ్ళేందుకని చాలా భ్రమించారు కానీ మార్గమేమీ లభించలేదు సరికదా, ఇంకా భక్తి మార్గపు ఆర్భాటాలను చూస్తూ మనుష్యులు చిక్కుకుంటూ వచ్చారు. ఇది భక్తి మార్గపు ఊబి, ఇందులో మనుష్యులు మెడ వరకు చిక్కుకుని ఉన్నారు. బాబా, మేము పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని మర్చిపోతాము, ఇప్పుడు అశరీరిగా అయి మీతోపాటు ఇంటికి వస్తాము అని పిల్లలంటారు. మమ్మల్ని తీసుకువెళ్ళేందుకు పరమపిత పరమాత్మ పరంధామము నుండి వచ్చారని అందరి బుద్ధిలోనూ ఉంది. వారు, కేవలం మీరు పవిత్రముగా అయి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. జీవిస్తూ మరణించాలి. అక్కడ ఆ ఇంటిలో ఆత్మలు నివసిస్తారని మీకు తెలుసు. ఆత్మ అయితే బిందువు. నిరాకారీ ప్రపంచములోకి ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి, ఎంతమంది మనుష్యులో అన్ని ఆత్మలు అక్కడ ఉంటాయి. ఆ మహాతత్వములో ఆత్మలు ఎంత చోటు తీసుకుంటాయి? శరీరమైతే ఇంత పెద్దది, ఇది ఎంత చోటు తీసుకుంటుంది? అదే ఆత్మకైతే ఎంత చోటు కావాలి! ఆత్మలమైన మనము ఎంత తక్కువ చోటును తీసుకుంటాము? చాలా తక్కువ. పిల్లలకు ఈ విషయాలన్నింటినీ తండ్రి ద్వారా వినే సౌభాగ్యము ఇప్పుడు లభిస్తుంది. తండ్రియే అర్థం చేయిస్తున్నారు - మీరు శరీరము లేకుండా వచ్చారు, తర్వాత శరీరాన్ని ధరించి పాత్రను అభినయించారు, ఇప్పుడు మళ్ళీ జీవిస్తూనే మరణించాలి, అందరినీ మర్చిపోవాలి. తండ్రి వచ్చి మరణించడము నేర్పిస్తారు. మీ తండ్రిని, మీ ఇంటిని స్మృతి చేయండి, బాగా పురుషార్థము చేయండి అని చెప్తారు. యోగములో ఉండటముతో పాపాలు నశిస్తాయి. అప్పుడు ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానము అయిపోతుంది, అందుకే తండ్రి సలహా ఇస్తున్నారు, కల్పక్రితం కూడా చెప్పారు, దేహపు సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. అందరి తండ్రి వారొక్కరే కదా. మీరు ప్రజాపిత బ్రహ్మాకు ముఖవంశావళి పిల్లలు, మీరు జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. మీరు ఎలాగూ శివుని పిల్లలే. మేము భగవంతుని పిల్లలము అన్న నిశ్చయమైతే అందరికీ ఉంది, కానీ వారి నామ, రూప, దేశ, కాలాలను మర్చిపోయిన కారణముగా భగవంతుని పట్ల ఎవరికీ అంత ప్రేమ ఉండదు. దీనికి ఎవరినీ దూషించరు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఆత్మ అయిన నీవు ఎంత చిన్నని బిందువు, ఆ బిందువులో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఆత్మ ఏ విధముగా శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది అనేది ఎంత అద్భుతము. ఇప్పుడు మీకు అనంతమైన పాత్ర గురించి తెలిసింది. ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. మీరు కూడా దేహాభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత పరివర్తనయ్యారు. అది కూడా ప్రతి ఒక్కరి భాగ్యముపై ఆధారపడి ఉంటుంది. కల్పక్రితపు భాగ్యము ఇప్పుడు సాక్షాత్కారమవుతోంది. ప్రపంచములో ఎంతమంది మనుష్యులు ఉన్నారు, ప్రతి ఒక్కరి భాగ్యము ఎవరిది వారిదే. ఎవరు ఎలాంటి కర్మలు చేసారో, దాని అనుసారముగా దుఃఖమయంగా, సుఖమయంగా, షావుకారులుగా, పేదవారిగా అవుతారు. అలా అయ్యేది ఆత్మనే. ఆత్మ ఏ విధముగా సుఖములోకి వస్తుంది, మళ్ళీ ఏ విధముగా దుఃఖములోకి వస్తుంది అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే తెలివిని కల్పక్రితం వలె తండ్రియే నేర్పిస్తారు. అప్పుడు ఎవరెంత తెలివిని పొందారో, ఇప్పుడు కూడా అంతే పొందుతున్నారు. చివరి కల్లా ప్రతి ఒక్కరి భాగ్యాన్ని అర్థం చేసుకుంటారు, అప్పుడిక కల్ప-కల్పము ప్రతి ఒక్కరి భాగ్యము ఇలాగే ఉంటుందని అంటారు. ఎవరైతే బాగా యోగయుక్తులుగా, జ్ఞానయుక్తులుగా ఉంటారో - వారు సేవ కూడా చేస్తూ ఉంటారు. చదువులో సదా ఉన్నతి జరుగుతూ ఉంటుంది. లౌకికములో కొందరు పిల్లలు త్వరగా ఉన్నతి పొందుతారు, కొందరు చాలా తలనొప్పిని కలిగిస్తారు. ఇక్కడ కూడా అలానే ఉన్నారు. కల్పక్రితం వలె ఎవరెవరైతే ఉన్నతి పొందుతారో, వారు దాగి ఉండలేరు. అందరి కనెక్షన్ శివబాబాతో ఉందని తండ్రికైతే తెలుసు కదా. వీరు (బ్రహ్మా) కూడా పిల్లల కర్మలు చూసి అర్థం చేసుకుంటారు, అలాగే వారు (శివబాబా) కూడా చూస్తూ ఉంటారు. వీరి నుండి ఎవరైనా దాచిపెట్టవచ్చు కానీ శివబాబా నుండి ఎవరూ దాచిపెట్టలేరు. భక్తి మార్గములోనే పరమాత్మ నుండి దాచిపెట్టలేరంటే ఇక జ్ఞాన మార్గములో ఎలా దాచిపెట్టగలరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - చదువైతే చాలా సహజమైనది, కర్మలు కూడా చేయాలి, ఉండటము కూడా పాత ప్రపంచములో మిత్ర-సంబంధీకుల వద్దనే ఉండాలి. అక్కడ ఉంటూ కృషి చేయాలి. ఒకవేళ ఎంతో తపన, ప్రేమ ఉన్నట్లయితే, ఇక్కడ ఉంటూ పురుషార్థము చేసేవారి కన్నా అక్కడ ఇంటిలో ఉంటూ పురుషార్థము చేసేవారు చురుకుగా ముందు వెళ్ళగలరు. శాస్త్రాలలో అర్జునుడు మరియు బోయవాడి (ఏకలవ్యుడు) ఉదాహరణ ఉంది కదా. ఏకలవ్యుడు బయట నివసించేవాడు కానీ అభ్యాసముతో అతను బాణాలు వేయడములో అర్జునుడి కన్నా తెలివైనవాడిగా అయ్యాడు. కావున గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండాలి. మీరు ఇటువంటి ఉదాహరణలను కూడా చూస్తారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ చాలా మంచి సేవను చేయవచ్చు. అటువంటివారు చాలా వృద్ధిని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఉండేవారిని కూడా మాయ విడిచిపెట్టదు. బాబా వద్దకు వస్తే విముక్తులైపోతారు అనేమీ కాదు. అలా కాదు. ప్రతి ఒక్కరి పురుషార్థము ఎవరిది వారిదే. గృహస్థ వ్యవహారములో ఉండేవారు ఇక్కడ ఉండేవారి కన్నా మంచి పురుషార్థము చేయగలరు. వారు చాలా మంచి ధైర్యాన్ని చూపించగలరు. ఎవరైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా అయి చూపిస్తారో, వారినే మహావీరులని అంటారు. బాబా, మీరైతే వదిలేశారు అని అంటారు. బాబా అంటారు - నేనెక్కడ వదిలేసాను, మీరే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. బాబా అయితే ఎవరినీ వదిలేసి రాలేదు. ఇంటికి ఇంకా ఎక్కువమంది పిల్లలు వచ్చారు. ఇకపోతే కన్యలకైతే బాబా చెప్తున్నారు, మీరు ఈ ఈశ్వరీయ సేవ చేయండి. వీరు కూడా బాబానే, వారు కూడా బాబానే. కుమారులు కూడా చాలామంది వచ్చారు కానీ నడవలేకపోయారు. కన్యలు ఎంతైనా బాగానే ఉన్నారు. కన్య 100 మంది బ్రాహ్మణుల కన్నా ఉత్తమముగా భావించబడుతుంది. కావున కన్యలు అనగా 21 కులాలను ఉద్ధరించేవారు, జ్ఞాన బాణాలను వేసేవారు. ఇకపోతే గృహస్థములో ఉండేవారు కూడా బి.కె. లే, మున్ముందు వారి బంధనము కూడా సమాప్తమైపోతుంది. సేవ అయితే చేయాలి కదా. కొంతమంది సేవ చేసే పిల్లలు బాప్ దాదా హృదయాన్ని అధిరోహించి ఉన్నారు, వారు వేలాది మంది కళ్యాణాన్ని చేస్తున్నారు కావున ఇటువంటి సేవాధారి పిల్లలకు ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. వారు హృదయాన్ని అధిరోహించి ఉంటారు. ఎవరైతే హృదయములో ఉంటారో, వారే సింహాసనముపై కూర్చుంటారు. బాబా అంటారు, అందరికీ మార్గాన్ని తెలియజేసేందుకు పరస్పరం కలుసుకుని యుక్తులను రచిస్తూ ఉండండి. చిత్రాలు కూడా తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇప్పుడు మీరు అర్థం చేయిస్తున్నారు, పరమపిత పరమాత్మ నిరాకారుడు, వారు కూడా బిందువే, కానీ వారు నాలెడ్జ్ ఫుల్, పతిత-పావనుడు. ఆత్మ కూడా బిందువే. పిల్లలు ఎంతైనా చిన్నగా ఉంటారు. తండ్రికి మరియు పిల్లలకు మధ్యన తేడా అయితే ఉంటుంది కదా. ఈ రోజుల్లోనైతే 15-16 సంవత్సరాల వారు కూడా తండ్రి అయిపోతున్నారు, కానీ అప్పుడు కూడా బిడ్డ అంటే తండ్రి కన్నా చిన్నగానే ఉంటారు కదా. ఇక్కడి విచిత్రము చూడండి - తండ్రి కూడా ఆత్మనే, బిడ్డ కూడా ఆత్మనే. వారు సుప్రీమ్ ఆత్మ, నాలెడ్జ్ ఫుల్. మిగిలినవారంతా తమ చదువు అనుసారముగా తక్కువ పదవిని లేక ఉన్నత పదవిని పొందుతారు. మొత్తమంతా చదువుపైనే ఆధారపడి ఉంటుంది. మంచి కర్మలు చేసినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. స్వర్గములో కేవలం భారత్ మాత్రమే ఉండేది, ఇంకే ఖండము ఉండేది కాదు. కావున చిన్న కొత్త భారత్ లో మన స్వర్గాన్ని చూపించండి. ఉదాహరణకు ద్వారిక అన్న పేరు కాదు, లక్ష్మీ-నారాయణుల వంశస్థుల రాజ్యము అని వ్రాయాలి. సత్యయుగములో మొదట దైవీ వంశస్థుల రాజ్యముంటుందని బుద్ధి కూడా చెప్తుంది. వారికి గ్రామాలు ఉంటాయి, చిన్న-చిన్న ప్రాంతాలు ఉంటాయి. ఇది కూడా విచార సాగర మంథనము చేయాలి. దీనితోపాటు శివబాబాతో బుద్ధియోగాన్ని కూడా జోడించాలి. మనము స్మృతి ద్వారానే రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. స్మృతితోనే తుప్పు వదులుతుంది, ఇందులోనే శ్రమంతా ఉంది. అనేకుల బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది, ఇక్కడ కూర్చున్నా కానీ పూర్తి సమయమంతా స్మృతిలో ఉండలేరు, బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది. భక్తి మార్గములో కూడా ఇలాగే జరుగుతుంది. శ్రీకృష్ణుని భక్తి చేస్తూ-చేస్తూ బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది. నవవిధ భక్తి చేసేవారు సాక్షాత్కారము కోసం చాలా శ్రమిస్తారు. శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదని ఎన్ని గంటలు కూర్చుండిపోతారు, ఇందులో చాలా శ్రమ ఉంటుంది. ఇక్కడ 8 మరియు 16108 మణుల మాలలు ఉంటాయి. వారు లక్షల మణిపూసల మాలను కూడా చూపిస్తారు. కానీ జ్ఞాన మార్గపు మాల చాలా విలువైనది ఎందుకంటే ఇందులో ఆత్మిక శ్రమ ఉంది, భక్తి మార్గపు మాల తక్కువ విలువైనది. శ్రీకృష్ణుడిని చూసి సంతోషములో నాట్యము చేస్తారు. భక్తికి మరియు జ్ఞానానికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. శ్రీకృష్ణుడిని స్మృతి చేస్తే తుప్పు వదులుతుంది అని మీకు ఇలా అర్థం చేయించడం జరగదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా పాపాలు నశిస్తాయని ఇక్కడ అర్థం చేయించడం జరుగుతుంది. పిల్లలైన మీరు ఇప్పుడు యోగబలముతో విశ్వానికి యజమానిగా అవుతారు. స్వప్నములో కూడా ఎవరికీ ఈ ఆలోచన రాదు. లక్ష్మీ-నారాయణులు యుద్ధాలు మొదలైనవేవీ చేయలేదు. మరి వారు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు? ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి అంటారు, యోగబలముతో మీకు రాజ్యము లభిస్తుంది. కానీ భాగ్యములో లేకపోతే పురుషార్థమే చేయరు, సేవాధారులుగా అవ్వరు. ఈ విధముగా ప్రదర్శనీలు చేయండి అని బాబా అయితే సూచనలు ఇస్తూనే ఉంటారు. తక్కువలో తక్కువ ఒక రోజులో 150-200 ప్రదర్శనీలు జరగాలి. అన్ని గ్రామాలలోనూ తిరిగి రండి. ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్ని ప్రదర్శనీలు జరగాలి. ఒక్కొక్క సెంటర్ లోనూ ప్రదర్శనీని ఏర్పాటు చేసినట్లయితే అర్థం చేయించడం సహజమవుతుంది. చిత్రాలు మొదలైనవి పెట్టుకోగలిగేలా సెంటర్లు కూడా రోజురోజుకూ పెద్దవి అవుతూ ఉంటాయి. చిత్రాలు కూడా కొత్తకొత్తగా తయారుచేస్తూ ఉంటారు. వైకుంఠ చిత్రాన్ని భారత్ లో సుందరమైన మహళ్ళు మొదలైనవి ఉన్నట్లుగా తయారుచేయాలి. మున్ముందు అర్థం చేయించేందుకు మంచి-మంచి చిత్రాలు వెలువడుతూ ఉంటాయి. వానప్రస్థావస్థ కలవారు నడుస్తూ-తిరుగుతూ కూడా సేవ చేస్తూ ఉండాలి, ఎవరి భాగ్యము ఉదయిస్తే వారు వెలువడుతారు. కొంతమంది పిల్లలు చెడు కర్మలు చేసి తమ గౌరవాన్ని పోగొట్టుకుంటారు, అప్పుడు యజ్ఞ గౌరవాన్ని భంగపరుస్తారు. నడవడిక ఎలా ఉంటే, అటువంటి పదవి లభిస్తుంది. ఎవరైతే అనేకులకు సుఖము ఇస్తారో, వారి పేరు మహిమ చేయబడుతుంది కదా. ఇప్పుడింకా సర్వ గుణాలలో సంపన్నులుగా అవ్వలేదు కదా. కొందరు చాలా మంచి సేవను చేస్తున్నారు. అటువంటివారి పేర్లు విని బాబా సంతోషిస్తున్నారు. సేవాధారి పిల్లలను చూసి బాబా సంతోషిస్తారు కదా. వారు సేవలో మంచిగా శ్రమిస్తూ ఉంటారు. వారు సెంటర్లు కూడా తెరుస్తూ ఉంటారు, దీనితో వేలాది మంది కళ్యాణము జరగనున్నది. మళ్ళీ వారి నుండి ఎంతోమంది వెలువడుతూ ఉంటారు. సంపూర్ణముగా అయితే ఇంకా ఎవరూ అవ్వలేదు. పొరపాట్లు కూడా ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. మాయ విడిచిపెట్టదు. ఎంతగా సేవ చేసి తమ ఉన్నతిని చేసుకుంటారో, అంతగానే హృదయాన్ని అధిరోహిస్తారు, అంతగానే ఉన్నత పదవిని పొందుతారు. ఇక కల్ప-కల్పము అటువంటి పదవియే లభిస్తుంది. శివబాబా నుండైతే ఎవరూ దాచిపెట్టలేరు. అంతిమములో ప్రతి ఒక్కరికీ తమ కర్మల సాక్షాత్కారమైతే జరుగుతుంది. అప్పుడిక ఏమి చేయగలరు! వెక్కివెక్కి ఏడవాల్సి వస్తుంది, అందుకే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు - అంతిమములో శిక్షలను అనుభవించి, పశ్చాత్తాప పడవలసి వచ్చేలాంటి కర్మలేవీ చేయకండి. కానీ ఎంతగా అర్థం చేయించినా సరే, భాగ్యములో లేకపోతే అసలు పురుషార్థమే చేయరు. ఈ రోజుల్లోని మనుష్యులకైతే తండ్రి గురించి తెలియదు. భగవంతుడిని గుర్తు చేసుకుంటారు కానీ వారెవరో తెలియదు. వారు చెప్పేది వినరు. ఇప్పుడు ఆ అనంతమైన తండ్రి నుండి మీకు ఒక్క క్షణములో సత్యయుగీ స్వరాజ్య వారసత్వము లభిస్తుంది. శివబాబా పేరునైతే అందరూ ఇష్టపడతారు కదా. ఆ అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుందని పిల్లలకు తెలుసు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. మీ నడవడిక ద్వారా తండ్రి పేరును మరియు యజ్ఞము పేరును ప్రఖ్యాతము చేయాలి, తండ్రి గౌరవాన్ని పోగొట్టే విధమైన కర్మలేవీ చేయకూడదు. సేవ ద్వారా మీ భాగ్యాన్ని మీరే తయారుచేసుకోవాలి. 2. తండ్రి సమానముగా కళ్యాణకారులుగా అయి సర్వుల ఆశీర్వాదాలను పొంది ముందు నంబరును తీసుకోవాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండేందుకు మంచి ధైర్యాన్ని చూపించాలి. వరదానము:-సతోప్రధాన స్థితిలో స్థితులై, సదా సుఖ-శాంతులను అనుభూతి చేసే డబల్ అహింసక భవ సదా తమ సతోప్రధాన సంస్కారాలలో స్థితులై, సుఖ-శాంతులను అనుభూతి చేయడమే సత్యమైన అహింస. దేని ద్వారానైతే దుఃఖము మరియు అశాంతి ప్రాప్తిస్తాయో, అది హింస. కనుక చెక్ చేసుకోండి, రోజంతటిలో ఏ రకమైన హింస చేయడము లేదు కదా! ఒకవేళ ఏవైనా మాటల ద్వారా ఎవరి స్థితినైనా డిస్టర్బ్ చేస్తే, అది కూడా హింసనే. 2. ఒకవేళ మీ సతోప్రధాన సంస్కారాలను అణిచిపెట్టి, ఇతర సంస్కారాలను ఆచరణలోకి తీసుకువస్తే, అది కూడా హింసనే. అందుకే సూక్ష్మతలోకి వెళ్ళి ‘మహాన్ ఆత్మను’ అనే స్మృతి ద్వారా డబల్ అహింసకులుగా అవ్వండి. స్లోగన్:-సత్యముతో అసత్యము మిక్స్ అవ్వగానే సంతోషము మాయమైపోతుంది.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ మీ ఒక్కొక్క మాట అలౌకికముగా ఉండాలి, ఫరిశ్తాల వలె ఉండాలి. ప్రతి మాట మధురముగా ఉండాలి. ఈ విషయముపై ఇప్పుడు అండర్ లైన్ చేయండి, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు వాణి శక్తి వ్యర్థముగా పోతుంది, అందుకే వాణిలో ఏదైతే బాబాను ప్రత్యక్షము చేసే పదును మరియు శక్తి ఉండాలో అది తక్కువగా ఉంది, వాచాను వ్యర్థమవ్వడము నుండి రక్షించండి, అప్పుడు బాబాను ప్రత్యక్షము చేసే శబ్దము తీవ్రతరమవుతుంది. "
#🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 23-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - భోళానాథుడైన అత్యంత ప్రియమైన తండ్రి మీ సమ్ముఖములో కూర్చున్నారు, మీరు ప్రేమతో స్మృతి చేసినట్లయితే తపన, ప్రేమ పెరుగుతూ ఉంటాయి, విఘ్నాలు సమాప్తమైపోతాయి’’ ప్రశ్న:-బ్రాహ్మణ పిల్లలకు ఏ విషయము సదా గుర్తున్నట్లయితే ఎప్పుడూ వికర్మలు జరగవు? జవాబు:-ఏ కర్మలనైతే నేను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు - ఇది గుర్తున్నట్లయితే వికర్మలు జరగవు. ఒకవేళ ఎవరైనా దాగి ఉంటూ పాప కర్మలను చేసినా, ధర్మరాజు నుండైతే దాగి ఉండలేరు, వెంటనే దానికి శిక్ష లభిస్తుంది. మున్ముందు ఇంకా మార్షల్ లా (కఠినమైన నియమాలతో కూడిన సైనిక శాసనము) ఏర్పడుతుంది. ఈ ఇంద్రసభలో ఏ పతితులు దాక్కుని కూర్చోలేరు. పాట:-భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు... ▶ ఓంశాంతి. ఇప్పుడు ఆత్మిక తండ్రి మనకు ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారని మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. వారి పేరే భోళానాథుడు. తండ్రులు ఎంతో భోళాగా (అమాయకముగా) ఉంటారు, ఎంతటి కష్టాన్ని అయినా సహించి పిల్లలను చదివిస్తారు, సంభాళిస్తారు. పిల్లలు పెద్దవారైన తర్వాత అంతా వారికి ఇచ్చేసి స్వయము వానప్రస్థ అవస్థలోకి వెళ్తారు. నేను నా బాధ్యతను పూర్తి చేశాను, ఇప్పుడిక పిల్లలు చూసుకుంటారని అనుకుంటారు. కనుక తండ్రి భోళాయే కదా. ఇది కూడా ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే వారు స్వయము భోళానాథుడు. హద్దు తండ్రి గురించి కూడా వారెంత భోళా అయినవారు అని అర్థం చేయిస్తున్నారు. వారు హద్దులోని భోళాతనము (అమాయకత్వము) కలవారు. వీరు అనంతమైన భోళానాథుడైన తండ్రి. వీరు పరంధామము నుండి వస్తారు, పాత ప్రపంచములోకి, పాత శరీరములోకి వస్తారు, అందుకే మనుష్యులు, పాత పతిత శరీరములోకి రావడమనేది ఎలా జరుగుతుంది అని అనుకుంటారు. అర్థం కానీ కారణముగా పావన శరీరము కల శ్రీకృష్ణుని పేరును వేశారు. ఇదే గీత, ఇవే వేదాలు, శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ తయారవుతాయి. శివబాబా ఎంత భోళాగా ఉన్నారో చూడండి. వారు వచ్చినప్పుడు, తండ్రి ఇక్కడే కూర్చుని ఉన్నారు అనే అనుభూతిని కలిగిస్తారు. ఈ సాకార బాబా కూడా భోళానే కదా. వారికి ఎటువంటి కండువా లేదు, ఎటువంటి తిలకము మొదలైనవి లేవు, కానీ సాధారణముగా ఉన్న ఈ బాబా, బాబాయే. ఇంతటి జ్ఞానాన్ని అంతా శివబాబాయే ఇస్తారని, ఇతరులెవ్వరికీ ఇది ఇవ్వగలిగే శక్తి లేదని పిల్లలకు తెలుసు. రోజురోజుకు పిల్లలకు తపన, ప్రేమ పెరుగుతూ ఉంటాయి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా ప్రేమ పెరుగుతుంది. వారు అత్యంత ప్రియమైన తండ్రి కదా. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, భక్తి మార్గములో కూడా మీరు వారిని అత్యంత ప్రియమైనవారిగా భావించేవారు. బాబా, మీరు వచ్చినప్పుడు, అందరి పట్ల ఉన్న ప్రేమను వదిలి, ఒక్క తండ్రితోనే ప్రేమను పెట్టుకుంటాము అని అనేవారు. ఇది ఇప్పుడు మీకు తెలుసు. కానీ మాయ అంతగా ప్రేమించనివ్వదు. మీరు మాయను వదిలి తండ్రిని స్మృతి చేయడమనేది మాయకు ఇష్టముండదు. వీరు దేహాభిమానులుగా అయి నన్ను ప్రేమించాలి అని మాయ కోరుకుంటుంది. మాయ ఇదే కోరుకుంటుంది, అందుకే ఎన్ని విఘ్నాలను కలిగిస్తుంది. మీరు విఘ్నాలను దాటివేయాలి. పిల్లలు ఎంతోకొంత శ్రమనైతే చేయాలి కదా. పురుషార్థముతోనే మీరు మీ ప్రారబ్ధాన్ని పొందుతారు. ఉన్నత పదవిని పొందేందుకు ఎంత పురుషార్థము చేయాల్సి ఉంటుంది అనేది పిల్లలకు తెలుసు. ఒకటేమో - వికారాలను దానము ఇవ్వాలి, రెండవది - తండ్రి నుండి ఏవైతే అవినాశీ జ్ఞాన రత్నాల ధనము లభిస్తుందో, దానిని దానము చేయాలి. ఈ అవినాశీ ధనముతోనే మీరు ఇంతటి ధనవంతులుగా అవుతారు. జ్ఞానము సంపాదనకు ఆధారము. వారిది శాస్త్రాల ఫిలాసఫీ, ఇది స్పిరిచ్యుల్ నాలెడ్జ్. శాస్త్రాలు మొదలైనవి చదువుకుని కూడా చాలా సంపాదిస్తారు. ఒక గదిలో గ్రంథ్ మొదలైనవి పెట్టుకుని, కొంచెం వినిపించినా చాలు, సంపాదన జరుగుతుంది. అది యథార్థమైన జ్ఞానమేమీ కాదు. యథార్థమైన జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఎంతవరకైతే ఎవరికైనా ఈ ఆత్మిక జ్ఞానము లభించదో, అంతవరకు ఆ శాస్త్రాల ఫిలాసఫీయే బుద్ధిలో ఉంటుంది. మీ మాట వినరు. మీరు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని పిల్లలు ఆత్మిక తండ్రి నుండి తీసుకున్నారు అనేది 100 శాతము వాస్తవము. జ్ఞానము సంపాదనకు ఆధారము. చాలా ధనము లభిస్తుంది. యోగము ఆరోగ్యానికి ఆధారము అనగా నిరోగీ శరీరము లభిస్తుంది, జ్ఞానముతో ధనము లభిస్తుంది - ఈ రెండూ ముఖ్యమైన సబ్జెక్టులు. అయితే, వీటిని కొంతమంది మంచి రీతిలో ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు కావున ధనము కూడా నంబరువారుగా తక్కువగా లభిస్తుంది. శిక్షలు అనుభవించిన తర్వాత పదవిని పొందుతారు. పూర్తిగా స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు, అప్పుడిక శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా భ్రష్టమవుతుంది. స్కూల్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా. ఇది అనంతమైన జ్ఞానము, దీనితో నావ తీరానికి చేరుతుంది. ఆ జ్ఞానములో బ్యారిస్టర్, డాక్టర్, ఇంజనీర్ అవ్వడానికి చదవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఒకే చదువు ఉంది. యోగము మరియు జ్ఞానముతో సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు, రాకుమారులుగా అయిపోతారు. అక్కడ స్వర్గములో బ్యారిస్టరు, జడ్జ్ మొదలైనవారెవరూ ఉండరు. అక్కడ ధర్మరాజు అవసరము కూడా ఉండదు. అక్కడ గర్భ జైలు శిక్షలు ఉండవు, ధర్మరాజుపురి శిక్షలు ఉండవు. గర్భ మహల్ లో అక్కడ చాలా సుఖముగా ఉంటారు. ఇక్కడైతే గర్భ జైలులో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ పిల్లలైన మీరే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఇకపోతే శాస్త్రాలలో సంస్కృతములో శ్లోకాలు మొదలైనవాటిని మనుష్యులు తయారుచేసారు. సత్యయుగములో ఏ భాష ఉంటుందని అడుగుతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - దేవతల భాష ఏదైతే ఉంటుందో, అదే నడుస్తుంది. అక్కడ ఏదైతే భాష ఉంటుందో, అది ఇంకెక్కడా ఉండదు. అక్కడ సంస్కృత భాష ఉండడమనేది జరగదు. దేవతల భాష మరియు పతిత మనుష్యుల భాష ఒక్కటే ఉండదు. అక్కడ ఏ భాష ఉంటుందో, అదే నడుస్తుంది. దీని గురించి అడగవలసిన అవసరము లేదు. ముందు తండ్రి నుండి వారసత్వాన్ని అయితే తీసుకోండి. కల్పక్రితం ఏదైతే జరిగి ఉంటుందో, అదే జరుగుతుంది. ముందు వారసత్వాన్ని తీసుకోండి, వేరే విషయాలేవీ అడగకండి. అచ్ఛా, 84 జన్మలు కాకపోతే, 80 లేక 82 జన్మలు ఉండచ్చు, ఈ విషయాలను మీరు వదిలేయండి. తండ్రి అంటారు, అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేయండి. స్వర్గ రాజ్యాధికారము తప్పకుండా లభిస్తుంది కదా. అనేక సార్లు మీరు స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకున్నారు. పై నుండి దిగవలసి ఉంటుంది కూడా. ఇప్పుడు మీరు మాస్టర్ జ్ఞాన సాగరులుగా, మాస్టర్ సుఖ సాగరులుగా అవుతారు. మీరు పురుషార్థులు. బాబా అయితే కంప్లీట్ (సంపూర్ణులు). తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో, అది పిల్లలలో ఉంది, కానీ మిమ్మల్ని సాగరులు అని అనరు. సాగరుడు ఒక్కరే ఉంటారు, కేవలం అనేక పేర్లు పెట్టేసారు. ఇకపోతే మీరు జ్ఞాన సాగరుడి నుండి వెలువడిన నదులు. మీరే మానస సరోవరాలు, నదులు. నదులకు పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది. కలకత్తాలో నది మరియు సాగరముల సంగమము ఉంది. దాని పేరు డైమండ్ హార్బర్. మీరు బ్రహ్మా ముఖవంశావళులు, మీరు వజ్రము వలె అవుతారు. చాలా భారీ మేళా ఏర్పాటు అవుతుంది. బాబా ఈ బ్రహ్మా తనువులోకి వచ్చి పిల్లలను కలుస్తారు. ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి. ఎంతైనా బాబా, మన్మనాభవ అని అంటారు. బాబాను స్మృతి చేస్తూ ఉండండి. వారు అత్యంత ప్రియమైనవారు, వారు సర్వ సంబంధాల సాక్కిరిన్. ఆ సంబంధీకులందరూ వికారులు, వారి నుండి దుఃఖము లభిస్తుంది. బాబా మీకు అన్నింటికీ రిటర్న్ ఇచ్చేస్తారు. సర్వ సంబంధాల ప్రేమనిస్తారు, ఎంత సుఖాన్నిస్తారు. ఇంకెవ్వరూ ఇంతటి సుఖాన్నివ్వలేరు. ఎవరైనా ఇచ్చినా కూడా అది అల్పకాలము కొరకే ఇస్తారు. దానినే సన్యాసులు కాకిరెట్ట సమానమైన సుఖమని అంటారు. దుఃఖధామములోనైతే తప్పకుండా దుఃఖమే ఉంటుంది. మనము ఈ పాత్రను అనేక సార్లు అభినయించామని పిల్లలైన మీకు తెలుసు. కానీ మేము ఉన్నతమైన పదవిని ఎలా పొందాలి అనే చింత ఉండాలి. మేము అక్కడ ఫెయిల్ అవ్వకూడదు అని చాలా పురుషార్థము చేయాలి. మంచి నంబరులో పాస్ అయినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు మరియు సంతోషము కూడా ఉంటుంది. అందరూ ఒకేలా ఉండలేరు, యోగముపై ఆధారపడి ఉంటుంది. చాలామంది గోపికలు అసలు ఎప్పుడూ కలవలేదు కూడా. వారు తండ్రిని కలుసుకునేందుకు తపిస్తూ ఉంటారు. సాధు-సన్యాసుల వద్ద తపించే విషయమేమీ ఉండదు. ఇక్కడికైతే శివబాబాను కలుసుకునేందుకు వస్తారు. ఇది అద్భుతమైన విషయము కదా. శివబాబా, మేము మీ పిల్లలము అని ఇంటిలో కూర్చుని స్మృతి చేస్తారు. ఆత్మకు స్మృతి కలుగుతుంది. మేము శివబాబా నుండి కల్ప-కల్పము వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. ఆ తండ్రే, కల్పము తర్వాత వచ్చి ఉన్నారు కనుక వారిని చూడకుండా ఉండలేరు. బాబా వచ్చారని ఆత్మకు తెలుసు. శివజయంతిని కూడా జరుపుకుంటారు, కానీ ఏమీ తెలియదు. శివబాబా వచ్చి చదివిస్తున్నారనేది ఏమీ తెలియదు. శివజయంతిని నామమాత్రముగా జరుపుకుంటారు. సెలవు కూడా ఇవ్వరు. ఎవరైతే వారసత్వాన్ని ఇచ్చారో, వారికి ఎటువంటి మహత్వాన్ని ఇవ్వడము లేదు కానీ ఎవరికైతే వారసత్వాన్ని ఇచ్చారో (శ్రీకృష్ణుడికి) వారి పేరును ప్రఖ్యాతము చేసారు. తండ్రి వచ్చి విశేషముగా భారత్ ను స్వర్గముగా తయారుచేసారు. మిగిలినవారందరికీ ముక్తినిస్తారు. అందరూ ముక్తిని కోరుకుంటారు కూడా. ముక్తి తర్వాత జీవన్ముక్తి లభిస్తుందని మీకు తెలుసు. తండ్రి వచ్చి మాయ బంధనాల నుండి విముక్తులుగా చేస్తారు. తండ్రిని సర్వుల సద్గతిదాత అని అంటారు. జీవన్ముక్తి అయితే నంబరువారు పురుషార్థానుసారముగా అందరికీ లభిస్తుంది. తండ్రి అంటారు, ఇది పతిత ప్రపంచము, దుఃఖధామము. సత్యయుగములో మీకు ఎంతటి సుఖము లభిస్తుంది. దానిని బహిష్త్ అని అంటారు. అల్లా బహిష్త్ ను ఎందుకు రచించారు? కేవలం ముసల్మానుల కోసమే రచించారా? తమ-తమ భాషల్లో కొంతమంది స్వర్గమని అంటారు, కొంతమంది బహిష్త్ అని అంటారు. హెవెన్ లో కేవలం భారత్ యే ఉంటుందని మీకు తెలుసు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో నంబరువారు పురుషార్థానుసారముగా కూర్చున్నాయి. నేను అల్లా యొక్క పుష్పాలతోటలోకి వెళ్ళాను అని ఒక ముస్లిమ్ కూడా అనేవారు. ఇటువంటి సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. ఇదంతా డ్రామాలో ముందు నుండే నిశ్చితమై ఉంది. డ్రామాలో ఏదైతే జరుగుతుందో, ఒక సెకెండు గడవడమైనా సరే, అది కల్పక్రితము కూడా జరిగిందని అంటారు. రేపు ఏమి జరగబోతుందో తెలియదు. డ్రామాపై నిశ్చయముండాలి, అప్పుడు ఏ విషయములోనూ చింత ఉండదు. మనకైతే బాబా ఆజ్ఞను ఇచ్చారు - నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు మీ వారసత్వాన్ని స్మృతి చేయండి. అందరూ అంతమవ్వాల్సిందే. అప్పుడు ఒకరి కోసం ఒకరు ఏడవలేరు కూడా. మృత్యువు వస్తుంది మరియు వెళ్ళిపోతారు, ఇక ఏడ్చేందుకు సమయము ఉండదు. శబ్దమే రాదు. ఈ రోజుల్లోనైతే మనుష్యులు బూడిదను తీసుకుని కూడా ఎంతగా తిరుగుతూ ఉంటారు. దాని పట్ల భావన ఉంటుంది. ఇదంతా సమయాన్ని వృధా చేసుకోవడము... దీనితో ఏమి ఉపయోగము ఉంది. మట్టి, మట్టిలో కలిసిపోతుంది. దీనితో భారత్ పవిత్రముగా అయిపోతుందా ఏమిటి? పతిత ప్రపంచములో ఏ కర్మ చేసినా, పతిత కర్మలే చేస్తారు. దాన-పుణ్యాలు మొదలైనవి కూడా చేస్తూ వచ్చారు కానీ భారత్ ఏమైనా పావనముగా అయ్యిందా? మెట్లు దిగవలసిందే. సత్యయుగములో సూర్యవంశీయులుగా అయ్యారు, తర్వాత మెట్లు దిగవలసి ఉంటుంది, నెమ్మది-నెమ్మదిగా పడిపోతారు. యజ్ఞ-తపాదులు మొదలైనవి ఎన్ని చేసినా కానీ మరుసటి జన్మలో అల్పకాలికమైన ఫలము లభిస్తుంది. ఎవరైనా చెడు కర్మలు చేస్తే వారికి దాని రిటర్న్ కూడా లభిస్తుంది. పిల్లలను చదివించేందుకు వచ్చాను అని అనంతమైన తండ్రికి తెలుసు. తనువు కూడా సాధారణమైనది తీసుకున్నారు. తిలకము మొదలైనవేవీ పెట్టే అవసరము లేదు. భక్తులైతే పెద్ద-పెద్ద తిలకాలను పెడతారు కానీ అక్కడ ఎంతగా మోసము చేస్తారు. బాబా అన్నారు, నేను సాధారణ తనువులోకి వస్తాను, వచ్చి పిల్లలను చదివిస్తాను. వానప్రస్థ అవస్థలో ఉన్నారు. శ్రీకృష్ణుని పేరు ఎందుకు వేసారు? ఇక్కడ జడ్జ్ చేసే (నిర్ణయించే) బుద్ధి కూడా లేదు. ఇప్పుడు బాబా రైట్-రాంగ్ లను జడ్జ్ చేసే బుద్ధిని ఇచ్చారు. తండ్రి అంటారు, మీరు యజ్ఞ-తపాదులను, దాన-పుణ్యాలను చేస్తూ, శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఆ శాస్త్రాలలో ఏమైనా ఉందా? మీకు రాజయోగాన్ని నేర్పించి, విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చింది నేనా లేక శ్రీకృష్ణుడా? జడ్జ్ చేయండి. బాబా, మీరే వినిపించారు అని అంటారు. శ్రీకృష్ణుడైతే చిన్న రాకుమారుడు, వారు ఎలా వినిపిస్తారు! బాబా, మీ రాజయోగము ద్వారానే మేము ఇలా తయారవుతాము అని అంటారు. తండ్రి అంటారు, శరీరముపై ఎటువంటి భరోసా లేదు, చాలా పురుషార్థము చేయాలి. ఫలానావారు చాలా మంచి నిశ్చయబుద్ధి కలవారని బాబాకు సమాచారాన్ని వినిపిస్తారు. నేను అంటాను - వారికి అస్సలు నిశ్చయము లేదు, ఎవరినైతే ఎంతో ప్రేమించామో వారు ఈ రోజు లేరు. బాబా అయితే అందరితోనూ ప్రేమగా వ్వవహరిస్తారు. నేను ఎటువంటి కర్మలు చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు. కొంతమందైతే వికారాలలోకి వెళ్ళి, మళ్ళీ దాగి వచ్చి కూర్చుంటారు. బాబా అయితే వెంటనే సందేశీకి తెలియజేస్తారు. ఇటువంటి కర్మలు చేసేవారు చాలా నాజూకుగా అయిపోతూ ఉంటారు, మున్ముందు నడవలేకపోతారు. అంతిమములోని నాజూకు సమయములో, ఎవరైనా ఏదైనా చేస్తే, ఒక్కసారిగా మార్షల్ లా ను (కఠినమైన నియమాలతో కూడిన సైనిక శాసనాన్ని) అమలు పరుస్తారు. బాబా ఏమేమి చేస్తారు అనేది మున్ముందు మీరు చాలా చూస్తారు. బాబా ఏమీ శిక్షలు ఇవ్వరు, ధర్మరాజు ద్వారా ఇప్పిస్తారు. జ్ఞానములో ప్రేరణ యొక్క విషయమేమీ ఉండదు. భగవంతుడినైతే మనుష్యులందరూ - ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని అంటారు. ఆత్మలందరూ ఇంద్రియాల ద్వారా పిలుస్తారు. తండ్రి జ్ఞాన సాగరుడు. వారి వద్ద చాలా వెరైటీ సామాగ్రి ఉంది. అటువంటి సామాగ్రి ఎవరి వద్ద లేదు. శ్రీకృష్ణుని మహిమ పూర్తిగా వేరు. తండ్రి శిక్షణతో వీరు (లక్ష్మీ-నారాయణలుగా) ఎలా తయారయ్యారు? తయారుచేసేవారైతే తండ్రి మాత్రమే. తండ్రి వచ్చి కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ మూడవ నేత్రము తెరుచుకుంది. ఇది 5 వేల సంవత్సరాల విషయమని మీకు తెలుసు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, పాత్రను అభినయించాలి. ఇది స్వదర్శన చక్రము కదా. మీ పేరు స్వదర్శన చక్రధారులు, బ్రాహ్మణ కుల భూషణులు, ప్రజాపిత బ్రహ్మా కుమార-కుమారీలు. లక్షలాది మంది స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు ఎంత జ్ఞానాన్ని చదువుకుంటారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. అచ్ఛా! ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఈ సమయము చాలా నాజూకు అయినది, అందుకే ఎటువంటి తప్పుడు కర్మలను చేయకూడదు. కర్మ-అకర్మ-వికర్మల గతిని ధ్యాసలో పెట్టుకుని సదా శ్రేష్ఠ కర్మలనే చేయాలి. 2. యోగము ద్వారా సదా కోసం తమ శరీరాన్ని నిరోగిగా చేసుకోవాలి. ఒక్క అత్యంత ప్రియమైన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి నుండి ఏదైతే అవినాశీ జ్ఞానమనే ధనము లభిస్తుందో, దానిని దానము చేయాలి. వరదానము:-సహనశీలతా గుణము ద్వారా కఠిన సంస్కారాలను కూడా శీతలముగా చేసే సంతుష్టమణి భవ ఎవరిలోనైతే సహనశీలతా గుణము ఉంటుందో, వారు ముఖము ద్వారా సదా సంతుష్టముగా కనిపిస్తారు. ఎవరైతే స్వయము సంతుష్టమూర్తులుగా ఉంటారో, వారు ఇతరులను కూడా సంతుష్టముగా చేస్తారు. సంతుష్టముగా అవ్వడము అనగా సఫలతను పొందడము. ఎవరైతే సహనశీలురుగా ఉంటారో, వారు తమ సహనశీలతా శక్తి ద్వారా కఠిన సంస్కారాలను మరియు కఠిన కార్యాలను శీతలముగా మరియు సహజముగా చేసుకుంటారు. వారి ముఖము గుణమూర్తిలా కనిపిస్తుంది. వారే డ్రామా అనే డాలుపై నిలవగలరు. స్లోగన్:-ఎవరైతే వాణి ద్వారా పరివర్తన అవ్వరో, వారిని శుభమైన వైబ్రేషన్ల ద్వారా పరివర్తన చేయవచ్చు.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ ఏ విధముగా బ్రహ్మాబాబా మాటలు ఫరిశ్తాల మాటల వలె, తక్కువగా మరియు మధురముగా ఉండేవో, అదే విధముగా యథార్థమైన మాటలు మాట్లాడండి. కార్యవ్యవహారాల కోసం మాట్లాడవలసి వస్తుంది కానీ వాటిని కూడా విస్తారము చేయకండి. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో ఫాలో ఫాదర్ చేయండి. ప్రతి మాటలో మధురత మరియు నమ్రతతో కూడిన మహానత ఉండాలి. దీని కోసం స్వయాన్ని నిమిత్తముగా భావిస్తూ ప్రతి కార్యము చేయండి, అప్పుడు మహానతతో పాటు నమ్రత వస్తుంది మరియు సఫలతామూర్తులుగా అవుతారు. "
https://youtube.com/watch?v=W9vguBu2PKE&si=6d7387KoJywp8Sdu #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🛕అయోధ్య రామ మందిరం🙏
youtube-preview
https://youtube.com/watch?v=ryw_NzguBjU&si=OH-HNYoZMLZrlm1D #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా
youtube-preview
#🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా 21-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానసాగరుడైన తండ్రి, పిల్లలైన మీ సమ్ముఖములో జ్ఞాన డాన్స్ చేయడానికి వచ్చారు, మీరు తెలివైనవారిగా, సేవాధారులుగా అయినట్లయితే జ్ఞాన డాన్స్ కూడా బాగా జరుగుతుంది’’ ప్రశ్న:-సంగమయుగములో పిల్లలైన మీరు ఏ హాబీ (అలవాటు) ను అలవాటు చేసుకుంటారు? జవాబు:-స్మృతిలో ఉండే హాబీను అలవాటు చేసుకుంటారు. ఇదే ఆత్మిక హాబీ. ఈ హాబీతో పాటుగా మీరు దివ్యమైన మరియు అలౌకికమైన కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు, మీరు అందరికీ సత్యాతి-సత్యమైన కథను తప్పకుండా వినిపించాలి. సేవ చేసే హాబీ కూడా పిల్లలైన మీకు ఉండాలి. పాట:-ఓర్పు వహించు మానవా... ▶ ఓంశాంతి. హాస్పిటల్ లో ఎవరైనా అనారోగ్యముతో ఉన్నట్లయితే, ఆ పేషెంట్ దుఃఖము నుండి విముక్తునిగా అవ్వాలని ఆశిస్తాడు. నా పరిస్థితి ఎలా ఉంది, ఈ అనారోగ్యము ఎప్పుడు నయమవుతుంది అని డాక్టరును అడుగుతారు. అవన్నీ హద్దులోని విషయాలు. ఇది అనంతమైన విషయము. తండ్రి వచ్చి పిల్లలకు సలహానిస్తారు. ఇది నిజంగానే సుఖము మరియు దుఃఖము యొక్క ఆట అని పిల్లలు తెలుసుకున్నారు. వాస్తవానికి పిల్లలైన మీకు సత్యయుగములోకి వెళ్ళేకంటే కూడా ఎక్కువ లాభము ఇక్కడే ఉంది ఎందుకంటే మీకు తెలుసు, ఈ సమయములో మనము ఈశ్వరీయ ఒడిలో ఉన్నాము, మనము ఈశ్వరీయ సంతానము. ఈ సమయములో మనకు ఎంతో ఉన్నతోన్నతమైన గుప్తమైన మహిమ ఉంది. మనుష్యమాత్రులు తండ్రిని శివుడు, ఈశ్వరుడు, భగవంతుడు అని కూడా అంటారు కానీ వారి గురించి తెలియదు, కేవలం అలా పిలుస్తూ ఉంటారు. డ్రామానుసారముగానే ఇలా జరుగుతుంది. జ్ఞానము మరియు అజ్ఞానము, పగలు మరియు రాత్రి అని కూడా పాడుతూ వచ్చారు కానీ బుద్ధి ఎంత తమోప్రధానముగా అయిపోయిందంటే, తమను తాము తమోప్రధానమని భావించనే భావించరు. ఎవరి భాగ్యములోనైతే తండ్రి యొక్క వారసత్వము ఉంటుందో, వారి బుద్ధిలోనే కూర్చోగలదు. మేము పూర్తిగా ఘోర అంధకారములో ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున ఎంతటి ప్రకాశము లభించింది. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే అర్థం చేయిస్తారో, అది ఏ వేద-శాస్త్రాలలోనూ, గ్రంథాలు మొదలైనవాటిలోనూ లేదు. ఇది కూడా తండ్రి నిరూపించి తెలియజేస్తారు. పిల్లలైన మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల ప్రకాశాన్ని ఇస్తాను, అది తర్వాత కనుమరుగైపోతుంది. నా ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా జ్ఞానము లభించదు, ఈ జ్ఞానము తర్వాత కనుమరుగైపోతుంది. కలియుగము గతించిపోయింది, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని అర్థమవుతుంది. ఇది కొత్త విషయము. ఇది శాస్త్రాలలో లేదు. తండ్రి అయితే ఈ జ్ఞానాన్ని అందరికీ ఒకే విధముగా చదివిస్తారు కానీ ధారణలో నంబరువారుగా ఉన్నారు. కొంతమంది మంచి సర్వీసబుల్ పిల్లలు వచ్చినప్పుడు బాబా యొక్క డ్యాన్స్ కూడా అలాగే జరుగుతుంది. డ్యాన్సింగ్ గర్ల్ (నృత్యము చేసే నర్తకి) ఎదురుగా, చాలా అభిరుచితో చూసేవారు ఉన్నట్లయితే, ఆమె కూడా సంతోషముతో చాలా బాగా నాట్యము చేస్తుంది. కొద్దిమందే కూర్చుని ఉంటే, సాధారణ రీతిలో కొద్దిగా డాన్స్ చేస్తుంది. వాహ్-వాహ్ అనేవారు చాలామంది ఉంటే, ఆమెకు కూడా ఉత్సాహము పెరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మురళీని పిల్లలందరూ వింటారు, కానీ సమ్ముఖముగా వినడము వేరు కదా. శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసేవారని కూడా చూపిస్తారు. కానీ డ్యాన్స్ అంటే స్థూలమైన డ్యాన్స్ కాదు. వాస్తవానికి ఇది జ్ఞాన డ్యాన్స్. శివబాబా స్వయంగా చెప్తున్నారు - నేను జ్ఞాన డ్యాన్స్ చేయడానికి వస్తాను, నేను జ్ఞాన సాగరుడిని, కావున మంచి-మంచి పాయింట్లు వెలువడతాయి. ఇది జ్ఞాన మురళీ, అంతేకానీ చెక్క మురళీ కాదు. పతిత-పావనుడైన తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారా లేక చెక్క మురళీని వాయిస్తారా? తండ్రి వచ్చి ఈ విధముగా రాజయోగాన్ని నేర్పిస్తారు అన్నది ఎవరి ఆలోచనలోనూ ఉండదు. ఇప్పుడు ఈ విషయము మీకు తెలుసు, ఇక మిగిలిన మనుష్యమాత్రులెవ్వరి బుద్ధిలోకీ ఈ విషయము రాదు. వచ్చేవారు కూడా నంబరువారుగా పదవిని పొందుతారు. కల్పక్రితం చేసినట్లుగానే ఇప్పుడు కూడా పురుషార్థము చేస్తూ ఉంటారు. తండ్రి కల్పక్రితం వలె వస్తారని, వచ్చి పిల్లలకు అన్ని రహస్యాలను విడమర్చి చెప్తారని మీకు తెలుసు. వారు అంటారు, నేను కూడా బంధనములో బంధింపబడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారు. సత్యయుగములో ఏదైతే జరిగిందో, అదే మళ్ళీ జరుగుతుంది. ఎన్నో రకాల యోనులు ఉన్నాయి. సత్యయుగములో ఇన్ని యోనులు ఉండవు. అక్కడ కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటాయి. ధర్మాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి కదా. సత్యయుగములోనైతే ఇన్ని ధర్మాలు ఉండేవి కావు. సత్యయుగములో ఏవైతే ఉండేవో, వాటిని మళ్ళీ సత్యయుగములోనే చూస్తారు. సత్యయుగములో ఛీ-ఛీగా మురికి చేసేవేవీ ఉండవు. ఆ దేవీ-దేవతలను భగవాన్-భగవతీ అని అంటారు. వేరే ఏ ఖండములోనూ ఎప్పుడూ ఎవరినీ గాడ్-గాడెస్ అని అనలేరు. ఆ దేవతలు తప్పకుండా స్వర్గములో రాజ్యము చేసేవారు. వారికి ఎంత మహిమ ఉందో చూడండి. పిల్లలైన మీకిప్పుడు ఓర్పు కలిగింది. మా పదవి ఎంతో ఉన్నతమైనదని లేదా ఎంతో తక్కువైనదని, మేము ఇన్ని మార్కులతో పాస్ అవుతాము అని మీకు తెలుసు. ఫలానావారు మంచి సేవను చేస్తున్నారని ప్రతి ఒక్కరు మీకు మీరు అర్థం చేసుకోగలరు కదా. అయితే, నడుస్తూ-నడుస్తూ తుఫానులు కూడా వస్తాయి. తండ్రి అంటారు, పిల్లలకు ఎటువంటి గ్రహచారము గాని, తుఫానులు మొదలైనవి గాని రాకూడదు. మాయ మంచి-మంచి పిల్లలను కూడా పడేస్తుంది. కనుక ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని తండ్రి ఓర్పునందిస్తూ ఉంటారు. మీరు సేవను కూడా చేయాలి. స్థాపన జరిగిపోయినట్లయితే ఇక వెళ్ళాల్సిందే. ఇందులో ఒక్క సెకండు కూడా ముందు-వెనుక అవ్వలేదు. ఈ రహస్యాన్ని పిల్లలే అర్థం చేసుకోగలరు. మనము డ్రామాలోని పాత్రధారులము, ఇందులో మనది ముఖ్యమైన పాత్ర. గెలుపు-ఓటముల ఆట భారత్ పైనే తయారుచేయబడింది. భారత్ యే పావనముగా ఉండేది, ఎంతో శాంతి, పవిత్రత ఉండేవి. ఇది నిన్నటి విషయమే. నిన్న మనమే పాత్రను అభినయించాము. 5 వేల సంవత్సరాల పాత్ర పూర్తిగా నిశ్చితమై ఉంది. మనము చక్రములో తిరిగి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ తండ్రితో యోగాన్ని జోడిస్తాము, దీనితోనే మాలిన్యము తొలగుతుంది. తండ్రి గుర్తుకు వచ్చినట్లయితే, వారసత్వము కూడా తప్పకుండా గుర్తుకువస్తుంది. మొట్టమొదట అల్ఫ్ (భగవంతుడు) ను తెలుసుకోవాలి. తండ్రి అంటారు, మీరు నన్ను తెలుసుకోవడముతో నా ద్వారా అంతా తెలుసుకుంటారు. జ్ఞానమైతే చాలా సులువైనది, ఇది ఒక్క సెకండుకు సంబంధించినది. అయినా కూడా అర్థం చేయిస్తూ ఉంటారు, పాయింట్లు ఇస్తూ ఉంటారు. ముఖ్యమైన పాయింటు, మన్మనాభవ, ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. దేహాభిమానము రావడముతో అనేక రకాలు ఇబ్బందులు పడతారు, అవి యోగములో ఉండనివ్వవు. భక్తి మార్గములో శ్రీకృష్ణుని స్మృతిలో కూర్చుంటారు కానీ బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెడుతుంది. భక్తిలో అందరికీ ఈ అనుభవముంది. ఇది ఈ జన్మ యొక్క విషయమే. ఈ జన్మ గురించి తెలుసుకుంటే, ఎంతోకొంత గత జన్మల గురించి కూడా తెలుసుకోగలుగుతారు. తండ్రిని స్మృతి చేయడము అనేది పిల్లలకు హాబీగా అయిపోయింది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషము పెరుగుతుంది. దీనితో పాటు దివ్యమైన అలౌకిక కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు. మీరు సత్యనారాయణ కథను, అమరకథను వినిపిస్తారు. ముఖ్యమైన విషయము ఒక్కటే - అందులోనే అన్నీ వచ్చేస్తాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ ఒక్క హాబీయే ఆత్మికమైనది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, జ్ఞానమైతే చాలా సహజమైనది. కన్యల పేరు కూడా మహిమ చేయబడింది. అదర్ కుమారీ, కుమారీ కన్య, ఇలా కుమారీల పేరు అందరికన్నా ఎక్కువ ప్రసిద్ధమైననది. వారికి ఎటువంటి బంధనము లేదు. ఆ పతి అయితే వికారీగా తయారుచేస్తాడు. ఈ తండ్రి అయితే స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు అలంకరిస్తారు, మధురమైన సాగరములోకి తీసుకువెళ్తారు. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచాన్ని పాత దేహము సహితముగా పూర్తిగా మర్చిపోండి. ఆత్మ అంటుంది - నేనైతే 84 జన్మలను పూర్తి చేసాను, ఇప్పుడు మళ్ళీ నేను తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాను. ధైర్యము ఉంచుతారు, అయినా కానీ మాయతో యుద్ధమైతే జరుగుతుంది. ముందైతే ఈ బాబా ఉన్నారు, మాయా తుఫానులు ఎక్కువగా వీరి వద్దకు వస్తాయి. బాబా, మాకు ఇలా అవుతుంది అని చాలామంది వచ్చి అడుగుతుంటారు. బాబా అంటారు - పిల్లలూ, ఈ తుఫానులైతే తప్పకుండా వస్తాయి, ఇవి ముందు నా వద్దకు వస్తాయి. అంతిమములో అందరూ కర్మాతీత అవస్థను పొందుతారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పక్రితము కూడా ఇలా జరిగింది. డ్రామాలో పాత్రను అభినయించారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. ఈ పాత ప్రపంచము నరకమని పిల్లలకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు క్షీరసాగరములో ఉండేవారని అంటారు కూడా. వీరికి ఎంత మంచి-మంచి మందిరాలను నిర్మిస్తారు. ప్రారంభములో మందిరాలను నిర్మించేటప్పుడు, పాలతోనే కొలనును తయారుచేసి, విష్ణు మూర్తిని పెట్టి ఉంటారు. చాలా మంచి-మంచి చిత్రాలను తయారుచేసి పూజించేవారు. ఆ సమయములోనైతే అన్నీ చాలా చౌకగా ఉండేవి. బాబా ఇవన్నీ చూసారు. ఈ భారత్ నిజంగా ఎంత పవిత్రముగా, క్షీరసాగరము వలె ఉండేది. పాల నదులు, నేతి నదుల ఉన్నట్లు ఉండేవి. ఈ విధముగా మహిమ చేశారు. స్వర్గము పేరు తీసుకోవడముతోనే, నోటిలో నీరు ఊరుతుంది. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. కనుక బుద్ధికి వివేకము లభించింది. బుద్ధి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్వర్గములోకి వస్తారు. అక్కడ అన్నీ కొత్తగానే ఉంటాయి. బాబా, శ్రీ నారాయణుడి మూర్తిని చూసి చాలా సంతోషపడేవారు, చాలా ప్రేమగా చూసుకునేవారు. నేనే ఇలా అవుతాను అని వారు అనుకోలేదు. ఈ జ్ఞానమైతే ఇప్పుడు బాబా నుండి లభించింది. మీకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. మనము చక్రములో ఎలా తిరుగుతాము అనేది మీకు తెలుసు. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. శరీరానికైతే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారముగా మీకు సుఖమయమైన రోజులు వస్తాయి. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని చూస్తున్నారు. మీకు మూడవ నేత్రము లభించింది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించి మీకు మంచి రీతిలో తెలుసు. ఈ స్వదర్శన చక్రము మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది, సంతోషము కలుగుతుంది. ఈ సమయములో అనంతమైన తండ్రి మనకు టీచరుగా అయి చదివిస్తారు. కానీ ఇది కొత్త విషయమైన కారణముగా పదే-పదే మర్చిపోతుంటారు. లేకపోతే బాబా అని అనడముతోనే సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కాలి. రామతీర్థుడు శ్రీకృష్ణుని భక్తునిగా ఉండేవారు కనుక శ్రీకృష్ణుని దర్శనము కోసం ఎంత చేసేవారు. అతనికి సాక్షాత్కారము కలిగింది, సంతోషపడ్డారు. కానీ దాని వలన ఏమి జరిగింది, ఏమీ లభించలేదు. ఇక్కడైతే పిల్లలైన మీకు సంతోషము కూడా ఉంది ఎందుకంటే మనము 21 జన్మల కొరకు ఇంతటి ఉన్నతమైన పదవిని పొందుతామని మీకు తెలుసు. మూడు వంతులు అయితే మీరు సుఖముగా ఉంటారు. ఒకవేళ సగం-సగం ఉన్నట్లయితే ఇక లాభము లేనట్లు. మీరు మూడు వంతులు సుఖములో ఉంటారు. మీ అంతటి సుఖాన్ని ఎవ్వరూ చూడలేరు. మీకైతే అపారమైన సుఖముంటుంది. మహాన్ సుఖములోనైతే దుఃఖము గురించి తెలియదు. ఇప్పుడు మేము దుఃఖము నుండి సుఖములోకి వెళ్తున్నామని సంగమములో మీరు రెండింటి గురించి తెలుసుకుంటారు. ముఖము పగలు వైపు మరియు కాళ్ళు రాత్రి వైపు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని కాలదన్నాలి అనగా బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని ఆత్మకు తెలుసు, చాలా పాత్రను అభినయించారు. ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగానే తుప్పు తొలగుతుంది. ఎంతగా తండ్రి సేవలో ఉంటూ తమ సమానముగా తయారుచేస్తారో, అంతగానే తండ్రిని ప్రత్యక్షము చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉంది. కనుక ఇంటినే స్మృతి చేయాలి. పాత ఇల్లు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఇల్లు ఎక్కడ, పాత ఇల్లు ఎక్కడ. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. ఇది అదే విషయ-వైతరణి నది. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు, గొడవపడుతూ ఉంటారు. ఇకపోతే తండ్రి వచ్చినప్పుడు కూడా చాలా గొడవలు మొదలయ్యాయి. ఒకవేళ పత్ని వికారాలను అందించకపోతే ఎంతగా విసిగిస్తారు, ఎంతగా తల కొట్టుకుంటారు. కల్పక్రితం కూడా అత్యాచారాలు జరిగాయి. ఇప్పటి విషయాల గురించే చెప్పుకుంటారు. ఎంతగా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు అనేది చూస్తుంటారు. డ్రామాలోని అదే పాత్ర మళ్ళీ నడుస్తుంది. ఇది తండ్రికి తెలుసు మరియు పిల్లలకు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మున్ముందు అందరికీ అర్థమవుతుంది. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత తండ్రి అని పాడుతారు కూడా. భారత్ స్వర్గముగా మరియు నరకముగా ఎలా అవుతుంది అనేది మీరెవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు వచ్చినట్లయితే మేము మీకు మొత్తము ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాల గురించి అర్థం చేయిస్తామని చెప్పాలి. ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికాలు ఈశ్వరునికే తెలుసు మరియు ఈశ్వరుని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవడముతో, పవిత్రత, సుఖ-శాంతుల స్థాపన ఎలా జరుగుతుంది అనేదంతా మీరు తెలుసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి మీరు తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే తీసుకుంటారు. మీరు వచ్చి ఇది అర్థం చేసుకోండి. టాపిక్స్ చాలా ఉన్నాయి. పిల్లలైన మీకైతే ఇప్పుడు బుద్ధి నిండుగా అయిపోయింది. సంతోషము యొక్క పాదరసము ఎంతగా పైకి ఎక్కింది. మొత్తం జ్ఞానమంతా పిల్లలైన మీ వద్ద ఉంది. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి నాలెడ్జ్ లభిస్తోంది. ఆ తర్వాత మనమే వెళ్ళి లక్ష్మీ-నారాయణలుగా అవుతాము. అక్కడ మళ్ళీ ఈ జ్ఞానమేమీ ఉండదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన ఎంతటి గుహ్యమైన విషయాలు. పిల్లలు మెట్ల వరుస చిత్రాన్ని మంచి రీతిలో అర్థం చేసుకున్నారు కదా. ఈ చక్రము 84 జన్మలది. ఇప్పుడు మనుష్యులకు కూడా స్పష్టముగా అర్థం చేయించాలి. దీనిని ఇప్పుడు స్వర్గము లేక పావన ప్రపంచమని అనరు. సత్యయుగము వేరు, కలియుగము వేరు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది సులువుగా అర్థం చేయించవచ్చు. వివరణ మంచిగా అనిపిస్తుంది. కానీ పురుషార్థము చేసి స్మృతియాత్రలో ఉండాలి, ఇది చాలామంది చేయలేకపోతారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఈ పాత దేహాన్ని మరియు పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచి తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇప్పుడు మా సుఖమయమైన రోజులు ఇక వచ్చేసాయని సదా ఇదే సంతోషములో ఉండాలి. 2. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి ఏ నాలెడ్జ్ అయితే లభించిందో, దానిని స్మరణ చేస్తూ బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడూ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడకూడదు. వరదానము:-సదా ఏకరస స్థితి అనే సింహాసనముపై విరాజమానమై ఉండే బాప్ దాదా హృదయ సింహాసనాధికారి భవ అన్నింటికంటే శ్రేష్ఠమైన సింహాసనము బాప్ దాదా హృదయ సింహాసనాధికారిగా అవ్వడము. కానీ ఈ సింహాసనముపై కూర్చునేందుకు అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితి యొక్క సింహాసనము కావాలి. ఒకవేళ ఈ స్థితి అనే సింహాసనముపై స్థితులవ్వలేకపోతే బాప్ దాదా యొక్క హృదయము రూపీ సింహాసనముపై స్థితులవ్వలేరు. దీని కోసం తమ భృకుటి సింహాసనముపై అకాలమూర్తులుగా అయి స్థితులవ్వండి, ఈ సింహాసనముపై మాటిమాటికి అలజడి చెందకూడదు, అప్పుడే బాప్ దాదా హృదయ సింహాసనముపై విరాజమానమవ్వగలరు. స్లోగన్:-శుభ చింతన ద్వారా నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేయండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ బ్రహ్మాబాబా తన పిల్లలు ప్రతి ఒక్కరి ముఖములో, ఒకటేమో - సదా ఆత్మికతకు చెందిన చిరునవ్వును చూడాలనుకుంటారు మరియు రెండవది - నోటి నుండి సదా మధురమైన మాటలను వినాలనుకుంటారు. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు, ముఖముపై ఆత్మికత ఉండాలి, నోటిలో మధురత ఉండాలి మరియు మనసు-బుద్ధిలో సదా శుభ భావన, దయా హృదయము కల భావన, దాతాతనపు భావన ఉండాలి. ప్రతి అడుగులోనూ ఫాలో ఫాదర్ చేయాలి, ఇదే పాలనకు రిటర్న్గా ఇవ్వండి. "
https://youtube.com/watch?v=eo1dk1o8tJ4&si=0b1a2hsk1ZKawMSr #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామ మందిరం🙏
youtube-preview
#🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు 21-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానసాగరుడైన తండ్రి, పిల్లలైన మీ సమ్ముఖములో జ్ఞాన డాన్స్ చేయడానికి వచ్చారు, మీరు తెలివైనవారిగా, సేవాధారులుగా అయినట్లయితే జ్ఞాన డాన్స్ కూడా బాగా జరుగుతుంది’’ ప్రశ్న:-సంగమయుగములో పిల్లలైన మీరు ఏ హాబీ (అలవాటు) ను అలవాటు చేసుకుంటారు? జవాబు:-స్మృతిలో ఉండే హాబీను అలవాటు చేసుకుంటారు. ఇదే ఆత్మిక హాబీ. ఈ హాబీతో పాటుగా మీరు దివ్యమైన మరియు అలౌకికమైన కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు, మీరు అందరికీ సత్యాతి-సత్యమైన కథను తప్పకుండా వినిపించాలి. సేవ చేసే హాబీ కూడా పిల్లలైన మీకు ఉండాలి. పాట:-ఓర్పు వహించు మానవా... ▶ ఓంశాంతి. హాస్పిటల్ లో ఎవరైనా అనారోగ్యముతో ఉన్నట్లయితే, ఆ పేషెంట్ దుఃఖము నుండి విముక్తునిగా అవ్వాలని ఆశిస్తాడు. నా పరిస్థితి ఎలా ఉంది, ఈ అనారోగ్యము ఎప్పుడు నయమవుతుంది అని డాక్టరును అడుగుతారు. అవన్నీ హద్దులోని విషయాలు. ఇది అనంతమైన విషయము. తండ్రి వచ్చి పిల్లలకు సలహానిస్తారు. ఇది నిజంగానే సుఖము మరియు దుఃఖము యొక్క ఆట అని పిల్లలు తెలుసుకున్నారు. వాస్తవానికి పిల్లలైన మీకు సత్యయుగములోకి వెళ్ళేకంటే కూడా ఎక్కువ లాభము ఇక్కడే ఉంది ఎందుకంటే మీకు తెలుసు, ఈ సమయములో మనము ఈశ్వరీయ ఒడిలో ఉన్నాము, మనము ఈశ్వరీయ సంతానము. ఈ సమయములో మనకు ఎంతో ఉన్నతోన్నతమైన గుప్తమైన మహిమ ఉంది. మనుష్యమాత్రులు తండ్రిని శివుడు, ఈశ్వరుడు, భగవంతుడు అని కూడా అంటారు కానీ వారి గురించి తెలియదు, కేవలం అలా పిలుస్తూ ఉంటారు. డ్రామానుసారముగానే ఇలా జరుగుతుంది. జ్ఞానము మరియు అజ్ఞానము, పగలు మరియు రాత్రి అని కూడా పాడుతూ వచ్చారు కానీ బుద్ధి ఎంత తమోప్రధానముగా అయిపోయిందంటే, తమను తాము తమోప్రధానమని భావించనే భావించరు. ఎవరి భాగ్యములోనైతే తండ్రి యొక్క వారసత్వము ఉంటుందో, వారి బుద్ధిలోనే కూర్చోగలదు. మేము పూర్తిగా ఘోర అంధకారములో ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున ఎంతటి ప్రకాశము లభించింది. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే అర్థం చేయిస్తారో, అది ఏ వేద-శాస్త్రాలలోనూ, గ్రంథాలు మొదలైనవాటిలోనూ లేదు. ఇది కూడా తండ్రి నిరూపించి తెలియజేస్తారు. పిల్లలైన మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల ప్రకాశాన్ని ఇస్తాను, అది తర్వాత కనుమరుగైపోతుంది. నా ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా జ్ఞానము లభించదు, ఈ జ్ఞానము తర్వాత కనుమరుగైపోతుంది. కలియుగము గతించిపోయింది, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని అర్థమవుతుంది. ఇది కొత్త విషయము. ఇది శాస్త్రాలలో లేదు. తండ్రి అయితే ఈ జ్ఞానాన్ని అందరికీ ఒకే విధముగా చదివిస్తారు కానీ ధారణలో నంబరువారుగా ఉన్నారు. కొంతమంది మంచి సర్వీసబుల్ పిల్లలు వచ్చినప్పుడు బాబా యొక్క డ్యాన్స్ కూడా అలాగే జరుగుతుంది. డ్యాన్సింగ్ గర్ల్ (నృత్యము చేసే నర్తకి) ఎదురుగా, చాలా అభిరుచితో చూసేవారు ఉన్నట్లయితే, ఆమె కూడా సంతోషముతో చాలా బాగా నాట్యము చేస్తుంది. కొద్దిమందే కూర్చుని ఉంటే, సాధారణ రీతిలో కొద్దిగా డాన్స్ చేస్తుంది. వాహ్-వాహ్ అనేవారు చాలామంది ఉంటే, ఆమెకు కూడా ఉత్సాహము పెరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మురళీని పిల్లలందరూ వింటారు, కానీ సమ్ముఖముగా వినడము వేరు కదా. శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసేవారని కూడా చూపిస్తారు. కానీ డ్యాన్స్ అంటే స్థూలమైన డ్యాన్స్ కాదు. వాస్తవానికి ఇది జ్ఞాన డ్యాన్స్. శివబాబా స్వయంగా చెప్తున్నారు - నేను జ్ఞాన డ్యాన్స్ చేయడానికి వస్తాను, నేను జ్ఞాన సాగరుడిని, కావున మంచి-మంచి పాయింట్లు వెలువడతాయి. ఇది జ్ఞాన మురళీ, అంతేకానీ చెక్క మురళీ కాదు. పతిత-పావనుడైన తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారా లేక చెక్క మురళీని వాయిస్తారా? తండ్రి వచ్చి ఈ విధముగా రాజయోగాన్ని నేర్పిస్తారు అన్నది ఎవరి ఆలోచనలోనూ ఉండదు. ఇప్పుడు ఈ విషయము మీకు తెలుసు, ఇక మిగిలిన మనుష్యమాత్రులెవ్వరి బుద్ధిలోకీ ఈ విషయము రాదు. వచ్చేవారు కూడా నంబరువారుగా పదవిని పొందుతారు. కల్పక్రితం చేసినట్లుగానే ఇప్పుడు కూడా పురుషార్థము చేస్తూ ఉంటారు. తండ్రి కల్పక్రితం వలె వస్తారని, వచ్చి పిల్లలకు అన్ని రహస్యాలను విడమర్చి చెప్తారని మీకు తెలుసు. వారు అంటారు, నేను కూడా బంధనములో బంధింపబడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారు. సత్యయుగములో ఏదైతే జరిగిందో, అదే మళ్ళీ జరుగుతుంది. ఎన్నో రకాల యోనులు ఉన్నాయి. సత్యయుగములో ఇన్ని యోనులు ఉండవు. అక్కడ కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటాయి. ధర్మాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి కదా. సత్యయుగములోనైతే ఇన్ని ధర్మాలు ఉండేవి కావు. సత్యయుగములో ఏవైతే ఉండేవో, వాటిని మళ్ళీ సత్యయుగములోనే చూస్తారు. సత్యయుగములో ఛీ-ఛీగా మురికి చేసేవేవీ ఉండవు. ఆ దేవీ-దేవతలను భగవాన్-భగవతీ అని అంటారు. వేరే ఏ ఖండములోనూ ఎప్పుడూ ఎవరినీ గాడ్-గాడెస్ అని అనలేరు. ఆ దేవతలు తప్పకుండా స్వర్గములో రాజ్యము చేసేవారు. వారికి ఎంత మహిమ ఉందో చూడండి. పిల్లలైన మీకిప్పుడు ఓర్పు కలిగింది. మా పదవి ఎంతో ఉన్నతమైనదని లేదా ఎంతో తక్కువైనదని, మేము ఇన్ని మార్కులతో పాస్ అవుతాము అని మీకు తెలుసు. ఫలానావారు మంచి సేవను చేస్తున్నారని ప్రతి ఒక్కరు మీకు మీరు అర్థం చేసుకోగలరు కదా. అయితే, నడుస్తూ-నడుస్తూ తుఫానులు కూడా వస్తాయి. తండ్రి అంటారు, పిల్లలకు ఎటువంటి గ్రహచారము గాని, తుఫానులు మొదలైనవి గాని రాకూడదు. మాయ మంచి-మంచి పిల్లలను కూడా పడేస్తుంది. కనుక ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని తండ్రి ఓర్పునందిస్తూ ఉంటారు. మీరు సేవను కూడా చేయాలి. స్థాపన జరిగిపోయినట్లయితే ఇక వెళ్ళాల్సిందే. ఇందులో ఒక్క సెకండు కూడా ముందు-వెనుక అవ్వలేదు. ఈ రహస్యాన్ని పిల్లలే అర్థం చేసుకోగలరు. మనము డ్రామాలోని పాత్రధారులము, ఇందులో మనది ముఖ్యమైన పాత్ర. గెలుపు-ఓటముల ఆట భారత్ పైనే తయారుచేయబడింది. భారత్ యే పావనముగా ఉండేది, ఎంతో శాంతి, పవిత్రత ఉండేవి. ఇది నిన్నటి విషయమే. నిన్న మనమే పాత్రను అభినయించాము. 5 వేల సంవత్సరాల పాత్ర పూర్తిగా నిశ్చితమై ఉంది. మనము చక్రములో తిరిగి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ తండ్రితో యోగాన్ని జోడిస్తాము, దీనితోనే మాలిన్యము తొలగుతుంది. తండ్రి గుర్తుకు వచ్చినట్లయితే, వారసత్వము కూడా తప్పకుండా గుర్తుకువస్తుంది. మొట్టమొదట అల్ఫ్ (భగవంతుడు) ను తెలుసుకోవాలి. తండ్రి అంటారు, మీరు నన్ను తెలుసుకోవడముతో నా ద్వారా అంతా తెలుసుకుంటారు. జ్ఞానమైతే చాలా సులువైనది, ఇది ఒక్క సెకండుకు సంబంధించినది. అయినా కూడా అర్థం చేయిస్తూ ఉంటారు, పాయింట్లు ఇస్తూ ఉంటారు. ముఖ్యమైన పాయింటు, మన్మనాభవ, ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. దేహాభిమానము రావడముతో అనేక రకాలు ఇబ్బందులు పడతారు, అవి యోగములో ఉండనివ్వవు. భక్తి మార్గములో శ్రీకృష్ణుని స్మృతిలో కూర్చుంటారు కానీ బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెడుతుంది. భక్తిలో అందరికీ ఈ అనుభవముంది. ఇది ఈ జన్మ యొక్క విషయమే. ఈ జన్మ గురించి తెలుసుకుంటే, ఎంతోకొంత గత జన్మల గురించి కూడా తెలుసుకోగలుగుతారు. తండ్రిని స్మృతి చేయడము అనేది పిల్లలకు హాబీగా అయిపోయింది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషము పెరుగుతుంది. దీనితో పాటు దివ్యమైన అలౌకిక కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు. మీరు సత్యనారాయణ కథను, అమరకథను వినిపిస్తారు. ముఖ్యమైన విషయము ఒక్కటే - అందులోనే అన్నీ వచ్చేస్తాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ ఒక్క హాబీయే ఆత్మికమైనది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, జ్ఞానమైతే చాలా సహజమైనది. కన్యల పేరు కూడా మహిమ చేయబడింది. అదర్ కుమారీ, కుమారీ కన్య, ఇలా కుమారీల పేరు అందరికన్నా ఎక్కువ ప్రసిద్ధమైననది. వారికి ఎటువంటి బంధనము లేదు. ఆ పతి అయితే వికారీగా తయారుచేస్తాడు. ఈ తండ్రి అయితే స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు అలంకరిస్తారు, మధురమైన సాగరములోకి తీసుకువెళ్తారు. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచాన్ని పాత దేహము సహితముగా పూర్తిగా మర్చిపోండి. ఆత్మ అంటుంది - నేనైతే 84 జన్మలను పూర్తి చేసాను, ఇప్పుడు మళ్ళీ నేను తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాను. ధైర్యము ఉంచుతారు, అయినా కానీ మాయతో యుద్ధమైతే జరుగుతుంది. ముందైతే ఈ బాబా ఉన్నారు, మాయా తుఫానులు ఎక్కువగా వీరి వద్దకు వస్తాయి. బాబా, మాకు ఇలా అవుతుంది అని చాలామంది వచ్చి అడుగుతుంటారు. బాబా అంటారు - పిల్లలూ, ఈ తుఫానులైతే తప్పకుండా వస్తాయి, ఇవి ముందు నా వద్దకు వస్తాయి. అంతిమములో అందరూ కర్మాతీత అవస్థను పొందుతారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పక్రితము కూడా ఇలా జరిగింది. డ్రామాలో పాత్రను అభినయించారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. ఈ పాత ప్రపంచము నరకమని పిల్లలకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు క్షీరసాగరములో ఉండేవారని అంటారు కూడా. వీరికి ఎంత మంచి-మంచి మందిరాలను నిర్మిస్తారు. ప్రారంభములో మందిరాలను నిర్మించేటప్పుడు, పాలతోనే కొలనును తయారుచేసి, విష్ణు మూర్తిని పెట్టి ఉంటారు. చాలా మంచి-మంచి చిత్రాలను తయారుచేసి పూజించేవారు. ఆ సమయములోనైతే అన్నీ చాలా చౌకగా ఉండేవి. బాబా ఇవన్నీ చూసారు. ఈ భారత్ నిజంగా ఎంత పవిత్రముగా, క్షీరసాగరము వలె ఉండేది. పాల నదులు, నేతి నదుల ఉన్నట్లు ఉండేవి. ఈ విధముగా మహిమ చేశారు. స్వర్గము పేరు తీసుకోవడముతోనే, నోటిలో నీరు ఊరుతుంది. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. కనుక బుద్ధికి వివేకము లభించింది. బుద్ధి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్వర్గములోకి వస్తారు. అక్కడ అన్నీ కొత్తగానే ఉంటాయి. బాబా, శ్రీ నారాయణుడి మూర్తిని చూసి చాలా సంతోషపడేవారు, చాలా ప్రేమగా చూసుకునేవారు. నేనే ఇలా అవుతాను అని వారు అనుకోలేదు. ఈ జ్ఞానమైతే ఇప్పుడు బాబా నుండి లభించింది. మీకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. మనము చక్రములో ఎలా తిరుగుతాము అనేది మీకు తెలుసు. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. శరీరానికైతే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారముగా మీకు సుఖమయమైన రోజులు వస్తాయి. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని చూస్తున్నారు. మీకు మూడవ నేత్రము లభించింది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించి మీకు మంచి రీతిలో తెలుసు. ఈ స్వదర్శన చక్రము మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది, సంతోషము కలుగుతుంది. ఈ సమయములో అనంతమైన తండ్రి మనకు టీచరుగా అయి చదివిస్తారు. కానీ ఇది కొత్త విషయమైన కారణముగా పదే-పదే మర్చిపోతుంటారు. లేకపోతే బాబా అని అనడముతోనే సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కాలి. రామతీర్థుడు శ్రీకృష్ణుని భక్తునిగా ఉండేవారు కనుక శ్రీకృష్ణుని దర్శనము కోసం ఎంత చేసేవారు. అతనికి సాక్షాత్కారము కలిగింది, సంతోషపడ్డారు. కానీ దాని వలన ఏమి జరిగింది, ఏమీ లభించలేదు. ఇక్కడైతే పిల్లలైన మీకు సంతోషము కూడా ఉంది ఎందుకంటే మనము 21 జన్మల కొరకు ఇంతటి ఉన్నతమైన పదవిని పొందుతామని మీకు తెలుసు. మూడు వంతులు అయితే మీరు సుఖముగా ఉంటారు. ఒకవేళ సగం-సగం ఉన్నట్లయితే ఇక లాభము లేనట్లు. మీరు మూడు వంతులు సుఖములో ఉంటారు. మీ అంతటి సుఖాన్ని ఎవ్వరూ చూడలేరు. మీకైతే అపారమైన సుఖముంటుంది. మహాన్ సుఖములోనైతే దుఃఖము గురించి తెలియదు. ఇప్పుడు మేము దుఃఖము నుండి సుఖములోకి వెళ్తున్నామని సంగమములో మీరు రెండింటి గురించి తెలుసుకుంటారు. ముఖము పగలు వైపు మరియు కాళ్ళు రాత్రి వైపు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని కాలదన్నాలి అనగా బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని ఆత్మకు తెలుసు, చాలా పాత్రను అభినయించారు. ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగానే తుప్పు తొలగుతుంది. ఎంతగా తండ్రి సేవలో ఉంటూ తమ సమానముగా తయారుచేస్తారో, అంతగానే తండ్రిని ప్రత్యక్షము చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉంది. కనుక ఇంటినే స్మృతి చేయాలి. పాత ఇల్లు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఇల్లు ఎక్కడ, పాత ఇల్లు ఎక్కడ. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. ఇది అదే విషయ-వైతరణి నది. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు, గొడవపడుతూ ఉంటారు. ఇకపోతే తండ్రి వచ్చినప్పుడు కూడా చాలా గొడవలు మొదలయ్యాయి. ఒకవేళ పత్ని వికారాలను అందించకపోతే ఎంతగా విసిగిస్తారు, ఎంతగా తల కొట్టుకుంటారు. కల్పక్రితం కూడా అత్యాచారాలు జరిగాయి. ఇప్పటి విషయాల గురించే చెప్పుకుంటారు. ఎంతగా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు అనేది చూస్తుంటారు. డ్రామాలోని అదే పాత్ర మళ్ళీ నడుస్తుంది. ఇది తండ్రికి తెలుసు మరియు పిల్లలకు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మున్ముందు అందరికీ అర్థమవుతుంది. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత తండ్రి అని పాడుతారు కూడా. భారత్ స్వర్గముగా మరియు నరకముగా ఎలా అవుతుంది అనేది మీరెవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు వచ్చినట్లయితే మేము మీకు మొత్తము ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాల గురించి అర్థం చేయిస్తామని చెప్పాలి. ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికాలు ఈశ్వరునికే తెలుసు మరియు ఈశ్వరుని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవడముతో, పవిత్రత, సుఖ-శాంతుల స్థాపన ఎలా జరుగుతుంది అనేదంతా మీరు తెలుసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి మీరు తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే తీసుకుంటారు. మీరు వచ్చి ఇది అర్థం చేసుకోండి. టాపిక్స్ చాలా ఉన్నాయి. పిల్లలైన మీకైతే ఇప్పుడు బుద్ధి నిండుగా అయిపోయింది. సంతోషము యొక్క పాదరసము ఎంతగా పైకి ఎక్కింది. మొత్తం జ్ఞానమంతా పిల్లలైన మీ వద్ద ఉంది. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి నాలెడ్జ్ లభిస్తోంది. ఆ తర్వాత మనమే వెళ్ళి లక్ష్మీ-నారాయణలుగా అవుతాము. అక్కడ మళ్ళీ ఈ జ్ఞానమేమీ ఉండదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన ఎంతటి గుహ్యమైన విషయాలు. పిల్లలు మెట్ల వరుస చిత్రాన్ని మంచి రీతిలో అర్థం చేసుకున్నారు కదా. ఈ చక్రము 84 జన్మలది. ఇప్పుడు మనుష్యులకు కూడా స్పష్టముగా అర్థం చేయించాలి. దీనిని ఇప్పుడు స్వర్గము లేక పావన ప్రపంచమని అనరు. సత్యయుగము వేరు, కలియుగము వేరు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది సులువుగా అర్థం చేయించవచ్చు. వివరణ మంచిగా అనిపిస్తుంది. కానీ పురుషార్థము చేసి స్మృతియాత్రలో ఉండాలి, ఇది చాలామంది చేయలేకపోతారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఈ పాత దేహాన్ని మరియు పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచి తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇప్పుడు మా సుఖమయమైన రోజులు ఇక వచ్చేసాయని సదా ఇదే సంతోషములో ఉండాలి. 2. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి ఏ నాలెడ్జ్ అయితే లభించిందో, దానిని స్మరణ చేస్తూ బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడూ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడకూడదు. వరదానము:-సదా ఏకరస స్థితి అనే సింహాసనముపై విరాజమానమై ఉండే బాప్ దాదా హృదయ సింహాసనాధికారి భవ అన్నింటికంటే శ్రేష్ఠమైన సింహాసనము బాప్ దాదా హృదయ సింహాసనాధికారిగా అవ్వడము. కానీ ఈ సింహాసనముపై కూర్చునేందుకు అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితి యొక్క సింహాసనము కావాలి. ఒకవేళ ఈ స్థితి అనే సింహాసనముపై స్థితులవ్వలేకపోతే బాప్ దాదా యొక్క హృదయము రూపీ సింహాసనముపై స్థితులవ్వలేరు. దీని కోసం తమ భృకుటి సింహాసనముపై అకాలమూర్తులుగా అయి స్థితులవ్వండి, ఈ సింహాసనముపై మాటిమాటికి అలజడి చెందకూడదు, అప్పుడే బాప్ దాదా హృదయ సింహాసనముపై విరాజమానమవ్వగలరు. స్లోగన్:-శుభ చింతన ద్వారా నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేయండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ బ్రహ్మాబాబా తన పిల్లలు ప్రతి ఒక్కరి ముఖములో, ఒకటేమో - సదా ఆత్మికతకు చెందిన చిరునవ్వును చూడాలనుకుంటారు మరియు రెండవది - నోటి నుండి సదా మధురమైన మాటలను వినాలనుకుంటారు. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు, ముఖముపై ఆత్మికత ఉండాలి, నోటిలో మధురత ఉండాలి మరియు మనసు-బుద్ధిలో సదా శుభ భావన, దయా హృదయము కల భావన, దాతాతనపు భావన ఉండాలి. ప్రతి అడుగులోనూ ఫాలో ఫాదర్ చేయాలి, ఇదే పాలనకు రిటర్న్గా ఇవ్వండి. "