ShareChat
click to see wallet page
search
#🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 23-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - భోళానాథుడైన అత్యంత ప్రియమైన తండ్రి మీ సమ్ముఖములో కూర్చున్నారు, మీరు ప్రేమతో స్మృతి చేసినట్లయితే తపన, ప్రేమ పెరుగుతూ ఉంటాయి, విఘ్నాలు సమాప్తమైపోతాయి’’ ప్రశ్న:-బ్రాహ్మణ పిల్లలకు ఏ విషయము సదా గుర్తున్నట్లయితే ఎప్పుడూ వికర్మలు జరగవు? జవాబు:-ఏ కర్మలనైతే నేను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు - ఇది గుర్తున్నట్లయితే వికర్మలు జరగవు. ఒకవేళ ఎవరైనా దాగి ఉంటూ పాప కర్మలను చేసినా, ధర్మరాజు నుండైతే దాగి ఉండలేరు, వెంటనే దానికి శిక్ష లభిస్తుంది. మున్ముందు ఇంకా మార్షల్ లా (కఠినమైన నియమాలతో కూడిన సైనిక శాసనము) ఏర్పడుతుంది. ఈ ఇంద్రసభలో ఏ పతితులు దాక్కుని కూర్చోలేరు. పాట:-భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు... ▶ ఓంశాంతి. ఇప్పుడు ఆత్మిక తండ్రి మనకు ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారని మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. వారి పేరే భోళానాథుడు. తండ్రులు ఎంతో భోళాగా (అమాయకముగా) ఉంటారు, ఎంతటి కష్టాన్ని అయినా సహించి పిల్లలను చదివిస్తారు, సంభాళిస్తారు. పిల్లలు పెద్దవారైన తర్వాత అంతా వారికి ఇచ్చేసి స్వయము వానప్రస్థ అవస్థలోకి వెళ్తారు. నేను నా బాధ్యతను పూర్తి చేశాను, ఇప్పుడిక పిల్లలు చూసుకుంటారని అనుకుంటారు. కనుక తండ్రి భోళాయే కదా. ఇది కూడా ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే వారు స్వయము భోళానాథుడు. హద్దు తండ్రి గురించి కూడా వారెంత భోళా అయినవారు అని అర్థం చేయిస్తున్నారు. వారు హద్దులోని భోళాతనము (అమాయకత్వము) కలవారు. వీరు అనంతమైన భోళానాథుడైన తండ్రి. వీరు పరంధామము నుండి వస్తారు, పాత ప్రపంచములోకి, పాత శరీరములోకి వస్తారు, అందుకే మనుష్యులు, పాత పతిత శరీరములోకి రావడమనేది ఎలా జరుగుతుంది అని అనుకుంటారు. అర్థం కానీ కారణముగా పావన శరీరము కల శ్రీకృష్ణుని పేరును వేశారు. ఇదే గీత, ఇవే వేదాలు, శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ తయారవుతాయి. శివబాబా ఎంత భోళాగా ఉన్నారో చూడండి. వారు వచ్చినప్పుడు, తండ్రి ఇక్కడే కూర్చుని ఉన్నారు అనే అనుభూతిని కలిగిస్తారు. ఈ సాకార బాబా కూడా భోళానే కదా. వారికి ఎటువంటి కండువా లేదు, ఎటువంటి తిలకము మొదలైనవి లేవు, కానీ సాధారణముగా ఉన్న ఈ బాబా, బాబాయే. ఇంతటి జ్ఞానాన్ని అంతా శివబాబాయే ఇస్తారని, ఇతరులెవ్వరికీ ఇది ఇవ్వగలిగే శక్తి లేదని పిల్లలకు తెలుసు. రోజురోజుకు పిల్లలకు తపన, ప్రేమ పెరుగుతూ ఉంటాయి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా ప్రేమ పెరుగుతుంది. వారు అత్యంత ప్రియమైన తండ్రి కదా. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, భక్తి మార్గములో కూడా మీరు వారిని అత్యంత ప్రియమైనవారిగా భావించేవారు. బాబా, మీరు వచ్చినప్పుడు, అందరి పట్ల ఉన్న ప్రేమను వదిలి, ఒక్క తండ్రితోనే ప్రేమను పెట్టుకుంటాము అని అనేవారు. ఇది ఇప్పుడు మీకు తెలుసు. కానీ మాయ అంతగా ప్రేమించనివ్వదు. మీరు మాయను వదిలి తండ్రిని స్మృతి చేయడమనేది మాయకు ఇష్టముండదు. వీరు దేహాభిమానులుగా అయి నన్ను ప్రేమించాలి అని మాయ కోరుకుంటుంది. మాయ ఇదే కోరుకుంటుంది, అందుకే ఎన్ని విఘ్నాలను కలిగిస్తుంది. మీరు విఘ్నాలను దాటివేయాలి. పిల్లలు ఎంతోకొంత శ్రమనైతే చేయాలి కదా. పురుషార్థముతోనే మీరు మీ ప్రారబ్ధాన్ని పొందుతారు. ఉన్నత పదవిని పొందేందుకు ఎంత పురుషార్థము చేయాల్సి ఉంటుంది అనేది పిల్లలకు తెలుసు. ఒకటేమో - వికారాలను దానము ఇవ్వాలి, రెండవది - తండ్రి నుండి ఏవైతే అవినాశీ జ్ఞాన రత్నాల ధనము లభిస్తుందో, దానిని దానము చేయాలి. ఈ అవినాశీ ధనముతోనే మీరు ఇంతటి ధనవంతులుగా అవుతారు. జ్ఞానము సంపాదనకు ఆధారము. వారిది శాస్త్రాల ఫిలాసఫీ, ఇది స్పిరిచ్యుల్ నాలెడ్జ్. శాస్త్రాలు మొదలైనవి చదువుకుని కూడా చాలా సంపాదిస్తారు. ఒక గదిలో గ్రంథ్ మొదలైనవి పెట్టుకుని, కొంచెం వినిపించినా చాలు, సంపాదన జరుగుతుంది. అది యథార్థమైన జ్ఞానమేమీ కాదు. యథార్థమైన జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఎంతవరకైతే ఎవరికైనా ఈ ఆత్మిక జ్ఞానము లభించదో, అంతవరకు ఆ శాస్త్రాల ఫిలాసఫీయే బుద్ధిలో ఉంటుంది. మీ మాట వినరు. మీరు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని పిల్లలు ఆత్మిక తండ్రి నుండి తీసుకున్నారు అనేది 100 శాతము వాస్తవము. జ్ఞానము సంపాదనకు ఆధారము. చాలా ధనము లభిస్తుంది. యోగము ఆరోగ్యానికి ఆధారము అనగా నిరోగీ శరీరము లభిస్తుంది, జ్ఞానముతో ధనము లభిస్తుంది - ఈ రెండూ ముఖ్యమైన సబ్జెక్టులు. అయితే, వీటిని కొంతమంది మంచి రీతిలో ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు కావున ధనము కూడా నంబరువారుగా తక్కువగా లభిస్తుంది. శిక్షలు అనుభవించిన తర్వాత పదవిని పొందుతారు. పూర్తిగా స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు, అప్పుడిక శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా భ్రష్టమవుతుంది. స్కూల్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా. ఇది అనంతమైన జ్ఞానము, దీనితో నావ తీరానికి చేరుతుంది. ఆ జ్ఞానములో బ్యారిస్టర్, డాక్టర్, ఇంజనీర్ అవ్వడానికి చదవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఒకే చదువు ఉంది. యోగము మరియు జ్ఞానముతో సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు, రాకుమారులుగా అయిపోతారు. అక్కడ స్వర్గములో బ్యారిస్టరు, జడ్జ్ మొదలైనవారెవరూ ఉండరు. అక్కడ ధర్మరాజు అవసరము కూడా ఉండదు. అక్కడ గర్భ జైలు శిక్షలు ఉండవు, ధర్మరాజుపురి శిక్షలు ఉండవు. గర్భ మహల్ లో అక్కడ చాలా సుఖముగా ఉంటారు. ఇక్కడైతే గర్భ జైలులో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ పిల్లలైన మీరే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఇకపోతే శాస్త్రాలలో సంస్కృతములో శ్లోకాలు మొదలైనవాటిని మనుష్యులు తయారుచేసారు. సత్యయుగములో ఏ భాష ఉంటుందని అడుగుతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - దేవతల భాష ఏదైతే ఉంటుందో, అదే నడుస్తుంది. అక్కడ ఏదైతే భాష ఉంటుందో, అది ఇంకెక్కడా ఉండదు. అక్కడ సంస్కృత భాష ఉండడమనేది జరగదు. దేవతల భాష మరియు పతిత మనుష్యుల భాష ఒక్కటే ఉండదు. అక్కడ ఏ భాష ఉంటుందో, అదే నడుస్తుంది. దీని గురించి అడగవలసిన అవసరము లేదు. ముందు తండ్రి నుండి వారసత్వాన్ని అయితే తీసుకోండి. కల్పక్రితం ఏదైతే జరిగి ఉంటుందో, అదే జరుగుతుంది. ముందు వారసత్వాన్ని తీసుకోండి, వేరే విషయాలేవీ అడగకండి. అచ్ఛా, 84 జన్మలు కాకపోతే, 80 లేక 82 జన్మలు ఉండచ్చు, ఈ విషయాలను మీరు వదిలేయండి. తండ్రి అంటారు, అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేయండి. స్వర్గ రాజ్యాధికారము తప్పకుండా లభిస్తుంది కదా. అనేక సార్లు మీరు స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకున్నారు. పై నుండి దిగవలసి ఉంటుంది కూడా. ఇప్పుడు మీరు మాస్టర్ జ్ఞాన సాగరులుగా, మాస్టర్ సుఖ సాగరులుగా అవుతారు. మీరు పురుషార్థులు. బాబా అయితే కంప్లీట్ (సంపూర్ణులు). తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో, అది పిల్లలలో ఉంది, కానీ మిమ్మల్ని సాగరులు అని అనరు. సాగరుడు ఒక్కరే ఉంటారు, కేవలం అనేక పేర్లు పెట్టేసారు. ఇకపోతే మీరు జ్ఞాన సాగరుడి నుండి వెలువడిన నదులు. మీరే మానస సరోవరాలు, నదులు. నదులకు పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది. కలకత్తాలో నది మరియు సాగరముల సంగమము ఉంది. దాని పేరు డైమండ్ హార్బర్. మీరు బ్రహ్మా ముఖవంశావళులు, మీరు వజ్రము వలె అవుతారు. చాలా భారీ మేళా ఏర్పాటు అవుతుంది. బాబా ఈ బ్రహ్మా తనువులోకి వచ్చి పిల్లలను కలుస్తారు. ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి. ఎంతైనా బాబా, మన్మనాభవ అని అంటారు. బాబాను స్మృతి చేస్తూ ఉండండి. వారు అత్యంత ప్రియమైనవారు, వారు సర్వ సంబంధాల సాక్కిరిన్. ఆ సంబంధీకులందరూ వికారులు, వారి నుండి దుఃఖము లభిస్తుంది. బాబా మీకు అన్నింటికీ రిటర్న్ ఇచ్చేస్తారు. సర్వ సంబంధాల ప్రేమనిస్తారు, ఎంత సుఖాన్నిస్తారు. ఇంకెవ్వరూ ఇంతటి సుఖాన్నివ్వలేరు. ఎవరైనా ఇచ్చినా కూడా అది అల్పకాలము కొరకే ఇస్తారు. దానినే సన్యాసులు కాకిరెట్ట సమానమైన సుఖమని అంటారు. దుఃఖధామములోనైతే తప్పకుండా దుఃఖమే ఉంటుంది. మనము ఈ పాత్రను అనేక సార్లు అభినయించామని పిల్లలైన మీకు తెలుసు. కానీ మేము ఉన్నతమైన పదవిని ఎలా పొందాలి అనే చింత ఉండాలి. మేము అక్కడ ఫెయిల్ అవ్వకూడదు అని చాలా పురుషార్థము చేయాలి. మంచి నంబరులో పాస్ అయినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు మరియు సంతోషము కూడా ఉంటుంది. అందరూ ఒకేలా ఉండలేరు, యోగముపై ఆధారపడి ఉంటుంది. చాలామంది గోపికలు అసలు ఎప్పుడూ కలవలేదు కూడా. వారు తండ్రిని కలుసుకునేందుకు తపిస్తూ ఉంటారు. సాధు-సన్యాసుల వద్ద తపించే విషయమేమీ ఉండదు. ఇక్కడికైతే శివబాబాను కలుసుకునేందుకు వస్తారు. ఇది అద్భుతమైన విషయము కదా. శివబాబా, మేము మీ పిల్లలము అని ఇంటిలో కూర్చుని స్మృతి చేస్తారు. ఆత్మకు స్మృతి కలుగుతుంది. మేము శివబాబా నుండి కల్ప-కల్పము వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. ఆ తండ్రే, కల్పము తర్వాత వచ్చి ఉన్నారు కనుక వారిని చూడకుండా ఉండలేరు. బాబా వచ్చారని ఆత్మకు తెలుసు. శివజయంతిని కూడా జరుపుకుంటారు, కానీ ఏమీ తెలియదు. శివబాబా వచ్చి చదివిస్తున్నారనేది ఏమీ తెలియదు. శివజయంతిని నామమాత్రముగా జరుపుకుంటారు. సెలవు కూడా ఇవ్వరు. ఎవరైతే వారసత్వాన్ని ఇచ్చారో, వారికి ఎటువంటి మహత్వాన్ని ఇవ్వడము లేదు కానీ ఎవరికైతే వారసత్వాన్ని ఇచ్చారో (శ్రీకృష్ణుడికి) వారి పేరును ప్రఖ్యాతము చేసారు. తండ్రి వచ్చి విశేషముగా భారత్ ను స్వర్గముగా తయారుచేసారు. మిగిలినవారందరికీ ముక్తినిస్తారు. అందరూ ముక్తిని కోరుకుంటారు కూడా. ముక్తి తర్వాత జీవన్ముక్తి లభిస్తుందని మీకు తెలుసు. తండ్రి వచ్చి మాయ బంధనాల నుండి విముక్తులుగా చేస్తారు. తండ్రిని సర్వుల సద్గతిదాత అని అంటారు. జీవన్ముక్తి అయితే నంబరువారు పురుషార్థానుసారముగా అందరికీ లభిస్తుంది. తండ్రి అంటారు, ఇది పతిత ప్రపంచము, దుఃఖధామము. సత్యయుగములో మీకు ఎంతటి సుఖము లభిస్తుంది. దానిని బహిష్త్ అని అంటారు. అల్లా బహిష్త్ ను ఎందుకు రచించారు? కేవలం ముసల్మానుల కోసమే రచించారా? తమ-తమ భాషల్లో కొంతమంది స్వర్గమని అంటారు, కొంతమంది బహిష్త్ అని అంటారు. హెవెన్ లో కేవలం భారత్ యే ఉంటుందని మీకు తెలుసు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో నంబరువారు పురుషార్థానుసారముగా కూర్చున్నాయి. నేను అల్లా యొక్క పుష్పాలతోటలోకి వెళ్ళాను అని ఒక ముస్లిమ్ కూడా అనేవారు. ఇటువంటి సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. ఇదంతా డ్రామాలో ముందు నుండే నిశ్చితమై ఉంది. డ్రామాలో ఏదైతే జరుగుతుందో, ఒక సెకెండు గడవడమైనా సరే, అది కల్పక్రితము కూడా జరిగిందని అంటారు. రేపు ఏమి జరగబోతుందో తెలియదు. డ్రామాపై నిశ్చయముండాలి, అప్పుడు ఏ విషయములోనూ చింత ఉండదు. మనకైతే బాబా ఆజ్ఞను ఇచ్చారు - నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు మీ వారసత్వాన్ని స్మృతి చేయండి. అందరూ అంతమవ్వాల్సిందే. అప్పుడు ఒకరి కోసం ఒకరు ఏడవలేరు కూడా. మృత్యువు వస్తుంది మరియు వెళ్ళిపోతారు, ఇక ఏడ్చేందుకు సమయము ఉండదు. శబ్దమే రాదు. ఈ రోజుల్లోనైతే మనుష్యులు బూడిదను తీసుకుని కూడా ఎంతగా తిరుగుతూ ఉంటారు. దాని పట్ల భావన ఉంటుంది. ఇదంతా సమయాన్ని వృధా చేసుకోవడము... దీనితో ఏమి ఉపయోగము ఉంది. మట్టి, మట్టిలో కలిసిపోతుంది. దీనితో భారత్ పవిత్రముగా అయిపోతుందా ఏమిటి? పతిత ప్రపంచములో ఏ కర్మ చేసినా, పతిత కర్మలే చేస్తారు. దాన-పుణ్యాలు మొదలైనవి కూడా చేస్తూ వచ్చారు కానీ భారత్ ఏమైనా పావనముగా అయ్యిందా? మెట్లు దిగవలసిందే. సత్యయుగములో సూర్యవంశీయులుగా అయ్యారు, తర్వాత మెట్లు దిగవలసి ఉంటుంది, నెమ్మది-నెమ్మదిగా పడిపోతారు. యజ్ఞ-తపాదులు మొదలైనవి ఎన్ని చేసినా కానీ మరుసటి జన్మలో అల్పకాలికమైన ఫలము లభిస్తుంది. ఎవరైనా చెడు కర్మలు చేస్తే వారికి దాని రిటర్న్ కూడా లభిస్తుంది. పిల్లలను చదివించేందుకు వచ్చాను అని అనంతమైన తండ్రికి తెలుసు. తనువు కూడా సాధారణమైనది తీసుకున్నారు. తిలకము మొదలైనవేవీ పెట్టే అవసరము లేదు. భక్తులైతే పెద్ద-పెద్ద తిలకాలను పెడతారు కానీ అక్కడ ఎంతగా మోసము చేస్తారు. బాబా అన్నారు, నేను సాధారణ తనువులోకి వస్తాను, వచ్చి పిల్లలను చదివిస్తాను. వానప్రస్థ అవస్థలో ఉన్నారు. శ్రీకృష్ణుని పేరు ఎందుకు వేసారు? ఇక్కడ జడ్జ్ చేసే (నిర్ణయించే) బుద్ధి కూడా లేదు. ఇప్పుడు బాబా రైట్-రాంగ్ లను జడ్జ్ చేసే బుద్ధిని ఇచ్చారు. తండ్రి అంటారు, మీరు యజ్ఞ-తపాదులను, దాన-పుణ్యాలను చేస్తూ, శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఆ శాస్త్రాలలో ఏమైనా ఉందా? మీకు రాజయోగాన్ని నేర్పించి, విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చింది నేనా లేక శ్రీకృష్ణుడా? జడ్జ్ చేయండి. బాబా, మీరే వినిపించారు అని అంటారు. శ్రీకృష్ణుడైతే చిన్న రాకుమారుడు, వారు ఎలా వినిపిస్తారు! బాబా, మీ రాజయోగము ద్వారానే మేము ఇలా తయారవుతాము అని అంటారు. తండ్రి అంటారు, శరీరముపై ఎటువంటి భరోసా లేదు, చాలా పురుషార్థము చేయాలి. ఫలానావారు చాలా మంచి నిశ్చయబుద్ధి కలవారని బాబాకు సమాచారాన్ని వినిపిస్తారు. నేను అంటాను - వారికి అస్సలు నిశ్చయము లేదు, ఎవరినైతే ఎంతో ప్రేమించామో వారు ఈ రోజు లేరు. బాబా అయితే అందరితోనూ ప్రేమగా వ్వవహరిస్తారు. నేను ఎటువంటి కర్మలు చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు. కొంతమందైతే వికారాలలోకి వెళ్ళి, మళ్ళీ దాగి వచ్చి కూర్చుంటారు. బాబా అయితే వెంటనే సందేశీకి తెలియజేస్తారు. ఇటువంటి కర్మలు చేసేవారు చాలా నాజూకుగా అయిపోతూ ఉంటారు, మున్ముందు నడవలేకపోతారు. అంతిమములోని నాజూకు సమయములో, ఎవరైనా ఏదైనా చేస్తే, ఒక్కసారిగా మార్షల్ లా ను (కఠినమైన నియమాలతో కూడిన సైనిక శాసనాన్ని) అమలు పరుస్తారు. బాబా ఏమేమి చేస్తారు అనేది మున్ముందు మీరు చాలా చూస్తారు. బాబా ఏమీ శిక్షలు ఇవ్వరు, ధర్మరాజు ద్వారా ఇప్పిస్తారు. జ్ఞానములో ప్రేరణ యొక్క విషయమేమీ ఉండదు. భగవంతుడినైతే మనుష్యులందరూ - ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని అంటారు. ఆత్మలందరూ ఇంద్రియాల ద్వారా పిలుస్తారు. తండ్రి జ్ఞాన సాగరుడు. వారి వద్ద చాలా వెరైటీ సామాగ్రి ఉంది. అటువంటి సామాగ్రి ఎవరి వద్ద లేదు. శ్రీకృష్ణుని మహిమ పూర్తిగా వేరు. తండ్రి శిక్షణతో వీరు (లక్ష్మీ-నారాయణలుగా) ఎలా తయారయ్యారు? తయారుచేసేవారైతే తండ్రి మాత్రమే. తండ్రి వచ్చి కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ మూడవ నేత్రము తెరుచుకుంది. ఇది 5 వేల సంవత్సరాల విషయమని మీకు తెలుసు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, పాత్రను అభినయించాలి. ఇది స్వదర్శన చక్రము కదా. మీ పేరు స్వదర్శన చక్రధారులు, బ్రాహ్మణ కుల భూషణులు, ప్రజాపిత బ్రహ్మా కుమార-కుమారీలు. లక్షలాది మంది స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు ఎంత జ్ఞానాన్ని చదువుకుంటారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. అచ్ఛా! ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఈ సమయము చాలా నాజూకు అయినది, అందుకే ఎటువంటి తప్పుడు కర్మలను చేయకూడదు. కర్మ-అకర్మ-వికర్మల గతిని ధ్యాసలో పెట్టుకుని సదా శ్రేష్ఠ కర్మలనే చేయాలి. 2. యోగము ద్వారా సదా కోసం తమ శరీరాన్ని నిరోగిగా చేసుకోవాలి. ఒక్క అత్యంత ప్రియమైన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి నుండి ఏదైతే అవినాశీ జ్ఞానమనే ధనము లభిస్తుందో, దానిని దానము చేయాలి. వరదానము:-సహనశీలతా గుణము ద్వారా కఠిన సంస్కారాలను కూడా శీతలముగా చేసే సంతుష్టమణి భవ ఎవరిలోనైతే సహనశీలతా గుణము ఉంటుందో, వారు ముఖము ద్వారా సదా సంతుష్టముగా కనిపిస్తారు. ఎవరైతే స్వయము సంతుష్టమూర్తులుగా ఉంటారో, వారు ఇతరులను కూడా సంతుష్టముగా చేస్తారు. సంతుష్టముగా అవ్వడము అనగా సఫలతను పొందడము. ఎవరైతే సహనశీలురుగా ఉంటారో, వారు తమ సహనశీలతా శక్తి ద్వారా కఠిన సంస్కారాలను మరియు కఠిన కార్యాలను శీతలముగా మరియు సహజముగా చేసుకుంటారు. వారి ముఖము గుణమూర్తిలా కనిపిస్తుంది. వారే డ్రామా అనే డాలుపై నిలవగలరు. స్లోగన్:-ఎవరైతే వాణి ద్వారా పరివర్తన అవ్వరో, వారిని శుభమైన వైబ్రేషన్ల ద్వారా పరివర్తన చేయవచ్చు.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ ఏ విధముగా బ్రహ్మాబాబా మాటలు ఫరిశ్తాల మాటల వలె, తక్కువగా మరియు మధురముగా ఉండేవో, అదే విధముగా యథార్థమైన మాటలు మాట్లాడండి. కార్యవ్యవహారాల కోసం మాట్లాడవలసి వస్తుంది కానీ వాటిని కూడా విస్తారము చేయకండి. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో ఫాలో ఫాదర్ చేయండి. ప్రతి మాటలో మధురత మరియు నమ్రతతో కూడిన మహానత ఉండాలి. దీని కోసం స్వయాన్ని నిమిత్తముగా భావిస్తూ ప్రతి కార్యము చేయండి, అప్పుడు మహానతతో పాటు నమ్రత వస్తుంది మరియు సఫలతామూర్తులుగా అవుతారు. "