*శివ/ విష్ణు పూజల లో శంఖధ్వని ప్రాముఖ్యత విధి*
*ధార్మిక విశేష మహాపూజలలో మన భారతీయులైన మనం శంఖధ్వని మోగిస్తూ దేవతల పూజలు ఆనందంగా చేస్తుంటాము ఈ శంఖధ్వని కథా విశేషం అవశ్యకత తెలుసుకుందాము*
****
శివ విష్ణు భక్తులు తెలుసుకోవాల్సిన ముఖ్యవిషయలు ఇవి****
*శంఖచూడ సంహార గాథ*
శంఖచూడుడు పూర్వజన్మలో శ్రీకృష్ణుని సేవకుడైన 'సుదాముడు'. ఒక శాపం వల్ల రాక్షసుడిగా జన్మిస్తాడు. అతను మహా విష్ణువు పట్ల భక్తి కలిగి ఉండి, తులసి (బృంద) అనే పతివ్రతను వివాహం చేసుకుంటాడు.
శంఖచూడుడు బ్రహ్మ దేవుని నుంచి అజేయమైన వరాన్ని పొందుతాడు. తన భార్య తులసి పాతివ్రత్యం కాపాడబడినంత కాలం అతనికి మరణం ఉండకూడదని.
తన బలంతో ఇంద్రాది దేవతలను ఓడించి లోకాలను పీడిస్తుంటాడు. దేవతల మొర ఆలకించిన శివుడు అతనితో యుద్ధానికి దిగుతాడు.
శంఖచూడుని అంతం చేయడానికి విష్ణువు మాయా రూపంలో వెళ్లి తులసి పాతివ్రత్యాన్ని భంగం చేస్తాడు. వెంటనే శివుడు తన త్రిశూలంతో శంఖచూడుని సంహరిస్తాడు.
శివశూలేన విద్ధః సన్ దేహం తత్యాజ దైత్యరాట్ |
తస్యాస్థిభిః సముద్భూతాః శంఖాః నానావిధాస్తథా ||
శివుని శూలం తగలగానే ఆ దైత్యరాజు దేహాన్ని విడిచాడు. అతని అస్థికల (ఎముకల) నుండి రకరకాల శంఖాలు ఉద్భవించాయి.
శంఖచూడుని అస్థికలు (ఎముకలు) సముద్రంలో పడి శంఖాలుగా మారాయి శంఖచూడుడు స్వతహాగా విష్ణు భక్తుడు కావడం వల్ల, అతని శరీరం నుండి వచ్చిన శంఖం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే శంఖాన్ని పూజా కార్యక్రమాలలో వాడుతారు.
ఇతర కాలం మరియు పురాణం ప్రకారం, క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా పుట్టింది. అందుకే శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరుడిగా, విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు.
శంఖం ఉన్నచోట లక్ష్మీదేవి నివసిస్తుందని, శంఖం నుండి వచ్చే ఓంకార నాదం ప్రతికూల శక్తులను నశింపజేస్తుందని నమ్మకం.
శంఖచూడాస్థిసంభూతః శంఖో దైత్యపతేః ఖలు |
తస్మాత్ తత్తోయమేవాత్ర శంభోః పూజాసు వర్జయేత్ ||
శంఖం అనేది దైత్య రాజైన 'శంఖచూడుని' అస్థికల (ఎముకల) నుండి సంభవించింది. కావున, ఆ శంఖంలోని నీటిని శంభుని (శివుని) పూజలలో *అభిషేకం* వర్జించాలి (నిషేధించాలి).
శంఖచూడ శరీరోత్థః శంఖో విష్ణుప్రియో భవేత్ |
అత ఏవ హి శంభోశ్చ పూజాయాం నైవ గృహ్యతే ||"
శంఖచూడుడి శరీరం నుండి పుట్టిన శంఖం శ్రీ విష్ణువు అంశతో పుట్టినవాడు కాబట్టి విష్ణువుకు ప్రియమైనదైంది. కానీ శివుని చేతిలో చనిపోయిన శత్రువు దేహ భాగం కాబట్టి, శివ పూజలో *అభిషేకానికి* దీనిని స్వీకరించరు.
శంఖచూడుడు చనిపోయిన తర్వాత, తులసి విష్ణువును శపిస్తుంది. అప్పుడు శ్రీమహా విష్ణువు ఆమెను అనుగ్రహించి, ఆమెను తులసి మొక్కగా, ఆమె భర్త దేహాన్ని శంఖంగా మారుస్తాడు.
"శంఖస్తు తవ దేహోఽయం మమ ప్రీతికరః సదా |
శంఖశబ్దేన తుష్యామి తవ రూపేణ పార్వతీ ||"
శ్రీ మహా విష్ణువు తులసితో అన్న మాట నీ భర్త దేహం శంఖంగా మారి నాకు ఎప్పుడూ ప్రీతికరంగా ఉంటుంది. శంఖ శబ్దం వినిపిస్తే నేను ఎంతో సంతోషిస్తాను.
***************************************
*శివ/ విష్ణు పూజలో శంఖ ధ్వని ప్రాముఖ్యతన*
"శంఖధ్వనిం వినా యస్తు పూజయేచ్ఛంకరమ్ విభుమ్ |
తస్య పూజాం న గృహ్ణాతి శంకరః పర్వతీపతిః ||"
శంఖ ధ్వని లేకుండా చేసే శివపూజను ఆ పార్వతీపతి అయిన శంకరుడు స్వీకరించడు (అంటే శంఖ ధ్వని పూజలో అంతర్భాగం మరియు అత్యంత ప్రశస్తమైనది అని అర్థం).
శివుని ముందు శంఖం ఊదడం వల్ల కలిగే పుణ్యాన్ని శివపురాణ అంతర్గత వచనాలు ఇలా వివరిస్తాయి:
"శంఖధ్వనిం ప్రకుర్వీత శంభోరగ్రే విశేషతః |
యస్య నాదేన సంతుష్టో భవత్యేవ మహేశ్వరః ||"
పరమేశ్వరుని ఎదుట విశేషంగా శంఖధ్వని చేయాలి. ఆ శంఖ నాదానికి మహేశ్వరుడు అత్యంత సంతుష్టుడవుతాడు.
శంఖం నుండి వెలువడే శబ్దం ఓంకార నాదానికి ప్రతీక.
"శంఖనాదేన సర్వాణి పాపాని విలయం యయుః |
దేవానాం ప్రీతిజనకం విష్ణోః లక్ష్మ్యాశ్చ ధారణమ్ ||"
శంఖ నాదం వినబడగానే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇది దేవతలకు ప్రీతిని కలిగిస్తుంది మరియు లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
విష్ణోః పూజాసు సర్వాసు శంఖశబ్దః ప్రశస్యతే |
తథైవ శంకరస్యాని దేవ్యాశ్చాపి విశేషతః ||"
శ్రీమహావిష్ణువు యొక్క అన్ని రకాల పూజలలో శంఖధ్వని ప్రశస్తమైనది. అలాగే శంకరునికి (శివుడు) మరియు దేవీ ఆరాధనలో కూడా శంఖనాదం విశేష ఫలితాన్ని ఇస్తుంది.
శంఖధ్వనిః శివప్రీతో నాదబ్రహ్మమయో యతః |
తస్మాత్ సర్వప్రయత్నేన శివపూజాసు వాదయేత్ ||"
శంఖధ్వని నాదబ్రహ్మ స్వరూపం కాబట్టి, అది శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే శివపూజలో అన్ని ప్రయత్నాలతో (తప్పనిసరిగా) శంఖాన్ని ఊదాలి.
శంఖదుందుభిఘోషైశ్చ మృదంగపణవైస్తథా |
తుష్యతి ప్రాణినాం నాథో శంఖనాదేన విశేషతః ||"
దుందుభులు, మృదంగాలు వంటి అనేక వాయిద్య ఘోషల కన్నా, శంఖనాదం వల్ల ప్రాణినాథుడైన ఆ పరమశివుడు విశేషంగా సంతోషిస్తాడు.
"యః కరోతి హరస్యాగ్రే శంఖనాదం ముహుర్ముహుః|
తస్య పాపాని నశ్యంతి శివలోకం స గచ్ఛతి ||"
ఎవరైతే హరుని (శివుని) ముందు మాటిమాటికీ శంఖనాదం చేస్తారో, వారి పాపాలన్నీ నశించి, వారు శివలోకాన్ని పొందుతారు.
వామావర్తేన శంఖేన యః కుర్యాత్ మంగళధ్వనిమ్|
తస్య గేహే వసేత్ లక్ష్మీః శివశ్చ కృపయా సహ ||"
ఎవరైతే వామవర్త శంఖం (ఎడమ వైపుకు తిరిగి ఉండేది) ద్వారా మంగళకరమైన ధ్వనిని చేస్తారో, వారి ఇంట్లో లక్ష్మీదేవి మరియు శివుని కృప ఎల్లప్పుడూ ఉంటాయి.
వామావర్త సముద్భూతః ప్రణవధ్వని రూపకః |
యస్య శబ్దేన సంతుష్టాః సర్వే దేవాః సవాసవాః ||"
వామవర్త శంఖం నుండి పుట్టిన ధ్వని ఓంకారానికి ప్రతిరూపం. ఆ శబ్దానికి ఇంద్రునితో సహా దేవతలందరూ సంతుష్టులవుతారు.
వామావర్తస్తు యః శంఖః పూజితో విజయప్రదః |
ధ్వనినా తస్య నశ్యంతి భూతప్రేతపిశాచకాః ||"
వామవర్త శంఖాన్ని పూజించడం వల్ల విజయం కలుగుతుంది. ఆ శంఖం నుండి వెలువడే ధ్వని వల్ల భూత, ప్రేత, పిశాచాది దుష్ట శక్తులు నశిస్తాయి.
వామావర్తేన శంఖేన పూజయేత్ పరమేశ్వరమ్ |
తస్య గృహే సదా తిష్ఠేత్ సర్వసిద్ధిర్న సంశయః ||"
వామవర్త శంఖంతో (నాదం చేస్తూ) పరమేశ్వరుని పూజించే వారి ఇంట్లో సర్వ సిద్ధులు నిలిచి ఉంటాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు.
****************************************
*సమస్త తీర్థాల నిలయం దక్షిణావర్త శంఖం*
"శంఖే తు సర్వతీర్థాని వసంతి పృథివీతలే |
దర్శనేన హి శంఖస్య సర్వపాపం ప్రణశ్యతి ||"
భూమండలంలోని సర్వ తీర్థాలు శంఖంలో నివసిస్తాయి. అటువంటి శంఖాన్ని దర్శించుకోవడం వల్లనే సర్వ పాపాలు నశిస్తాయి.
శంఖే తు సర్వతీర్థాని వసంతి పృథివీతలే |
గంగాద్యాః సరితః సర్వాః తిష్ఠంతి పరమాజ్ఞయా ||"
భూమండలంలో ఉన్న సమస్త పుణ్య తీర్థాలు శంఖంలో నివసిస్తాయి. పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం గంగ మొదలైన పుణ్య నదులన్నీ శంఖంలోనే కొలువై ఉంటాయి.
"గంగా స్నాన ఫలం తస్య యస్య శంఖే స్థితం జలమ్ |
నిత్యం యః పిబతే మర్త్యో ముక్తిస్తస్య న సంశయః ||"
ఎవరైతే శంఖంలో ఉంచిన నీటిని తాగుతారో లేదా శిరస్సుపై ప్రోక్షించుకుంటారో, వారికి గంగానదిలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. అట్టి వారు ముక్తిని పొందుతారు.
"శంఖశబ్దో భవేద్యత్ర తత్ర లక్ష్మీః స్థిరా భవేత్ |
అశుభం చ వినశ్యేత శుభం భవతి సర్వదా ||"
ఎక్కడైతే శంఖ శబ్దం వినిపిస్తుందో, అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అశుభాలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ శుభమే జరుగుతుంది.
శంఖు పూజ చేసేటప్పుడు చదువుకోవలసిన
****************************************
*శంఖం లో ఉండే దేవతలు*
శంఖం చుంద్రార్క దైవత్యం మధ్యే వరుణ దేవతామ్|
పృష్టే ప్రజాపతిం విద్యాత్ అగ్రే గంగా సరస్వతీమ్ ||"
శంఖము యొక్క పై భాగంలో చంద్ర సూర్యులు, మధ్య భాగంలో వరుణ దేవుడు, వెనుక భాగంలో ప్రజాపతి (బ్రహ్మ), ముందు భాగంలో గంగా యమునా సరస్వతి నదులు ఉన్నాయని భావించి పూజించాలి.
ఈ విధంగా శంఖం కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, సాక్షాత్తూ దేవతా స్వరూపం అని శివపురాణం మరియు ఇతర పురాణాలు ప్రబోధిస్తున్నాయి.
*ఏ దేవతలకు నిషేధం*
న శంఖేనార్చయేత్ సూర్యం తథా నాగ్నిం కదాచన |
శంఖేన భాస్కరం దృష్ట్వా హ్యంధః సప్తసు జన్మసు ||"
సూర్యునిని గానీ, అగ్నిని గానీ ఎప్పుడూ శంఖంతో పూజించకూడదు (అభిషేకం లేదా నీటిని చల్లడం). శంఖం ద్వారా సూర్యుని ఆరాధించినట్లయితే, అటువంటి వారు ఏడు జన్మల పాటు అంధత్వాన్ని పొందుతారని హెచ్చరించబడింది.
*గణేష్ సుబ్రమణ్య రామ హనుమ మరియు లక్ష్మీ దుర్గా కాళీ లలితా అమ్మవారి దేవతలకు వాడుక ఉన్నది*
****************************************
శివపూజ లోన్ఎన్ని మార్లు శంఖధ్వని చేయాలి?
"వారత్రయం ప్రకుర్వీత శంఖనాదం సుమంగళమ్ |
సర్వవిఘ్నవినాశార్థం శివప్రీత్యర్థమేవ చ ||"
సర్వ విఘ్నాలు తొలగిపోవడానికి, శివుని ప్రీతి కోసం మూడు సార్లు (వారత్రయం) మంగళకరమైన శంఖనాదాన్ని చేయాలి.
ప్రథమం దేవతా ప్రీత్యై ద్వితీయం రక్షసాం భయమ్ |
తృతీయం మోక్షదాతారం శంఖం కుర్యాత్ విచక్షణః ||"
మొదటి నాదం దేవతల ప్రీతి కోసం (ఆవాహన), రెండవది రాక్షసులకు భయం కలిగించి పారద్రోలడానికి, మూడవది మోక్షాన్ని ప్రసాదించడానికి చేయాలి.
"ఓంకార పూర్వకం శంఖం త్రివారం చ ప్రపూరయేత్ |
బ్రహ్మ విష్ణు మహేశానాం ప్రీత్యర్థం చ శుభావహమ్ ||"
*మొదటి సారి: సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్మరిస్తూ, రజోగుణాన్ని నియంత్రించడానికి.
*రెండవ సారి: స్థితికారుడైన శ్రీమహావిష్ణువును స్మరిస్తూ, సత్వగుణాన్ని పెంపొందించుకోవడానికి.
*మూడవ సారి: లయకారుడైన పరమశివుని స్మరిస్తూ, తమోగుణాన్ని (అజ్ఞానాన్ని) పోగొట్టుకోవడానికి.
******
*శంఖం ఊదే క్రమం*???
"మృదుః ప్రథమ శబ్దః స్యాత్ మధ్యమస్తు ద్వితీయకః |
దీర్ఘస్తృతీయ శబ్దః స్యాత్ ఏవం శంఖస్య లక్షణమ్ ||"
*ప్రథమ శబ్దః (మృదువుగా): మొదటిసారి ఊదినప్పుడు శబ్దం మృదువుగా ఉండాలి.
*ద్వితీయకః (మధ్యస్థంగా): రెండవసారి ఊదినప్పుడు కొంచెం గంభీరంగా ఉండాలి.
*తృతీయ శబ్దః (దీర్ఘంగా): మూడవసారి మాత్రం శ్వాస ఉన్నంతవరకు చాలా దీర్ఘంగా, ఓంకార నాదం వినిపించేలా ఊదాలి.
******
పూజలలో ఎప్పుడు శంఖధ్వని చేయాలి?
స్నానకాలే తు సంప్రాప్తే శంఖధ్వని మతఃపరమ్ |
కుర్యాత్ సర్వ ప్రయత్నేన దేవానాం తోషణాయ చ ||"
ధూపే దీపే చ నైవేద్యే శంఖనాదం సమాచరేత్ |
తద్దోష పరిహారార్థం రాక్షసానాం వినాశనే ||"
నైవేద్యకాలే శంఖస్య ధ్వనిః కార్యః ప్రయత్నతః |
తేన ప్రీతో భవేద్విష్ణుః సకలాన్ కామాన్ ప్రయచ్ఛతి ||"
*పూజారంభంలో: దేవతలను ఆహ్వానించేటప్పుడు.
*అభిషేక సమయంలో: రుద్రాభిషేకం జరుగుతున్నప్పుడు మంగళకరంగా ఊదాలి.
*నైవేద్య సమర్పణలో: భగవంతునికి ఆహారాన్ని నివేదించేటప్పుడు.
*నీరాజనం (హారతి): ధూప, దీప, నీరాజన సమయాల్లో శంఖధ్వని తప్పనిసరి.
త్వచ్ఛబ్ద శ్రవణాదేవ భూతప్రేత పిశాచాద్యాః |
పలాయంతే భయాభీతాః శంఖనాదో జయతు తే ||"
నీ శబ్దాన్ని విన్నంత మాత్రాన భూత ప్రేత పిశాచాదులు భయంతో పారిపోతాయి. ఓ శంఖమా! నీ నాదానికి జయము కలుగుగాక.
****************************************
*శంఖం రకాలు (వామవర్త - దక్షిణవర్త)
పూజలలో రెండు రకాల శంఖాలు కనిపిస్తాయి
1 దక్షిణవర్త శంఖం
ఇది లక్ష్మీ స్వరూపం, దీనిని అభిషేకానికి, పూజ గదిలో ఉంచడానికి ఉపయోగిస్తారు (దీనిని ఊదకూడదు).
2 వామవర్త శంఖం
దీనిని ధ్వని చేయడానికి (ఊదడానికి) ఉపయోగిస్తారు.
****************************************
****శుభమైన శంఖం లక్షణాలు***
"శ్వేతః శంఖో భవేత్ పుణ్యః సర్వపాపప్రణాశనః |
జయదశ్చైవ విజేతవ్యం దేవతాప్రీతిదాయకః ||"
తెల్లగా ఉండే శంఖం అత్యంత పుణ్యప్రదమైనది మరియు సర్వ పాపాలను నశింపజేస్తుంది. ఇది విజయాన్ని ఇస్తుంది మరియు దేవతలకు ప్రీతిని కలిగిస్తుంది.
శంఖం ఎలా ఉండాలంటే????
"సుస్నిగ్ధం నిర్మలం శుభ్రం గంభీరధ్వని సంయుతమ్|
అచ్ఛిద్రం చావిరూపం చ శంఖం శ్రేష్ఠతమం విదుః ||"
*సుస్నిగ్ధం: నునుపుగా ఉండాలి.
*నిర్మలం/శుభ్రం: మచ్చలు లేకుండా తెల్లగా ఉండాలి.
*గంభీరధ్వని: ఊదినప్పుడు ధ్వని గంభీరంగా (బిగ్గరగా) ఉండాలి.
*అచ్ఛిద్రం: ఎక్కడా రంధ్రాలు ఉండకూడదు.
అవిరూపం: వికృతమైన ఆకారం ఉండకూడదు.
*వాడిన ప్రతిసారి నీటి తో కడిగి పవిత్రంగా ఉంచాలి*
****************************************
*అశుభ లక్షణ శంఖాలు (నిషిద్ధం)*
"విస్వరః కఠినః శూన్యః సఛిద్రో మలినస్తథా |
త్యాజ్యః శంఖో బుధైర్నిత్యం అశుభః పరికీర్తితః ||"
*శబ్దం సరిగ్గా రానిది (విస్వరః),
*కఠినంగా ఉన్నది లేదా గరుకుగా ఉన్నది,
*రంధ్రాలు ఉన్నది (సఛిద్రః),
*మురికిగా, నల్లగా ఉన్న శంఖాలను విద్వాంసులు త్యజించాలి. ఇవి అశుభప్రదమైనవి.
*వికృత ఆకారాలు కలిగి ఉన్నవి పూజలకు పనికి రావు*
****************************************
****శంఖ ధ్వని ప్రార్థన****
ఓం
"త్వం పురా సాగరోత్పన్నః విష్ణునా విధృతః కరే |
నమితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోఽస్తు తే ||"
ఓ శంఖమా! నీవు పూర్వం సముద్రము నుండి జన్మించావు, విష్ణుమూర్తి చేత ధరించబడ్డావు. సర్వ దేవతలచే నమస్కరించబడిన ఓ పాంచజన్యమా! నీకు నమస్కారం.
****************************************
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏
#🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #హర హర మహాదేవ శంభో శంకర #🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #hara hara mahadeva


