అంబోతు అంబటికి చుక్కలు..
అరాచకానికి పరాకాష్ట, రాజమండ్రి జైలుకు పయనం!
- నోటి దురుసుకి బేడీలు.. 14 రోజుల రిమాండ్!
- 16 కేసులు.. 14 రోజుల రిమాండ్
- అంబటి పాపం పండింది!
- వైసీపీ నేర సంస్కృతిపై చట్టం పంజా..
- అంబటి అరాచక పర్వానికి తెర!
-'మనచంద్రబాబు' సోషల్ మీడియా విభాగం ప్రతినిధి కుర్రా సురేష్ బాబు
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా నోటికి అదుపు లేకుండా, అరాచకమే తన సంస్కృతిగా బతికిన వైసీపీ నేత అంబటి రాంబాబు అలియాస్ 'అంబోతు అంబటి'కి ఎట్టకేలకు కాలం చెల్లింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషణలు చేస్తూ, తన స్థాయిని మరిచి ప్రవర్తించిన ఈ మాజీ మంత్రికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది.
పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టు చూస్తుంటే అంబటి అసలు రంగు బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఈయనపై ఏకంగా 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయంటే, ఈయన రాజకీయ నేతనా లేక నేర చరిత్ర ఉన్న వ్యక్తినా అనే అనుమానం కలగక మానదు. పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సమాజంలో ఉద్రిక్తతలు పెంచి, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడమే లక్ష్యంగా అంబటి రాజకీయాలు సాగించారని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.
ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి వాడిన పదజాలం నాగరిక సమాజం తలదించుకునేలా ఉందని నల్లపాడు పోలీసులు రిపోర్టులో స్పష్టంగా ప్రస్తావించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజలను రెచ్చగొట్టేలా ఈయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అశాంతిని నింపాయి. కేవలం తన రాజకీయ ఉనికి కోసం వ్యవస్థలను కించపరుస్తూ, రాష్ట్ర ప్రతిష్టను గంగలో కలిపే ప్రయత్నం అంబటి చేశారన్నది బహిరంగ రహస్యం.
అంబటిని బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, శాంతిభద్రతల దృష్ట్యా ఇతనిని కస్టడీలోకి తీసుకోవడం అత్యవసరమని పోలీసులు బలంగా వాదించారు. అంతేకాకుండా, ఇతని నోటి దురుసు వల్ల బయట ఉంటే ఇతని ప్రాణాలకే ముప్పు ఉందని, రిమాండ్ విధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఇంతటి అరాచకానికి ఒడిగట్టడం వైసీపీ నేతలకే చెల్లింది.
ఈ పరిణామాలపై 'మనచంద్రబాబు' సోషల్ మీడియా విభాగం ప్రతినిధి కుర్రా సురేష్ బాబు ఘాటుగా స్పందించారు. "వైసీపీ అరాచకానికి ఇది పరాకాష్ట. అంబటి లాంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిపై కాకుండా, మొత్తం వ్యవస్థపై దాడి లాంటివి. ఇలాంటి వారిపై ఉన్న అన్ని కేసులు క్షుణ్ణంగా విచారించి, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడేలా చూడాలి. అప్పుడే రాష్ట్రంలో శాంతి నెలకొంటుంది, ఇలాంటి అంబోతులకు బుద్ధి వస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని గంటలు వాదించినా న్యాయం వైపే తీర్పు నిలిచింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అంబటిని భారీ భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డూఅదుపు లేకుండా ప్రవర్తించిన ప్రతి వైసీపీ నేతకు ఇదొక హెచ్చరిక. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు తలవంచక తప్పదు. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు


