గిద్దలూరు, నంద్యాల రైల్వే టన్నెల్ పూర్తి
రైల్వే శాఖ చేపట్టిన గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది.
గాజులపల్లి-చెలుమ గ్రామాల మధ్య నిర్మిస్తున్న 320 మీటర్ల పొడవైన సొరంగ మార్గం (టన్నెల్) పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. సోమవారం ఈ సొరంగం చివరి అడ్డంకిని తొలగించి విజయవంతంగా అనుసంధానం చేశారు. పనులు పూర్తి కావడంతో రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
రవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఇది ఒక భారీ మైలురాయిగా నిలవనుంది. #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
ఏ నియోజకవర్గం బ్రో ఇతనీది ఇంతా టాలెంట్ గా ఉన్నాడు... #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో కన్నీరు పెట్టుకున్న బిఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు.
చేసిన పాపం ఊరికే పోతుందా #దయాకర్_రావు_ఎర్రబెల్లి
తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు పొలిట్ బ్యూరో మెంబర్, తెలంగాణ టిడిపి లో రెండో స్థానం..
తెలుగుదేశం పార్టీ లో ఉంటూ తెరాసకు పార్టీ అంతర్గత విషయాలను చేరవేశావ్, నేడు రాజకీయ ఓనమాలు తెలియని 25 ఏళ్ళ యువతి చేతిలో ఘోర ఓటమి.. #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
మైనార్టీలకు నిండు భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వం. మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం 2025-26లో మైనార్టీ సంక్షేమానికి రూ.3,766 కోట్లు ఖర్చు చేసింది. తాజాగా 2026-27 బడ్జెట్లో రూ.6,090 కోట్లు కేటాయించింది. వక్ఫ్ బోర్డును పునరుద్ధరించింది. ఇమామ్ లకు రూ.10,000లు, మౌజంలకు రూ.5,000లు గౌరవ వేతనంగా ఇస్తోంది.
#SwarnaAndhraBudget2026
#IdhiManchiPrabhutvam
#🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్
🔱
*58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం*
*రూ.150 కోట్లతో అభివృద్ధి.. మార్చి 16న ఆవిష్కరణ*
*శరవేగంగా పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణం*
*రాజధానిలోని శాఖమూరు వద్ద 6.8 ఎకరాలలో*
రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం
నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన
ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు శాఖమూరు వద్ద *'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్'* పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. పొట్టిశ్రీరాములు 125వ జయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా వచ్చేనెల 16న దీన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం రూపుదిద్దుకుంటోంది. మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని, డిసెంబరు 15న ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర కార్యక్రమాలుగా ప్రకటించింది.
*ట్రస్టు ఆధ్వర్యంలో పనులు*
పొట్టిశ్రీరాములు విగ్రహం, స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం రాజధానిలో 6.8 ఎకరాల భూమి కేటాయించింది.
ఈ ప్రాజెక్టుకు రూ.150 కోట్లు వ్యయమవుతుండగా.. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ భరిస్తోంది. ఇ-9, ఎన్-15 రహదారుల పక్కన పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించే ఈ విగ్రహ నిర్మాణానికి మంత్రి లోకేశ్ 2025 సెప్టెంబరు 3న శంకుస్థాపన చేశారు. అక్టోబరులో పనులు ప్రారంభించారు.
కృష్ణా జిల్లా బొమ్ములూరుకు చెందిన కళాకారులు అక్కడే విగ్రహ భాగాలకు ఆకృతినిస్తూ, దశల వారీగా రాజధానికి తరలిస్తున్నారు. ఇప్పటికే రెండు భాగాలు చేరుకున్నాయి.
రెండంతస్తుల వేదికపై విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. వేదిక, విగ్రహం కలిపి మొత్తం ఎత్తు 110 అడుగులు.
వేదిక నిర్మిత ప్రాంతం 17 వేల చదరపు అడుగులు.
గ్రౌండ్ ఫ్లోర్లో 100 మంది కూర్చునేలా మినీ థియేటర్, మ్యూజియం, లైబ్రరీ ఉంటాయి.
మినీ థియేటర్ లో పొట్టిశ్రీరాములు జీవిత విశేషాలతో కూడిన 15 నిమిషాల వీడియోను సందర్శకులకు ప్రదర్శిస్తారు.
ఆయన వాడిన వస్తువులు, ప్రముఖులకు రాసిన లేఖలను మ్యూజియంలో ఉంచుతారు.
మొదటి అంతస్తులో ధ్యాన మందిరం ఉంటుంది.
9 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అక్కడ ఆసీనులైన భంగిమలో నిర్మిస్తున్నారు.
ధ్యానమందిరంపై కమలం ఆకారంలో పీఠం నిర్మించి, దానిపై విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పైనుంచి చూస్తే కమలం మధ్యలో మనిషి నిలబడ్డట్టుగా కనిపిస్తుంది.
ఎనిమిది కమలం రేకులు (పెటల్స్) అమరుస్తున్నారు. ఒక్కో రేకు ఎత్తు 22.50 అడుగులు. వాటిని ముంబయిలో తయారు చేయించారు.
మొత్తం బరువు 100 టన్నులు కాగా, విగ్రహాన్ని 30 టన్నుల కంచుతో తయారు చేస్తున్నారు. పీఠంపై విగ్రహాన్ని నిలబెట్టేందుకు లోపల 70 టన్నుల బరువైన ఇనుప గడ్డర్లు వాడుతున్నారు.
మొదటి దశలో భాగంగా మార్చి 16 నాటికి రెండంతస్తుల వేదిక, విగ్రహం సిద్ధం చేసి, విగ్రహావిష్కరణ చేస్తారు.
రెండో దశలో మరో 2,000 సీటింగ్ సామర్థ్యంతో ఆడిటోరియం, పార్క్ అభివృద్ధి చేస్తారు. దీనికి ఏడాది సమయం పడుతుంది.
*ఏటా వెయ్యి మందికి సహాయం*
పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేవలం ఆయన విగ్రహ ఏర్పాటు, నిర్వహణకే పరిమితం కాకుండా..
పలు సేవా కార్యక్రమాలూ నిర్వహిస్తుందని మేనేజింగ్ ట్రస్టీ డూండీ రాకేశ్ తెలిపారు. ప్రాథమికంగా ప్రతి సంవత్సరం వెయ్యి మందికి విద్య, వైద్య సహాయం, పేదరికంలో ఉన్నవారికి చేయూత వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఆ సంఖ్య పెంచుతామన్నారు.
20 కోర్సులతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పి, పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని, భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు జీఎంఆర్ సంస్థ ఆసక్తిగా ఉందని రాకేశ్ పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పేదలకు ట్రస్ట్ తరపున సాయమందిస్తామని, పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని నందనవనంలా తీర్చిదిద్దుతామని తెలిపారు..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
#వివేకానంద_కాలనీలో_తాగునీటి_సమస్య
#ఎమ్మెల్యే_అశోక్_రెడ్డి_గారికి_కాలనీవాసుల_ఫిర్యాదు
24 గంటల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణ శివారులోని వివేకానంద కాలనీలో గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్యతో నీటి కోసం కాలనీ వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్ళి నీరు తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని,దీనితో కాలనీవాసులు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు గిద్దలూరు మండల (MPDO) కార్యాలయంకు వచ్చారని తెలుసుకొని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్లి తాగునీటి సమస్య గురించి వివరించారు. దీంతో ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు తక్షణమే స్పందించి మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ లో సమస్యను తెలియచేసి, 24 గంటల్లో వివేకానంద కాలనీలో నీటి సమస్యను పరిష్కరించి తిరిగి తనకు ఫోన్ చేసి విషయం చెప్పాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ఇన్ని రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
#IdhiManchiPrabhutvam
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#MuthumulaAshokReddy
#ThankyouMlaMuthumulaAshokReddySir
#మనగిద్దలూరుమనముత్తుముల #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
నైస్... గుడ్... గ్రేట్-రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై గేట్స్ ప్రశంసలు
#బిల్_గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్
• గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.
• గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ... భవిష్యత్ ప్రణాళికలపై చర్చించకునేలా బిల్ గేట్స్ పర్యటన జరిగింది.
• గేట్స్ పై ఉన్న అపారగౌరవంతో నారా లోకేష్ సహా నలుగురు మంత్రులను గన్నవరం విమానాశ్రయానికి పంపి స్వాగతం పలికారు.
• సచివాలయంలో మొదటి బ్లాకులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ కు ఆత్మీయ స్వాగతం పలికారు.
• మొదటి బ్లాక్ వద్ద తనకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబును చూడగానే కారు దిగుతూనే హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ.. అంటూ గేట్స్ ముఖ్యమంత్రిని అప్యాయంగా పలకరించారు.
• ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సహా ఇతర కెబినెట్ మంత్రులను బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు పేరు పేరునా పరిచయం చేశారు.
• బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా తన ఛాంబర్లోకి వచ్చిన బిల్ గేట్స్ కు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు చిత్రపటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించారు.
• శ్రీవారి ప్రాసస్త్యాన్ని.. తిరుమల క్షేత్రం గొప్పదనాన్ని బిల్ గేట్స్ కు సీఎం వివరించారు.
• గేట్స్ ఫౌండేషన్ బృందంతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అనంతరం ఆర్టీజీ సెంటర్ కు గేట్స్ ను తీసుకెళ్లిన ముఖ్యమంత్రి.. ఆ విభాగం పనితీరును వివరించారు.
• పాలనా వ్యవహరాల్లో, విపత్తుల్లో, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విషయంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకుంటున్నామనే అంశాన్ని ఉదాహరణలతో సహా ముఖ్యమంత్రి వివరించారు.
• గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కుప్పంలో చేపట్టిన సంజీవని ప్రాజెక్టు ప్రోగ్రస్ ను ముఖ్యమంత్రి వివరించగా... దట్స్ నైస్ అంటూ మెచ్చుకున్నారు.
• ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం గురించి గ్రేట్ అంటూ గేట్స్ అభినందించారు.
• డేటా లేక్, వాట్సాప్ గవర్నన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడాన్ని అభినందించారు.
• వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్కువ ధరకే అందించగలిగితే... పేద వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడిన గేట్స్
• అమరావతి రాజధాని ప్రణాళికలను.. బ్లూ-గ్రీన్ కాన్సెప్టును, అత్యాధునిక పద్దతుల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న విధానాన్ని తెలుసుకున్న బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ అంటూ రాజధాని మాస్టర్ ప్లాన్ ను మెచ్చుకున్నారు.
• భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎటువంటి వ్రణాళికలతో రాజధాని నిర్మిస్తున్నామనే విషయాన్ని సీఎం చంద్రబాబు వివరించారు.
• రాజధాని ప్రాంతంలో మొత్తంగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించే దిశగా... ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టు గేట్స్ కు సీఎం చెప్పారు.
• అనంతరం మంత్రులు, సెక్రటరీల సమావేశానికి గేట్స్ ను తీసుకు వచ్చిన చంద్రబాబు... ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు, లక్ష్యాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
• ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ హైదరాబాద్ కు రావడానికి దారి తీసిన పరిస్థితులపై కొద్దిసేపు చర్చ జరిగింది.
• ముఖ్యమంత్రితోపాటు.. గేట్స్ కూడా నాటి ఢిల్లీ సమావేశం... సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు, అమెరికా వెలుపల తొలి డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు కావడం గురించి సమావేశంలో ఉన్న మంత్రులు, సెక్రటరీలకు వివరించారు.
• తొలి మీటింగ్ లోనే చంద్రబాబు విజనరీ ఆలోచనలను తాను గమనించానని బిల్ గేట్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
• మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు బిల్ గేట్స్ ను వివిధ అంశాలపై ప్రశ్నల ద్వారా బిల్ గేట్స్ అభిప్రాయాలు తెలుసుకున్నారు.
• అక్కడి నుంచి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన బిల్ గేట్స్ బృందం సాగులో టెక్నాలజీ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి... ప్రశంసించారు.
• ప్రకృతి సాగు గురించి రైతులు అధికారులతో చర్చించిన బిల్ గేట్స్... ఆ పంట ఉత్పత్తులను పరిశీలించారు.
• చీడపీడలకు సంబంధించే వివరాలు అందించే AP-AIMS (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం) మొబైల్ యాప్ పనితీరును బిల్ గేట్స్ పరిశీలించారు.
• రైతు ఫోన్ ద్వారా ఈ యాప్ ను ఉపయోగించి పంటకు వచ్చిన తెగులును గుర్తించడమే కాకుండా... డ్రోన్ ద్వారా మందుల పిచికారి చేసే విధానాన్ని కూడా గేట్స్ పరిశీలించారు.
• వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన బిల్ గేట్స్ కు రైతులు స్థానిక వంటకాలను రుచి చూపించారు. #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
#శ్రీ_రామలింగేశ్వర_స్వామిని_దర్శించుకున్న_ఎమ్మెల్యేలు
#మార్కాపురంజిల్లా : #అర్థవీడు మండలం #యాచవరం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని #గిద్దలూరు ఎమ్మెల్యే గౌ శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు, #మార్కాపురం ఎమ్మెల్యే గౌ శ్రీ #కందుల_నారాయణరెడ్డి గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, గ్రామ ప్రజలు ఎమ్మెల్యేలను సంప్రదాయబద్ధంగా స్వాగతించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రార్థించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈసందర్బంగా గ్రామస్థులు ఇరువురి ఎమ్మెల్యేలను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు
ఈకార్యక్రమంలో స్థానిక మండల , గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
*ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమానికి పచ్చ జెండా ఊపిన ఎమ్మెల్యే ముత్తుముల*
*మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని పచ్చ జెండా ఊపి ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు*.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని తెలిపారు. మన గిద్దలూరు మండలానికి 35 రిక్షాలు, గ్రీన్ అంబాసిడరెస్ అయిన మీరు మీకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరూ 250 గృహాల నుండి చెత్త సేకరించి పరిశుభ్రం గా ఉంచడంలో మీది ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కావున గ్రామాలు, పట్టణాలు శుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీతో చెత్త సేకరణ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని కూటమి ప్రభుత్వం అభివృద్ధి లో ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.*
*ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, సిబ్బంది మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు* #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు ఈసందర్భంగా దేవాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ సభ్యులు, మండల, పట్టణ నాయకులు భక్తులు ఘన స్వాగతం పలికి శాలువా పూల మాలతో ఘనంగా సన్మానించారు
అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభిస్తూ, గ్రామీణ క్రీడలు మరియు సంప్రదాయాలను పరిరక్షించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు యువత ఇలాంటి సాంప్రదాయ క్రీడల్లో పాల్గొని గ్రామ సంస్కృతిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.పోటీలు ఉత్సాహభరితంగా సాగుతూ ప్రేక్షకులను అలరించాయి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, మండల , పట్టణ నాయకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు










