🔱
*58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం*
*రూ.150 కోట్లతో అభివృద్ధి.. మార్చి 16న ఆవిష్కరణ*
*శరవేగంగా పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణం*
*రాజధానిలోని శాఖమూరు వద్ద 6.8 ఎకరాలలో*
రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం
నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన
ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు శాఖమూరు వద్ద *'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్'* పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. పొట్టిశ్రీరాములు 125వ జయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా వచ్చేనెల 16న దీన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం రూపుదిద్దుకుంటోంది. మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని, డిసెంబరు 15న ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర కార్యక్రమాలుగా ప్రకటించింది.
*ట్రస్టు ఆధ్వర్యంలో పనులు*
పొట్టిశ్రీరాములు విగ్రహం, స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం రాజధానిలో 6.8 ఎకరాల భూమి కేటాయించింది.
ఈ ప్రాజెక్టుకు రూ.150 కోట్లు వ్యయమవుతుండగా.. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ భరిస్తోంది. ఇ-9, ఎన్-15 రహదారుల పక్కన పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించే ఈ విగ్రహ నిర్మాణానికి మంత్రి లోకేశ్ 2025 సెప్టెంబరు 3న శంకుస్థాపన చేశారు. అక్టోబరులో పనులు ప్రారంభించారు.
కృష్ణా జిల్లా బొమ్ములూరుకు చెందిన కళాకారులు అక్కడే విగ్రహ భాగాలకు ఆకృతినిస్తూ, దశల వారీగా రాజధానికి తరలిస్తున్నారు. ఇప్పటికే రెండు భాగాలు చేరుకున్నాయి.
రెండంతస్తుల వేదికపై విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. వేదిక, విగ్రహం కలిపి మొత్తం ఎత్తు 110 అడుగులు.
వేదిక నిర్మిత ప్రాంతం 17 వేల చదరపు అడుగులు.
గ్రౌండ్ ఫ్లోర్లో 100 మంది కూర్చునేలా మినీ థియేటర్, మ్యూజియం, లైబ్రరీ ఉంటాయి.
మినీ థియేటర్ లో పొట్టిశ్రీరాములు జీవిత విశేషాలతో కూడిన 15 నిమిషాల వీడియోను సందర్శకులకు ప్రదర్శిస్తారు.
ఆయన వాడిన వస్తువులు, ప్రముఖులకు రాసిన లేఖలను మ్యూజియంలో ఉంచుతారు.
మొదటి అంతస్తులో ధ్యాన మందిరం ఉంటుంది.
9 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అక్కడ ఆసీనులైన భంగిమలో నిర్మిస్తున్నారు.
ధ్యానమందిరంపై కమలం ఆకారంలో పీఠం నిర్మించి, దానిపై విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పైనుంచి చూస్తే కమలం మధ్యలో మనిషి నిలబడ్డట్టుగా కనిపిస్తుంది.
ఎనిమిది కమలం రేకులు (పెటల్స్) అమరుస్తున్నారు. ఒక్కో రేకు ఎత్తు 22.50 అడుగులు. వాటిని ముంబయిలో తయారు చేయించారు.
మొత్తం బరువు 100 టన్నులు కాగా, విగ్రహాన్ని 30 టన్నుల కంచుతో తయారు చేస్తున్నారు. పీఠంపై విగ్రహాన్ని నిలబెట్టేందుకు లోపల 70 టన్నుల బరువైన ఇనుప గడ్డర్లు వాడుతున్నారు.
మొదటి దశలో భాగంగా మార్చి 16 నాటికి రెండంతస్తుల వేదిక, విగ్రహం సిద్ధం చేసి, విగ్రహావిష్కరణ చేస్తారు.
రెండో దశలో మరో 2,000 సీటింగ్ సామర్థ్యంతో ఆడిటోరియం, పార్క్ అభివృద్ధి చేస్తారు. దీనికి ఏడాది సమయం పడుతుంది.
*ఏటా వెయ్యి మందికి సహాయం*
పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేవలం ఆయన విగ్రహ ఏర్పాటు, నిర్వహణకే పరిమితం కాకుండా..
పలు సేవా కార్యక్రమాలూ నిర్వహిస్తుందని మేనేజింగ్ ట్రస్టీ డూండీ రాకేశ్ తెలిపారు. ప్రాథమికంగా ప్రతి సంవత్సరం వెయ్యి మందికి విద్య, వైద్య సహాయం, పేదరికంలో ఉన్నవారికి చేయూత వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఆ సంఖ్య పెంచుతామన్నారు.
20 కోర్సులతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పి, పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని, భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు జీఎంఆర్ సంస్థ ఆసక్తిగా ఉందని రాకేశ్ పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పేదలకు ట్రస్ట్ తరపున సాయమందిస్తామని, పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని నందనవనంలా తీర్చిదిద్దుతామని తెలిపారు..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్


