*ఖమ్మం జిల్లాకు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఒక మైలురాయిగా నిలిచే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది*. *ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేవాలయ నిర్మాణం కోసం ద్వంసలాపురం రెవెన్యూ పరిధిలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది*. *ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకోబడింది.*
*ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, తిరుమల దర్శనానికి వెళ్లలేని భక్తులకు స్థానికంగా టీటీడీ దేవాలయం ఏర్పడితే ఆధ్యాత్మిక అవసరాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, వెంటనే రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలు తడవుగా రెవిన్యూ శాఖ సమన్వయంతో భూమి కేటాయింపునకు కాంగ్రెస్ సర్కారు చర్యలు చేపట్టింది*.
*_ఖమ్మానికి ఆధ్యాత్మిక కేంద్రమవుతుందా?..._*
*ద్వంసలాపురం పరిధిలో కేటాయించిన 20 ఎకరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణంతో పాటు యాత్రికుల కోసం వసతి గృహాలు, కళ్యాణ మండపం, పార్కింగ్ సౌకర్యాలు, ధార్మిక కార్యకలాపాల కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది ఖమ్మం నగర అభివృద్ధికి దోహదపడటమే కాకుండా, భక్తులకు మరింత సౌలభ్యం కల్పించనుంది*.
*మంత్రి తుమ్మల ధన్యవాదాలు*...
*భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు*. #మన సంప్రదాయాలు సమాచారం

