#వేసవిలో_నీటిఎద్దడి_తలెత్తకుండా_చర్యలు...
ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కృషితో 24 డీప్ బోర్లు మంజూరు...
రూ.30 లక్షలతో పైపులైన్ నిర్మాణ పనులు
మరో రూ.30 లక్షలతో 3 ట్యాంకర్ల కొనుగోలుకు నిర్ణయం
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు : వేసవి వచ్చిందంటే పట్టణంలోని చాలా ప్రాంతాల ప్రజలు నీటి సమస్యతో సతమత మవుతుంటారు. భూగర్భజలాలు అడుగంటి వారానికి ఒకసారి వచ్చే మున్సిపల్ ట్యాంకర్ నీరు సరిపోక ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడి జేబులు గుళ్ల చేసుకుంటారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు వీలుగా స్థానిక Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు కొత్తగా 24 డీప్బోర్లను మంజూరు చేయించారు. ఈ డీప్బోర్లు నుంచి నివాస గృహాల వరకు వైపులైన్ నిర్మాణాలకు, అలాగే స్ప్రేమోటార్లకు నిధులు మంజూరు చేయించారు. వేసవి మొదలు కాకముందే ఈపనులను పూర్తి చేసి వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ కమిషనర్ రమణబాబు నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు. గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో 164 డీప్బోర్ల ద్వారా ప్రజలకు నిత్యం నీటిని అందిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటడం వలన 10 ప్రాంతాలలోని బోర్లు పని చేయడం లేదు. పక్క బోర్ల నుంచి ఆ ప్రాంతాలకు పైపులైన్ కలిపి నీటిని అందిస్తున్నారు. వేసవిలో మరికొన్ని బోర్లకు నీరందకపోతే ఇబ్బంది పడతారన్న భావనతో ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి 24 బోర్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించారు. వారం పది రోజుల్లో 16 బోర్లు డిల్డింగ్ చేశారు. మరో 8 ప్రాంతాలలో మంజూరైన బోర్లను డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. కొత్త బోర్ల నుంచి నివాస ప్రాంతాల వరకు పైపులైన్ నిర్మించేందుకు వీలుగా 30 లక్షల రూపాయలు మంజూరు కాగా పైపులైన్ నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ 24 బోర్ల ద్వారా రాబోయే వేసవిలో నీటి సమస్య నుంచి చాలావరకు గట్టెక్కగలదని అధికారులు భావిస్తున్నారు.
పైపులైన్ మార్పిడికి ప్రతిపాదనలు
పట్టణంలోని చాలా ప్రాంతాలలో దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్ చాలాచోట్ల శిథిలావస్థకు చేరుకుని మురికినీరు లోపలికి వెళుతోంది. ఈ సమస్య నుంచి గటెక్కించేందుకు పైపులైన్ మార్పిడికి కోటి రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కమిషనర్ రమణబాబు తెలిపారు.
కొత్తగా 3 ట్యాంకర్లు
పట్టణంలోని హోసన్న మందిర్ వెనుక భాగంలో నరవ రోడ్డు, శ్రీనివాస కాలనీ, అర్బన్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ తదితర శివారు ప్రాంతాలలో తరచూ నీటి సమస్య తలెత్తుతుండడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం గిద్దలూరు మున్సిపాలిటీకి 2 సొంత ట్యాంకర్లు ఉండగా మరో రెండింటిని అద్దెకు తీసుకున్నారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని అద్దె భారం నుంచి బయట పడేందుకు ఎస్ సి ఎస్ పీ నిధుల నుంచి కొత్తగా 30 లక్షలతో 3 కొత్త ట్యాంకర్లు కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు కాగా ఇప్పటికే టెండర్లు పిలిచారు...
స్పేర్ మోటార్లు
మున్సిపాలిటిలో కొత్తగా వేసేవి. పాతవి కలిపి. 188 డీప్బోర్లు ఉండగా మోటార్లు కాలిపోయిన సందర్భంలో రిపేర్లు చేయించి మోటారు. బిగించేందుకు 2, 3 రోజుల వ్యవధి పడుతుంది. ఈసమయంలో ప్రజలు నీటి కోసం పడరానిపాట్లు పడాల్సివస్తుంది. ఈ సమస్యనుంచి గట్టెక్కేందుకు వీలుగా 35 కొత్త మోటార్లను స్పేర్గా
ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మోటారు చెడిపోతే వెంటనే అదేరోజు కొత్త మోటారు ఏర్పాటు చేసేందుకు ఈ విధానంలో వీలు పడుతుంది.
గుండ్లమోటు నీరు
నల్లమల అటవీ ప్రాంత సమీపంలో గుండ్లమోటు తాగునీటి ప్రాజెక్టుకు గత టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కృషి ఫలితంగా నీటి ప్రాజెక్టు ఏర్పాటైన విషయం తెలిసిందే. అక్కడ 12 బోర్లు ఉండగా ప్రస్తుతం 9 బోర్లు రన్నింగ్లో ఉన్నాయి. మోటార్ల సమస్య వలన 3 బోర్డు పని చేయడం లేదు.. స్పేర్ మోటార్లు మంజూరైతే ఈ 3 బోర్లు కూడా వినియో గంలోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా పట్టణంలోని నల్లబండ బజారు, పాములపల్లి రోడ్డు, రాచర్ల రోడ్డులలో పైపులైన్ ద్వారా నీటిని అందిస్తున్న విషయం తెలిసిందే.
#NaraChandrababuNaidu
#NaraLokesh
#TeluguDesamParty
#GiddalurTelugudesamparty
#ThankYouCMsir
#ThankyouMlaMuthumulaAshokReddySir
#IdhiManchiPrabhutvam
#జైతెలుగుదేశం #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్


