ShareChat
click to see wallet page
search
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించిన బోర్డు మెంబెర్ రవణమ్మ #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు శ్రీశైలంలో నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారిని శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబెర్ బోనేని రవణమ్మ గారు వారి భర్త కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించి, బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తూ, కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలు అందించాలని కోరారు.ఎమ్మెల్యే గారు ఆహ్వానాన్ని స్వీకరించి, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో తప్పక పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొంటానని తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండనుందని, అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు సూచించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియచేయాలని ఎమ్మెల్యే గారు రవణమ్మ గారికి తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు... #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
✊నారా లోకేష్ - ShareChat