ShareChat
click to see wallet page
search
#తిరుమల లడ్డు #రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 #దర్మో రక్షిత రక్షితం 🙏 *వైఎస్ కుటుంబంపై దుష్ప్రచారమే సిగ్గు పడేంతగా………❗* FEBRUARY 21, 2026🔱 ఒకట్రెండు సంవత్సరాలు కాదు, ఏకంగా 19 ఏళ్లుగా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తీవ్ర దుష్ప్రచారం. ఎంతగా అంటే……… దుష్ప్రచారమే సిగ్గుపడేంత. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమల ఏడుకొండల్ని రెండు కొండలంటూ జీవోలు తీసుకొచ్చారని గత 19 ఏళ్లుగా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాన్ వారిని మోసే ప్రసార సాధనాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. అయితే అసలు నిజం తెలిసే సరికి, వైఎస్సార్ కుటుంబానికి తీవ్రంగా నష్టం జరిగింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, క్రిస్టియన్ మత విశ్వాసకుడైన వైఎస్సార్ తిరుమల ఏడుకొండల ప్రతిష్టను, ప్రాశస్త్యాన్ని కాపాడేలా జీవోలు తీసుకొచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారు తమ ఇలవేల్పుగా నిత్యం చెప్పే చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారనేందుకు తాజాగా వెలుగు చూసిన వీడియోనే నిదర్శనం. నాడు వైఎస్సార్ మొదలుకుని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ వరకూ రాజకీయంగా దెబ్బ కొట్టడానికి అత్యంత సున్నిత అంశం మతాన్ని చంద్రబాబు అండ్ కో వాడుకుంటున్నారు. ప్రధానంగా వైఎస్సార్ ఏడుకొండల్ని రెండు కొండలంటూ జీవోలిచ్చారనేది చంద్రబాబు ఆరోపణ. ఇందులో నిజం లేకపోగా, అలాంటి రెండు కొండలు కాదు ఏడుకొండలని చెప్పడంతో పాటు 350 కిలోమీటర్ల పరిధిని పెంచుతూ జీవోలు 746, 747 వైఎస్సార్ తీసుకొచ్చారు. అలాగే తిరుమలతో పాటు మరో 19 ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేలా వైఎస్సార్ చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ హయాంలోనే టీటీడీలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా చట్టం తీసుకొచ్చారు. ఇన్ని గొప్ప పనులు చేసిన వైఎస్సార్, ఆయన తనయుడిని హిందూ వ్యతిరేకులుగా చంద్రబాబు, పవన్, వారి మీడియా దుష్ప్రచారం చేయడం గమనార్హం. అయితే దుష్ప్ర,చారాన్ని పటాపంచలు చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా ముఖంగా తిరుమలను ఏడుకొండలుగా ప్రకటిస్తూ 2007లో వైఎస్సార్ హయాంలో జారీ చేసిన జీవోలను బయటపెట్టారు. దీంతో పాటు మరో సంచలన విషయాన్ని జగన్ బహిర్గతం చేశారు. 2009 ఎన్నికల ప్రచారంలో తిరుమలకు సంబంధించి రెండు జీవోలను చంద్రబాబు వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోను జగన్ బయట పెట్టారు. “నేను అధికారంలో ఉన్నప్పుడు జీవోలు 746, 747 అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం (వైఎస్సార్) వచ్చిన తర్వాత రెండు జీవోలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వీటికి వ్యతిరేకం. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు జీవోలను తీసేస్తాం” అని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఘనంగా హామీ ఇచ్చారు. ఇదే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇటీవల కేబినెట్ సహచరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఏమన్నారో తెలుసుకుందాం. "మీరు ఏడుకొండల్ని రెండు కొండలంటే, కాదు తప్పని చెప్పాను. దేవుని వద్దకు వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పాను. ఆ తర్వాత తిరుమలకు నడుచుకుంటూ వెళ్లి మొక్కు తీర్చుకున్నా” అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మెప్పు కోసంతో పాటు వైఎస్ జగన్పై అక్కసుతో పవన్ దూకుడు ప్రదర్శించారు. “వీళ్లు భగవంతుడి మీద పగపట్టారు. ఏడు కొండల్ని రెండు కొండలన్నారు” అని పవన్ తన వంతు దుష్ప్రచారాన్ని విజయవంతంగా చేశారు. అయితే ఎట్టకేలకు తిరుమలకు ఎవరి హయాంలో ఎలాంటి మంచి జరిగిందో వెలుగు చూసింది. ఏనాటికైనా నిజం బయటపడుతుందని పెద్దలు అంటుంటారు. అయితే తిరుమల కేంద్రంగా వైఎస్సార్, ఆయన తనయుడిపై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నదంతా దుష్ప్రచారమే అని లోకానికి తెలియజేయడానికి సుమారు 19 ఏళ్లు పట్టింది. ఇంత సమయం అంటే చిన్న విషయం కాదు. ఇన్నేళ్లలో వైఎస్సార్ కుటుంబం మానసికంగా తీవ్రంగా నలిగిపోవాల్సి వచ్చింది. తిరుమలను ఏడు కొండలుగా నిర్ధారిస్తూ వైఎస్సార్ జీవోలు తీసుకొస్తే, వాటిని రద్దు చేస్తానన్న చంద్రబాబే, ఇప్పుడు అది తప్పని చెప్పానని బొంకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు కనీసం తన అనుభవానికి, హోదాకు కూడా విలువ ఇవ్వకుండా, పచ్చి అవకాశవాద రాజకీయాలకు తిరుమల శ్రీవారిని వాడుకున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని సిట్ తేల్చి చెప్పింది. అలాగే తిరుమలలో ఏడుకొండలు లేవు, రెండు కొండలే ఉన్నాయని వైఎస్సార్ జీవోలు తీసుకొచ్చారనే ప్రచారంలో నిజం లేదని ఇంతకాలానికి స్పష్టంగా తెలిసొచ్చింది. అంతేకాదు, వైఎస్సార్ తీసుకొచ్చిన జీవోలను వ్యతిరేకించిన నాయకుడిగా సమాజం గుర్తించింది. తిరుమలకు వెళ్లే మార్గాల్లో అడుగడుగునా “ధర్మో రక్షతి రక్షితః” అనే నినాదం కనిపిస్తుంటుంది. దీని అర్థం ధర్మాన్ని మనం రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని. ఇప్పుడు వైఎస్ జగన్ విషయంలో అదే నిజమైంది. తిరుమలలో ధర్మాన్ని కాపాడేలా వైఎస్సార్, ఆ తర్వాత వైఎస్ జగన్ వ్యవహరించడం వల్లే, సుదీర్ఘ కాలం తర్వాతైనా, వారిని రక్షించేలా ధర్మం నిలబడిందనే చర్చ జరుగుతోంది. రాజకీయ అవసరాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకోవడం ముమ్మాటికీ తప్పు. మరీ ముఖ్యంగా తప్పని తెలిసిన తర్వాత కూడా అదే రకమైన పంథాను కొనసాగించడం దుర్మార్గం. అందుకే రాజకీయ ప్రత్యర్థుల దుర్మార్గ చర్యలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ, కోట్లాది మంది భక్తులతో చీవాట్లు తినేలా చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థిపై మతాన్ని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చిట్టచివరి అస్త్రం. అలాంటి అస్త్రాన్ని కూడా వైఎస్ జగన్పై చంద్రబాబు ప్రయోగించడం గమనార్హం. చేసిన మంచి చెప్పుకోవడంలో వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ ఎంతగా వెనకపడ్డారో ఏడుకొండలే నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు కూడా ఏడుకొండల విషయంలో నిజాలు బయటపడకపోయి వుంటే, టీడీపీ ఉన్నంత కాలం ఆ దుష్ప్రచారాన్ని కొనసాగించేది. అయితే చంద్రబాబు నాడు ఏడుకొండల్ని నిర్ధారిస్తూ వైఎస్సార్ తీసుకొచ్చిన జీవోలపై వ్యతిరేకంగా మాట్లాడి దొరికిపోయారు. మంచి పనులు చేసి కూడా వైఎస్ కుటుంబం ఆత్మరక్షణలో పడాల్సిన దుస్థితి. మరోవైపు తప్పుడు పనులు చూసి కూడా దర్జాగా నీతులు మాట్లాడుతున్న వైనం. ఏది ఏమైనా ఏడు కొండల సాక్షిగా వైఎస్ జగన్ కుటుంబంపై దుష్ప్రచారమే సిగ్గు పడేంతగా దుర్మార్గ ప్రచారం ఏళ్లతరబడి సాగింది. ఎట్టకేలకు దానికి వైఎస్ జగన్ ఫుల్స్టాప్ పెట్టారు.
తిరుమల లడ్డు - 1&P 1&P - ShareChat