https://youtube.com/watch?v=InQil_bV1Ig&si=WTB0Abcb1Fp5gCLD #తిరుమల లడ్డు
T20 World Cup: #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏క్రికెట్ 🏏
*టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే తోపు టీంగా భారత్.. ఈ రికార్డ్ చూస్తే ప్రత్యర్థులకు దడ పుట్టాల్సిందే..❗*
19.02.2026🏏
టీ20 ప్రపంచ కప్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ప్రపంచ రికార్డును సృష్టించింది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్ను ఓడించడం ద్వారా ఈ అద్భుతమైన ఘనతను సాధించిన సంగతి తెలిసిందే.
ప్రపంచ క్రికెట్లో దీనిని సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. ఈ క్రమంలో భారత జట్టు తన సూపర్ 8 ప్రత్యర్థులకంటే నాలుగు అడుగులు ముందుకు సాగింది. అలాగే, పాకిస్తాన్తో ఏడు అడుగుల అంతరాన్ని తగ్గించింది.
ఈ ప్రపంచ రికార్డు టీమిండియా పేరిట..
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, టీం ఇండియా ఏ అద్భుతమైన ఘనత సాధించింది? నిజానికి, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో 40 విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా టీం ఇండియా నిలిచింది. నెదర్లాండ్స్పై తమ 40వ విజయాన్ని నమోదు చేసింది. టీ20 ప్రపంచ కప్లో ఏ జట్టు అయినా అత్యధిక విజయాలు సాధించిన రికార్డు ఇదే కావడం గమనార్హం. భారత జట్టు తర్వాత, దక్షిణాఫ్రికా, శ్రీలంక వరుసలో ఉన్నాయి.
30+ మ్యాచ్లు గెలిచిన 5 జట్లు.. 40 మ్యాచ్లు గెలిచిన మొదటి జట్టుగా భారత్..
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో 30 కంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన జట్లు 5 ఉన్నాయి. కానీ, 40 మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టు టీమిండియా నిలిచింది. పురుషుల టీ20 ప్రపంచ కప్లో ఆడిన 56 మ్యాచ్ల్లో టీం ఇండియా 40 విజయాలు నమోదు చేసింది. టీమిండియా తర్వాత, దక్షిణాఫ్రికా ఈ జాబితాలో తదుపరి స్థానంలో ఉంది. ఇది 53 మ్యాచ్ల్లో 36 విజయాలు నమోదు చేసింది. శ్రీలంక 57 మ్యాచ్ల్లో 36 విజయాలు సాధించింది. పాకిస్తాన్ 55 మ్యాచ్ల్లో 33 విజయాలు నమోదు చేసిన జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చెరో 31 విజయాలు సాధించాయి. కానీ ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్లో 50 మ్యాచ్ల్లో, ఇంగ్లాండ్ 56 మ్యాచ్ల్లో దీనిని సాధించాయి.
అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అతి తక్కువ మ్యాచ్లలో గెలుపు..
పురుషుల టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్, వెస్టిండీస్ చెరో 28 మ్యాచ్ల్లో గెలిచాయి. న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో 28 మ్యాచ్ల్లో గెలిచింది. వెస్టిండీస్ కేవలం 49 మ్యాచ్ల్లోనే ఆ విజయాన్ని సాధించింది. పురుషుల టీ20 ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ 13 విజయాలు సాధించగా, బంగ్లాదేశ్ 45 మ్యాచ్ల్లో 12 విజయాలు సాధించింది.
#🕉 ఓం అరుణాచల శివ🛕
💗✨ *గిరి ప్రదక్షిణ చేసేటపుడు గిరివలం మార్గం లో మీరు దర్శించ వలసిన 44 అతి శక్తి వంతమైన ఆలయాలు*
అరుణాచలం అనగా అరుణ ఎర్రని, అచలం అంటే కొండ అని పరమార్ధం. అలాగే ఆ ఎర్రని కొండ పాపములను హరింప చేస్తుంది. అణ్ణామలైగా కూడా పిలుచుకునే సకల పాప దోషాలను హరింపచేసే ఈ క్షేత్రంలో స్మరణ మాత్రంచేత పుణ్యం లభిస్తుంది.
ఈ అరుణాచల స్వామి తేజోలింగం, జ్యోతిర్లింగము అందుకే అగ్నిక్షేత్రమని కూడా కొనియాడతారు. 14 కి. మీ. గిరి ప్రదక్షిణ చేయడమంటే ముక్కంటి ప్రదక్షణే. వేదాలు, ఉపనిషత్తులలో కొండ అనగా పెద్ద కొండ శివుడని. ఆ మహేశ్వరుడని సెలవిస్తోంది. గిరిప్రదక్షిణ చేసేమార్గం లో 44 ఆలయాలు దర్శించుకునే క్రమంలో మధ్య మధ్యలో మరికొన్ని చిన్న చిన్న ఆలయాలుంటాయి అన్నీ దర్శించుకుని పెద్దాలయం దగ్గరకు చేరుకుంటే గిరిప్రదిక్షిణ పూర్తైనట్టే... ఈ కొండకి తూర్పు వైపున అరుణాచలేశ్వరాలయం కన్నా ఈ కొండే అత్యంత మహా అద్భుత ఫలితాలని, ప్రశాంతతని పుణ్యాన్ని ఇస్తుంది భక్తులకి.
1. బ్రహ్మలింగం - గిరి ప్రదిక్షిణ ప్రారంభించాల్సిన ప్రదేశం ఇది...
2. ఇంద్ర లింగం - ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం దీనికి శుక్రుడు - సూర్యుడు అధిదేవతలు. ఈ లింగాన్ని దర్శించుకుంటే కెరీర్ కి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి..
3. అగ్నిలింగం - అగ్ని తీర్థం - అరుణగిరి చుట్టూ మొత్తం 8 శివలింగాలున్నాయి.. వాటిలో ఏడు రోడ్డుకి ఎడమవైపు ఉంటే అగ్నిలింగం కుడివైపు ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కపకాలంలో ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తాడు
4. శేషాద్రి స్వామి - ఈయన కామాక్షి అమ్మవారి స్వరూపంతో జన్మించారని చెబుతారు. అవధూత స్వరూపంలో భక్తులను అనుగ్రహించేవారు.
5. దక్షిణా మూర్తి - ఇది చాలా పురాతనమైన, శక్తివంతమైన ఆలయం... దాదాపు 1500 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆలయం ఉంది.
6. రమణాశ్రమం - ఇక్కడ రమణమహర్షి తల్లి సమాధి ఉంటుంది.. దానికి నమస్కరించుకుని రమణాశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి
7. మీనాక్షీ, సుందరేశ్వరుడు, గణేశ ఆలయాలు -పార్వతీ పరమేశ్వరుల శక్తి ఇక్కడుందని భక్తుల విశ్వాసం
8.ద్రౌపది ఆలయం - ఇక్కడ నుంచి గిరి దర్శనం అద్భుతంగా ఉంటుంది... జీవితంలో ఎదురుదెబ్బలు తిని విసిగిపోయినవారికి మానసిక స్థైర్యాన్నిస్తుంది ఈ ఆలయం
9.యమలింగం యముడు పూజించిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అకాలమృత్యువు దరిచేరదు. మృత్యుభయం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
10. పృథ్విలింగం - అరుణాచలం గిరిచుట్టూ ఉన్న 8 శివలింగాల్లో ఇదొకటి...
11. వాలమూరి గణపతి - తొండం కుడివైపు తిరిగిఉండే ఈ గణపయ్యను దర్శించుకుంటేఅదృష్టం వరిస్తుంది
12. దూర్వాస ఆలయం - ఇక్కడ దూర్వాసుడిని కుంతీ దేవి ప్రతిష్టించిందని చెబుతారు - ఇక్కడున్న వేపచెట్టుకి పసుపుదారాలు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని...రాళ్లు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల విశ్వాసం.
13. కాట్టు శివాశ్రమం - అటవీ అధికారుల అధీనంలో ఉండే ఈ ప్రదేశానికి వెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలి. గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ ఆశ్రమాన్ని రోడ్డుపైనుంచి దర్శనం చేసుకుని వెళిపోవచ్చు..
14. అప్పు నంది - పంచభూతాలకు సంబంధించిన నందుల్లో ఇది జలసంబంధ నంది... వివాదాలను సమసిపోయేలా చేసి బంధాలను వృద్ధి చేస్తుంది ఈ నంది దర్శనం
15. తేయునంది - ఈ నందినుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం ఉంటుంది... బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావాల్సిన జ్ఞానం ఇక్కడి నుంచి పొందారని చెబుతారు. అందుకే ఇక్కడి నుంచి బహ్మదేవుడిలా కనిపిస్తుంది గిరి
16. శోణ తీర్థం - ఇక్కడ రెండు నందులుంటాయి. ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు..రమణమహర్షి గిరిప్రదిక్షిణ చేసేటప్పుడు సేదతీరిన ప్రదేశం ఇది.. ఆ మహనీయుడు కూర్చోవడం వల్ల ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది...
17. నైరుతి లింగం - అష్ట లింగాల్లో నాలుగోది ఇది..రాక్షసరాజు నిరుతి ( నైరుతి దిక్కుకి అధిపతి) ప్రతిష్టించిన విగ్రహం ఇది. ఈ క్షేత్రానికి అధిపతి రాహువు..ఇక్కడ స్వామిని దర్శించుకుంటే రుషగ్రహబాధలు తొసగిపోయి కీర్తి ప్రతిష్టలు వస్థాయి
18.నంది ముఖ దర్శనం - ఇక్కడి నుంచి గిరివైపు చూస్తే..నంది ముఖంలా కనిపిస్తుంది
19.ఎదిర్ నేర్ అన్నామలై - సరిగ్గా ఇది గిరికి వెనుకవైపు ఉంటుంది.. ఇక్కడి నుంచి గిరిని చూస్తే శవశక్తి దర్శనం అవుతుంది.. అంటే శివుడు ఓ కొండగా, శక్తి మరోకొండగా కనిపిస్తారు..
20. ఆకాశ నంది - పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగోది ఆకాశనంది
21. పళని ఆండవార్ ఆలయం- కుమారస్వామి ఇక్కడ తపస్సుచేసి స్వయంభుగా వెలశాడని చెబుతారు..అందుకే ఈ ప్రదేశం అత్యంత పవర్ ఫుల్
22. రాజ రాజేశ్వరి ఆలయం - ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం..ఇక్కడి నుంచి కొండను చూస్తే పార్వతీదేవి కొండ మాత్రమే కనిపిస్తుంది...
23. సింహ తీర్థం, సింహ నంది - పంచభూత నందుల్లో ఇది ఐదోది. ఇక్కడున్న సింహతీర్థంలో నీరు తాగితే ఎంతటి వ్యసనం అయినా మానేయగలుగుతారు... ఓ సారి ప్రయత్నించి చూడండి భక్తితో...
24. కన్నప్ప గుడి - ఇది కూడా అటవీశాఖ అధీనంలో ఉంది. రోడ్డుపైనుంచి నమస్కారం చేసుకోవడమే..
25. గౌతమ ఆశ్రమం - గౌతముడు తపస్సు చేసిన ప్రదేశం ఇది
26. సూర్య లింగం - అరుణగిరిపైనుంచి వెళ్లిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్లీ తేజస్సు పొందాడని చెబుతారు. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది..
27. వరుణ లింగం - వరుణ
లింగానికి అధిదేవత శని... గ్రహదోషాలు తొలగించే శక్తి ఉన్న లింగం ఇది
28. మాణిక్య వాచకర్ ఆలయం-
మాణిక్యవాచకర్ శివభక్తుడు.. ఈయన కీర్తిస్తుంటే పరమేశ్వరుడు ఆ శ్లోకాలను రచించి భద్రపరిచాడని చెబుతారు
29. ఆది అణ్ణామలై - బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందే ఉందట..
30. వాయులింగం ఈ ఆలయంలో కూర్చుంటే బయట ఎండగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది..ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు..
31. వాయు నంది- వాయునంది చాలా శక్తివంతమైనది
32. భగవాన్ బ్రిడ్జ్ - రమణ మహర్షి సేదతీరిన ప్రదేశం ఇది..
33. చంద్ర లింగం - చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఇది... దీనిని దర్శించుకుంటే మీ జీవితంలో ఉండే కష్టనష్టాలు బాధలు తొలగిపోతాయి...
34. అధికార నంది - శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికారి నంది అలా ను అన్నమాట.. నంది చెవిలో గోత్రనామాలు చెప్పుకోవాలి
35. అగస్త్య ఆశ్రమం - ఇక్కడి నుంచి కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరూ కలసి కనిపిస్తారు.ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం, సంతాన దోషాలు తొలగిపోతాయి
36. కుబేర లింగం - లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది. ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి.
37. ఇడుక్కు పిళ్లయార్ - చిన్నగా కనిపించే ఇది ఆలయం కాదు. లోపల రెండు యంత్రాలు అమర్చారని...గిరిప్రదిక్షిణ వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేసేస్తుందని నమ్మకం.
38. పంచముఖ దర్శనం - ఇక్కడి నుంచి గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగించే ప్రదేశం ఇది
39. ఊసి లింగం - ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం..ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది..
40. పచ్చయ్యమ్మ గుడి - ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ స్వరూపంలో కొలువైంది...
41. ఈశాన్య లింగం, యజమాన నంది - ఇక్కడితో అష్టదిక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది.
42. షణ్ముఖ ఆలయం - ఇక్కడ స్వామివారు ఆరుముఖాల్లో దర్శనమిస్తాడు..
43. దుర్గాలయం, ఖడ్గ తీర్థం- ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని సంహరించాడని చెబుతారు
44. ప్రవాళ పర్వతం - గిరిప్రదిక్షిణలో ఆఖరి ప్రదేశం ఇది..రమణమహర్షి తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం ఇది . ఇదీ గిరిప్రదిక్షిణ చేసే విధానం
నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది
గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది .








![🕉 ఓం అరుణాచల శివ🛕 - Vayd Lngam {lbeta Lingem Verunattingamy EasemaL ngಖn Arunachala Peak Aruacnaleswyara Nmanrunganl Indra [ngam PradakshwaRoad Thl]inlrli ~Agnl Unaa Vematngan Vayd Lngam {lbeta Lingem Verunattingamy EasemaL ngಖn Arunachala Peak Aruacnaleswyara Nmanrunganl Indra [ngam PradakshwaRoad Thl]inlrli ~Agnl Unaa Vematngan - ShareChat 🕉 ఓం అరుణాచల శివ🛕 - Vayd Lngam {lbeta Lingem Verunattingamy EasemaL ngಖn Arunachala Peak Aruacnaleswyara Nmanrunganl Indra [ngam PradakshwaRoad Thl]inlrli ~Agnl Unaa Vematngan Vayd Lngam {lbeta Lingem Verunattingamy EasemaL ngಖn Arunachala Peak Aruacnaleswyara Nmanrunganl Indra [ngam PradakshwaRoad Thl]inlrli ~Agnl Unaa Vematngan - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_909664_3b537b26_1771472770786_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=786_sc.jpg)



