#🌙జాతీయం🌍అంతర్జాతీయం ☀
*శ్రీలంక సంచలన నిర్ణయం.. ఎంపీలకు పెన్షన్లు రద్దు❗*
FEBRUARY 18, 2026🎯
ఇండియాలో ఎమ్మెల్యేలుగాని, ఎంపీలుగాని ఎక్కువ శాతం మంది బాగా ధనవంతులై ఉంటారు. కొందరికి వందల కోట్ల సంపద ఉంటే, కొందరికి వేల కోట్ల సంపద ఉంటుంది. పైగా ఇతర పద్ధతుల్లో సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయిప్పటికీ వారికి బొచ్చెడు జీతాలు ఉంటాయి. పైగా ఈ జీతాలను అప్పుడప్పుడు పెంచుకుంటారు కూడా.
పదవులు ముగిసిన తరువాత బొచ్చెడు పెన్షన్ వస్తుంది. మాజీ ఎంపీలకు పెన్షన్ తో పాటు రైళ్లలో ఉచిత ప్రయాణం, వైద్య సౌకర్యాలు వంటి సేవలు కూడా లభిస్తాయి. ఇంకా వేరే
సౌకర్యాలు కూడా ఉంటాయి. ఎంపీ, ఎమ్మెల్యేల పెన్షన్లు రద్దు చేయాలని సామాజిక కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.
చట్టసభలకు వెళ్లినవారికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏముదంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజా ప్రతినిధులు పదవిలో లేనప్పుడు ఈ పెన్షన్ గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. గౌరవప్రదంగా బతకడానికి కావల్సిన డబ్బు వారి దగ్గర ఉంటుంది. లేకపోయినా పదవిలో ఉండగా కావల్సినంత సంపాదించుకుంటారు. మరి గౌరవప్రదంగా జీవించలేరా?
మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే పొరుగున చిన్న దేశం శ్రీలంక ప్రభుత్వం అక్కడి ఎంపీలకు పెన్షన్లు రద్దుచేసి పారేసింది. ఈ బిల్లుకు చట్టసభలో తగినంత మద్దతు లభించడం విశేషం. సభలో 225 మంది సభ్యులు ఉండగా……… 154 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఇద్దరు సభ్యులు మాత్రమే దీన్ని వ్యతిరేకించారు.
మిగతా సభ్యులు ఓటు వేయలేదు. ప్రస్తుతం చూసుకుంటే శ్రీలంకలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఎంపీ లకు పెన్షన్ అందుతోంది. కొత్త చట్టం పార్లమెంటులో ఆమోదం పొందడంతో అందరికీ ఈ పెన్షన్లు నిలిచిపోతాయి. అంతేకాదు దిసనాయకే సర్కార్ అధికారంలోకి వచ్చాక మాజీ అధ్యక్షులకు ఇచ్చే ప్రయోజనాలను కూడా నిలిపివేసింది.
అనుర కుమార దిస నాయకే నేతృత్వంలోని ప్రభుత్వం ఆల్రెడీ రాజకీయ నాయకులకు ఇచ్చే ఇంటి అద్దె, అలవెన్సులు, రవాణా సౌకర్యాలనూ రద్దు చేసింది. దేశ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా అనవసరపు ప్రోత్సాహకాలు, విలాసాలను తగ్గించి ప్రజా ధనాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకకు పర్యాటక రంగంతోనే ఎక్కువగా ఆదాయం వస్తుంది.
అయితే కరోనా, ఉగ్రదాడుల కారణంగా పర్యాటకుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణ లోపం కూడా ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో 2022లో శీలంక ప్రభుత్వం దివాళా తీసింది దేశంలో
సంక్షోభం ఏర్పడింది. ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. చివరికి అప్పటికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మార్క్సిస్టు నేత దిసనాయకే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలోనే ఎంపీల పెన్షన్లు రద్దు చేస్తానని చెప్పాడు. అన్నట్లే చేశాడు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉండగా ఎంపీలకు పెన్షన్లు తీసుకునే నైతికత లేదని న్యాయశాఖ మంత్రి హర్షణ నానాయక్కర బిల్లుపై చర్చ సందర్భంగా అన్నారు.
ఇక మన దేశం విషయానికి వస్తే ఒక వ్యక్తి ఎంపీ పదవిలో ఒక్క రోజు ఉన్నా కూడా నెలకు రూ.31,000 పెన్షన్ వస్తుంది. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఎంపీగా ఉంటే అదనంగా ప్రతి నెలా రూ.2500 చొప్పున పెన్షన్ వస్తుంది. ఒకవేళ మాజీ ఎంపీ మరణిస్తే వాళ్ల జీవిత భాగస్వామికి లేదా డిపెండెంట్లకు ఎంపీ పొందే పెన్షన్లో 50 శాతం అందుతుంది.
తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే తెలంగాణ, ఏపీలో పెన్షన్ కనీసం రూ.30,000 నుంచి ప్రారంభమై సర్వీసును బట్టి రూ.50,000 పైగా ఉంటుంది. ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పెన్షన్లు చాలా ఎక్కువ. రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు ఉంటుంది. గత ఏడాది ఏప్రిల్లోనే ఎంపీల జీతాలు పెరిగాయి. పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్, పెన్షన్, అదనపు పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది.
పార్లమెంట్ సభ్యుల ప్రాథమిక జీతం రూ. 1,00,000గా ఉండగా ఈ మొత్తాన్ని రూ. 1,24,000కి పెంచారు. అలాగే, ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరైతే రోజుకు ఇప్పటివరకు తీసుకుంటున్న రూ. 2,000 డైలీ అలవెన్సెస్ ను రూ. 2,500కి పెంచారు. పెన్షన్ విషయంలోనూ కేంద్రం కీలక మార్పులు చేసింది.
ప్రస్తుతం మాజీ పార్లమెంట్ సభ్యులకు నెలకు రూ. 25,000 పెన్షన్ అందించగా, ఇప్పుడు దాన్ని రూ. 31,000కి పెంచారు. అదనపు పెన్షన్ విషయంలోనూ మార్పు తీసుకువచ్చారు. ఇది ఇప్పటి వరకు రూ. 2,000గా ఉండగా, ప్రస్తుతం రూ. 2,500కు పెంచారు. ప్రజాప్రతినిధులు ఎక్కువ ఖర్చులను భరించాల్సిన పరిస్థితిలో ఉన్నారని, అందుకే జీతాలు పెంచామని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థించింది.
అయితే, ఈ పెంపు నిర్ణయంపై సామాన్య ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ప్రజాప్రతినిధుల జీతాలు, ఇతర సౌకర్యాలు పెంచడం సమంజసం కాదన్నారు. మరి భవిష్యత్తులోనైనా ఎంపీ, ఎమ్మెల్యేల పెన్షన్లు రద్దు చేసే బిల్లు వస్తుందా ? రాదా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
#తిరుమల వెయ్యి కాళ్ల మండపం 🙏 #🕉️ సనాతన హిందూ ధర్మం 🚩
హిందూ ధర్మ పరిరక్షణ గురించి నీతులు చెప్పే చంద్రబాబు నాయుడు, అసలు స్వరూపం తెలియాలంటే 2003లో తిరుమల కొండపై ఆయన చేసిన 'చారిత్రక విధ్వంసాన్ని' గుర్తు చేసుకోవాలి. మీలో చాలా మంది ఈ విషయం మరిచిపోయారు.
తిరుమల లో వెంకటేశ్వర స్వామి కి విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, మహా భక్తులైన సాళువ నరసింహరాయలు నిర్మించిన అద్భుత కట్టడం, 1000 కాళ్ల మండపాన్ని నేలమట్టం చేసిన ఘనత చంద్రబాబుదే. ఇది కేవలం రాళ్లను కూల్చడం కాదు, ఐదు శతాబ్దాల హిందూ వారసత్వాన్ని కూల్చివేసాడు.
నాడు ఏం జరిగింది అంటే
1472లో నిర్మితమైన ఈ వేయి కాళ్ల మండపం శిల్పకళా వైభవానికి ప్రతిరూపం. కానీ చంద్రబాబు తన మాస్టర్ ప్లాన్ అనే పైశాచికత్వం తో పిచ్చి ఆలోచనతో ఈ అపురూప కట్టడాన్ని కూల్చివేయ్యాలని ప్రకటించాడు.
వెంటనే పండితుల హెచ్చరికల చెసారు ఆ మండపం ఆలయ మర్యాదల్లో భాగమని, దాన్ని కూల్చడం ఆగమ శాస్త్ర విరుద్ధమని పీఠాధిపతులు, వేద పండితులు మొత్తుకున్నా చంద్రబాబు వినలేదు. అంతేకాదు భక్తుల మనోభావాలపై దాడి: భక్తులు రోడ్లపైకి వచ్చి కన్నీరు మున్నీరైనా, పోలీసు బలగాలతో భయభ్రాంతులకు గురిచేసి మరీ ఆ పురాతన కట్టడాన్ని ధ్వంసం చేయించాడు .
కూల్చిన రాళ్లను భద్రపరిచి తిరిగి నిర్మిస్తామని అప్పట్లో కల్లిబొల్లి మాటలు చెప్పారు. కానీ ఆ పవిత్రమైన రాళ్లను ఏళ్ల తరబడి ఎండకు, వానకు వదిలేసి చెత్తకుప్పలా మార్చిన చరిత్ర ఇ చంద్రబాబుది.
జగన్మోహన్ రెడ్డి ని క్రిష్టియన్ గా చూపించి తన రాజకీయ స్వార్థం తో విమర్శించే చంద్రబాబు, తాను హిందువునని చెప్పుకుంటూనే హిందు దేవాలయాలు విషయం లో చాలా తప్పు చెసాడు..
ఇదే వెయ్యి కాళ్ళ మండపం, రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లు ముఖ్యమంత్రి లు గా ఉన్నప్పుడు ఈ మండపాన్ని కూల్చి ఉంటే ఈ చంద్రబాబు పరమతస్థుడని హిందు దేవాలయాలు అంటే ద్వేషం అని ఎంత రచ్చ చేసేవాడో.. అయనకి తోడు అవకాశ వాద సనాతని ఏంత రచ్చ చెసే వారో..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి, హిందూ శిల్పకళా సంపదను డోజర్లతో పడగొట్టించడం హిందూ వ్యతిరేకత కాదా.
ఈ 1000 కాళ్ళ మండపం కూల్చివేత వెనుక ఉన్న ఉద్దేశం భద్రత కాదు, తన అహంకారాన్ని ప్రదర్శించుకోవడమేనని ఆనాడే విమర్శలు వచ్చాయి.
నేడు లడ్డూ రాజకీయం.. నాడు మండపం కూల్చివేత.
అధికారం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగుతారనడానికి ఈ వేయి కాళ్ల మండపమే నిదర్శనం. నాడు భౌతికమైన కట్టడాన్ని కూల్చారు, నేడు లడ్డూ వివాదం పేరుతో భక్తుల విశ్వాసాన్ని కూల్చాలని చూస్తున్నారు.
ఐదు వందల ఏళ్ల చరిత్రను పిండి చేసిన చంద్రబాబుకు, తిరుమల పవిత్రత గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది. చారిత్రక కట్టడాన్ని కూల్చిన పాపం ఆయన వెంటే ఉంటుంది..
తిరుమల వేయి కాళ్ల మండపం కూల్చివేత అనేది హిందూ సమాజంపై చంద్రబాబు చేసిన ఒక మాయని ద్రోహం. ఆనాడు ఆయన చేసిన ఆ తప్పిదాన్ని ఏ ప్రాయశ్చిత్తమూ కడిగివేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లడం మానేసి, మొదట తాను చేసిన ఈ చారిత్రక పాపానికి సమాధానం చెప్పాలి. హిందూ ధర్మం అంటే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు కేవలం ఒక రాజకీయ ఓటు బ్యాంకు మాత్రమే..వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత అనేది చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎన్నటికీ తుడిచిపెట్టుకుపోని ఒక మాయని మచ్చ.
జగన్ పై విషప్రచారం కేవలం రాజకీయ లబ్ధి కోసం, భక్తుల మనోభావాలను రెచ్చగొట్టి, జగన్మోహన్ రెడ్డి పై మతపరమైన ముద్ర వేయడానికి చంద్రబాబు పడుతున్న తాపత్రయం చూస్తుంటే అసహ్యం వేస్తోంది.
లడ్డూ వివాదం ఒక డ్రామా తిరుమల లడ్డూపై లేనిపోని కట్టుకథలు అల్లి, కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో తిరుమల ప్రతిష్టను గంగలో కలిపేందుకు కూడా ఈయన వెనకాడటం లేదు.
హిందూ ధర్మాన్ని తన రాజకీయం కోసం వాడుకునే చంద్రబాబు తిరుమలను అప్రదిష్ట పాలు చేస్తున్న మీ కుట్రలను ఈ సమాజం గమనిస్తూనే ఉంది. వేయి కాళ్ల మండపం కూల్చిన పాపం, ఇప్పుడు పవిత్రమైన లడ్డు విషయం లో చెసిన వివాదం భక్తుల ఉసురు మిమ్మల్ని వదిలిపెట్టదు. అధికారం వస్తుంది పోతుంది,
మాటలు కాలంతో మారిపోతాయి, కానీ చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. వెయ్యి కాళ్ల మండపం కూల్చిన చరిత్రను ఏ రాజకీయ నినాదాలు, ఏ ఆరోపణలు దాచలేవు.కానీ మీరు చేసిన దైవ ద్రోహం కాలగర్భంలో ఎప్పటికీ మాసిపోదు..
భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ, దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్న ఆయనకు కాలమే సమాధానం చెబుతుంది...
...
Post by:- పోనకా శివకుమార్ రెడ్డి..
.
.
.
#TirumalaHeritageDestruction #1000PillarMandapamDemolition #ChandrababuAntiHindu #TirumalaHistory
#SaveHinduTemples #CBN_Destroyed_History
#TirumalaPurity #CBN_AntiHinduPolitics
#VeyiKallaMandapam#TDP_Against_Hinduism
#TirumalaTemple#AndhraPradeshPolitics
#TCBN_Exposed#HinduDharma
#HinduSentimentsHurǰt#TirumalaTemple
#CBN_AntiHinduPolitics#MandapamDemolitionVsLadduPolitics#
#🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥
*‘బలుపు కా బాప్’… నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేశావురా హార్దిక్…‼️*
February 18, 2026🏏
మిత్రుడు బెల్లంకొండ ప్రసేన్ రీసెంటుగా ఫేస్బుక్లో ఓ ఇన్స్టా వీడియో బిట్, దానికి చిన్న రైటప్ షేర్ చేసుకున్నట్టు గుర్తుంది… బాగుంది… ఈరోజు వెతికితే పోస్టు ఉంది, కానీ నెట్ నుంచి, సోషల్ మీడియా ప్లాట్ఫారాల నుంచి ఆ వీడియో బిట్ మాయం… కారణం తెలియదు గానీ… భలే ఉంది అది…
ఇదే టీ20 వరల్డ్ కప్ పోటీలు… కొలంబోలో పాకిస్థాన్తో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్… అదీ ఫస్ట్ ఓవర్లోనే… యాటిట్యూడ్ కా బాప్ అనిపించుకెునే హార్దిక్ పాండ్యా ‘నో లుక్ వికెట్’ సీన్ అది… వెతగ్గా వెతగ్గా… ఓ ఫేస్బుక్ రీల్లో కనిపించింది… కాపీ రైట్ సమస్యతో ఇది కూడా బహుశా మాయం అయిపోవచ్చు కూడా… ఓసారి ఆ పోస్టులోకి వెళ్దాం… (నిన్నటిదే)…
Prasen Bellamkonda ….
Altitude of attitude… బలుపంటూ ఉంటే అలానే ఉండాలి. నచ్చావ్ హార్దిక్.
#
అద్సరేగానీ…
నిన్న పాక్ ఇండియా మ్యాచ్ లో కొన్ని ఫ్రేజ్ లు నాకు కొత్తగా అర్ధమయాయి.
స్టాండ్ అండ్ డెలివర్ అనే పదబంధాన్ని సెహ్వాగ్ లాంటి వాళ్ళ కొట్టుడుకి వాడతారు.
కానీ నిన్న ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ కు ఆ ఫ్రేజ్ సరిగ్గా సరిపోతుందని తెలిసింది. నిలబడి బౌల్ చేయడం.
నో లుక్ హిట్ అంటే కొట్టేసి ఆ బంతి సిక్స్ పోయినట్టే అని కనీసం ఆ బంతి వైపు చూడనైనా చూడకపోవడం. ఇది చాలా మంది బాట్స్మన్లలో చూడొచ్చు.
కానీ నిన్న హార్దిక్ మొదటి వికెట్ తీస్తూ కనీసం రింకూ ఆ క్యాచ్ పట్టాడా లేదా అని చూడకపోవడం నిజంగా హైట్ ఆఫ్ 'నో లుక్ వికెట్'.
భూమిని 70 శాతం నీరు కవర్ చేస్తే మిగతా ముప్పైశాతం రింకూ కవర్ చేస్తాడని ఫీల్డింగ్లో పేరు. హార్దిక్ ది ఆ నమ్మకం కావచ్చు కానీ మనకు రాబోయే వికెట్ గురించి ఇంత నిర్వేదంగా ఉండడం ప్రపంచంలో ఏ మానవమాత్ర బౌలర్ వల్లా కాదు.
బలుపు కా బాప్ అయితేనే అది సాధ్యం. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చావురా హార్దిక్.
ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ లో అయితే బంతిని ఆలస్యంగా వేసాడు కానీ బ్యాటింగ్ లో బ్యాట్ ను ముందే డిఫెన్స్ పొజిషన్ లో పెట్టేస్తున్నాడు. ఇంత కామెడీ బ్యాటింగ్ పొజిషన్ ను నేనైతే అస్సలు బ్యాటింగ్ రాని చంద్రశేఖర్, దోషి లాంటి వాళ్ళ దగ్గర కూడా చూడలేదు.
మ్యాచ్ నడుస్తుంటే మా సీతారాం ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అన్నాడు. నెక్స్ట్ ఓవర్లో బాబర్ అవుట్, చూడు అన్నాను. అన్నట్టే అయాడు. నాకు తెలిసిన విషయం పాక్ మేనేజ్ మెంట్ కు ఎందుకు తెలియలేదో అర్ధం కాలేదు.
వాడెవడో పాకిస్థాన్ కుర్రోడు చేసిన ‘ బాబర్ ను పాక్ టీమ్ లోనే కాదు పాకిస్థాన్ లోనే ఉంచొద్దు ‘ అన్న కామెంట్ లో కామెడీ కంటే నిజమే ఎక్కువ వుంది. నిన్నటి పాక్ భారత్ మ్యాచ్ సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ బాగా పండింది…
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*ఏపీ రాజకీయాల్లో కోవా – నెయ్యి – పెరుగు – ప్రతిదీ గాయిగత్తరే…⁉️*
February 18, 2026🎯
ఒక జాతర… అదీ తెలంగాణలోని ప్రముఖ జాతర… అక్కడ అన్ని మతాల చిన్న వ్యాపారులు నాలుగు డబ్బులు సంపాదించుకుందామని వస్తారు… సహజం… పొట్టపోసుకునే ప్రయత్నం…
కానీ ఏం జరిగింది..? కోవా బన్ను అమ్ముకునే ఎవరో చిన్న వ్యాపారిని ఎవరో ఓ చానెల్ వాళ్లు గెలికారు, ఏదో ఆరోపించారు… అదంతా ఒక కోణంలో నాన్సెన్స్… అమానవీయం… మరీ దానికి ఫుడ్ జిహాద్ అని పేరుపెట్టి మరీ కొందరు రచ్చ చేయడానికి ప్రయత్నించారు… వ్యక్తుల నడుమ రచ్చను మతాలకు ముడిపెట్టడం దేనికి..? వోటు బ్యాంకు రాజకీయాల వైపు మళ్లించడం దేనికి..
ఆ బన్ను కల్తీయా, మరొకటా అనేది ఇక్కడ చర్చ కాదు, జాతరలో రకరకాల వ్యాపార వస్తువులు అమ్ముతారు, వాటి నాణ్యత, వాటి ధర కొనేవాడి ఇష్టం… సరే, సదరు చిరు వ్యాపారికి ఎస్డీపీఐ వంటి నిషిద్ద, ప్రమాదకర సంస్థ మద్దతు అనేది కొంత ఆలోచించాల్సిన విషయం…
దాన్ని అంతటితో వదిలేయలేదు ఏపీ పాలిటిక్స్… విషయం ఏదైనా గాయిగత్తర చేయడమే కదా ఏపీ పాలిటిక్స్ నైజం… రాజకీయాలు పులుముతారు కదా… ఇక్కడా అంతే..,. లోకేష్ ట్వీట్, నేను నీ కోవా బన్ను తింటాను అని… ఎందుకు..? ఏం చెప్పదలుచుకున్నాడు..? ఇష్యూను మరింత సీరియస్ చేయాలనేనా ఉద్దేశం..? లేక ఇది మైనారిటీ హక్కులు, మనోభావాల ఇష్యూగా చిత్రీకరించాలనా..?
నాగబాబు… పేరుకు నాస్తిక చక్రవర్తి… తనేం మాట్లాడతాడో తనకూ తెలియదు చాలాసార్లు… ఇప్పుడు సదరు వ్యాపారిని పిలిచి, ఆ కోవా బన్ను తిని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు… ఏం చెప్పదలుచుకున్నాడు..? దాని నాణ్యతకు, పవిత్రతకు సర్టిఫికెట్ ఇస్తున్నాడా..? చూశావా, మేమెంత మానవతావాదులమో అని ఓ ఓ చిత్రీకరణా…?
మరి హిందూ గుళ్ల మీద దాడులు జరిగినప్పుడు, విగ్రహాల తలలు నరికేసినప్పుడు, ఏమయ్యాయి ఈ గొంతులు..? ఒక్క కోవా బన్ను మీద ఎందుకింత ఓవరాక్షన్..? సదరు వ్యాపారికి మద్దతుగా బోలెడు పోస్టులు, లక్షల వసూళ్లు, విరాళాలు.., చివరకు దీన్ని ఏమని చిత్రీకరిస్తున్నారు అందరూ కలిసి..?
సదరు చానెల్ చేసింది తప్పే, మత విద్వేషం పెంచుతున్నారు అని భావిస్తే చర్యలు తీసుకొండి… సదరు వ్యాపారికి నష్టం వాటిల్లితే మానవతా కోణంలో ఏదైనా పథకంలో ఇన్క్లూడ్ చేసి, సాయం చేయండి, నిలబెట్టండి… అంతేతప్ప ప్రతిదానికీ రాజకీయాలను పులమడం దేనికి..? పొలిటికల్ షో దేనికి..?
(తెలంగాణ ప్రభుత్వం దీన్ని లైట్ తీసుకుంది, తన పరిధిలో జరిగిన వివాదమే అయినా సరే… దీన్ని మరింత రచ్చ చేయడం సొసైటీకి అంతిమ నష్టం కాబట్టి… టీడీపీ, జనసేనల నుంచి ఈ సోయి కనిపించడం లేదు…)
చివరకు దీన్ని తిరుమల లడ్డూకు ముడిపెట్టి చర్చలు, రాద్ధాంతం చేస్తున్నారు… అసలు దానికీ దీనికీ లింకేమిటి..? సరే, తిరుమల లడ్డూ సంగతికే వద్దాం… గతంలో ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు స్పష్టంగా చెప్పింది… జంతువుల కొవ్వుల గురించి… కానీ సీబీఐ సిట్ మాత్రం కేవలం ‘నెయ్యి కాని నెయ్యి’ దగ్గరే ఆగిపోయింది… అంటే కేంద్రం కూడా ఇంకా ఇంకా లడ్డూ మీద దుష్ప్రచారం జరగకూడదని..! దాని విశిష్టతకు ఇంకా భంగం వాటిల్లకూడదని..! కేంద్రం భావన టీడీపీ క్యాంపుకి అర్థం కాలేదు…
అందుకే పదే పదే తన సోషల్ మీడియా, మీడియా ద్వారా గాయిగత్తర వరుస కథనాలకు, పోస్టులకు దిగారు… అసలు ఈ జంతు కొవ్వుల గురించి ప్రస్తావన తెచ్చిందే చంద్రబాబు… పొలిటికల్ ఫాయిదా కోసం… అదేదో దర్యాప్తు చేయిస్తే అయిపోయేది, కానీ కావాలని జగన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం కోసం… ఎస్, జగన్ క్యాంపు తిరుమలను భ్రష్టుపట్టించింది నిజమే… కానీ సిస్టమాటిక్గా చంద్రబాబు ఎక్స్పోజ్ చేసి, ఎస్టాబ్లిష్ చేసింది ఎక్కడ..?
(ఏమాటకామాట… ఏపీబీజేపీ సంయమనం పాటిస్తోంది… ) ఈలోపు వైసీపీ క్యాంపు హెరిటేజ్ పెరుగు, పాలపై ప్రచారానికి దిగింది… అది మరో బ్లండర్… నెయ్యి కాని నెయ్యి కీ హెరిటేజ్ పెరుగుకూ ఏం లింక్..? చంద్రబాబు హెరిటేజ్ ద్రోహం చేస్తే, జగన్ లడ్డూకు చేసిన ద్రోహాలు బారాఖూన్ మాఫ్ అనుకోవాలనా..?
ఈ ప్రచారంపై హెరిటేజ్ లీగల్ ఫైట్కు రెడీ కాగానే, తాజాగా ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ అనుబంధమేననీ, ఆ నెయ్యిలో టాయిలెట్ క్లీనర్ల అవశేషాల మాటేమిటీ అని చట్టసభలో ప్రస్తావనకు తీసుకొచ్చారు… ఇదే కాదు, గతంలో చంద్రబాబు హయాంలోనే సదరు అక్రమ డెయిరీల నుంచి కోట్ల రూపాయల నెయ్యి కొన్నట్టు, టీటీడీ బ్లాక్ లిస్టు చేసినా సరే, అనతికాలంలోనే ఆ నిషేధం తొలగించినట్టు కూడా ప్రచారం మొదలెట్టారు… వెరసి టీడీపీ క్యాంప్ ఫుల్ డిఫెన్సులో పడినట్టు కనిపిస్తోంది… అబ్బే, అవి కంట్రాక్టు మాన్యుఫాక్చరింగ్ ఒప్పందాలు మినహా సదరు డెయిరీ నెయ్యి సరఫరాలతో తమకేమీ సంబంధం లేదని హెరిటేజ్ క్లారిటీలు ఇస్తోంది…
అంతేకాదు, ఢిల్లీ నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు అందినట్టున్నాయి… తిరుమల లడ్డూ యవ్వారాన్ని కంపు చేయడం ఇక మానేయాలని..! ప్చ్, ఏపీ రాజకీయాల్లో కాదేదీ రాజకీయాలకనర్హం… బన్ను కోవా, లడ్డూ నెయ్యి, పట్టు శాలువా, హెరిటేజ్ పెరుగు… ఎటెటో తిప్పుతున్నారు… ఏం రాజకీయాలురా బాబూ..!!












