https://youtube.com/live/BgXoU_2OOm0?si=qM3YBHCHv75dPfsC #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
#ఏపీ అప్ డేట్స్..📖 #ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు
*చంద్రబాబు, లోకేశ్తోసహా వారిద్దరికి శిక్ష తప్పదు.. నేను వదలను..❗*
25.02.2026🎯
చంద్రబాబు, లింగమనేని రమేశ్, నారాయణ, లోకేశ్లకు శిక్ష తప్పదు.
పిర్యాదుదారులను భయపెట్టి వాళ్లపై కేసులు కొట్టేయించుకుంటున్నారు.
నేను మాత్రం భయపడను..
చంద్రబాబు నాయుడు, లింగమనేని, నారాయణతోపాటు నారా లోకేశ్కు శిక్ష తప్పదు. మీపై ఉన్న కేసుల్లో ఫిర్యాదుదారులను భయపెట్టి ఒక్కొక్కటి కొట్టేయిస్తున్నారు. నేను మాత్రం వదలను.. భయపడను. నన్ను ఎలా భయపెట్టారో సందర్భాన్ని బట్టి చెబుతా. ఎవరెవరిని నా దగ్గరికి పంపి నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారో అన్ని చెబుతానని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏసీబీ కోర్టు, సీఐడీ నాకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, లింగమనేని రమేష్, మంత్రి నారాయణ పక్కా ప్లాన్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రకటనకు ముందే లింగమనేని రమేష్ 350 ఎకరాలు కొనుగోలు చేశారు. భూముల విలువలు పెంచుకోవడానికి ముందుగా కొనుగోలు చేసిన చోట నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు మార్చారు. లింగమనేనికి చెందిన కొన్ని భూములకు దగ్గరగా, కొన్ని భూములకు ఆనుకుని ఉండేలా ప్లాన్ చేశారని, ఈ ప్లాన్ అనుకూలంగా మార్చడంతో హెరిటేజ్కి 18ఎకరాలు ఇచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
కోట్లలో విలువ ఉన్న భూమిని 8 లక్షలకు అమ్మారు. పవన్ కల్యాణ్కి కూడా 2.5 ఎకరాలు భూమిని 8 లక్షలకు అమ్మారు. కోట్లలో విలువ ఉన్న భూములను కేవలం 8 లక్షలకే ఎందుకు ఇచ్చారని ఆళ్ల ప్రశ్నించారు. అత్యంత విలువైన కరకట్ట పైన ఉన్న ఇంటిని చంద్రబాబుకి ఉచితంగా ఇచ్చారు. ఈ కేసులో లింగమనేని, చంద్రబాబు, మంత్రి నారాయణ అందరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో 18వ నిందితుడిగా నారా లోకేష్ కూడా ఉన్నారు. ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈరోజు కేసు ముసెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
అసలు కేసే తప్పుడు కేసు అని కోర్టులో అప్పీల్ కి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులే ఇప్పుడు తప్పుడు కేసు అంటున్నారు. అనిత హోంమంత్రి అయినా లా అండ్ ఆర్డర్ మొత్తం చంద్రబాబు చేతిలో ఉంది. ఎస్పీ స్థాయి నుండి డీజీపీ వరకూ చంద్రబాబు ఆధీనంలోనే ఉన్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులను అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేసులు క్లోస్ చేసేసుకుంటున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టాలకు విరుద్ధంగా కేసులు మూసేస్తున్నారు. ఇది చిన్న కేసు కాదు.. 2500 కోట్ల అవినీతి జరిగింది.. మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్ అని క్లోస్ చెయ్యడం అన్యాయం. న్యాయ స్థానాల్లో నా పోరాటం కొనసాగిస్తా. ఏ ఆధారంతో సీఐడీ అధికారులు ఈ కేసును మూసేస్తున్నారు..? నాకు వివరాలు ఇవ్వాలి. 27 తేదీన ఏసీబీ కోర్టుకి హాజరవుతా, నాకు న్యాయం జరగకపోతే హై కోర్టుకి వెళ్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
తప్పు చెయ్యకపోతే మీరు లీగల్గా నిరూపించుకోండి. అన్యాయంగా అధికారం అడ్డుపెట్టుకుని క్లోస్ చేసేస్తారా..? డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ చీప్ రవి శంకర్, ఆయఎన్నార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మీ ఇద్దరిపై కన్నువేసి ఉంచాను.. ఎక్కడెక్కడ అన్యాయాలు చేస్తున్నారో చూస్తున్న. రెండేళ్లలో మీ ఇద్దరూ ఎక్కడెక్కడ అవినీతి ఆస్తులు పోగేశారో నాదగ్గర ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఈ ఇద్దరి అధికారుల అవినీతి చిట్టా బయటపెడతానంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
2024 లో నేను పోటీ చెయ్యలేదు. 2029 లో పోటీ చేస్తాను. ఎమ్మెల్యే గానో ఎంపీ గానో అవుతాను. మీరు రిటైర్ అయితే మళ్లీ ఐపీఎస్లు అవ్వలేరు. నేను మళ్లీ ఎమ్మెల్యే లేదంటే ఎంపీ అవుతాను. చట్టం ముందు నినబెడతా అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
* #కేరళం..! ఎందుకు ఈ పేరు మార్పిడి..? ఈ పేరులో అర్థమేమిటి..❓*
February 25, 2026🎯
కేరళం.. ఒక జాతి ఆత్మాభిమాన నినాదం! …. By Srinivas Ganjivarapu ….
సముద్రపు కెరటాల సవ్వడి, పచ్చని కొబ్బరి వనాల సోయగం, అక్షరమే ఆయుధంగా సాగే ప్రగతి ప్రయాణం.. వెరసి మన కళ్ళముందు కదిలే చిత్రం ‘కేరళం’ . ఇప్పుడా పేరు కేవలం ఒక భౌగోళిక ప్రాంతానికి గుర్తు మాత్రమే కాదు; అది ఒక జాతి తన అస్తిత్వాన్ని, మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటిచెప్పే చారిత్రక ఘట్టం.
రాజ్యాంగ పత్రాల్లో ఇప్పటివరకు ‘కేరళ’గా పిలవబడిన ఆ రాష్ట్రం, ఇకపై అధికారికంగా తన సొంత ఉచ్చారణతో ‘కేరళం’గా రూపాంతరం చెందడంతో మలయాళీ ప్రజల దశాబ్దాల కల సాకారమయింది. రాష్ట్రంలో పార్టీలకతీత నిర్ణయం .. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదు, వలసవాద ముద్రలను చెరిపివేసి మాతృభాషలోని మాధుర్యాన్ని పరిపాలనలో ప్రతిబింబించడం.
కేరళం అనే పదానికి ఆ రాష్ట్ర నేల స్వభావానికే ఒక విడదీయలేని బంధం ఉంది. మలయాళంలో ‘కేర’ అంటే కొబ్బరి చెట్టు అని, ‘ఆలం’ అంటే భూమి అని అర్థం. ఈ ‘కొబ్బరి వనాల నేల’ తన పేరును తానే సార్థకం చేసుకుంటోంది.
ఈ కొబ్బరి కేవలం పేరులోనే కాదు, వారి ప్రతి రుచిలోనూ పరిమళిస్తుంది. కొబ్బరి నూనె ఘుమఘుమలు, కొబ్బరి పాలతో చేసే ‘అప్పం’, ‘స్టూ’ వంటి వంటకాలు కేరళీయుల ఆహార సంస్కృతికి ప్రాణం. ముఖ్యంగా అరటి ఆకుపై వడ్డించే ‘సద్య’ విందు ఆ నేల యొక్క ఐక్యతను చాటిచెప్పే ఒక సాంస్కృతిక ప్రతీక. అక్కడి తీర ప్రాంతపు సముద్రపు రుచులు కూడా అద్భుతం.
సముద్రపు నీలి అలల మధ్య దొరికే ‘కరిమీన్’ చేపను మసాలాలతో అద్ది, అరటి ఆకులో చుట్టి కాల్చే ‘కరిమీన్ పొల్లిచత్తు’) ఆ రాష్ట్రపు గర్వకారణమైన రుచి. ‘కొడమ్ పులి’ (మలబార్ చింతపండు) వేసి వండే చేపల పులుసు ఆ ప్రాంతపు అసలైన ఘుమఘుమలను పంచుతుంది.
కేవలం చేపలే కాదు, మాంసాహార ప్రియుల కోసం మలబార్ పరోటాలో మేళవించే మాంసం వేపుడు… కుట్టనాడ్ ప్రాంతపు ప్రసిద్ధ ‘బాతు మాంసం కూర’, మలబార్ ముస్లింల ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచే ‘తలస్సేరి బిర్యానీ’ ఆ నేల అస్తిత్వంలో భాగం. సుగంధ ద్రవ్యాల రాజధానిగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతపు ఆహారంలో మిరియాలు, ఏలకుల ఘాటు వారి చరిత్రలో దాగి ఉన్న అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను గుర్తుచేస్తుంటుంది.
చారిత్రకంగా చూస్తే మౌర్య చక్రవర్తి అశోకుని కాలం నాటి శిలా శాసనాల్లో (క్రీ.పూ. 257) ఈ ప్రాంతాన్ని ‘కేరళపుత్ర’ అని సంబోధించడం విశేషం. వేల ఏళ్ల నాటి ఈ చారిత్రక వారసత్వాన్ని నేటి ఆధునిక కాలంలో ‘కేరళం’ పేరుతో పునరుద్ధరించుకోవడం ఒక గొప్ప సాంస్కృతిక విజయం. ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఒకప్పుడు మలబార్, కొచ్చిన్, ట్రావంకూర్ సంస్థానాలుగా విడిపోయి ఉన్న మలయాళీలను ఏకం చేసేందుకు ‘ఐక్య కేరళ ఉద్యమం’ దశాబ్దాల పాటు సాగింది.
భాషా పరంగా చూస్తే, సంస్కృతంలోని ‘కేరళ’ పదానికి మలయాళ వ్యాకరణం ప్రకారం చివరన చేరే ‘మ్’ (అనుస్వరం) ఆ రాష్ట్ర అస్తిత్వానికి ప్రాణం పోస్తుంది. ‘కేరళం’ అని పలికినప్పుడు కలిగే ఆత్మీయత ‘కేరళ’లో లేదని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. సాహిత్యంలో ‘వల్లతోల్ నారాయణ మీనన్’ వంటి కవులు తమ మాతృభాషా గౌరవాన్ని చాటిచెబుతూ రాసిన కవితలు ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచాయి.
ఈ మార్పు కేవలం ఒక అక్షరం చేరిక కాదు, ఒక జాతి తన ఆత్మగౌరవాన్ని రాజ్యాంగబద్ధంగా ప్రకటించుకోవడం. మాతృభాష పట్ల, తమ ప్రత్యేకమైన ఆహార రుచుల పట్ల మలయాళీలు చూపే నిబద్ధత ఇతర భాషా రాష్ట్రాలకు కూడా ఒక గొప్ప ప్రేరణ. ఇకపై అధికారిక పత్రాల్లో మెరిసే ‘కేరళం’ అనే పేరు..పచ్చని కొబ్బరి ఆకుల మధ్య వికసించే ఒక భాషా సుగంధం!
*കേരളം Keralam కేరళం*
https://youtube.com/watch?v=Lr5tlc-ASNk&si=WBkZJwFt57PugNZz #తిరుమల లడ్డు #ఏపీ అప్ డేట్స్..📖
https://youtube.com/live/IObB-zX9u_s?si=it6MC9G23LmZsMKc #ఏపీ అప్ డేట్స్..📖
#మనిషి పుట్టుక
*మనిషి 100 ఏళ్ల రహస్యం❗ అసలు ట్విస్ట్ ఇదే..*
40+20+20+20
సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మనిషికి, ఎద్దుకి, కుక్కకి, గుడ్లగూబకి.. ఒక్కొక్కరికి 40 ఏళ్ల ఆయుష్షు ఇచ్చాడు.
కానీ 🙍🏻♂️మనిషి అది నాకు చాలలేదు అన్నాడు.
🐂ఎద్దు అంది.. "స్వామీ! బరువులు మోస్తూ 40 ఏళ్లు బతకలేను, 20 "ఏళ్లు చాలు" అని.
ఆ 20 ఏళ్లు మనిషి లాగేసుకున్నాడు! (ఇప్పుడు మనిషి ఆయుష్షు : 60)
🐕కుక్క అంది.. "ప్రతి ఒక్కరితో ఛీత్కరించుకుంటూ 40 ఏళ్లు వద్దు, 20 చాలు" అంది.
ఆ 20 కూడా మనిషే తీసుకున్నాడు! (ఇప్పుడు మనిషి ఆయుష్షు : 80)
🪽చివరగా గుడ్లగూబ.. "అపశకునం అనే మాటలు పడుతూ 40 ఏళ్లు ఉండలేను, 20 చాలు" అంది.
🙍🏻♂️మనిషి వదలకుండా అది కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అలా మనిషికి 100 ఏళ్లు నిండాయి.
అందుకే.. మొదటి 40 ఏళ్లు మనిషి రాజాలా బతుకుతాడు.
40-50 ఏళ్ల మధ్య ఎద్దులా కష్టపడి సంపాదిస్తాడు.
60-80 ఏళ్ల మధ్య కుక్కలా ఇంటికి కాపలా ఉంటూ అందరి మాటలు పడతాడు.
80-100ఏళ్ల మధ్య గుడ్లగూబలా వరండాలో కూర్చుని ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తుంటాడు.
"ఎప్పుడు ఇచిన దానికంటే ఎక్కువ ఆశపడితే..
జీవితం ఇలాగే మారుతుంది.
మనిషికి 100 ఏళ్ల ఆయుషు ఎలా వచ్చిందంటే ఇందువల్లనే.. అందుకే ప్రశాంతంగా బతకడం నేర్చుకుందాం..🤗
ఒక లక్ష్యం కోసం పరిగెత్తే వాడి కంటే..❓
తన కుటుంబం కోసం బండి నడిపేవాడే గొప్పవాడు.
#🌅శుభోదయం🌻🌺
https://youtube.com/watch?v=lxbHxbLirfo&si=pILJlZTwtacFMrv1 #తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯






![🩺ఆరోగ్య జాగ్రత్తలు - RIGHT SIDE Esophagus stomach stomach acid LEFT SIDE Esophagus] stomach acid RIGHT SIDE Esophagus stomach stomach acid LEFT SIDE Esophagus] stomach acid - ShareChat 🩺ఆరోగ్య జాగ్రత్తలు - RIGHT SIDE Esophagus stomach stomach acid LEFT SIDE Esophagus] stomach acid RIGHT SIDE Esophagus stomach stomach acid LEFT SIDE Esophagus] stomach acid - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_928145_69649c4_1772003926810_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=810_sc.jpg)





