https://youtube.com/watch?v=YDHmloO5Ty4&si=FFWpz0RYYaZptMNZ #తిరుమల లడ్డు
#🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥
*ఆపరేషన్ సిందూర్ కంటిన్యూస్… ఇషాన్ కిషన్ బాంబింగ్తో పాకిస్థాన్ బెంబేలు…🤪*
February 15, 2026🏏
చెప్పుకోవాలి… ఖచ్చితంగా చెప్పుకోవాలి… చాన్నాళ్ల తరువాత చాలా హీట్ జనరేట్ చేసిన మ్యాచ్ ఇది… వాడు బంగ్లాదేశ్ వాడు నేను ఆడనుపో అన్నాడు… పోతేపోరా అనేసింది ఇండియా…
బంగ్లాదేశ్ మీద తెగ ప్రేమ ఒలకబోస్తూ పాకిస్తాన్ కూడా నేనూ ఆడను, బంగ్లాదేశ్ గొంతెమ్మ కోరికలు తీర్చాలి అని ఎప్పటిలాగే తనదైన తిక్క స్టయిల్ పోకడ… నువ్వూ పోతేపోరా, తరువాత నువ్వే అనుభవిస్తావు అనేసింది ఇండియా…
కాళ్లబేరం అలవాటే కదా పాకిస్థాన్కు… దిగివచ్చింది… రాకుండా చేసేదేమీ లేదు… ఒకవైపు పెహల్గామ్ దురాగతం ఇండియన్ల గుండెల్ని మండిస్తూనే ఉంది… ఆపరేషన్ సిందూర్ పేలుళ్లు మరిన్ని వినిపించాలి ఈ మ్యాచులో అని ప్రతి ఇండియన్ కోరుకున్నాడు… హైవోల్టేజీ మ్యాచ్ కాదు… ఇది థర్మోబారిక్ బాంబింగ్…
అఫ్కోర్స్, దీన్ని కూడా బీజేపీకి, మోడీకి ముడిపెట్టి… లోలోపల ఇండియా ఓడిపోవాలని కోరుకున్న యాంటీ నేషన్ ఇడియట్స్కు కూడా కొదవ లేదు కదా దేశంలో… అందరూ ఒక్కసారిగా సైలెంట్…
అట్లా ఇట్లా కాదు… ఓ రాఫెల్ ఫైటర్ను ఎక్కి ఇషాన్ కిషన్ ఒక్కడే బాంబింగ్ చేసి వచ్చినట్టు… వాట్ ఏ బ్యాటింగ్… తరువాత కాగల కార్యం ప్రతి బౌలరూ తీర్చారు… వెరసి పాకిస్థాన్ చిత్తు చిత్తు… సగటు జాతీయ వాద భారతీయుడకి ఆత్మతృప్తి…
ఇంకా ఎవడూ మొదలుపెట్టలేదు, ఆటను ఆటలాగా చూడాలి అని… పర్లేదు… ఎవడి ఏడుపు వాడు ఏడవనీ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈరోజు టీవీని అతుక్కున్నారు… ఎక్కడెక్కడో దూరదేశాల్లో ఉన్నవాళ్లు కూడా… క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేని వాళ్లు కూడా…
అది ఎమోషన్… ఎస్, ఖచ్చితంగా ఓ పాట్రియాటిక్ ఫీల్… ఎవడు ఎన్ని శుష్క వాదనలకు దిగినా సరే… ఆటను కూడా దేశం భిన్నంగా చూడలేదు… ఇదీ యుద్దంలో భాగమే… భాగం కాకపోతేనే ఆశ్చర్యపడాలి… ఇక్కడ ఇండియా- పాకిస్థాన్ స్కోర్లు, పోలిక, మన్నూమశానం ఏమీ చెప్పడం లేదు…
ఒక ఆనంద కెరటం ఇండియాను ముంచెత్తడాన్ని పాఠకులతో షేర్ చేసుకోవడమే ఈ కథన ఉద్దేశం... కంగ్రాట్స్ ఇండియన్ ప్లేయర్స్... వన్స్ అగెయిన్... ఎస్, ఆపరేషన్ సిందూర్ కంటిన్యూస్
*2003 March 1st మహాశివరాత్రి రోజున ఇండియా vs పాకిస్థాన్ ... (World Cup) .... అప్పుడు సచిన్ చెలరేగిపోయాడు... 98 (75B)... అప్పట్లో ఈనాడు పేపర్ హెడ్డింగ్ ఇండియా వైడ్ వైరల్ అయ్యింది... "భారత్కి శివరాత్రి.. పాకిస్థాన్కి కాళరాత్రి" అని... మళ్ళీ ఇన్నాళ్ళకి సేమ్ మహా శివరాత్రి రోజున T20 world cup... 'భారత్కి మహా శివరాత్రి.. పాకిస్థాన్కి కాళరాత్రి '.... మళ్ళీ ట్రెండింగ్ అవుతుంది.....*
#🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥
*ఇండియా ఎలా గెలిచింది..? పాకిస్థాన్ ఎందుకు మట్టికరిచింది..⁉️*
February 15, 2026🏏
Pardha Saradhi Upadrasta
…. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్లు అంటే కేవలం క్రికెట్ కాదు… ప్రెజర్, మైండ్సెట్, మెంటల్ స్ట్రెంత్ మధ్య జరిగే యుద్ధం. ఈ మ్యాచ్లలో ఎవరి టాలెంట్ ఎక్కువ అనేది కాదు — ఒత్తిడిని ఎవరు బెటర్గా హ్యాండిల్ చేస్తారన్నదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది.
భారత ఆటగాళ్లు సంవత్సరం మొత్తం హై-ప్రెజర్ వాతావరణంలోనే ఉంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి టాప్ టీమ్స్తో నిరంతరం సిరీస్లు… పైగా IPL వంటి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్లో ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ లాంటిదే. అందుకే భారత ఆటగాళ్లు కేవలం స్కిల్స్ మాత్రమే కాదు, మానసికంగా కూడా బలంగా తయారవుతారు.
చిన్న టీమ్పై సెంచరీ కొట్టినా విమర్శలు వస్తాయి, స్ట్రైక్ రేట్, మ్యాచ్ ఇంపాక్ట్, ప్రెజర్ హ్యాండ్లింగ్ అన్నీ విశ్లేషించబడతాయి. ఎందుకంటే భారత క్రికెట్లో స్టాండర్డ్ చాలా హైగా ఉంటుంది.
ఇంకొకవైపు, పాకిస్తాన్ క్రికెట్లో చాలాసార్లు చిన్న విజయాలను పెద్దగా సెలబ్రేట్ చేయడం, బలహీన టీమ్లపై రన్స్ పోగు చేసి స్టాటిస్టిక్స్ను హైలైట్ చేయడం కనిపిస్తుంది. ఇది కొన్నిసార్లు అసలు పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా డిల్యూషన్ తీసుకువస్తుంది. నిజమైన పరీక్ష మాత్రం హై-ప్రెజర్ మ్యాచ్లలోనే జరుగుతుంది.
భారత్ ఎన్నో ఏళ్లుగా నిరంతర ఒత్తిడిలో ఉండి కూడా విజయాలను సాధించడం నేర్చుకుంది. మీడియా స్క్రూటిని, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్, పెద్ద స్టేజ్ మ్యాచ్లు — ఇవన్నీ కలిసి భారత ఆటగాళ్లను మెంటల్గా చాలా స్ట్రాంగ్గా మార్చాయి. అదే కారణంగా భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్లలో భారత టీమ్ ఎక్కువగా కామ్గా, క్లియర్ ప్లాన్తో ఆడుతుంటుంది.
చివరగా చెప్పాలంటే…: ఇండియా అసలైన బలం కేవలం టాలెంట్ కాదు… ఎలాంటి ఒత్తిడిలోనైనా నిలబడే మైండ్సెట్. అదే వారిని మెంటల్గా ఫార్మిడబుల్ టీమ్గా మార్చింది … —
*ఉపద్రష్ట పార్ధసారధి*
అట్లుంటది మనతో..🤔 #f🤣un..
ఆరు బాల్స్ లో ఆరు సిక్స్ లు కొడతా అన్నావ్
సున్నాకె అవుటయ్యావ్.. 😂😂🤣
*🔔_ #🌅శుభోదయం🌻🌺_🔔*
*_నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది._*
*_నమ్మకం లేకుంటే ప్రతిమాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥
*పాక్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ... హ్యాట్రిక్ విజయంతో సూపర్-8 రౌండ్కు..❗*
16.02.2025🏏
* దంచికొట్టిన ఇషాన్ .. అదరగొట్టిన బౌలర్లు
* దాయాది జట్టుపై ఇండియా గ్రాండ్ విక్టరీ
* 61 రన్స్ తేడాతో చిత్తయిన సల్మాన్ సేన
* 40 బాల్స్లో 77 రన్స్తో చెలరేగిన ఇషాన్
* పాక్ బ్యాటర్స్ను ఆటాడుకున్న బౌలర్లు
* 61 రన్స్ తేడాతో చిత్తైన పాకిస్తాన్
* టీ20 వరల్డ్ కప్ సూపర్-8కు టీమిండియా
గ్రౌండ్ ఏదైనా.. గండం మాత్రం పాకిస్తాన్కే అని ఇండియా మరోసారి చాటి చెప్పింది. మహాశివరాత్రి పర్వదినాన జరిగిన టీ20 వరల్డ్ కప్ మెగా సమరంలో టీమిండియా రుద్రరూపం ముందు దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది. శ్రీలంక గడ్డపై యంగ్ సెన్సేషన్ ఇషాన్ కిషన్ (40 బాల్స్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) షాన్దార్ బ్యాటింగ్తో శివాలెత్తిన వేళ.. ఆదివారం జరిగిన హై-ఓల్టేజ్ పోరులో 61 రన్స్ తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన సూపర్-8 కు దూసుకెళ్లింది.
స్పిన్ వలతో మనల్ని బోల్తా కొట్టించాలనుకున్న పాక్ ఎత్తులను కిషన్ తన బ్యాట్ పవర్తో తుత్తునియలు చేస్తూ మైదానంలో 'రన్'రగం సృష్టించాడు. దాంతో 20 ఓవర్లలో ఇండియా 175/7 స్కోరు చేసింది. అనంతరం వికెట్ల వేటలో పోటీపడ్డ బౌలర్లు పాక్ను ఓ ఆటాడుకున్నారు. మన బౌలర్ల మూకుమ్మడి దాడికి పాక్ 18 ఓవర్లలో 114 రన్స్కే కుప్పకూలింది. ఫలితంగా వరల్డ్ కప్ చరిత్రలో పాక్పై విజయాల రికార్డును 8-1కి పెంచుకున్న ఇండియా సరికొత్త చరిత్ర లిఖించింది. ఇది కేవలం విజయం మాత్రమే కాదు.. పాక్ అహంకారంపై ఎగురవేసిన విజయకేతనం! జయహో ఇండియా!
పాకిస్తాన్తో ఏ గ్రౌండ్లో వార్కు దిగినా తమకు తిరుగులేదని ఇండియా మళ్లీ చాటిచెప్పింది. టీ20 వరల్డ్ కప్ హై ఓల్టేజ్ పోరులో టీమిండియా కొట్టిన దెబ్బకు పాక్ బేజారింది. 18 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేసి తమను దెబ్బతీయాలని చూసిన దాయాదిపై యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బాల్స్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) ఫోర్లు, సిక్సర్లతో తాండవం చేసిన వేళ.. బౌలర్లు బంతితో పాక్ను అష్టదిగ్బంధనం చేశారు.
ఫలితంగా మెగా టోర్నీలో పాక్పై అతి పెద్ద విజయం అందుకున్న టీమిండియా సూపర్-8 రౌండ్కు చేరుకుంది. టీ20 వరల్డ్ కప్స్లో ఆ జట్టుపై విజయాల రికార్డును 8-1కి పెంచుకుంది. ఓటమి భయంతోనే కాబోలు.. ముందే బాయ్కాట్ రాగం ఎత్తుకున్న పాక్కు అసలైన సినిమా చూపించింది! మొత్తంగా మహా శివరాత్రి రోజున యావత్ క్రికెట్ ప్రపంచం కళ్లప్పగించి చూసిన మెగా మ్యాచ్ పాకిస్తాన్కు కాళరాత్రిగా మారింది.
కొలంబో: ఈసారైనా హోరాహోరీగా సాగుతుందని అనుకున్న ఇండియా-పాకిస్తాన్ హై ఓల్టేజ్ పోరు మళ్లీ వన్సైడే అయ్యింది. గ్రౌండ్లో పాక్కు షేక్హ్యాండ్ ఇవ్వని సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఇండియా.. తమ ఆటతో ప్రత్యర్థిని మరోసారి షేక్ చేసింది. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్లో ఇండియా 61రన్స్ తేడాతో పాక్ను చిత్తు చిత్తుగా ఓడించింది. టోర్నీలో హ్యాట్రిక్ విక్టరీతో సూపర్-8 రౌండ్కు దూసుకెళ్లింది.
వన్సైడ్ పోరులో తొలుత ఇండియా 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29 బాల్స్లో 3 ఫోర్లతో 29), శివం దూబే (17 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 27), తిలక్ వర్మ (25) కూడా రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ ఆయుబ్ (3/25) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్లో పాక్ 18 ఓవర్లలో 114 రన్స్ కే కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ (34 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 44), షాహీద్ ఆఫ్రిది (23 నాటౌట్) మాత్రమే కాస్త పోరాడారు. ఇండియా బౌలర్లలో హార్దిక్, బుమ్రా, అక్షర్, వరుణ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇషాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో ఇండియా పోటీ పడనుంది.
18 ఓవర్లు స్పిన్.. ఇషాన్ ధనాధన్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్ స్లో, టర్నింగ్ వికెట్పై స్పిన్తో ఇండియాను దెబ్బకొట్టాలని ప్లాన్ చేసింది. ఏకంగా 18 ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ చేసింది. కెప్టెన్, పార్ట్టైమ్ స్పిన్నర్ సల్మాన్ ఆఘా ఫస్ట్ ఓవర్లో తానే బౌలింగ్కు దిగాడు. తొలుత ఈ ప్రయోగం ఫలించింది. ఇన్నింగ్స్ ఆరో బాల్కు ఓపెనర్ అభిషేక్ శర్మ (0) భారీ షాట్కు ప్రయత్నించి షాహీన్ చేతికి చిక్కడంతో ఆదిలోనే ఇండియాకు షాక్ తగిలింది. కానీ మరో డ్యాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్.. పాక్ ప్లాన్ను దెబ్బ తీశాడు. పిచ్ నెమ్మదిగా ఉన్నా.. స్టార్టింగ్లోనే వికెట్ పడినా అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఆడాడు.
స్టేడియం నలుమూలలా షాట్లు కొడుతూ ఇండియా హీరో అయ్యాడు. రెండో ఓవర్లో పేసర్ షాహీన్ వేసిన ఫస్ట్ బాల్నే ఇషాన్ పుల్ షాట్తో మిడ్-వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన తీరు ఇన్నింగ్స్కే హైలైట్. పవర్ ప్లేలోనే పాక్ ముగ్గురు స్పిన్నర్లను బౌలింగ్కు దింపినా.. ఇషాన్ వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఐదో ఓవర్లో లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో సిక్స్, ఫోర్ బాదాడు. థర్డ్ మ్యాన్ దిశగా అతను ఆడిన లేట్ కట్ షాట్ అద్భుతం.
మరో ఎండ్లో తిలక్ సింగిల్స్తో ఇషాన్కు స్ట్రయిక్ ఇచ్చాడు. సైమ్ వేసిన ఆరో ఓవర్లో ఇషాన్, తిలక్ చెరో ఫోర్ రాబట్టడంతో పవర్ప్లేను ఇండియా 52/1తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత ఇషాన్ మరింత రెచ్చిపోయాడు. అబ్రార్ వేసిన ఏడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించి 27 బాల్స్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే షాదాబ్కు6, 4తో వెల్కం చెప్పిన అతను సెంచరీ చేసేలా కనిపించాడు.
దెబ్బకొట్టిన సైమ్ ఆయుబ్
ఇషాన్ దూకుడు చూస్తుంటే ఇండియా ఈజీగా 200 రన్స్ చేసేలా కనిపించింది. కానీ, పాక్ పార్ట్టైమ్ స్పిన్నర్ సైమ్ అయూబ్ టీమిండియా జోరుకు బ్రేక్ వేశాడు. దూకుడుగా ఆడుతున్న కిషన్ను తొమ్మిదో ఓవర్లో స్లో బాల్తో బౌల్డ్ చేయడంతో రెండో వికెట్కు 87 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఈ టైమ్లో తిలక్కు తోడైన కెప్టెన్ సూర్య కుదురుకునేందుకు టైమ్ తీసుకున్నాడు. సూర్య బ్యాటింగ్కు రాగానే సల్మాన్ పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ను బౌలింగ్ను దింపాడు. రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లను ప్రయోగించడంతో తిలక్, సూర్య భారీ షాట్లు ఆడలేకపోయారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత సైమ్ ఇండియాకు డబుల్ షాకిచ్చాడు. 15వ ఓవర్లో వరుస బాల్స్లో తిలక్, హార్దిక్ పాండ్యా (0)ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు.
దూబే, రింకూ ఫినిషింగ్ టచ్
పాక్ స్పిన్నర్లు కట్టడి చేయడంతో 13 నుంచి 17 ఓవర్ల మధ్యలో ఇండియా 22 రన్స్ మాత్రమే చేసి డీలా పడింది. అయితే. స్లాగ్ ఓవర్లలో సూర్య, శివం దూబే జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. అబ్రార్ వేసిన 18వ ఓవర్లో సూర్య ఫోర్, దూబే సిక్స్తో మళ్లీ జోష్ తెచ్చారు. కానీ, 19వ ఓవర్లో సూర్యను ఔట్ చేసిన తారిఖ్ 5 రన్సే ఇచ్చాడు. షాహీన్ వేసిన ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో దూబే ఓ ఫోర్ కొట్టగా.. హిట్టర్ రింకూ సింగ్ (11 నాటౌట్) వరుసగా 4, 6తో స్కోరు 170 దాటించాడు. ఐదో బాల్కు దూబే రనౌటవ్వగా.. లాస్ట్ బాల్కు భారీ షాట్కు ట్రై చేసిన అక్షర్ (0) సైమ్కు క్యాచ్ ఇచ్చాడు.
వణికిన పాక్..
టార్గెట్ ఛేజింగ్లో ఇండియా బౌలింగ్ను ఎదుర్కోలేక పాక్ తోకముడిచింది. ఆ దేశ స్పిన్నర్లు రాణించిన వికెట్పై సూర్యసేన పేస్, స్పిన్తో అదరగొట్టింది. హార్దిక్, బుమ్రా తమ తొలి ఓవర్లలోనే ప్రత్యర్థిని చావు దెబ్బకొట్టారు. ఫామ్లో ఉన్న ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ (0)ను నాలుగో బాల్కే స్లో షార్ట్ పిచ్ డెలివరీతో పాండ్యా బోల్తా కొట్టించాడు. రెండో ఓవర్లో తనకు సిక్స్తో వెల్కం చెప్పిన సైమ్ ఆయుబ్ (6)ను బుమ్రా ఫుల్ లెంగ్త్ బాల్తో ఎల్బీ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు.
లాస్ట్ బాల్కు కెప్టెన్ సల్మాన్ (4)ను పెవిలియన్ చేర్చడంతో పాక్ 13/3తో ఎదురీత మొదలు పెట్టింది. ఐదో ఓవర్లో బాబర్ ఆజమ్ (5)ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పాక్ జట్టంతా సైలెంట్ అయిపోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఓ ఎండ్లో ఉస్మాన్ ఖాన్ భారీ షాట్లతో ఎదురుదాడికి దిగాడు. అక్షర్ను టార్గెట్ చేసి అతని బౌలింగ్లోనే ఆరు ఫోర్లు కొట్టాడు. అయితే పదో ఓవర్లో ఉస్మాన్ను స్టంపౌట్ చేసిన అక్షర్ రివెంజ్ తీర్చుకున్నాడు. ఆ వెంటనే కుల్దీప్ బౌలింగ్లో నవాజ్ (4) వెనుదిరగ్గా.. తిలక్ బౌలింగ్లో షాట్కు ట్రై చేసిన షాదాబ్ ఖాన్ (14) దూబే క్యాచ్ ఇవ్వడంతో పాక్ ఓటమి ఖాయమైంది. చివర్లో షాహీన్ ఆఫ్రిది మెరుపులు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి.
నో షేక్హ్యాండ్
ఆసియా కప్లో మొదలైన నో షేక్హ్యాండ్ పాలసీని ఇండియా ఈ మ్యాచ్లోనూ కొనసాగింది. టాస్ టైమ్లో పాక్ కెప్టెన్ సల్మాన్ కు సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆట పూర్తయ్యాక ఇరు జట్ల ప్లేయర్లు చేతులు కలపలేదు.
పాక్పై టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (27 బాల్స్). 2012లో యువరాజ్ సింగ్ 29 బాల్స్ లో కొట్టిన ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేశాడు.
టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ పవర్ప్లేలోనే 4 వికెట్లు కోల్పోవడం ఇది రెండోసారి.టీ20 వరల్డ్ కప్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైన మూడో బ్యాటర్ అభిషేక్ శర్మ. ఆశిష్ నెహ్రా, ఇమ్రుల్ కయేస్ (బంగ్లాదేశ్) ముందున్నారు. టీ20 వరల్డ్ కప్లో పాక్పై ఇండియా ఆధిక్యం ఇది. ఈ టోర్నీలో ఒకే ప్రత్యర్థిపై ఎక్కువ సార్లు గెలిచిన రికార్డు కూడా ఇదే. బంగ్లాదేశ్పై ఆసీస్ ఆరుసార్లు గెలిచింది.ఈ మ్యాచ్లో పాక్ 18 ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించింది. ఓ వరల్డ్ కప్ ఇన్నింగ్స్ లో స్పిన్నర్లు అత్యధిక ఓవర్లు వేసిన రెండో మ్యాచ్ ఇది. 2012లో ఆస్ట్రేలియాపై పాక్ 18 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేసింది.
స్కోర్బోర్డ్
ఇండియా ఇన్నింగ్స్: అభిషేక్ (సి) షాహీన్ (బి) సల్మాన్ 0, ఇషాన్ (బి) సైమ్ 77, తిలక్ (ఎల్బీ) (బి) సైమ్ 25, సూర్యకుమార్ (సి) సైమ్ (బి) ఉస్మాన్ 32, హార్దిక్ (సి) బాబర్ (బి) సైమ్ 0, దూబే (రనౌట్) 27, రింకూ సింగ్ (నాటౌట్) 11, అక్షర్ (సి) సైమ్ (బి) షాహీన్ 0; ఎక్స్ట్రాలు: 3; మొత్తం 20 ఓవర్లలో 175/7; వికెట్ల పతనం:1-1, 2-88, 3-126, 4-126, 5-159, 6-175, 7-175; బౌలింగ్: సల్మాన్ 2--0--10--1, షాహీన్ 2--0--31--1, సైమ్ అయూబ్ 4--0--25--3, అబ్రార్ 3--0--38--0, షాదాబ్ 1--0--17--0, నవాజ్ 4--0--28--0, ఉస్మాన్ తారిఖ్ 4--0--24--1.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: సాహిబ్జాదా (సి) రింకూ (బి) పాండ్యా 0, సైమ్ (ఎల్బీ) (బి) బుమ్రా 6, సల్మాన్ (సి) పాండ్యా (బి) బుమ్రా 4, బాబర్ (బి) అక్షర్ 5, ఉస్మాన్ (స్టంప్డ్) కిషన్ (బి) అక్షర్ 44, షాదాబ్ (సి) దూబే (బి) తిలక్ వర్మ 14, నవాజ్ (సి) దూబే (బి) కుల్దీప్ 4, ఫహీమ్ అష్రఫ్ (సి) రింకూ (బి) వరుణ్ 10, షాహీన్ అఫ్రిది (నాటౌట్) 23, అబ్రార్ (ఎల్బీ) వరుణ్ 0, తారిఖ్ (బి) పాండ్యా 0; ఎక్స్ట్రాలు: 4; మొత్తం: 18 ఓవర్లలో 114 ఆలౌట్; వికెట్ల పతనం: 1--0, 2--6, 3--13, 4--34, 5--73, 6--78, 7--78, 8--97, 9--97, 10--114; బౌలింగ్: హార్దిక్ 3--1--16--2, బుమ్రా 2--0--17--2, అక్షర్ 4--0--29--2, వరుణ్ చక్రవర్తి 3--0--17--2, కుల్దీప్ 3--0--14--1, తిలక్ 2--0--11--1, రింకూ 1--0--9--0.
#జయహో భారత్🇮🇳
*రికార్డు సృష్టించిన ఇండియా❗*
16.02 2025✍️
T 20 ప్రపంచకప్ 2026లో భారత్ (Team India) తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వేదికతో సంబంధం లేకుండా, ప్రత్యర్థి ఎవరైనా భారత ఆధిపత్యం మాత్రం తగ్గడం లేదు.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు, దాయాది పాకిస్థాన్పై మరోసారి పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో సూర్య సేన 61 పరుగుల భారీ తేడాతో గెలిచి, సూపర్-8 బెర్త్ను ఖరారు చేసుకుంది.
ఓ జట్టుపై అత్యధిక సార్లు గెలిచిన టీమ్గా భారత్
ఈ విజయంతో పాకిస్థాన్పై భారత్ (Team India) తమ రికార్డును 8-1కి మెరుగుపరుచుకుంది.
ఈ నేపథ్యంలోనే, ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక సార్లు గెలిచిన టీమ్గా రికార్డు సృష్టించింది. పాక్తో జరిగిన 9 మ్యాచుల్లో ఏకంగా 8 సార్లు భారత్ గెలిచింది. మరే జట్టూ దరిదాపుల్లో కూడా లేదు. బంగ్లాపై ఆస్ట్రేలియా, బంగ్లాపై పాకిస్థాన్, వెస్టిండీస్పై శ్రీలంక, ఇంగ్లండ్పై వెస్టిండీస్ 6 విజయాలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.













