#🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥
*‘బలుపు కా బాప్’… నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేశావురా హార్దిక్…‼️*
February 18, 2026🏏
మిత్రుడు బెల్లంకొండ ప్రసేన్ రీసెంటుగా ఫేస్బుక్లో ఓ ఇన్స్టా వీడియో బిట్, దానికి చిన్న రైటప్ షేర్ చేసుకున్నట్టు గుర్తుంది… బాగుంది… ఈరోజు వెతికితే పోస్టు ఉంది, కానీ నెట్ నుంచి, సోషల్ మీడియా ప్లాట్ఫారాల నుంచి ఆ వీడియో బిట్ మాయం… కారణం తెలియదు గానీ… భలే ఉంది అది…
ఇదే టీ20 వరల్డ్ కప్ పోటీలు… కొలంబోలో పాకిస్థాన్తో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్… అదీ ఫస్ట్ ఓవర్లోనే… యాటిట్యూడ్ కా బాప్ అనిపించుకెునే హార్దిక్ పాండ్యా ‘నో లుక్ వికెట్’ సీన్ అది… వెతగ్గా వెతగ్గా… ఓ ఫేస్బుక్ రీల్లో కనిపించింది… కాపీ రైట్ సమస్యతో ఇది కూడా బహుశా మాయం అయిపోవచ్చు కూడా… ఓసారి ఆ పోస్టులోకి వెళ్దాం… (నిన్నటిదే)…
Prasen Bellamkonda ….
Altitude of attitude… బలుపంటూ ఉంటే అలానే ఉండాలి. నచ్చావ్ హార్దిక్.
#
అద్సరేగానీ…
నిన్న పాక్ ఇండియా మ్యాచ్ లో కొన్ని ఫ్రేజ్ లు నాకు కొత్తగా అర్ధమయాయి.
స్టాండ్ అండ్ డెలివర్ అనే పదబంధాన్ని సెహ్వాగ్ లాంటి వాళ్ళ కొట్టుడుకి వాడతారు.
కానీ నిన్న ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ కు ఆ ఫ్రేజ్ సరిగ్గా సరిపోతుందని తెలిసింది. నిలబడి బౌల్ చేయడం.
నో లుక్ హిట్ అంటే కొట్టేసి ఆ బంతి సిక్స్ పోయినట్టే అని కనీసం ఆ బంతి వైపు చూడనైనా చూడకపోవడం. ఇది చాలా మంది బాట్స్మన్లలో చూడొచ్చు.
కానీ నిన్న హార్దిక్ మొదటి వికెట్ తీస్తూ కనీసం రింకూ ఆ క్యాచ్ పట్టాడా లేదా అని చూడకపోవడం నిజంగా హైట్ ఆఫ్ 'నో లుక్ వికెట్'.
భూమిని 70 శాతం నీరు కవర్ చేస్తే మిగతా ముప్పైశాతం రింకూ కవర్ చేస్తాడని ఫీల్డింగ్లో పేరు. హార్దిక్ ది ఆ నమ్మకం కావచ్చు కానీ మనకు రాబోయే వికెట్ గురించి ఇంత నిర్వేదంగా ఉండడం ప్రపంచంలో ఏ మానవమాత్ర బౌలర్ వల్లా కాదు.
బలుపు కా బాప్ అయితేనే అది సాధ్యం. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చావురా హార్దిక్.
ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ లో అయితే బంతిని ఆలస్యంగా వేసాడు కానీ బ్యాటింగ్ లో బ్యాట్ ను ముందే డిఫెన్స్ పొజిషన్ లో పెట్టేస్తున్నాడు. ఇంత కామెడీ బ్యాటింగ్ పొజిషన్ ను నేనైతే అస్సలు బ్యాటింగ్ రాని చంద్రశేఖర్, దోషి లాంటి వాళ్ళ దగ్గర కూడా చూడలేదు.
మ్యాచ్ నడుస్తుంటే మా సీతారాం ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అన్నాడు. నెక్స్ట్ ఓవర్లో బాబర్ అవుట్, చూడు అన్నాను. అన్నట్టే అయాడు. నాకు తెలిసిన విషయం పాక్ మేనేజ్ మెంట్ కు ఎందుకు తెలియలేదో అర్ధం కాలేదు.
వాడెవడో పాకిస్థాన్ కుర్రోడు చేసిన ‘ బాబర్ ను పాక్ టీమ్ లోనే కాదు పాకిస్థాన్ లోనే ఉంచొద్దు ‘ అన్న కామెంట్ లో కామెడీ కంటే నిజమే ఎక్కువ వుంది. నిన్నటి పాక్ భారత్ మ్యాచ్ సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ బాగా పండింది…
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*ఏపీ రాజకీయాల్లో కోవా – నెయ్యి – పెరుగు – ప్రతిదీ గాయిగత్తరే…⁉️*
February 18, 2026🎯
ఒక జాతర… అదీ తెలంగాణలోని ప్రముఖ జాతర… అక్కడ అన్ని మతాల చిన్న వ్యాపారులు నాలుగు డబ్బులు సంపాదించుకుందామని వస్తారు… సహజం… పొట్టపోసుకునే ప్రయత్నం…
కానీ ఏం జరిగింది..? కోవా బన్ను అమ్ముకునే ఎవరో చిన్న వ్యాపారిని ఎవరో ఓ చానెల్ వాళ్లు గెలికారు, ఏదో ఆరోపించారు… అదంతా ఒక కోణంలో నాన్సెన్స్… అమానవీయం… మరీ దానికి ఫుడ్ జిహాద్ అని పేరుపెట్టి మరీ కొందరు రచ్చ చేయడానికి ప్రయత్నించారు… వ్యక్తుల నడుమ రచ్చను మతాలకు ముడిపెట్టడం దేనికి..? వోటు బ్యాంకు రాజకీయాల వైపు మళ్లించడం దేనికి..
ఆ బన్ను కల్తీయా, మరొకటా అనేది ఇక్కడ చర్చ కాదు, జాతరలో రకరకాల వ్యాపార వస్తువులు అమ్ముతారు, వాటి నాణ్యత, వాటి ధర కొనేవాడి ఇష్టం… సరే, సదరు చిరు వ్యాపారికి ఎస్డీపీఐ వంటి నిషిద్ద, ప్రమాదకర సంస్థ మద్దతు అనేది కొంత ఆలోచించాల్సిన విషయం…
దాన్ని అంతటితో వదిలేయలేదు ఏపీ పాలిటిక్స్… విషయం ఏదైనా గాయిగత్తర చేయడమే కదా ఏపీ పాలిటిక్స్ నైజం… రాజకీయాలు పులుముతారు కదా… ఇక్కడా అంతే..,. లోకేష్ ట్వీట్, నేను నీ కోవా బన్ను తింటాను అని… ఎందుకు..? ఏం చెప్పదలుచుకున్నాడు..? ఇష్యూను మరింత సీరియస్ చేయాలనేనా ఉద్దేశం..? లేక ఇది మైనారిటీ హక్కులు, మనోభావాల ఇష్యూగా చిత్రీకరించాలనా..?
నాగబాబు… పేరుకు నాస్తిక చక్రవర్తి… తనేం మాట్లాడతాడో తనకూ తెలియదు చాలాసార్లు… ఇప్పుడు సదరు వ్యాపారిని పిలిచి, ఆ కోవా బన్ను తిని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు… ఏం చెప్పదలుచుకున్నాడు..? దాని నాణ్యతకు, పవిత్రతకు సర్టిఫికెట్ ఇస్తున్నాడా..? చూశావా, మేమెంత మానవతావాదులమో అని ఓ ఓ చిత్రీకరణా…?
మరి హిందూ గుళ్ల మీద దాడులు జరిగినప్పుడు, విగ్రహాల తలలు నరికేసినప్పుడు, ఏమయ్యాయి ఈ గొంతులు..? ఒక్క కోవా బన్ను మీద ఎందుకింత ఓవరాక్షన్..? సదరు వ్యాపారికి మద్దతుగా బోలెడు పోస్టులు, లక్షల వసూళ్లు, విరాళాలు.., చివరకు దీన్ని ఏమని చిత్రీకరిస్తున్నారు అందరూ కలిసి..?
సదరు చానెల్ చేసింది తప్పే, మత విద్వేషం పెంచుతున్నారు అని భావిస్తే చర్యలు తీసుకొండి… సదరు వ్యాపారికి నష్టం వాటిల్లితే మానవతా కోణంలో ఏదైనా పథకంలో ఇన్క్లూడ్ చేసి, సాయం చేయండి, నిలబెట్టండి… అంతేతప్ప ప్రతిదానికీ రాజకీయాలను పులమడం దేనికి..? పొలిటికల్ షో దేనికి..?
(తెలంగాణ ప్రభుత్వం దీన్ని లైట్ తీసుకుంది, తన పరిధిలో జరిగిన వివాదమే అయినా సరే… దీన్ని మరింత రచ్చ చేయడం సొసైటీకి అంతిమ నష్టం కాబట్టి… టీడీపీ, జనసేనల నుంచి ఈ సోయి కనిపించడం లేదు…)
చివరకు దీన్ని తిరుమల లడ్డూకు ముడిపెట్టి చర్చలు, రాద్ధాంతం చేస్తున్నారు… అసలు దానికీ దీనికీ లింకేమిటి..? సరే, తిరుమల లడ్డూ సంగతికే వద్దాం… గతంలో ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు స్పష్టంగా చెప్పింది… జంతువుల కొవ్వుల గురించి… కానీ సీబీఐ సిట్ మాత్రం కేవలం ‘నెయ్యి కాని నెయ్యి’ దగ్గరే ఆగిపోయింది… అంటే కేంద్రం కూడా ఇంకా ఇంకా లడ్డూ మీద దుష్ప్రచారం జరగకూడదని..! దాని విశిష్టతకు ఇంకా భంగం వాటిల్లకూడదని..! కేంద్రం భావన టీడీపీ క్యాంపుకి అర్థం కాలేదు…
అందుకే పదే పదే తన సోషల్ మీడియా, మీడియా ద్వారా గాయిగత్తర వరుస కథనాలకు, పోస్టులకు దిగారు… అసలు ఈ జంతు కొవ్వుల గురించి ప్రస్తావన తెచ్చిందే చంద్రబాబు… పొలిటికల్ ఫాయిదా కోసం… అదేదో దర్యాప్తు చేయిస్తే అయిపోయేది, కానీ కావాలని జగన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం కోసం… ఎస్, జగన్ క్యాంపు తిరుమలను భ్రష్టుపట్టించింది నిజమే… కానీ సిస్టమాటిక్గా చంద్రబాబు ఎక్స్పోజ్ చేసి, ఎస్టాబ్లిష్ చేసింది ఎక్కడ..?
(ఏమాటకామాట… ఏపీబీజేపీ సంయమనం పాటిస్తోంది… ) ఈలోపు వైసీపీ క్యాంపు హెరిటేజ్ పెరుగు, పాలపై ప్రచారానికి దిగింది… అది మరో బ్లండర్… నెయ్యి కాని నెయ్యి కీ హెరిటేజ్ పెరుగుకూ ఏం లింక్..? చంద్రబాబు హెరిటేజ్ ద్రోహం చేస్తే, జగన్ లడ్డూకు చేసిన ద్రోహాలు బారాఖూన్ మాఫ్ అనుకోవాలనా..?
ఈ ప్రచారంపై హెరిటేజ్ లీగల్ ఫైట్కు రెడీ కాగానే, తాజాగా ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ అనుబంధమేననీ, ఆ నెయ్యిలో టాయిలెట్ క్లీనర్ల అవశేషాల మాటేమిటీ అని చట్టసభలో ప్రస్తావనకు తీసుకొచ్చారు… ఇదే కాదు, గతంలో చంద్రబాబు హయాంలోనే సదరు అక్రమ డెయిరీల నుంచి కోట్ల రూపాయల నెయ్యి కొన్నట్టు, టీటీడీ బ్లాక్ లిస్టు చేసినా సరే, అనతికాలంలోనే ఆ నిషేధం తొలగించినట్టు కూడా ప్రచారం మొదలెట్టారు… వెరసి టీడీపీ క్యాంప్ ఫుల్ డిఫెన్సులో పడినట్టు కనిపిస్తోంది… అబ్బే, అవి కంట్రాక్టు మాన్యుఫాక్చరింగ్ ఒప్పందాలు మినహా సదరు డెయిరీ నెయ్యి సరఫరాలతో తమకేమీ సంబంధం లేదని హెరిటేజ్ క్లారిటీలు ఇస్తోంది…
అంతేకాదు, ఢిల్లీ నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు అందినట్టున్నాయి… తిరుమల లడ్డూ యవ్వారాన్ని కంపు చేయడం ఇక మానేయాలని..! ప్చ్, ఏపీ రాజకీయాల్లో కాదేదీ రాజకీయాలకనర్హం… బన్ను కోవా, లడ్డూ నెయ్యి, పట్టు శాలువా, హెరిటేజ్ పెరుగు… ఎటెటో తిప్పుతున్నారు… ఏం రాజకీయాలురా బాబూ..!!
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁
*బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీ పై సుప్రీం సంచలన ఆదేశాలు..⚖️*
17.02.2025🎯
తెలంగాణలో ప్రముఖ విద్యాసంస్థ అయిన గీతం యూనివర్సిటీకి సంబంధించి వందల కోట్ల విద్యుత్ బకాయిల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
విశాఖపట్నం ఎంపీ భరత్ యాజమాన్యంలో ఉన్న ఈ యూనివర్సిటీకి అనుబంధంగా విబిసి ఫెరో అలాయ్స్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా నడుస్తోంది. ఈ రెండు సంస్థలు ఒకే మేనేజ్మెంట్ కింద ఉంటూ ఒకే విద్యుత్ మీటర్ వాడుతున్నాయని విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. అయితే విబిసి ఫెరో అలాయ్స్ కంపెనీ గత పద్దెనిమిది ఏళ్లుగా కరెంటు బిల్లులు కట్టకుండా పెండింగ్ లో పెట్టింది. వడ్డీతో కలిపి ఈ మొత్తం దాదాపు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలకు చేరుకుంది. సామాన్యులు రెండు నెలలు బిల్లు కట్టకపోతే వెంటనే కరెంటు కనెక్షన్ కట్ చేసే అధికారులు ఇన్ని ఏళ్లుగా ఇన్ని కోట్లు బకాయి ఉన్నా ఎలా ఊరుకున్నారనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ బకాయిల వసూలు కోసం విద్యుత్ సంస్థలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. మొదట కేసు విచారించిన సింగిల్ బెంచ్ ఈ రెండు సంస్థలు ఒకే మేనేజ్మెంట్ కింద ఉన్నాయని తేల్చి వెంటనే నూట ఎనిమిది కోట్లు కట్టాలని తీర్పు ఇచ్చింది. దీనిపై గీతం యాజమాన్యం డివిజన్ బెంచ్ కి వెళ్ళగా అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. మూడు వారాల్లో యాభై నాలుగు కోట్లు కట్టకపోతే కరెంటు కట్ చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో గీతం యూనివర్సిటీ యాజమాన్యం చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ వీరికి కొంత ఊరట లభించినప్పటికీ నిధుల జమ విషయంలో కోర్టు కఠినంగానే వ్యవహరించింది. మూడు వారాల గడువులోగా పదిహేను కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అసలు గీతం యూనివర్సిటీకి మరియు విబిసి ఫెరో అలాయ్స్ కంపెనీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మళ్ళీ హైకోర్టు సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. రెండు సంస్థలు ఒకే యాజమాన్యం కింద ఉన్నాయా లేదా అనే అంశంపై మళ్ళీ మొదటి నుంచి వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఒక పక్క సామాన్య ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసే విద్యుత్ సంస్థలు ఇలాంటి పెద్ద సంస్థల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. పద్దెనిమిది ఏళ్ల పాటు బిల్లు కట్టకపోయినా కరెంటు సరఫరా ఎలా కొనసాగిందనేది పెద్ద ప్రశ్న. ఇలాంటి పెద్ద సంస్థలు సాంకేతిక కారణాలు చూపిస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతూ బకాయిలు కట్టకుండా తప్పించుకోవాలని చూడటం సరికాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకుని ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉంచడం వెనుక ఎవరెవరి హస్తం ఉందో కూడా బయటపడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా వసూలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చట్టం అందరికీ ఒకేలా పని చేస్తోందా లేదా అనే అనుమానం సామాన్యుడికి కలగడం సహజం.
#జై జవాన్ జై కిసాన్
*🇮🇳దేశ సరిహద్దుల్లో విధినిర్వహణలో అమరుడైన తన భర్తను కడసారి చూసేందుకు, కేవలం 8 గంటల క్రితం పుట్టిన కుమార్తెను తీసుకుని స్ట్రెచర్ పై వచ్చిన భార్య. సెల్యూట్*🙏
https://youtube.com/watch?v=GGnL2ddfOhE&si=VayYp-DEX_eEYDZw #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
#f🤣un..
*బరువు తగ్గడానికి.... మీ జీవిత భాగస్వామి సహాయం తీసుకోండి....😀*
BEST WAY... 👍
https://youtube.com/watch?v=dzt-jUYyQcE&si=djA1s03CFRAdU1YH #EVM హాక్ ⁉️










