P.Venkateswara Rao
ShareChat
click to see wallet page
@prasad831
prasad831
P.Venkateswara Rao
@prasad831
ప్రేమించు కానీ నటించకు
#✍️కోట్స్ *ఆవేశం పడకు......నీకే నష్టం* మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారి మాటలను మౌనంగా వినండి.. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది.. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు....!! అంతర్గతంగా ఉండే శక్తులు.. అవి అందరిలోనూ ఉండవు..🤗
✍️కోట్స్ - Morwings Good Da Hae a Fanastic Morwings Good Da Hae a Fanastic - ShareChat
#⚜️🔱కర్మ సిద్ధాంతం 🧓
⚜️🔱కర్మ సిద్ధాంతం 🧓 - ಇಆಠಲನಾಕನಂ కోరే ఆలోచన పుట్టిన క్షణమే భగవంతుడు మన లెక్క రాయడం మొదలుపెడతాడు కర్తశ ఖాతాలో ಒ9 అక్షరం కూదా తప్పదు: ಇಆಠಲನಾಕನಂ కోరే ఆలోచన పుట్టిన క్షణమే భగవంతుడు మన లెక్క రాయడం మొదలుపెడతాడు కర్తశ ఖాతాలో ಒ9 అక్షరం కూదా తప్పదు: - ShareChat
#EVM హాక్ ⁉️ ఏపీలో ఎన్నికల ‘మిస్టరీ’ పై ఈసీ సమాధానం చెప్పాలి సామాజిక మాధ్యమంలో ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ ‘ద వైర్‌’లో పరకాల వ్యక్తం చేసిన అనుమానాలు విలువైనవి కూటమికి 164 సీట్లు ఎలా వచ్చాయన్నది ప్రశ్నార్ధకమే అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ 2024 ఎన్నికల ‘అద్భుతం’ వెనుక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ వ్యక్తం చేసిన అనుమానాలకు ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ కూటమి 175 స్థానాలకు 164 స్థానాలు గెలుచుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనమని, ఈ ‘అద్భుతం’ ఎలా జరిగిందనే ప్రశ్న ఇప్పటికీ ఉత్పన్నమవుతూనే ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు గతంలో సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్‌ ఆ మిస్టరీ ఏమిటి..? అంటూ తాజాగా ‘ద వైర్‌’లో ఒక వ్యాసం రాశారని చెప్పారు. చంద్రబా­బుకు అత్యంత సన్నిహితుడైన పరకాల తన విలువైన వ్యాసంలో పోలింగ్‌ సరళిపై వ్యక్తం చేసిన అనుమానాలకు ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలని నాగేశ్వర్‌ సూచించారు. పరకాల వ్యక్తం చేసిన అనుమానాలను సామాజిక మాధ్యమంలో ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ వెల్లడించారు. ఆ వివరాలివీ.. వీటికి బదులివ్వాల్సిందే.. మే 13న సాయంత్రం 5 గంటల సమయంలో అప్పటి వరకూ ఓటింగ్‌ శాతం లెక్కలను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. 68.04 శాతం పోలింగ్‌ జరిగినట్లు పేర్కొంది. అయితే అప్పటికే పోలింగ్‌ బూత్‌లలో ఉన్నవారు ఓట్లు వేస్తారు కనుక అది పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తర్వాత 8 గంటలకు మరో ప్రెస్‌ నోట్‌ను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ శాతం 68.12 శాతం అని ఉంది. ఇక అదే రోజు రాత్రి 11.45 గంటలకు 76.50 శాతంగా ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. నాలుగు రోజుల తర్వాత మే 17న మరో ప్రెస్‌ నోట్‌ను విడుదల చేసింది. దానిలో 80.66 శాతం అని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య ఎన్నికల అధికారి పోలింగ్‌ శాతం 81.86 అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. చివరిగా ఎన్నికల కమిషన్‌ అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించి ఏపీలో పోలింగ్‌ శాతం 81.79గా నిర్ధారించింది. సాయంత్రం ఐదు గంటల వరకూ పది గంటల పాటు పోలింగ్‌ జరిగింది. అంటే గంటకు 6.8 శాతం, తర్వాత మూడు గంటలు 0.08 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. అంత తక్కువ పోలింగ్‌ ఎందుకు జరిగిందనే దానికి ఎన్నికల కమిషన్‌ ఇంత వరకూ వివరణ ఇవ్వలేదు. ఇదెలా సాధ్యం..? ఎన్నికల రోజు రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 3,500 పోలింగ్‌ బూత్‌లలో 4.16 శాతం పోలింగ్‌ పెరిగింది. అంటే గంటకు 2 శాతం కంటే ఎక్కువ జరిగింది. అంత భారీ స్థాయిలో అ సమయంలో ఓటింగ్‌ ఎలా జరిగిందనేది పెద్ద ప్రశ్న. కేవలం 2.15 గంటలలో 17,19,482 మంది ఓట్లు వేసేశారు. అంటే ఒక్కో పోలింగ్‌ బూత్‌లలో 491 మంది ఓట్లు వేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన ఓటింగ్‌లో ఏపీలో ఉన్న 46,389 బూత్‌లతో గంటకు దాదాపు 60 ఓట్లు పడ్డాయి. అంటే నిమిషానికి ఒక ఓటు చొప్పున పడ్డాయి. కానీ అర్ధరాత్రి ఒక్కో బూత్‌లో 491 మంది.. అంటే నిమిషానికి ముగ్గురు కంటే ఎక్కువ మంది ఓట్లు వేశారు. ఇది సాధ్యమయ్యే పనేనా? 3,500 పోలింగ్‌ బూత్‌లలో అప్పటికే 17 గంటల పాటు పోలింగ్‌ జరిగితే సగటున గంటకు 24 మందే ఓట్లు వేశారు. అదే అర్ధరాత్రి 11.45 నుంచి 2 గంటల మధ్య గంటకు 200 మంది కంటే ఎక్కువ ఓట్లు వేశారు. ఈ నెంబర్ల మధ్య అనుమానాలకు ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలి. అర్ధరాత్రి బారులు తీరి ఉన్న ఓటర్ల వీడియోలు బయటపెట్టాలి.
EVM హాక్ ⁉️ - ధ్యమంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సామాజిక మా 36' పరకాల వ్యక్తం చేసిన అనుమానాలు 6 ೮೯' విలువైనవి %कल వచ్చాయన్నది కూటమికి 164 ఎలా ప్రశ్నార్ధకమే ధ్యమంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సామాజిక మా 36' పరకాల వ్యక్తం చేసిన అనుమానాలు 6 ೮೯' విలువైనవి %कल వచ్చాయన్నది కూటమికి 164 ఎలా ప్రశ్నార్ధకమే - ShareChat
#✍️కోట్స్
✍️కోట్స్ - Always (  Smile more than Goo you cry MORNING 09&' more than you take and:| ७७e more than you hate. Always (  Smile more than Goo you cry MORNING 09&' more than you take and:| ७७e more than you hate. - ShareChat
#తిరుమల తిరుపతి *స్వర్ణదేవాలయం తరహాలో టీటీడీ చట్టం తెస్తాడట చంద్రబాబు..⁉️* February 24, 2026🕉️ నిన్న వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో ఓ వార్త కనిపించింది… అదేమిటంటే..? అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం (హర్మిందిర్ సాహిబ్) నిర్వహణ తీరు, అక్కడ అమలయ్యే చట్టం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది కదా, అచ్చంగా అదే చట్టాన్ని టీటీడీలో అమలు చేయాలనే ఆలోచనతో సమగ్ర అధ్యయనం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించాడని ఆ వార్త సారాంశం… ఎస్, ఇదొక డైవర్షన్ టాక్టిస్… జగన్‌ను హిందూ ద్రోహిగా, వెంకన్న ద్రోహిగా, కోట్లాది హిందూ మతస్తుల ద్రోహిగా ‘జంతుకొవ్వు’ లడ్డూను పదే పదే ప్రచారంలోకి తీసుకొస్తుంటే చంద్రబాబే దోషిగా మారుతున్నాడు… అనాలోచిత ప్రచారం… పొలిటికల్ ఫాయిదా కోసం ఓ విఫల ప్రయత్నం, భ్రష్టం కూడా… నిజంగా జగన్ అండ్ కో తిరుమలను ఎంత భ్రష్టుపట్టించారో జనం మొత్తం చూస్తోంది, వింటోంది, చదువుతోంది… సుప్రీం కనుసన్నల్లో సాగిన సీబీఐ సిట్ విచారణ జంతుకొవ్వును గాకుండా నెయ్యి గాని నెయ్యిని చూపించింది… హిందూ మతమనోభావాలను మరీ దెబ్బతినకుండా సంయమనం పాటించినట్టు అనిపించింది… గతంలో ఎన్డీడీబీ ల్యాబ్ జంతుకొవ్వు అవశేషాలు చెప్పినా సరే, సిట్ దాన్ని పక్కన పెట్టేసింది… కానీ చంద్రబాబు వదలడం లేదు… పదే పదే జంతుకొవ్వు పేరిట జగన్‌ను ద్రోహి ద్రోహి అని చెబుతోంది… ఆ జంతుకొవ్వును మళ్లీ జనంలోకి తీసుకురావడం కోసమే మాజీ సీఎస్ దినేష్ కుమార్ కమిషన్ వేశారనేది బహిరంగ రహస్యం… పక్కా పొలిటికల్ మూవ్… అలాగని జగన్ అండ్ కోకు ఎవడూ సర్టిఫికెట్ ఇవ్వనక్కర్లేదు… ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి… వీళ్ల బాస్ జగన్ తిరుమలను ఎంత భ్రష్టుపట్టించాలో అంత భ్రష్టుపట్టించారు… నెవ్వర్ ఇన్ ది హిస్టరీ… మతపిచ్చి ఢిల్లీ పాదుషాలు, అదే రేంజ్ టిప్పు సుల్తాన్‌కు కూడా చేతకానంత తీవ్రంగా..!! కానీ ఎక్కడో ఓ ఫుల్ స్టాప్ పడాలి, కానీ చంద్రబాబు పడనివ్వడు… ఇప్పుడట, ఏకంగా టీటీడీకి అమృత్‌సర్ తరహా చట్టం తీసుకొస్తాడట… చంద్రబాబు మార్క్ రాజకీయాలు తెలిసినవాడెవడూ నమ్మడు… అబ్బో, చంద్రబాబు మరీ ఆదర్శప్రాయమైన వెంకన్న సేవ చేస్తున్నాడనే ఓ క్షుద్ర ప్రచారం కోసం ఈ ఎత్తుగడ… ఎందుకంటే..? కాస్త వివరంగా చెప్పుకుందాం… 1. స్వర్ణ దేవాలయం చట్టం (Sikh Gurdwaras Act, 1925) ఈ చట్టం బ్రిటీష్ కాలంలో సిక్కు గురుద్వారాల నిర్వహణ కోసం రూపొందించబడింది… దీని ప్రధాన ఉద్దేశం దేవాలయాలను స్వతంత్రంగా, రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించడం… ఎన్నికైన కమిటీ (SGPC)…: స్వర్ణ దేవాలయంతో పాటు ఇతర ముఖ్యమైన గురుద్వారాలను శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) నిర్వహిస్తుంది… ఈ కమిటీ సభ్యులు సిక్కు ఓటర్ల ద్వారా ఎన్నికవుతారు… అంటే భక్తులే తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు… రాజకీయ జోక్యం ఉండదు..: ప్రభుత్వానికి ఈ కమిటీలో లేదా దేవాలయ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ఉండదు… సేవా భావం (Seva)…: గురుద్వారాలో పనిచేసే వారు లేదా భోజనశాల (Langar) నడిపేవారు స్వచ్ఛందంగా సేవ చేస్తారు… ఇది ఖర్చును తగ్గించడమే కాకుండా ఆధ్యాత్మికతను పెంచుతుంది… ఆర్థిక పారదర్శకత..: నిధుల వినియోగంపై పూర్తి స్థాయి ఆడిటింగ్ ఉంటుంది, భక్తులకు వివరాలు అందుబాటులో ఉంటాయి… 2. టీటీడీకి ఈ చట్టం సాధ్యమేనా..? ప్రస్తుతం టీటీడీ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం (Endowments Act) పరిధిలో ఉంది… దీని ప్రకారం ప్రభుత్వం బోర్డు సభ్యులను, ఛైర్మన్‌ను నియమిస్తుంది… స్వర్ణ దేవాలయ చట్టం తరహాలో మార్పులు చేయాలంటే ఈ మార్పులు అవసరం… స్వయంప్రతిపత్తి (Autonomy)…: బోర్డు సభ్యుల నియామకంలో రాజకీయ జోక్యం ఉండకూడదు… కేవలం నిబద్ధత గల భక్తులు లేదా ఆధ్యాత్మిక వేత్తలకు మాత్రమే అవకాశం దక్కాలి… నిధుల రక్షణ…: గురుద్వారా చట్టం ప్రకారం నిధులు కేవలం మతపరమైన, సామాజిక, సేవా కార్యక్రమాలకే వాడాలి… టీటీడీ నిధులు ఇతర ప్రభుత్వ అవసరాలకు మళ్లించకుండా గట్టి నిబంధనలు రావాలి… పారదర్శకత…: టెండర్లు, నియామకాలు, దర్శన టిక్కెట్ల కేటాయింపులో లోపాలు లేకుండా, సిక్కు మోడల్ లాగా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి… నిర్వహణ మెరుగుదల…: స్వర్ణ దేవాలయంలో భక్తులకు కల్పించే సౌకర్యాలు, ముఖ్యంగా ఉచిత భోజనం (అన్నప్రసాదం) పంపిణీలో వారు పాటించే టెక్నాలజీ, క్రమశిక్షణ అవసరం… చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని చూసిన ఎవరికైనా ఇలాంటి మార్పులు టీటీడీలో తీసుకువస్తాడని ఆశించడం అసాధ్యం… అయితే, ఈ “స్వర్ణ దేవాలయ చట్టం” అధ్యయనం వెనుక ఉన్న రాజకీయ, గత నేపథ్యాన్ని తటస్థంగా విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన కోణాలు కనిపిస్తాయి… స్వర్ణ దేవాలయం (SGPC) తరహాలో పూర్తి స్వయంప్రతిపత్తి ఇవ్వడం అంటే, టీటీడీపై ప్రభుత్వానికి ఉండే పట్టును పూర్తిగా వదులుకోవడం… టీడీకి వచ్చే వేల కోట్ల ఆదాయం, దాని ద్వారా జరిగే సామాజిక కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రభావం ఉంటుంది… పూర్తి స్వయంప్రతిపత్తి ఇస్తే ప్రభుత్వం ఆ ‘పవర్’ కోల్పోతుంది… నియామకాలు…: బోర్డు మెంబర్ల పదవులు సాధారణంగా రాజకీయంగా కీలకమైన వారికి ఇచ్చే ‘బహుమతులు’…. వాటిని వదులుకోవడం ఏ రాజకీయ నాయకుడికైనా కష్టమే… ప్రచారం కోసమేనా? (Political Strategy) గత కొంతకాలంగా టీటీడీలో లడ్డూ కల్తీ వ్యవహారం, అన్యమతస్థుల నియామకాలు వంటి వివాదాలు తీవ్రమయ్యాయి… ఈ తరుణంలో “మేము వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం, రాజకీయం లేని బోర్డును తెస్తున్నాం” అని చెప్పడం ద్వారా హిందూ ఓటు బ్యాంకును, భక్తుల విశ్వాసాన్ని కాపాడుకోవడం ఒక వ్యూహం కావచ్చు… మరోవైపు వెంకన్న ఫోటోలను కూడా చట్టసభల్లోకి తీసుకొచ్చి రచ్చ చేయడం ద్వారా కూటమి, వైసీపీ రెండూ ఇంకా ఇంకా తిరుమల పవిత్రతను కాలరాచే ప్రయత్నాలు చేస్తున్నాయి… ఎవడికైనా వాడి పొలిటికల్ ఫాయిదాయే ముఖ్యమైపోయింది… మధ్యలో హెరిటేజ్ పెరుగు, నెయ్యి సరఫరా వంటి ఆరోపణలతో వైసీపీ డైవర్షన్ టాక్టిస్ ప్రయోగిస్తున్నా హిందువులు మాత్రం ఎవరూ నమ్మడం లేదు… అసలు విషయానికి వద్దాం… బీఆర్ నాయుడిని పట్టుకొచ్చారు… అన్యమతస్తులను తరిమేస్తాం అన్నారు… ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు… ఎఐ వ్యవస్థ తీసుకొచ్చి దర్శనాల్ని తక్కువ వ్యవధిలో కల్పిస్తాం అన్నారు… జీరో ఆచరణ… చంద్రబాబు తరహా రాజకీయంలో ఇవేమీ జరగవు… రాజకీయం… అది ఎవరైనా సరే, తిరుమల మీద ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడదు… మరీ ప్రత్యేకించి చంద్రబాబు వంటి ప్యూర్, టిపికల్ పొలిటిషియన్ అస్సలు వదులుకోడు… నిజంగా తను ఈ మార్పులు చేయగలిగితే, అంటే స్వర్ణదేవాలయం తరహా రాజకీయ జోక్యాలు లేని గుడినిర్వహణను తీసుకురాగలిగితే మొత్తం హిందూ ధార్మిక వ్యవస్థ తనకు జేజేలు పలుకుతుంది… *నీకు నిజంగా చేతనవుతుందా మిస్టర్ చంద్రబాబూ..?! కనీసం, నీ సంకల్పంలో నిజాయితీ ఉందా..?! టెండర్లు, నియామకాలు, కొనుగోళ్లు, దర్శనాలు, వీవీఐపీల అడుగులకు మడుగులు... అన్నింట్లోనూ సర్వభ్రష్టమే కదా...*
తిరుమల తిరుపతి - ShareChat
#f🤣un.. *సుబ్బారావు*:మాస్టారూ... ఎందుకండీ అమ్మాయిలు ఎప్పుడూ ప్రపోజ్ చేయరు..❓ *మాస్టారు*:చాలా ఏళ్ళ క్రితం శూర్పణక ప్రపోజ్ చేస్తే,.. అప్పుడు ముక్కు కోసేశారు. ఆ భయం ఇంకా ఉందండి..🤪
f🤣un.. - సదాశివ సదాశివ ದಾಣವ ಸದೌನ; అందుకే చేస్తే గీస్తే మనమే చేయాలివాళ్ళు చేయరు  సదాశివ సదాశివ ದಾಣವ ಸದೌನ; అందుకే చేస్తే గీస్తే మనమే చేయాలివాళ్ళు చేయరు - ShareChat
https://youtube.com/watch?v=gulXN8Z2Sxs&si=55grfVRt5K9-vPso #రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠
youtube-preview
#స్నేహం
స్నేహం - స్నేహం అనేది కాసేపు కాలక్షేపం కోసం చేసేది కాదు దుఃఖంతోహృదయం నిండినప్పుడు నేనున్నాను ಅಂಟ್ುೌ, Katpana writings| అక్కున చేర్చుకుని ఆలంబనగా నిలబడేది!! అంతరంగాన్ని అర్థంచేసుకుని ఆత్మాభిమానాన్ని "ಮೌಬಲ್ಲ್ ಆಲ್ಮಿಯಅನು ವೆಅಲ್ಲ್ పడిపోనీయకుండా నిబద్ధతను చూపించగలిగేది నిజమైన స్నేహం!! స్నేహం అనేది కాసేపు కాలక్షేపం కోసం చేసేది కాదు దుఃఖంతోహృదయం నిండినప్పుడు నేనున్నాను ಅಂಟ್ುೌ, Katpana writings| అక్కున చేర్చుకుని ఆలంబనగా నిలబడేది!! అంతరంగాన్ని అర్థంచేసుకుని ఆత్మాభిమానాన్ని "ಮೌಬಲ್ಲ್ ಆಲ್ಮಿಯಅನು ವೆಅಲ್ಲ್ పడిపోనీయకుండా నిబద్ధతను చూపించగలిగేది నిజమైన స్నేహం!! - ShareChat
#ఏపీ అప్ డేట్స్..📖 #విజనరీ బాబు 👀 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 ⚡ ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ⚡ 🔴 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసుల్లో ఊహించని కీలక మలుపు! 📌 ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరపనుంది. 🔍 కేసు నేపథ్యం – పూర్తి వివరాలు: 👉 2022లో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి 50 పేజీల సుదీర్ఘ నివేదికను అధికారులకు సమర్పించారు. 👉 ఈ ఫిర్యాదుపై ఏపీ సీఐడీ (CID) కేసు నమోదు చేసింది. 👉 ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు A1 ముద్దాయిగా నమోదు అయ్యారు. 👉 అనంతరం, చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ పొందారు. ⚖️ హైకోర్టు షరతులు: 🟡 విచారణను ఎలాంటి విధంగానూ ప్రభావితం చేయరాదు అనే కఠిన నిబంధనతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 🟡 ఆ తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 🚨 కొత్త ఆరోపణలు: ❗ ముఖ్యమంత్రి హోదాలో ఉండి, 👉 ఏపీ సీఐడీ అధికారులను ప్రభావితం చేశారని 👉 అధికార బలంతో విచారణ దిశను మార్చారని 👉 ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని తనకు అనుకూలంగా తిప్పుకున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఆరోపించారు. ❗ దీనివల్ల హైకోర్టు విధించిన షరతులు ఉల్లంఘించబడ్డాయని పేర్కొంటూ 👉 మధ్యంతర బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. 🧑‍⚖️ న్యాయపోరాటం: ⚖️ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. 📜 కీలక న్యాయ అంశం: 📌 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, 👉 ఏపీ సీఐడీ ఐజీకి సూపర్వైజింగ్ అధికారి ముఖ్యమంత్రీనే. 👉 అందువల్ల, A1 ముద్దాయి అయిన వ్యక్తే సీఐడీని పర్యవేక్షిస్తే, విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా? అనే తీవ్ర సందేహాలకు ఈ జీవో బలం చేకూరుస్తోంది. ⏳ రేపటి విచారణపై ఉత్కంఠ: 🔥 హైకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా, న్యాయపరంగా అత్యంత కీలకం కానుంది. 👉 మధ్యంతర బెయిల్ కొనసాగుతుందా? 👉 లేక రద్దవుతుందా? రేపటి తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉంది! ⚡
ఏపీ అప్ డేట్స్..📖 - ShareChat
#సప్త చిరంజీవులు
సప్త చిరంజీవులు - 35 லல చిరంజీవులు ನಗನ್ನ Hನn  )  et Suulued  0=~ 000 ಕನಃನಾರೈದು    35 லல చిరంజీవులు ನಗನ್ನ Hನn  )  et Suulued  0=~ 000 ಕನಃನಾರೈದು - ShareChat