🔔_ #🌅శుభోదయం🌻🌺_🔔*
*మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు.*
*దానిని ఎవరి వద్ద నిరూపించుకోవాలని ప్రయత్నించ వలసిన అవసరంలేదు.*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర 🙏
*ఉపాధ్యాయుడి అధికారం కూలిన రోజే సమాజం తన భవిష్యత్తును చంపుకుంది**
ఒకప్పుడు ఉపాధ్యాయుడు దండిస్తే తల్లిదండ్రులు తలవంచేవారు.
ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు (అందరూ కాదండీ)
పిల్లల ముందే ఉపాధ్యాయుడిని అవమానించే స్థాయికి దిగజారుతున్నారు.
ఇక్కడే అసలు పతనం మొదలైంది.
తప్పు చేసిన పిల్లాడిని కాదు,
తప్పు చూపించిన ఉపాధ్యాయుడినే నిందించడం మొదలైన రోజే
విద్యార్థి లోకపు నాశనం ప్రారంభమైంది.
“నీకు అధికారం ఎవరిచ్చారు?”
అని ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తే
ఆ పిల్లాడు నేర్చుకునేది చదువు కాదు—
👉 తప్పు చేసినా కాపాడేవాళ్లు ఉంటారు
👉 నియమాలు తనకు వర్తించవు
👉 పెద్దలను ఎదిరించొచ్చు
ఇవే ఈ తరపు విద్యార్థి నేర్చుకుంటున్న అసలు పాఠాలు.
క్రమశిక్షణ లేని పెంపకం
స్వేచ్ఛ కాదు… **విషం**.
శిక్షించే అధికారం లేని ఉపాధ్యాయుడు
విద్య ఇవ్వలేడు—మహా అయితే పాఠాలు చదివిస్తాడు.
మార్కులు రావొచ్చు కానీ మార్గం దొరకదు.
దాంతో
🔹 10 ఏళ్లకే అహంకారం
🔹 15 ఏళ్లకే నియంత్రణలేని ప్రవర్తన
🔹 20 ఏళ్లకే జీవితాన్ని తట్టుకోలేని అసహనం
ఇది విధి కాదు.
ఇది ప్రమాదం కాదు.
ఇది పెంపకంలో జరిగిన ఘోరమైన తప్పు.
ఉపాధ్యాయుడు భయపడితే
విద్యార్థి భయపడడు.
ఉపాధ్యాయుడి మాటకు విలువ లేకపోతే
నియమాలకు విలువ ఉండదు.
నియమాలు లేని సమాజంలో
స్వేచ్ఛ కాదు—
*అరాచకమే రాజ్యమేలుతుంది*.
దీనికి బాధ్యత ఎవరిది?
పిల్లలది కాదు.
ఉపాధ్యాయులది కాదు.
👉 **పూర్తిగా తల్లిదండ్రులదే.**
పిల్లల్ని ప్రేమించడం అంటే
ప్రతి తప్పునీ సమర్థించడం కాదు.
తప్పు చేసినప్పుడు
తప్పు అని చెప్పడమే నిజమైన ప్రేమ.
ఉపాధ్యాయుడిని అవమానిస్తే
మీ పిల్లల భవిష్యత్తును
మీ చేత్తో మీరే నాశనం చేసుకున్నట్టే.
చివరగా ఒకటే మాట—
ఉపాధ్యాయుడు శత్రువు కాదు.
వారు శిక్షిస్తే అది ద్వేషం కాదు,
స్వార్థం లేని బాధ్యత.
ఈ రోజు మీరు పిల్లల తప్పుని సమర్థిస్తే
రేపు అదే తప్పు
సమాజం శిక్షగా తిరిగి ఇస్తుంది.
ఉపాధ్యాయుడికి అధికారం ఇవ్వండి—
అదే సమాజానికి **శ్రీరామరక్ష**,
పిల్లల పాలిట **జగద్రక్ష**.
ఉపాధ్యాయుడిని దేవుడిలా పూజించాల్సిన అవసరం లేదు…
కానీ **సాటి మనిషిగా అయినా గౌరవించండి**.
చివరగా
ఉపాధ్యాయుడి అధికారం కూలిన రోజే
సమాజం తన భవిష్యత్తును తానే చంపుకుంది.
గౌరవం పోయిన చోట
విలువలు నిలవవు.
విలువలు లేని విద్య
సమాజాన్ని నిలబెట్టలేదు.
https://youtube.com/watch?v=0-L43CAdD1U&si=o5lNPe658gFG-sXY #తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
#మీకు తెలుసా 🤔❓️
*ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఎందుకు ఉంటాయి? దీని వెనుక కథ పె..ద్దదే❗*
25.08.2026🫣
మరో మూడు రోజుల్లో ఫిబ్రవరి నెల ముగుస్తుంది. క్యాలెండర్ లోని 12 నెలల్లో మరే నెలకు లేని ప్రత్యేకత ఫిబ్రవరి సొంతం. మిగిలిన నెలల్లో అయితే 30 రోజులు లేదంటే 31 రోజులు. కానీ.. ఫిబ్రవరి మాత్రం 28 రోజులకే ముగిసే పరిస్థితి. ఇంతకూ ఫిబ్రవరిలో 28 రోజులే ఉండాలని ఎవరు ఫిక్స్ చేశారు? అప్పటివరకు ఏం జరిగింది? అసలు ఫిబ్రవరి నెల ఎందుకు వచ్చింది? లాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీ మదిలో మెదిలాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. బోలెడన్ని విషయాలు వెలుగు చూస్తాయి. ఇంతకూ మిగిలిన నెలలకు భిన్నంగా ఫిబ్రవరి ఎందుకు ఉంటుందన్న విషయంలోకి వెళితే..
సింఫుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాచీన రోమన్ల మూఢనమ్మకాలే ఫిబ్రవరి 28 రోజులు ఉండేందుకు కారణమైందని చెప్పాలి. ఆ మాటకు వననననస్తే.. మొదట్లో క్యాలెండర్ లో పన్నెండు నెలల కాదు.. పది నెలలే (మార్చి నుంచి డిసెంబరు) ఉండేవి. అయితే.. క్రీస్తు పూర్వం 713లో రోమన్ రాజు నుమా పోంపిలియస్ చంద్రుని గమనాన్ని అనుసరించి క్యాలెండర్ ను 12 నెలలుగా మారుస్తూ జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చారు. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. రోమన్లకు సరి సంఖ్యను అరిష్టంగా భావిస్తారు. 12 చంద్ర చక్రాలు పూర్తి కావటానికి సుమారు 354 రోజులు పడుతుంది. కాబట్టి మొదటి క్యాలెండర్ 354 రోజులతోనే ప్రారంభమైంది. ఇది సరిసంఖ్య కావటంతో చక్రవర్తి మరో రోజును అదనంగా కలిపి మొత్తం 355 రోజులు చేశారు. తర్వాత ప్రతి నెలలోనూ బేసి సంఖ్యలు ఉండేలా 29 లేదా 31 రోజులకు డివైడ్ చేశారు.
అప్పటికి ఒక నెలలో సరి సంఖ్య ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి క్యాలెండర్ లో ఫిబ్రవరి చివరి నెలగా ఉండేది. ఆ నెలను చనిపోయిన వారిని స్మరించుకునే నెలగా భావించేవారు. దీన్ని అశుభ నెలగా భావిస్తూ 28రోజులు కేటాయించారు. తర్వాత జూలియస్ సీజర్ క్యాలెండర్ను సవరించినప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరగడాన్ని అనుసరించి సవంత్సరానికి 365 రోజులు డిసైడ్ చేశారు. దాని ప్రకారం నెలలను సవరించారు. ఆ సందర్భంలోనూ ఫిబ్రవరిలో 28 రోజులను మాత్రం అలానే ఉంచేవారు. అదిప్పటికి కంటిన్యూ అవుతోంది. సూర్య సంవత్సరానికి సరిపడేలా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరి నెలకు మరో రోజు అదనంగా చేర్చటం ద్వారా లీప్ ఇయర్ కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు. అదండి ఫిబ్రవరినెలలో 28 రోజులు ఉండటానికి అసలు కారణం.
https://youtube.com/watch?v=huwAXAJNV18&si=19x_nT-yNNvI-AcW #ys viveka reddy case
https://youtube.com/watch?v=NWsb8qN1v0o&si=T9QodltQa6OFtTy2 #తిరుమల లడ్డు
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*అబద్ధం.. అబద్ధం❗‼️*
FEBRUARY 25, 2026🎯
ఇటీవల “గ్రేట్ ఆంధ్ర” వెబ్సైట్లో ప్రసిద్ధ వ్యంగ్య రచయిత అద్భుతమైన మాట రాశారు. ఆ మాట ఏంటంటే……… *"అబద్ధాన్ని గౌరవించు. అదే ప్రపంచ విజేత”*
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మాట కొందరు నేతలకు అతికినట్టు సరిపోతుంది. కేవలం అబద్ధాలే తమను మళ్లీమళ్లీ విజేతలుగా నిలుపుతాయనే నమ్మకంతో, నిత్యం అవే ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సహజ న్యాయ సూత్రం ఏంటంటే……… న్యాయం జరగడమే కాదు, జరిగిటనట్టు కనిపించాలి. ఏపీలోని కొంత మంది నాయకుల తీరు ఎలా వుందంటే... తామే చెసిందే న్యాయం, చెప్పిందే చట్టం. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే, ఆ మరుసటి రోజు ఏదో ఒక కేసులో సమీపంలోని జైళ్లలో ఊచలు లెక్కించాల్సి వుంటుంది. ఎవరైనా న్యాయాన్ని,
చట్టాన్ని లెక్క చేయరో, వాళ్లే వాటి గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత.
కొంత మంది నాయకుల రాజకీయ పంథాను మొదటి నుంచి గమనిస్తే… కేవలం అబద్ధాల్ని మాత్రమే సాధన చేసిన భావన కలుగుతుంది. అబద్ధాల పునాదులపై రాజకీయ సౌధాల్ని నిర్మించుకున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశాబ్దాలుగా కేవలం అబద్ధాల్నే చెబుతూ, ప్రజల్ని వంచిస్తూ ఎంత బాగా రాణిస్తున్నారయ్యా అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు.
ఈ మాటలన్నీ ఎవరి గురించి పేరు చెప్పకుండా, అర్థం చేసుకునే చైతన్యం తెలుగు సమాజం సొంతం. అయితే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత……… అరర్రె ఇంతకాలం మనం మోసపోయాం, మోసపోతున్నాం గురూ అనే ఆవేదన కలగకుండా వుండదు.
దేశ రాజకీయాల్లోనే ఏపీ రాజకీయాలు ఎంతో ప్రత్యేకం. సీఎం చంద్రబాబు తరచూ కేస్ స్టడీ అంటుంటారు. ఏపీ రాజకీయాలు కూడా కేస్ స్టడీ లాంటివే. రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టడానికి ఎన్నైనా అబద్ధాలు చెప్పు. వాటిని నిజమని నమ్మించే మీడియాను చేతిలో పెట్టుకో. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతుంటే, చివరికి అదే నిజమని నమ్మే పరిస్థితిని సృష్టించు. నచ్చి నాయకుడు ఎద్దు ఈనిందంటే కళ్లు మూసుకుని గాటిన కట్టేసే మీడియా ఎలాగూ తోడుంటుంది.
బలమైన మీడియా వ్యవస్థని చేతిలో పెట్టుకుని, ప్రజలతో మైండ్రోమ్ ఆడడం ఏపీలో అలవాటైంది. రాజకీయ ప్రత్యర్థులపై తాము మాత్రం ఇష్టానుసారం అబద్ధాల్ని ప్రచారం చేస్తామని, తమ జోలికి వస్తే మాత్రం న్యాయ స్థానాల్ని ఆశ్రయించి, నోళ్లు మూయిస్తామనే ధోరణి ఏపీలో నడుస్తోంది.
కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీని అడ్డుపెట్టుకుని ………బాబోయ్ ఎన్నెన్ని విష ప్రచారాలో. వినడానికే జుగుప్స. కానీ విష ప్రచారం చేసేవారిలో మాత్రం అలుపుసొలుపు లేదు. అబద్ధాల్ని నిత్యం ప్రాక్టీస్ చేయడం ఒక కళ అయితే తప్ప, రాజకీయాల్లో అలా చెప్పడం సాధ్యం కాదనిపిస్తుంది.
ఇప్పుడ బాధంతా ఏందంటే… ఇలాంటి వాళ్ల చేతిలో రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుంది? అధికారం, రాజకీయ స్వార్థం కోసం ఎంత వరకైనా దిగజారే వ్యక్తిత్వం ఉన్నోళ్లు, ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం గొప్ప ఆలోచనలు చేస్తారని ఆశించడం అత్యాశే. అధికారం లేకపోతే, ఏమవుతామో అని భయపడే
వాళ్లు, దాని కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని బలి తీసుకోవడం పెద్ద విషయం కాదు.
ఐదేళ్లకోసారి అధికారం కట్టబెట్టడానికే ప్రజలున్నారని నాయకుల భావన. అబద్ధాలు, దుష్ప్రచారానికి చట్టసభలు అతీతం కాదని నిరూపిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. చట్టసభలు, బయట కొంత మంది అలవోకగా అసత్యాలు చెబుతున్న తీరు చూసి, బహుశా అబద్ధం కూడా సిగ్గుపడుతోంటోంది.
తనను అంటరానిదానిగా చూస్తుంటారని, కేవలం దాన్నే నమ్ముకుని రాజకీయ బతుకీడుస్తున్న నాయకులు దర్జాగా అధికారాన్ని అనుభవిస్తున్నారని అబద్ధం వెక్కివెక్కి ఏడుస్తుందేమో! ఏ వినాశకానికి ఈ విపరీత అబద్ధాలో తెలియదు కానీ, పాలకులు మాత్రం ఇలా వుండకూడదని సర్వత్రా కోరుకుంటున్నారు.
https://youtube.com/live/BgXoU_2OOm0?si=qM3YBHCHv75dPfsC #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
#ఏపీ అప్ డేట్స్..📖 #ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు
*చంద్రబాబు, లోకేశ్తోసహా వారిద్దరికి శిక్ష తప్పదు.. నేను వదలను..❗*
25.02.2026🎯
చంద్రబాబు, లింగమనేని రమేశ్, నారాయణ, లోకేశ్లకు శిక్ష తప్పదు.
పిర్యాదుదారులను భయపెట్టి వాళ్లపై కేసులు కొట్టేయించుకుంటున్నారు.
నేను మాత్రం భయపడను..
చంద్రబాబు నాయుడు, లింగమనేని, నారాయణతోపాటు నారా లోకేశ్కు శిక్ష తప్పదు. మీపై ఉన్న కేసుల్లో ఫిర్యాదుదారులను భయపెట్టి ఒక్కొక్కటి కొట్టేయిస్తున్నారు. నేను మాత్రం వదలను.. భయపడను. నన్ను ఎలా భయపెట్టారో సందర్భాన్ని బట్టి చెబుతా. ఎవరెవరిని నా దగ్గరికి పంపి నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారో అన్ని చెబుతానని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏసీబీ కోర్టు, సీఐడీ నాకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, లింగమనేని రమేష్, మంత్రి నారాయణ పక్కా ప్లాన్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రకటనకు ముందే లింగమనేని రమేష్ 350 ఎకరాలు కొనుగోలు చేశారు. భూముల విలువలు పెంచుకోవడానికి ముందుగా కొనుగోలు చేసిన చోట నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు మార్చారు. లింగమనేనికి చెందిన కొన్ని భూములకు దగ్గరగా, కొన్ని భూములకు ఆనుకుని ఉండేలా ప్లాన్ చేశారని, ఈ ప్లాన్ అనుకూలంగా మార్చడంతో హెరిటేజ్కి 18ఎకరాలు ఇచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
కోట్లలో విలువ ఉన్న భూమిని 8 లక్షలకు అమ్మారు. పవన్ కల్యాణ్కి కూడా 2.5 ఎకరాలు భూమిని 8 లక్షలకు అమ్మారు. కోట్లలో విలువ ఉన్న భూములను కేవలం 8 లక్షలకే ఎందుకు ఇచ్చారని ఆళ్ల ప్రశ్నించారు. అత్యంత విలువైన కరకట్ట పైన ఉన్న ఇంటిని చంద్రబాబుకి ఉచితంగా ఇచ్చారు. ఈ కేసులో లింగమనేని, చంద్రబాబు, మంత్రి నారాయణ అందరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో 18వ నిందితుడిగా నారా లోకేష్ కూడా ఉన్నారు. ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈరోజు కేసు ముసెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
అసలు కేసే తప్పుడు కేసు అని కోర్టులో అప్పీల్ కి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులే ఇప్పుడు తప్పుడు కేసు అంటున్నారు. అనిత హోంమంత్రి అయినా లా అండ్ ఆర్డర్ మొత్తం చంద్రబాబు చేతిలో ఉంది. ఎస్పీ స్థాయి నుండి డీజీపీ వరకూ చంద్రబాబు ఆధీనంలోనే ఉన్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులను అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేసులు క్లోస్ చేసేసుకుంటున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టాలకు విరుద్ధంగా కేసులు మూసేస్తున్నారు. ఇది చిన్న కేసు కాదు.. 2500 కోట్ల అవినీతి జరిగింది.. మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్ అని క్లోస్ చెయ్యడం అన్యాయం. న్యాయ స్థానాల్లో నా పోరాటం కొనసాగిస్తా. ఏ ఆధారంతో సీఐడీ అధికారులు ఈ కేసును మూసేస్తున్నారు..? నాకు వివరాలు ఇవ్వాలి. 27 తేదీన ఏసీబీ కోర్టుకి హాజరవుతా, నాకు న్యాయం జరగకపోతే హై కోర్టుకి వెళ్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
తప్పు చెయ్యకపోతే మీరు లీగల్గా నిరూపించుకోండి. అన్యాయంగా అధికారం అడ్డుపెట్టుకుని క్లోస్ చేసేస్తారా..? డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ చీప్ రవి శంకర్, ఆయఎన్నార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మీ ఇద్దరిపై కన్నువేసి ఉంచాను.. ఎక్కడెక్కడ అన్యాయాలు చేస్తున్నారో చూస్తున్న. రెండేళ్లలో మీ ఇద్దరూ ఎక్కడెక్కడ అవినీతి ఆస్తులు పోగేశారో నాదగ్గర ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఈ ఇద్దరి అధికారుల అవినీతి చిట్టా బయటపెడతానంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
2024 లో నేను పోటీ చెయ్యలేదు. 2029 లో పోటీ చేస్తాను. ఎమ్మెల్యే గానో ఎంపీ గానో అవుతాను. మీరు రిటైర్ అయితే మళ్లీ ఐపీఎస్లు అవ్వలేరు. నేను మళ్లీ ఎమ్మెల్యే లేదంటే ఎంపీ అవుతాను. చట్టం ముందు నినబెడతా అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.













