* #ఐటీ అంటే ఇప్పుడు పిటీ……… మిడిల్ క్లాస్ మటాష్❗*
APRIL 27, 2026🎯
కృత్రిమ మేథ (AI) దూకుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రతీ రంగంలోనూ ఏఐ రాకతో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటి ప్రభావం ఉద్యోగాలపై తీవ్రంగా పడుతోంది. ఉద్యోగులు తమ పని తీరుతో పాటు ఏ మార్పుకైనా సిద్ధం కావాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏఐ దూకుడు కారణంగా ఇప్పటికే మొదలైన
ఉద్యోగాల కోతలు మరో రెండేళ్లలో తీవ్రంగా మారి మధ్యతరగతిని కుప్పకూల్చబోతున్నాయంటూ ఓ అంచనా వెలువడింది. గతంలో గూగుల్ లో ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా పనిచేసి ప్రస్తుతం 350 పని చేయాల్సిన చోట కేవలం ముగ్గురు ఉద్యోగులతో సంస్థను నడుపుతున్న మో గోడాట్ అనే ఉద్యోగి ఏఐ దూకుడుపై సంచలన అంచనాల్ని వెల్లడించాడు.
తన పాడ్కాస్ట్ ‘డైరీ ఆఫ్ ఎ సీఈఓ'లో ఆయన ఓ భయంకరమైన అంచనాను ప్రకటించాడు. దీని ప్రకారం 2027 చివరి నాటికి ఏఐ పెను సవాళ్లు విసరబోతోందని హెచ్చరించారు. ఏఐ గణనీయమైన మార్పులను తీసుకువస్తుందని, ఇది మధ్యతరగతి పతనానికి దారితీస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా టాప్ 0.1 శాతంలో లేకపోతే మీరు రైతు కిందే లెక్క అని, మధ్యతరగతి అంటూ ఉండదని తేల్చిచెప్పేశారు.
2027 నాటికి ఉన్నత విద్యావంతులైన వ్యక్తులు కూడా నిరుద్యోగులుగా మారవచ్చని, దీని ఫలితంగా ప్రస్తుత మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం చూపే కొత్త ప్రపంచ తరగతి నిర్మాణం ఏర్పడవచ్చని మో గోడాట్ తాజా అంచనాలో తెలిపారు. ఏఐ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, పాడ్కాస్టర్లతో సహా వివిధ ప్రొఫెషనల్ పాత్రలను ఎలా తొలగిస్తుందో ఆయన వెల్లడించారు.
2027 ప్రారంభాన్ని ఆయన మనం స్వర్గానికి చేరుకునే ముందు నరకంగా అభివర్ణించారు. దీంతో ఇప్పుడు గోడాట్ అంచనాలు ఐటీ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత పరిస్థితులు కూడా దానికి తగ్గట్లే ఉన్నాయి.
మధ్య తరగతి రేంజ్ పెంచిన ఐటీ
ఒకానొక కాలంలో మధ్య తరగతివారు ఈసురోమని ఉండేవారు. పొదుపుగా ఖర్చు చేస్తూ ఉన్నంతలో గుట్టుగా బతికేవారు. కాని ఐటీ విప్లవంతో మధ్య తరగతి జీవితాల్లో పెనుమార్పులు వచ్చాయి. ఐటీ కోర్సులు చేసిన చాలామంది అమెరికా దారి పట్టారు. దీంతో మధ్య తరగతి కుటుంబాల రేంజ్ పెరిగింది. కొనుగోలు శక్తి పెరిగింది.
'మేము గొప్పోళ్లం' అంటూ కాలర్ ఎగరేసే కాలం వచ్చింది. ఆడంబరాలు, అట్టహాసాలు పెరిగాయి. లగ్జరీ లైక్అలవాటైంది. ఐటీ జాబ్వస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకున్నారు. ఇతర ఉద్యోగుల కంటే ఐటీ ఉద్యోగులకు విలువ ఎక్కువ. కాని
ఇప్పుడు ఏఐ విజృంభణతో పరిస్థితి తారుమారయ్యేలా కనబడుతోంది. అమెరికాలో పరిస్థితి కూడా ఐటీ చదువుకున్న యువతను చావు దెబ్బ కొడుతుండటంతో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది.
ఏఐ కారణంగా హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఉద్యోగాల కోత ప్రారంభమైంది. ఇప్పటికే ప్రారంభ స్థాయి ఉద్యోగాలను కృత్రిమ మేధ(ఏఐ) ఆక్రమించడంతో గత ఏడాదికాలంలో క్యాంపస్ ప్లేస్మెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ఈసారి క్యాంప్సలలో కొత్త ఉద్యోగాల నియామకం మూడోవంతు కూడా లేదని ఐటీనిపుణులు అంటున్నారు.
కొత్త ఉద్యోగాల సంఖ్య సంగతి తర్వాత... అసలు ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. ఏఐతో మరిన్ని అవకాశాలు వస్తాయని, కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఇప్పటివరకు కంపెనీల యాజమాన్యాలు, ఐటీనిపుణులు, ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు.
పెద్ద కంపెనీల్లో భారీ ఉద్యోగ కోతలు
పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల కోత ఇప్పటికే ప్రారంభమైంది. మధ్యస్థాయి, చిన్నపాటి ఐటీకంపెనీలూ ఉన్న సిబ్బందిలో కోత విధిస్తున్నాయి. ఉద్యోగులతో పోలిస్తే మరింత ఖచ్చితంగా, మరింత సమర్ధంగా, నిర్వరామంగా పనిచేయగలిగే ఏఐ
టెక్నాలజీని కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది.
వచ్చే రెండేళ్లలో ఐటీరంగంలో తెలంగాణలో రెండు లక్షలకు పైగా ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోతారని, ఉద్యోగుల స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని ఐటీ నిపుణులతో పాటు ప్రభుత్వం అంచనా వేస్తోంది. దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్న వార్తలు రోజూ ప్రతికల్లో వస్తున్నాయి. 2026 ప్రారంభం నుంచే ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారీ ఉద్యోగ కోతలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్పులు, ఖర్చుల తగ్గింపు చర్యలు ఈ తొలగింపులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రముఖ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను ఆకస్మిక షాక్లకు గురిచేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఇటీవల 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇందులో భారత సంతతికి చెందిన వారే ఎక్కువగా ఉండడం మరింత కలవర పెట్టే అంశం. పొద్దున నిద్ర లేచి మెయిల్ చూసుకున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోయాయన్న చేదు వార్తను జీర్ణించుకోలేక పోయారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు వార్తల్లో నిత్యం కనిపిస్తున్నాయి. ఏఐ, ఆటోమేషన్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులకు నిధులను సర్దుబాటు చేసేందుకే ఈ కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, 2026 ప్రారంభంలో కీలక పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టింది. ఈ చర్యల భాగంగా జనవరి 2026లో దాదాపు 16,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించినట్లు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. 2025 చివర్లో తగ్గించిన 14,000 ఉద్యోగాలను కలుపుకుంటే మొత్తం ప్రభావిత ఉద్యోగుల సంఖ్య 30,000 దాటింది. సంస్థలో ఉన్న మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించి, బ్యూరోక్రసీని తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు.
ఆర్థిక వనరులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వైపు మళ్లిస్తూ గతంలో అధికంగా నియామకాలు జరిగిన విభాగాల్లో కోతలు విధిస్తోంది. అమెరికాలో ప్రభావిత ఉద్యోగులకు సాధారణంగా 90 రోజులు సమయం ఇస్తున్నారు, ఈ సమయంలో వారు సంస్థలోనే ఇతర అవకాశాలను వెతుక్కోవచ్చు. మరొక ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ తన తాజా ఆర్థిక నివేదికలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది.
2026 జనవరి 30 నాటికి సంబంధించిన ఫైలింగ్ ప్రకారం కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 11,000 తగ్గి 97,000కు చేరింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డెల్ ఉద్యోగుల సంఖ్య: 1,20,000గా ఉంటే.. 2025 కల్లా 1,08,000 ລ້໖.
ఇప్పుడు లక్ష లోపే ఉంది. డెల్ వరుసగా మూడు సంవత్సరాలుగా కొలువులో కోత పెడుతూ వస్తోంది. ఖర్చులను
నియంత్రించడం, వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం, మారుతున్న టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడం ఈ నిర్ణయాల వెనుక ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
క్లౌడ్, ఏఐ, ఆటోమేషన్ రంగాల్లో పెట్టుబడులు పెంచుతున్న సంస్థలు సంప్రదాయ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెల్ తీసుకున్న చర్యలు గ్లోబల్ ట్రెండ్ను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దిగ్గజ కంపెనీల నిర్ణయంతో హైదరాబాద్లోని ఉద్యోగులూ భారీగానే తొలగింపునకు గురయ్యారు.
ఐటీరంగంలో స్టార్టప్ కంపెనీల పాత్ర కీలకం. ఒకేసారి పెద్ద కంపెనీలో అవకాశం లభించడం కష్టం కాబట్టి.. డిగ్రీ పట్టాలు పొందగానే అత్యధికులు స్టార్టప్ కంపెనీల్లో చేరుతారు. అక్కడ అనుభవంతో పెద్ద కంపెనీలకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఏఐ రాకతో స్టార్టప్ కంపెనీల్లోనూ ఉద్యోగుల కోత మొదలైంది.
తెలంగాణలో ఐటీ రంగానికి గడ్డుకాలం
తెలంగాణ ఐటీ రంగానికి గడిచిన రెండేళ్లుగా ఒక రకమైన 'గడ్డు కాలం' దాపురించిందన్నది కాదనలేని సత్యం. 2023లో 9.46 లక్షల ఉద్యోగాలతో కళకళలాడిన హైదరాబాద్ ఐటీ రంగం.. 2026 నాటికి 9.39 లక్షలకు పడిపోవడం అంటే అది కేవలం సంఖ్యల తగ్గుదల మాత్రమే కాదు.. వేల కుటుంబాల ఆశల మీద పడ్డ దెబ్బ.
కేటీఆర్ విమర్శించినట్లుగా ప్రభుత్వం స్వయంగా అసెంబ్లీలోనూ, బడ్జెట్ ప్రసంగంలోనూ ఈ తగ్గుదలను అంగీకరించడం ఐటీ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఒక ఐటీ ఉద్యోగం అంటే అది కేవలం ఒక జీతం కాదు.. మధ్య తరగతి తల్లిదండ్రుల కల, ఒక యువకుడి లేదా యువతి కష్టానికి దక్కిన ఫలితం.
నేడు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ కెరీర్ ఎటు వెళ్తుందో తెలియక, ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందోనని ఆందోళనతో గడుపుతున్నారు. గతంలా కొత్త నియామకాలు లేవు, ఉన్న కొలువులు ఊడిపోతున్నాయి. “హైదరాబాద్ ఐటీ అభివృద్ధి రథం ఆగిపోయిందా? లేక వెనక్కి పయనిస్తోందా?” .
#ఏపీ అప్ డేట్స్..📖
తుగ్లక్ Nara Chandrababu Naidu నిర్ణయాలతో ఆంధ్రరాష్ట్రం అధోగతి పాలు..
#✍️కోట్స్
*ఆకలి ముందు అన్నీ చిన్నవే..*
డబ్బు లేకపోయినా బతకొచ్చు..
కారు లేకపోయినా బతకవచ్చు..
రోడ్డు లేకపోయినా బతకొచ్చు..
కానీ ఒక ముద్ద అన్నం దొరక్కుండా ఎవరూ చచ్చిపోకూడదు సార్ అది మనుషులైనా... మూగజీవాలైనా..
#🏏IPL 2026 హైలెట్స్ 🏆 #😍కింగ్ కోహ్లీ 🔥
*విరాట్ కోహ్లీ ఆల్టైమ్ రికార్డు.. దరిదాపుల్లో కూడా ఎవడూ లేడు❗*
Uppala Shivaprasad
April 28, 2026🏏
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీకి దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. తన హోమ్ గ్రౌండ్లో కోహ్లీ ఈ అద్వితీయమైన ఘనతను అందుకోవడం ప్రత్యేకం.
ఈ మ్యాచ్కు ముందు ఈ మైలురాయికి 11 పరుగుల దూరంలో నిలిచిన కోహ్లీ.. అక్షర్ పటేల్ బౌలింగ్లో సింగిల్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించేందుకు కోహ్లీ 6732 బాల్స్ ఆడాడు. ఆర్సీబీ ఫ్రాంచైజీ తరఫునే కోహ్లీ ఈ 9వేల పరుగులు చేయడం విశేషం.
ఇప్పటికే ఐపీఎల్లో టాప్ రన్ స్కోరర్గా కోహ్లీ కొనసాగుతున్నాడు. అతని తర్వాత రోహిత్ శర్మ 7183 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్(6769), డేవిడ్ వార్నర్(6565), కేఎల్ రాహుల్(5580) తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు.
Advertisement
ఈ మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. 81 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్(33 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్గా నిలిచాడు. అర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/5), జోష్ హేజిల్వుడ్(4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్ధార్ సలామ్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 34 నాటౌట్) అజేయంగా నిలవగా.. జాకోబ్ బెతెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కైల్ జెమీసన్(1/42) ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
#ఏపీ అప్ డేట్స్..📖
*అనుభవమా... మజాకా..!*
మొత్తానికి రాష్ట్రాన్ని లైన్ లో పెట్టేశారు...!
గ్యాస్ సిలిండర్ కోసం , పెట్రోల్ కోసం , డీజిల్ కోసం , రేషన్ కోసం , యూరియా కోసం ... ఇలా ప్రజలందరినీ "లైన్ లో" పెట్టేశారు...!
#AndhraPradesh







![✍️కోట్స్ - "ಬಲಂವೌಲಿನಿ5ವೌಡಲೆದು చదువురావణుడునిరక్షించలేదు బలంచదువుతోపాటు గుణం ఉన్న దేవుడు అయ్యాడు!" ರೌಮುಡು This ISit నిన్ను గొప్పవాడినిచేసేది 93 ನಿ ಗಣಂ ಮೌತ್ತಿಮು [] ( ( ( "ಬಲಂವೌಲಿನಿ5ವೌಡಲೆದು చదువురావణుడునిరక్షించలేదు బలంచదువుతోపాటు గుణం ఉన్న దేవుడు అయ్యాడు!" ರೌಮುಡು This ISit నిన్ను గొప్పవాడినిచేసేది 93 ನಿ ಗಣಂ ಮೌತ್ತಿಮು [] ( ( ( - ShareChat ✍️కోట్స్ - "ಬಲಂವೌಲಿನಿ5ವೌಡಲೆದು చదువురావణుడునిరక్షించలేదు బలంచదువుతోపాటు గుణం ఉన్న దేవుడు అయ్యాడు!" ರೌಮುಡು This ISit నిన్ను గొప్పవాడినిచేసేది 93 ನಿ ಗಣಂ ಮೌತ್ತಿಮು [] ( ( ( "ಬಲಂವೌಲಿನಿ5ವೌಡಲೆದು చదువురావణుడునిరక్షించలేదు బలంచదువుతోపాటు గుణం ఉన్న దేవుడు అయ్యాడు!" ರೌಮುಡು This ISit నిన్ను గొప్పవాడినిచేసేది 93 ನಿ ಗಣಂ ಮೌತ್ತಿಮು [] ( ( ( - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_714701_238013d3_1777326713555_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=555_sc.jpg)




