P.Venkateswara Rao
ShareChat
click to see wallet page
@prasad831
prasad831
P.Venkateswara Rao
@prasad831
ప్రేమించు కానీ నటించకు
#దగ్గుబాటి పురంధేశ్వరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక కేంద్రమంత్రి, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్ష పదవి నిర్వహించిన వాళ్ళు సైద్ధాంతిక భేదాలు, పార్టీలో వచ్చిన చీలికలు, కేంద్ర నాయకత్వంతో విధానపరమైన సర్దుకోలేని వైరుధ్యాలు వచ్చినప్పుడు తప్ప కేవలం పదవుల కోసం పార్టీ మారిపోవడం అంటే అంతకంటే దగాకోరుతునం మరొకటి ఉండదు. రైట్ వింగ్ పార్టీలు, లెఫ్ట్ వింగ్ పార్టీలు, సెంట్రిస్ట్ పార్టీలు ఆయా నేపథ్యాలను కలిగి ఉన్నప్పుడు ఒక సెంట్రిస్ట్ పార్టీ సభ్యుడు పైన చెప్పిన కారణాలు కారణంగా మరొక సెంట్రిస్ట్ పార్టీకి వెళితే ఔననవచ్చునేమో కానీ సరాసరి పూర్తి భిన్నమైన రైట్ వింగ్ పార్టీలోకి పోవటం జన్మ సంబంధిత బానిసత్వానికి పరాకాష్ట. ఆ ఘోరానికి పాల్పడిన వారు నిజ జీవితంలో లాభం కోసం ఎలాంటి నికృష్టమైన పనికి పాల్పడడానికైనా వెనుకాడరు. ఎన్టీ రామారావు అమ్మాయి. కుటుంబంలో ఆమెను చిన్నమ్మ అని వేడుకగా పిలుచుకుంటారు అనుకుంటాను. వెంపటి చినసత్యం గారి శిష్యురాలుగా అనేక నాట్య రీతులలో అందెవేసిన చెయ్యి. ఇటీవల కాలంలో కూడా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె తన భరత నాట్య కళను సందర్భానుసారం ప్రదర్శించిన తీరు చూసి అందరం చాలా అభినందించి ఉన్నాం. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో న్యాయం ఎలా ఉన్నప్పటికీ ఆమె అనర్గళంగా మాట్లాడగలగటం ఆమెకు అదనపు ఆకర్షణ. ఎన్టీఆర్ సంతతికి దీక్షాదక్షతలు లేక చంద్రబాబు లాంటి చాణక్యుడు పార్టీని సొంతం చేసేసుకున్నాడు అనేది భయానకమైన అపోహ. ఎన్టీ రామారావుకు ఉన్న ధారణ, గ్రహణ మొదలైన మేధోపరమైన సహజ లక్షణాలు చంద్రబాబులో లుప్తం. ఎన్టీఆర్ సంతతిగా మిగిలిన వాళ్ల గురించి మనం చూడక తెలియదు కానీ హరికృష్ణకు, చిన్నమ్మ పురందేశ్వరికి అవన్నీ సహజంగా అబ్బినాయి. హరికృష్ణ వాసనలే జూనియర్ ఎన్టీఆర్ ధారణలో కూడా మనకు గోచరిస్తాయి. ఇవన్నీ సామర్ధ్యానికి సంబంధించిన కోణాలు. అయితే న్యాయపరమైన కోణం వీటికి పూర్తి విభిన్నమైనది. ఎన్టీఆర్ పదవీచ్యుతి, ఆ సమయంలో ఆయన సంతతి వ్యవహార సరళి, చంద్రబాబు వ్యూహం(ఈ పదం వాడటం నాకు అసలు నచ్చదు, చంద్రబాబు విషయంలో అసలు నచ్చదు, అయినా తప్పదు) మొదలైన విషయాలు అందరికీ తెలిసినవే కాబట్టి వాటి గురించి ప్రత్యేకించి ఇప్పుడు అనుకోవలసిన పనిలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తన భర్త ఉప ముఖ్యమంత్రి పదవికి వస్తాడని ఈమె తన భర్తకు వీర తిలకం దిద్ది మరి వైస్రాయ్ హోటల్కు పంపించింది అని చనిపోయిన ఎర్రం నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన మాటను కాదనలేం. అంటే కన్నతండ్రి కి ద్రోహం చేయటం ఎంతటి పాతకమో ప్రవచనకార్లు సమయానుకూలంగా ఎప్పుడో చెబుతుంటారు కాబట్టి దాని గురించి మనం కూడా అనుకోనక్కర్లేదు. అంతటి పాపానికి ఈమె సాక్షాత్తు ఒడిగట్టేసింది. అనంతర కాలంలో చంద్రబాబు కక్ష్యలోకి ప్రవేశించిన ఉపగ్రహం మాదిరి తనను అక్కడ వరకు చేర్చిన యంత్రాన్ని విసర్జించి వెళ్లిపోయినట్టుగా ఈమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఘోరంగా అవమానించి దారిలో వదిలేస్తే, ఆయన మళ్లీ ఎన్టీ రామారావు దగ్గరికి, ఆయన పోయాక మారేటి అత్త దగ్గరికి పోయి దీనాలాపాలు పోతే అది కూడా పని జరగక బికారుల మాదిరిగా తయారైపోయారు భార్యాభర్తలిద్దరూ. అలాంటి నేపథ్యంలో జనం అందరికీ కొత్త రాజకీయం నేర్పడానికి పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ కూడా తన ఈ సొంత మనుషులకి భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతో అధికారానికి చేరువవుతున్న కాంగ్రెస్లో చేరమని సలహా కూడా చెప్పడంతో(ఈ విషయం దగ్గుబాటి స్వయంగా చెప్పాడు) ఈ భార్యాభర్తలు ఇద్దరూ సోనియా దగ్గరికి పోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తరువాత ఈమె పార్లమెంట్ సభ్యులుగా, ఆయన శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నీడన పెరిగారు. ఈమెను సోనియా కేంద్ర మంత్రిని కూడా చేసి రాష్ట్రంలో మరిదికి దీటుగా ఆత్మగౌరవంతో బతికేటట్టు స్థానం కల్పించారు. మామూలు మనిషి ఎవరైనా అయితే అంతటి ఉపకారం చేసిన వ్యక్తికి తిరిగి ఎలాంటి పరిస్థితుల్లోనూ సమానమైన ప్రత్యుపకారం చేయలేకపోయినప్పటికీ అపకారమైతే మటుకు ఎట్టి పరిస్థితులలోను చేయరు. ఎందుకంటే అది మానవ విలువలకు సంబంధించింది. కాకపోతే చిన్నమ్మలో అలాంటి విలువలు ఏ కోశానా ఉన్నట్టు అగుపించవు. రాష్ట్రంలో విభజన నేపథ్యంలో పార్టీ మొత్తం లుప్తమైపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుగు తేజం అండతో కాంగ్రెస్కు పూర్తి భిన్నమైన విధాన నేపథ్యం గల బిజెపిలో చక్కగా అమరిపోయింది. భరతనాట్యం చేసేటప్పుడు వివిధ భంగిమలను అలవోకగా ఎలా ప్రదర్శించగలరో నాట్యకారిణి అయిన చిన్నమ్మ అంతే సహజంగా ఆ పార్టీలో ఇమిడిపోయింది. ఆ తర్వాత పది సంవత్సరాలు పాటు రేయింబవళ్లు కష్టపడినా కూడా పెద్దగా ఫలితం లేదు.పొత్తులో పోటీ చేసి 2014లో రాజంపేటలో ఓడిపోతే,పొత్తులు లేని 2019 ఎన్నికల్లో విశాఖపట్నంలో 19,000 ఓట్లను తెచ్చుకోగలిగారు బిజెపి పార్టీ తరఫున. 2024 ఎన్నికల్లో తిరిగి పవన్ కళ్యాణ్ పుణ్యమా అని 2024 ఎన్నికల్లో 10 ఏళ్ల తర్వాత తిరిగి పార్లమెంటు సభ్యురాలు అవ్వగలిగారు. ఈమె ఇదివరలో రాహుల్ గాంధీని గురించి ఆయనతో గల గతకాలపు సాన్నిహిత్యాన్ని కూడా మరిచి చాలా హేళనగా గేలి చేశారు. అంతకంటే అమానుషం మరొకటి లేదని అప్పుడు అందరూ అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ నెహ్రూ ను లక్ష్యం చేసి నెహ్రూ టిబెట్ను చైనాకు వదిలేసాడు, పాకిస్తాన్ కు సింధు పరివాహ ప్రాంతంలో 80% నీళ్లు వదిలేశాడు, ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత సభ్యత్వాన్ని అప్పగించేసాడు అంటూ దుర్మార్గపారోపణలు ఎలాంటి రుజువులు లేకుండా ఎవరో రాసిచ్చిన మాటలను(పరివార్ శక్తులు అందరి వాల్స్ మీద అవి ఉన్నాయి) ఈమె కూడా నిస్సిగ్గుగా వాడేస్తూ చాలా జుగుప్సాగరంగా మాట్లాడారు. 1950లో భారత్ సైనికపాటవం ఏపాటిది? దేశ ప్రజలకు రెండు పూటలా తిండి లేని కాలమది. టిబేట్ మన భూభాగం కాదు ఏనాడు. దానిని ఆక్రమించుకోగలిగిన శక్తి సామర్ధ్యాలు మనకు లేవు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన నీటి ఒప్పందాలు ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి జోక్యంతో అప్పటికి ఉన్న బెస్ట్ పాసిబుల్ విధానంలో జరిగాయి. ఐక్యరాజ్యసమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇచ్చేసేటంత పరిస్థితి ఏనాడు లేదు. అందుచేత అలాంటి గొంతెమ్మ కోరికలు తోటి నెహ్రూనాడిపోసుకోవటం అసహ్యం. ప్రత్యేకించి తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సోనియా కుటుంబం మీదకి ఏనాటికి ఆమె పోకూడదు. అలా వెళితే మానవత్వానికే మచ్చ. తండ్రినే దెబ్బతీసిన మనిషికి ఇది ఒక లెక్కా అని అడిగితే మటుకు సమాధానం లేదు సుమా! మనలో మన మాట. ఎన్టీ రామారావు కుమార్తెగా ఈమె పెళ్లి ఒక జమిందారీ కుటుంబం నుంచి వచ్చిన వాడితో జరిగింది. ఆ లెక్కన చూస్తే కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవి వల్ల చంద్రబాబు నాయుడు కు తన కుమార్తెను ఇచ్చాడే తప్ప కేవలం నారావారిపల్లెలో అతనికి ఉన్న రెండు ఎకరాలను చూసి కాదు. అలాంటిది ఇప్పుడు ఆర్థికంగా చంద్రబాబును, దగ్గుబాటిని బేరీజ్ వేసి చూసినప్పుడు దగ్గుబాటి చంద్రబాబులో కనీసం నూరువ వంతు చేయడు. అందుకని ఇప్పుడు ఈమె దగ్గుబాటిని తప్పు పడుతుందా? ఈమె పిల్లలు ఈ భార్యాభర్తలను ఈ విషయంలో ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పగలరా? నెహ్రూను గురించి అలాంటి అవాకులు చవాకులు మాట్లాడే ముందు ప్రపంచ చరిత్ర పుస్తకం రాసిన తన పక్కనే ఉన్న తన భర్తను అందులోని నిజా నిజాలు ఏంటో అడిగి తెలుసుకోవచ్చుగా? పైగా అవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అందరికీ తెలిసిన చరిత్రకారుడు. నెహ్రూ నిజంగా దేశాన్ని అమ్మేసే ఉంటే అలాంటి అమ్మేసిన వాడి పార్టీలోకి ఈ భార్యాభర్తలిద్దరూ ఎందుకు వెళ్ళినట్టు? అంటే సొంత లాభం ఉంటే ఎలాంటి పనికైనా సిద్ధపడిపోతారా? కొంచెం మనిషి లాగా ప్రవర్తించాలి కదా? ఆ మాత్రం ఆశించడం మనది అత్యాశ అవుతుందా?
దగ్గుబాటి పురంధేశ్వరి - 3:12 [} All .Ill 31 You _ >/ Just now రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక కేంద్రమంత్రి; ఒక S జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షపదవి నిర్వహించిన Read more Reply 3:12 [} All .Ill 31 You _ >/ Just now రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక కేంద్రమంత్రి; ఒక S జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షపదవి నిర్వహించిన Read more Reply - ShareChat
#వైరల్ వీడియోస్ *అధ్యయనంలో నాకు నచ్చినది సినిమా ప్రియులకు, మారని అభిమానులకు చెంపదెబ్బ*🫣 *ఎంత అద్భుతమైన రచన, నటుడు భాస్కర్ నటన అద్భుతం.*👏
వైరల్ వీడియోస్ - ShareChat
01:44
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *త్వరలో లోకేష్‌కు పగ్గాలు..? మరి చంద్రబాబు..? మరి జనసేనాధిపతి..⁉️* February 27, 2026🎯 త్వరలో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా..? తొందరపడుతున్నాడా..? మరి చంద్రబాబు ఏం చేయాలి..? అసలు దీనికి పవన్ కల్యాణ్ అంగీకరిస్తాడా..? లోకేష్ నాయకత్వంలో పనిచేస్తాడా..? కూటమిలోని బీజేపీ ఏం చెబుతుంది..? ఇదుగో ఈ చర్చ రీసెంటుగా జోరుగా సాగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో… దేశం కూడా చూస్తోంది… ఎందుకంటే..? టీడీపీ సపోర్టుతోనే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోంది, అందుకే టీడీపీ రాజకీయాలపై అందరికీ ఆసక్తి… 1) పవన్ కల్యాణ్ అంగీకరిస్తాడా..? ఈ ప్రశ్నకు సమాధానం… ‘తన అంగీకారంతో పనిలేదు’… చంద్రబాబు గనుక వారసుడి పట్టాభిషేకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాక, టీడీపీ శాసనసభాపక్షం లోకేష్‌ను ఎన్నుకున్నాక పవన్ కల్యాణ్ అంగీకరించినా అంగీకరించకపోయినా ఆగేదేమీ ఉండదు… ఒకవేళ కోపంతో, అసంతృప్తితో కూటమి నుంచి బయటికి వస్తే నష్టపోయేదీ తనే… తనెలాగూ జగన్‌తో కలిసి రాజకీయం చేయలేడు, కేవలం బీజేపీ ప్లస్ జనసేన కలిసి ప్రయాణించినా టీడీపీకి పెద్దగా నష్టమూ లేదు… లోకేష్‌తో సమన్వయం చేసుకుంటూ తన డిప్యూటీ సీఎం హోదాలో పనిచేయాల్సిందే… ఆ కెమిస్ట్రీ తప్పదు… (లేదంటే దాసరికి, చిరంజీవికి గతంలో కేంద్రంలో చాన్స్ ఇచ్చినట్టు పవన్ కల్యాణ్‌ను కూడా ఢిల్లీకి రప్పించి, కేంద్ర మంత్రి పదవి ఇస్తారేమో…) 2) మరి చంద్రబాబు ఏం చేయాలి..? ఇదే అసలు ప్రశ్న… 75 ఏళ్లొచ్చినా చంద్రబాబు మంచి ఆరోగ్యంతో ఉన్నాడు… చురుకుగా ఉన్నాడు… తను అధికారం లేకుండా, యాక్టివ్ పాలిటిక్స్ లేకుండా ఉండలేడు… కరుణానిధి, ఫరూక్ అబ్దుల్లా, ములాయంసింగ్ తదితరులు మరీ ముసలితనం పైనబడ్డాక గానీ కొడుకులకు పగ్గాలు ఇవ్వలేదు… బిజూ పట్నాయక్ వంటి నేతలు మరణించాక గానీ కొడుకు రాజకీయాల్లోకి రాలేదు… చాలా ఉదాహరణలున్నయ్… పోనీ, లోకేష్‌కు టీడీపీ ప్లస్ ప్రభుత్వ పగ్గాలు ఇచ్చేసి (నిజానికి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఇప్పటికే లోకేష్ యాక్టింగ్ సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు తీసేసుకున్నాడు) ఢిల్లీకి ఏ రాజ్యసభ సభ్యుడిగానో వెళ్తే..? వెళ్లి ఏం చేయాలి మరి..? అక్కడేమీ ఖాళీలు లేవు, ఉత్త రాజ్యసభ సభ్యుడిగా తను చేయగలిగేదీ ఏమీ లేదు… ఉపరాష్ట్రపతి పదవి భర్తీ జరిగి చాన్నాళ్లు కాలేదు… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీకాలం వచ్చే ఏడాది జూలై దాకా ఉంది… పోనీ, అప్పటిదాకా ఆగి, చంద్రబాబును రాష్ట్రపతిని చేసి, అప్పుడు లోకేష్‌కు అధికారికంగా పగ్గాలు ఇచ్చే ప్లాన్ ఏమైనా ఉందా..? అదేనా ఈ రీసెంటు చర్చ వెనుక సారాంశం..? కానీ రాష్ట్రపతి పదవి లెక్కలు వేరే ఉంటాయి, అదంత సులభమేమీ కాదు… ఏమో, మోడీ వర్సెస్ మోహన్ భగవత్ రాజకీయ సమీకరణాల్లో చంద్రబాబును మరేదైనా కీలక పదవిలోకి అకామిడేట్ చేస్తారా..? చంద్రబాబు పొలిటిషియన్‌కన్నా గుడ్ మేనేజర్… అవకాశాల్ని సరిగ్గా వాడుకుంటాడు… ఎవరితో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడు… ఒకప్పుడు కేంద్రంలో చక్రాలు తిప్పినా, ఇప్పుడు కేవలం విభజిత ఏపీకే పరిమితమై, కాలానికి తగినట్టు తగ్గి ఉంటున్నాడు… జనాకర్షణ శక్తి, మంచి వాగ్దాటి లేకపోయినా తన లౌక్యం, మేనేజింగ్ ప్రతిభలతోనే నెట్టుకొస్తున్నాడు… మామ నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని కాజేసినా, జనంలో వ్యతిరేకత రాకుండా మేనేజ్ చేసుకోగలిగాడు… కానీ లోకేష్ మేనేజింగ్ సామర్థ్యం…? ఏమో, వేచి చూడాల్సిందే… పార్టీ నాయకులు లోకేష్ నాయకత్వాన్ని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తారా అనేదీ సందేహమే… కాకపోతే తను గతంలో పప్పు ఇమేజ్ ఉన్న నాయకుడు మాత్రం కాదు, అన్నింట్లోనూ ఆరితేరుతున్నాడు… ఆల్రెడీ పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోసం ప్రత్యేకంగా విందులు, ఫ్యామిలీలకు పట్టుచీరెలు గట్రా ఓ తంతు స్టార్ట్ చేశాడు కూడా… 3) కొన్నేళ్ల క్రితం కేసీయార్ కూడా కేటీయార్‌కు ప్రభుత్వ పగ్గాలు ఇచ్చేసి, తను తప్పుకుందామని ఆలోచించినట్టు వార్తలొచ్చాయి… ప్రధాని మోదీ కూడా ఏదో సభలో వెల్లడించినట్టు గుర్తు… కానీ తనకు పార్టీలో, ప్రజల్లో యాక్సెప్టెన్స్ అంతగా ఉందానే డౌట్ కేసీయార్‌ను వెనక్కి లాగిందేమో… ప్రస్తుత దారుణ పరిస్థితుల్లో కూడా కేసీయారే పార్టీ అధినేతగా ఉన్నాడు… తన పేరే పార్టీకి తారకమంత్రం, కేసీయార్ రాజకీయాలు వదిలేస్తే (అఫ్‌కోర్స్, వదిలేసినట్టే) బీఆర్ఎస్ ఇప్పుడున్నట్టు కూడా ఉండలేదు… (కేటీయార్‌కన్నా హరీష్‌రావుకు పార్టీలో యాక్సెప్టెన్స్ ఎక్కువ)… సేమ్, టీడీపీ కూడా ఓ కుటుంబ పార్టీయే కదా, కుటుంబ ఆస్తి వ్యవహారాల్లాగే లోకేష్‌‌కు పగ్గాలు ఇవ్వాలని అనుకుంటే… తనకు నిజంగా జనంలో యాక్సెప్టెన్సీ ఉందా..? లభిస్తుందా..? ఇదీ డిబేటబుల్… 4) మరి బీజేపీ..? పెద్దగా పట్టించుకోకపోవచ్చు… జగన్‌తో కలిసి ప్రయాణించలేదు… సొంత బలం లేదు, ఉన్నంతలో టీడీపీకి తోకగా ఉండటం మినహా..! గత ఎన్నికల కూటమి మేనిఫెస్టోతో విభేదించినా, కలిసి వోట్లు అడగక తప్పలేదు… ఒకవేళ చంద్రబాబు గనుక గ్రీన్‌సిగ్నల్ ఇస్తే బీజేపీ హైకమాండ్ వోకే అనకుండా, చేయగలిగేది కూడా ఏమీ లేదు..! మొత్తానికి ఇలాంటి చర్చలు, విశ్లేషణలు జోరుగానే సాగుతున్నాయి..!!
ఏపీ అప్ డేట్స్..📖 - ShareChat
#ఆకాశం లో వింతలు *కలిసి చూడండి❗👀* 28వ తేదీన ఒక అరుదైన ఖగోళ సంఘటన జరగనుంది, ఆ సమయంలో 6 గ్రహాలు - బుధుడు, శుక్రుడు, నెప్ట్యూన్, శని, యురేనస్ మరియు బృహస్పతి - కనిపిస్తాయి! సూర్యాస్తమయం తర్వాత దీనిని కంటితో చూడవచ్చని నాసా తెలిపింది. A rare and awe inspiring night show is set to brighten the sky on February 28 as all the planets in our solar system seem to share one view in a beautiful celestial procession. Skywatchers around the globe will get a chance to look up and spot several worlds lined up in a way that creates a gorgeous cosmic scene. Moments like this are uncommon, making it truly special for anyone who loves cosmos, wonder, or quietly watching faint starlight. While the planets will not make a single exact line, from Earth alone, they can appear spread out across the sky like a quiet planet parade. Some will stand out bright to your eyes, while others may need binoculars or a small telescope to show up clearly. For many people, it may feel like a once in a lifetime chance to catch so many planets sharing the same sky at the same time. The next similar alignment is expected not until 2040, so this one today lands hard. Scenes like this show us how huge and mysterious the universe really is, for sure. Above our schedules and noisy days, entire worlds drift in silent harmony through space. Taking a few minutes to step outside and look up can link you to something far bigger than yourself. Sometimes the universe puts on a show, and all we must do is just pause and watch. #astronomyphotography
ఆకాశం లో వింతలు - BREAKING On February 28, Every Planet In our solar system Will Allign in The Sky For A Rare Parade That Wont Happen Again Until 2040. BREAKING On February 28, Every Planet In our solar system Will Allign in The Sky For A Rare Parade That Wont Happen Again Until 2040. - ShareChat
#🩺ఆరోగ్య జాగ్రత్తలు
🩺ఆరోగ్య జాగ్రత్తలు - మద్యం  ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మానేయండి:. మద్యం . రాత్రి తాగిన తర్వాత ఉదయం . అనిపిస్తుందా? ಇಲಾ తల బరువుగా ఉండటం శక్తి లేకపోవడం . నొప్పి' వాంతులు; వికారం కడుపు కడుపులో భారంగా అనిపించడం . త్రేనుపు తరచుగా గ్యాస్; 5ೌಏಮ್ಮ್ ఇవి మీ జీర్ణవ్యవస్థ దెబ్బతింటున్న సంకేతాలు esera రాత్రి నిద్ర భంగం 88 అలసట; నీరసం ఉదయం ಇನಿ ಊೌಡೌ ಮದ್ಯ{ಂ ಏಲ್ಲ್ ರೌಏಮ್ಬು: ఆరోగ్యం ముఖ్యమైతే: ఇప్పుడే జాగ్రత్త సడండి : ১6$9 ಆಗ್ಗಿಂಬಂಡಿ ಶದ್ ಪೌರ್ತಿಗೌ ಮೌಸೆಯಂಡಿ. మద్యం  ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మానేయండి:. మద్యం . రాత్రి తాగిన తర్వాత ఉదయం . అనిపిస్తుందా? ಇಲಾ తల బరువుగా ఉండటం శక్తి లేకపోవడం . నొప్పి' వాంతులు; వికారం కడుపు కడుపులో భారంగా అనిపించడం . త్రేనుపు తరచుగా గ్యాస్; 5ೌಏಮ್ಮ್ ఇవి మీ జీర్ణవ్యవస్థ దెబ్బతింటున్న సంకేతాలు esera రాత్రి నిద్ర భంగం 88 అలసట; నీరసం ఉదయం ಇನಿ ಊೌಡೌ ಮದ್ಯ{ಂ ಏಲ್ಲ್ ರೌಏಮ್ಬು: ఆరోగ్యం ముఖ్యమైతే: ఇప్పుడే జాగ్రత్త సడండి : ১6$9 ಆಗ್ಗಿಂಬಂಡಿ ಶದ್ ಪೌರ್ತಿಗೌ ಮೌಸೆಯಂಡಿ. - ShareChat
#జాతీయం అంతర్జాతీయం 🌏
జాతీయం అంతర్జాతీయం 🌏 - SRI LANKA STOPS PENSION FORITS MPS SRI LANKA GOVERNMENT CANCELLED PENSION FOR ITS MEMBERS OF PARLIAMENT AND MANY PEOPLE IN INDIA ARE ASKING FOR THE SAMERULEHERE SRI LANKA STOPS PENSION FORITS MPS SRI LANKA GOVERNMENT CANCELLED PENSION FOR ITS MEMBERS OF PARLIAMENT AND MANY PEOPLE IN INDIA ARE ASKING FOR THE SAMERULEHERE - ShareChat
#❤️అమ్మకు ప్రేమతో❤️💞 అమ్మ ప్రేమ💞(My sweet home &బృందావనం)
❤️అమ్మకు ప్రేమతో❤️💞 అమ్మ ప్రేమ💞(My sweet home &బృందావనం) - My Alarm] Mom 1s My Mom is Doctor My  Encouragement Mom is My Mom is Courage Debility My Mom is Mom is My Love My Friend Mom is My Everything And Mom is Love You So Much Mom My Alarm] Mom 1s My Mom is Doctor My  Encouragement Mom is My Mom is Courage Debility My Mom is Mom is My Love My Friend Mom is My Everything And Mom is Love You So Much Mom - ShareChat
IND vs ZIM: #🏏క్రికెట్ 🏏 #🇮🇳టీమ్ ఇండియా😍 *పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి❗* Uppala Shivaprasad February 27, 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీలో టీమిండియా బ్యాటర్లు సరికొత్త రికార్డును నమోదు చేశారు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో టాప్-6 బ్యాటర్లు 150 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం ఇదే తొలిసారి. జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఈ ఫీట్ అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో టీమిండియా పూర్వవైభవాన్ని అందుకుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన ఓపెనర్లు.. ఈ మ్యాచ్‌లో మాత్రం అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. సంజూ శాంసన్ 160 స్ట్రైక్‌రేట్‌తో 15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 24 పరుగులు చేయగా.. తన డకౌట్ల పరంపరకు చెక్ పెట్టిన అభిషేక్ శర్మ(30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55) 183.33 స్ట్రైక్‌రేట్‌తో ఫామ్ అందుకున్నాడు. ఫస్ట్ డౌన్‌కు డిమోట్ అయిన ఇషాన్ కిషన్.. 158.33 స్ట్రైక్‌రేట్‌తో 24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 253.85 స్ట్రైక్‌రేట్‌తో 33 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్) 217.39 స్ట్రైక్‌రేట్‌తో విధ్వంసం సృష్టించగా..నెంబర్ 6లో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) 275 స్ట్రైక్‌రేట్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 ఏళ్ల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు టాప్-6 బ్యాటర్లు కూడా ఈ ఫీట్ సాధించలేదు. భారత టాప్-6 బ్యాటర్ల స్ట్రైక్‌రేట్.. సంజూ శాంసన్- 160 అభిషేక్ శర్మ-183.33 ఇషాన్ కిషన్-158.33 సూర్యకుమార్ యాదవ్- 253.85 హార్దిక్ పాండ్యా-217.39 తిలక్ వర్మ-275 భారత్ ఘన విజయం.. ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రెస్సింగ్ ముజుర్బాని, మపోసా, సికందర్ రజా తలో వికెట్ తీసారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓటమిపాలైంది. బ్రియాన్ బెన్నిట్(59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 నాటౌట్)తన జోరు కొనసాగించగా.. కెప్టెన్ సికందర్ రజా(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/22) మూడే వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు.
🏏క్రికెట్ 🏏 - గ!  225 చరి సభారత టరు 217.39 183.33 158.33 160 గ!  225 చరి సభారత టరు 217.39 183.33 158.33 160 - ShareChat
#✍️కోట్స్ చెడు అలవాటు ఉన్నవాడు మారే దానికి అధిక అవకాశం ఉంది.. కానీ.. చెడు ఆలోచనలు ఉన్నవాడు మారేదానికి అవకాశాలు తక్కువ..🤗
✍️కోట్స్ - ShareChat
https://youtube.com/watch?v=zeqXKuBq7pQ&si=USwjMhJcBuGwGRHT #తిరుమల లడ్డు #ఏపీ అప్ డేట్స్..📖
youtube-preview