ShareChat
click to see wallet page
search
అంబటి వ్యాఖ్యల పై భగ్గుమన్న వైసీపీ శ్రేణులు.. సభ్యత, సంస్కారం లేని పార్టీలో కొనసాగలేము.. ఎమ్మెల్యే ముత్తుముల సమక్షంలో టీడీపీ గూటికి 25 కుటుంబాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి పై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చేసిన అనుచిత వ్యాఖ్యలు గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపాయి. అంబటి వ్యాఖ్యలను నిరసిస్తూ, గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, గడికోట గ్రామ పంచాయతీ, దేవనగరం గ్రామానికి చెందిన సుమారు 25 కుటుంబాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, మాజీ సర్పంచ్ మంద రంగస్వామి, LIC నరసింహులు గార్ల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ మారిన నాయకులు మాట్లాడుతూ.. వైసీపీ నేత అంబటి, చంద్రబాబు నాయుడి గారి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం కోసం కృషి చేస్తున్న ఒక సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి పై అంబటి నోరు పారేసుకోవడం సరికాదని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని, అటువంటి సభ్యత, సంస్కారం లేని పార్టీలో తాము ఇమడలేమని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే తాము వైసీపీని వీడుతున్నట్లు వెల్లడించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని, కేవలం అరాచక పాలన సాగిందని వారు విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ బాటలో పయనిస్తోందని, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి సారథ్యంలో గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఎమ్మెల్యే పనితీరు నచ్చే తాము టీడీపీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన గుర్రపుసాల రామనారాయణ, చలివేంద్ర వెంకటేశ్వర్లు, బోయిళ్ళ శంకర్ రెడ్డి, మందగిరి పాండు, శివాజీ సింగరయ్య, యన్నం వెంకటేశ్వర్లు, ప్రసాద్, చంద్రశేఖర్, దండు చిన్న పుల్లయ్య, ఆదామ్, లక్ష్మయ్య, గుర్రయ్య, రంగయ్య, మరియు గిద్దలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, మాజీ సర్పంచ్ గోపాల కృష్ణ, ముత్తూరి వెంకటేశ్వర్లు, మరియు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.. #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
🎯AP రాజకీయాలు - Rhera |7  ఊగిచ ٤   ٥ PARNತ ^ CAe   5=7 TAITI . 03//. -141 1   9- 4 - UESA n 1 _ 0    7 ٥٥٢٥٥٥٥ miuuunin 0< = ~ಖ ls VERN 0 1  3  م UD Rhera |7  ఊగిచ ٤   ٥ PARNತ ^ CAe   5=7 TAITI . 03//. -141 1   9- 4 - UESA n 1 _ 0    7 ٥٥٢٥٥٥٥ miuuunin 0< = ~ಖ ls VERN 0 1  3  م UD - ShareChat