విజయవాడ దుర్గమ్మ గుడిలో మహా కుంభాభిషేకం..12 ఏళ్ల తర్వాత మళ్లీ..
కనకదుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 6వ తేదీ నుంచి 8 వరకూ మూడు రోజుల పాటు కనకదుర్గమ్మ ఆలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం జరగనుంది. ఇందుకోసం దుర్గ గుడి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకుంభాభిషేకం 12 ఏళ్లకు ఒకసారి వస్తుందని.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు కుంభాభిషేకంలో ముఖ్యమైన ఘట్టం మార్చి 8వ తేదీ ఉదయం నిర్వహించనున్నారు.
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


