💐మంగళ_శనివారాల్లో_శ్రీవారికి_అష్టదళ_పద్మారాధన.. 💐
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి అష్టదళ పద్మారాధన చేస్తారు. ఈ ఆరాధన ఎందుకు చేస్తారు.. ఎప్పుడు చేస్తారో తెలుసుకోవాలనుందా..
శ్రీ మహాలక్ష్మీదేవి పద్మముల యందు నివసిస్తుందియని.. అందుకే అమ్మవారిని పద్మవాసిని అని పిలుస్తారు. అష్టదళ పద్మములందు లక్ష్మీదేవి యొక్క అష్ట లక్ష్ముల వైభవం అలరారుతుంటుంది.
కనుకనే వేంకటేశ్వరస్వామికి అష్టదళ పద్మారాధన ఎంతో ప్రీతికరమైనది
ప్రతి మంగళవారం నాడు స్వామివారికి అష్టదళ పద్మారాధన జరుగుతుంది.
మంగళవారం నాడు స్వామివారిని అష్టదళ పద్మములతో పూజించటం వలన కుజదోషాలు తొలగిపోయి, కుటుంబసౌఖ్యం, సత్వర వివాహసిద్ధి, ఉద్యోగ విజయాలు లభిస్తాయి.
శనివారం నాడు స్వామివారిని అష్టదళ పద్మములతో పూజించడం వలన శనిదోషాలు తొలగిపోయి రాజ్యాధికారం, సకల సంపదలు లభిస్తాయి.
ప్రతి నిత్యం శ్రీ వేంకటేశ్వరస్వామిని, పద్మావతీదేవిని అష్టదళ పద్మములతో పూజించేవారికి అష్టైశ్వర్యసిద్ధి కలుగుతుంది..
#తెలుసుకుందాం #🙏 ఓం నమో నారాయణ #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #om namo venkatesaya #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి


