ShareChat
click to see wallet page
search
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌸పంచాంగం🌸 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 14 - 02 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, బహుళ పక్షం, తిథి : *ద్వాదశి* మ3.24 వరకు, నక్షత్రం : *పూర్వాషాఢ* సా6.00 వరకు, యోగం : *సిద్ధి* తె3.22 వరకు, కరణం : *తైతుల* మ3.24 వరకు, తదుపరి *గరజి* తె4.02 వరకు, వర్జ్యం : *రా2.34 - 4.17* దుర్ముహూర్తము : *ఉ6.31 - 8.03* అమృతకాలం : *మ12.46 - 2.30* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండం : *మ1.30 - 3.00* సూర్యరాశి : *కుంభం* చంద్రరాశి : *ధనుస్సు* సూర్యోదయం : 6.32, సూర్యాస్తమయం : 5.57, *_నేటి విశేషం_* *శనిత్రయోదశి* పూర్వము కృతయుగములో కైలాసములోని పరమశివుని దర్శించ వచ్చిన నారదుడు పరమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాల చెప్పాడు. నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు. ఆకారణముగా శని అంతటి శక్తిమంతుడైతే తన ప్రభావాన్ని తనపై (శివునిపై) చూపి, తనను పీడించి శని శక్తిసామర్థ్యాలను నిరూపించుకోమను అని శివుడు అనగా నారదుడు ఆవిషయము శనితో చెప్పెను. పరమశివుని మాటలకు శనికి అవేశము, పట్టుదల ప్రేరేపించాయి. తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని, ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను. ఈ విధముగా నారదుడు శివ, శనిల మద్య తగాదా సృష్టించాడు. నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శని ప్రభావాన పడకుండా జాగ్రత్తపడమని చెప్పి వెళ్ళిపోయెను. “శని తనను ఎలా పీడించ గలడో చూస్తాను” అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండ కారణ్యము దారిపట్టాడు శివుడు, ఎవరి దృష్టికీ ఊహకు రాని చోటు కోసం అలోచించాడు, ఆ అడవిలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు ఒక పెద్ద రావిచెట్టు తొర్రలో ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు. అప్పుడు “ఏమయింది నీ శపథం” అని ప్రశ్నించాడు ఈశ్వరుడు. ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ “పరమశివుడంతటివాడు దేవతలకు, బుషులకు, మరి ఎందరికో ఆరాధ్య దైవం, ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలె చెట్టు తొర్రలో దాగుకోవడమంటే... ఆ క్షణము శని పట్టినట్లు కాదా !" అని అడిగాడు శని నెమ్మదిగా వినయంగా. శని సమయస్పూర్తికి, వినయానికి ఆయన ప్రభావానికి, పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు. తనను మెప్పించిన శనికి ఆనాటి నుండి ఈశ్వర అనే శబ్ధము సార్ధకం కాగలదని మానవులు తనను (శని) శనీశ్వరా అని పూజిస్తే .. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరము ఇచ్చెను. అలా శనిగ్రహం శనీశ్వరడు అయ్యాడు. సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆహా! శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు, శని... “నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశినాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీకిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం, మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరుతుంది అని వరము ఇస్తున్నానని తెలిపాడు. శనివారం - త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం దానం చేసిన శని ప్రసన్నుడవుతాడనీ, ఏలినాటిశని అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. హనుమంతుడుని పూజించుట వలన కూడా శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైనా హనుమంతుని ప్రార్థించినచో, ముఖ్యముగా శనివారాలలో వారు శనిగ్రహం యొక్క “దుష్ప్రభావాల” నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు. *_🌸శుభమస్తు🌸_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ