ShareChat
click to see wallet page
search
🌸 చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి ▫️ రామచంద్రుడితడు.. షోడశ గుణధాముడు ఏ చిన్నపాటి కష్టం వచ్చినా 'రామచంద్రా' అని తలుచుకుంటాం. ఆశ్చర్యం గొలిపే సంగతులు చెవిన పడినప్పుడు 'అయ్యో రామా!" అని.., వినకూడని మాటలకు 'రామ రామ" అని తెలియకుండానే అనేస్తాం. పిల్లలకు లాలపోసే అమ్మమ్మలు, నాయనమ్మలు 'శ్రీరామ రక్ష' అని దిష్టి తీస్తారు. శ్రీరాముడిలా వాళ్లకు సుగుణాలు అలవడాలని, ఆయురారోగ్యాలతో కళకళలాడాలని కోరుకుంటారు. ఇప్పటికీ ఏదైనా శుభకార్యానికి సంబంధించి కాగితం మీద ఏం రాసినా తొలుత 'శ్రీ 'రామ' అని రాయటం మన సంప్రదా యంగా మారిపోయింది. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష' అన్న తోరణాలతో ఇంటి గడపలు స్వాగతం పలుకుతుంటాయి. వివాహం అయిన నూతన వధూవరులను 'సీతారాముల్లా వర్థిల్లండి' అని దీవించే అనవాయితీ కొనసాగుతున్నది. ఆదర్శ జీవనానికి శ్రీరా ముడు స్ఫూర్తి అయితే సత్సరిపాలనకు రామరాజ్యం దిక్సూచి. సామాజిక ఐక్యతకి 'జై శ్రీరామ్' నినాదం ఒక ఆలంబన. 'రాముడు లేని వాడ లేదు. రామాలయం లేని ఊరు లేదు' అన్న నానుడి తెలుగు రాష్ట్రాలలో ప్రబ లంగా ఉంది. రామనామం, రామబాణం, రామపాదం, ఆఖరికి రాముని మాట దేనికవే గొప్పవిగా ప్రాచుర్యం పొందాయి. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ లోక సంచారి నారద మహాముని ఓ సందర్భంలో వాల్మీకి ఆశ్రమానికి విచ్చేశాడు. ఈ సందర్భంగా వాల్మీకి, 'ఈ లోకంలో గుణవంతుడు యుద్ధంలో శత్రువుని ధైర్యంగా ఎదుర్కోగలిగిన వాడు, ధర్మవంతుడు, చేసిన మేలు మరవని వాడు, ఎల్లప్పుడు సత్యాన్ని పలికేవాడు, అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు. ఎవరైనా ఉన్నారా?' అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నారద ముని.. 'మహర్షీ.. ఇన్ని సుగుణాలు ఉండటం రక్రవర్తులకే అసంభవమైన విషయం. ఇక మామూలు మనుషులకు ఇది సాధ్య మయ్యే పనేనా? కాకపోతే అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు.. ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అంశ అంటూ పై శ్లోకం చెప్పారు. 'ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు అపార సంకల్ప శక్తి ఉన్నవాడు, ఇంద్రియాలను జయించినవాడు. అన్ని విద్యలు తెలిసిన వాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువులను జయించినవాడు, హిమవత్ పర్వతమంత ధైర్యం ఉన్న వాడు..' అంటూ రాముడి శక్తి సామర్థ్యాలను వివరిం చాడు. సంక్షిప్త రామాయణంతో వాల్మీకి హృదయాన్ని నింపేశాడు నరుడి కథ రామాయణం.. 'రామస్య ఆయనం రామాయణం. రాముని కదలికకు అంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది? అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే ఆది సత్యం. ఆయన కదలికలన్నీ సత్యధర్మాలే. అందుకే రామో విగ్ర హవాన్ ధర్మః' అన్నారు. దశావతారాల్లో ఏడోది రామా వతారం. విభిన్నమైనది, విశిష్టమైనది. రామావతారంలో స్వామి పరిపూర్ణ మానవుడే. ధర్మబద్ధమైన జీవనానికి నిలువెత్తు నిదర్శనంగా మసిలాడు. రావణ సంహారం కోసం అవతరించి విలువలను చాటాడు. రామకథను విన్న వాల్మీకి ఆ మరుసటి రోజునే తన శిష్యులతో కలిసి తమసా నదీ తీరాన సంచరిస్తున్నాడు. ఆ సమయంలో ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణంతో కొట్టాడు. అది విలవిల్లాడుతూ మరణించింది. దాంతో ముని హృదయం ద్రవించింది. ఆయన నోట 'మానిషాద ప్రతిష్టాం... త్వమగు శాశ్వతీ సమా: యత్ క్రౌంచ మిథునాదేకమ్, అవధీ కామమో హితమ్.." అన్న శ్లోకం ఆశువుగా వచ్చింది. ఛందోబ ద్ధంగా ఉన్న ఆ శ్లోకం గొప్పతనాన్ని బ్రహ్మ ఆయనకు వివరించాడు. శ్రీరామచరిత్రను కావ్యరూపంగా రచించ మని ప్రేరేపించాడు. ఈ లోకంలో పర్వతాలు, నదులు ఉన్నంత కాలం రామాయణ మహాకావ్యం ప్రకాశిస్తుం దని దీవించాడు. అందుకే వాల్మీకి రామాయణానికి అంతటి ప్రశస్తి. ఆ కావ్య ఘనతను ఇలా ప్రస్తుతిస్తారు.. రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్ ఏకైకమక్షరం ప్రోక్తమ్ పుంసాం మహాపాతకనాశనమ్ శ్రీరాముడి జీవితం అత్యున్నత ధర్మనిరతిని, సత్యసం ధతను సూచిస్తుంది. పితృవాక్య పరిపాలనకు కట్టుబడిన ఆదర్శమూర్తిగా ఆయన నిలుస్తాడు. కైకేయికి తండ్రి దశ రథుడు ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం 14 ఏళ్లు వనవాసానికి వెళ్లాడు. ఆ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించలేదు. తండ్రి మాటను జవదాటకుండా అడవి బాట పట్టాడు. తెల్లవారితే రాజ్యాభిషేకం జరగవలసిన తరు ణంలో ఎలాంటి ఆశాపాశాల్లేకుండా రాజ్యభోగాలను తృణ ప్రాయంగా త్యజించాడు. 'తండ్రి మాటను నెరవే ర్చటం కుమారుని ధర్మం' అని నమ్మాడు. ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించాడు. రాముడి ధర్మనిష్టకు, తండ్రిపై ఉన్న భక్తికి ఇది నిదర్శనం. భారతీయ సంస్కృ తిలో కుటుంబ విలువలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఇది చెప్ప కనే చెబుతుంది. శ్రీరాముడు కంటే శ్రీరామనామం చాలా గొప్పదని ప్రతీతి. 'రమయతి ఇతి రామః... రామ అన్న మాటతోనే హృదయం రమిస్తుంది. నోరు తెరిచి మనం 'రామ' అన్నప్పుడు.. 'రా' అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచు కుని మనలోని పాపాలు బయటికి వెళ్లి దహించుకపోతా యట. 'మ' అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయట ఉన్న పాపాలు లోపలికి రాకుండా ఉంటాయని. చెబుతారు. అలాగే దా అక్షరం భక్తులను సంసార సాగరం నుంచి రక్షిస్తే. 'మ' భక్తుల మనోభీష్టా లను నెరవేరుస్తుందని పెద్దల వివరణ. 'రామ .. రామ అన్న నామం ఉచ్ఛరిస్తే సంసార వ్యామోహాలు దగ్ధం అవుతాయి. సుఖ సంపదలు కలుగుతాయి. యమదూతలను కూడా అది పారదోలుతుందని విశ్వాసం. 'శ్రీ రామ రామ రామ' అని మూడు సార్లు జపిస్తే, శ్రీవిష్ణు సహస్రనామ పారా యణ చేసిన ఫలితం కలుగుతుందని పరమశివుడు పార్వతీ దేవికి తెలిపినట్టు పురాణ కథనం. 'శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే ... సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే' అన్న శ్లోకం జనం నాలుకపైన తరతరా లుగా వర్తిస్తూనే ఉన్నది. ప్రాచీన భారతీయంలో గణితంలో కటపయాది సూత్రం అని ఒకటి ఉంది. సంస్కృత వర్ణమాలలో హల్లులను వర్గాల వారీగా విభజించి వాటికి సంఖ్యలను కేటాయిస్తారు. 'ఆ' అలాగే ఇతర అచ్చులు సున్నా విలువను కలిగి ఉంటాయి. వాటి ప్రకారం ఒకసారి రామ అంటే 10, మూడుసార్లు అంటే వెయ్యికి సమానం అని తెలియజేశారు. అందుకే భక్తులు రామనామాన్ని జపిస్తారు. రామకోటిని లిఖిస్తారు. రామచంద్రుణ్ని స్తోత్రపాఠాలతో కీర్తిస్తారు. శ్రీరామచంద్రుడి సుందర మనోహర రూపాన్ని వర్ణిం చడం ఎవరి తరమూ కాదు. 'ధనుర్భాణాలు ధరించిన వాడు, పద్మాసనంలో విరాజిల్లేవాడు, పీతాంబర ధారి, అప్పుడే వికసించిన తామర పూరేకులతో పోటీపడుతూ, ఎడమ పక్కన ప్రకాశిస్తున్న సీతాదేవి ముఖ కవళికలో మిళి తములై ప్రసన్నములైన నేత్రాలు కలవాడు, ఆజానుబా హువు, మేఘశ్యాముడు, అనేక విధాల దివ్యాభరణాలతో శోభిల్లువాడు, విశాలమైన జటాజూటం కలవాడు అని దాశరథిని రామరక్షా స్తోత్రం వర్ణిస్తుంది. 'నల్లకలువల బోలిన దేహకాంతి కలవాడు, కమల నయనుడు, జటా జాటం అనే కిరీటంతో శోచించేవాడు, చేతులలో ఖడ్గం,అమ్ములపొది, ధనుర్బాణాలు కలవాడు, రాక్షస సంహారకుడు, ప్రపంచ రక్షణకు లీలగా అవతరించినవాడు, జన్మ రహితుడు, సర్వవ్యాపకుడు, సీతాలక్ష్మణ సమేతుడు' అని రామ వైభవాన్ని చాటుతూ ఆ స్తోత్రం సాగుతుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 'రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, బ్రహ్మ స్వరూపుడు, రఘునాథుడు ప్రభువగు సీతాపతికి నమ స్కారం. శ్రీరామ.. రఘునందన... భరతాగ్రజ.. రణధీర... రామ.. నీవు నాకు ఆశ్రయమై నిలువు' అని భక్తులు కోరు తారు. రామనామం ఎంత శక్తిమంతమైనదో రామబాణం కూడా అంతే ఆమోఘమైనది. అది అజేయమైనది. రామ బాణం ప్రయోగిస్తే అది లక్ష్యాన్ని తప్పకుండా చేదిస్తుంది.. అంతేకాదు అది ఆయుధం మాత్రమే కాదు, 'ధ ర్మాత్మా సత్య సంధశ్చ' అంటే ధర్మాన్ని నిల బెట్టే శక్తి దానికి ఉంది అని చెబుతారు. శ్రీరాముణ్ని వనవాసం నుంచి తిరిగి రమ్మని భర తుడు కోరితే అందుకు ఆయన నిరాకరించాడు. అప్పుడు భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి 14 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. భగవంతుడి కంటే ఆయన పాదుకలే గొప్పవని ఈ విషయం దాటి చెబుతుంది. రాయిగా మారిన అహల్య రాముడి పాద స్పర్శతో తిరిగి స్త్రీ రూపం పొందింది. భగవంతుని పాద రజస్సు ఎంతటి కఠినమైన పాపాలనైనా తుడిచేస్తుందనే సత్యాన్ని ఇది చాటుతుంది. శ్రీరాముడి పాదాలను ఆశ్రయించటం అంటే సంసార సాగ రాన్ని దాటడమే. హనుమంతుడు, విభీషుణుడు వంటి గొప్ప భక్తులు దీనిని నిరూపించారు. హిందూ ధర్మశాస్త్రాల పదంగా భగవంతుడి పాదాల వద్ద గంగానది ఉద్భవించి నట్టు భావిస్తారు. రామ పాదాలను స్మరించటం లేదా పూజించటం వల్ల సకల పుణ్యతీర్థాలను దర్శించిన ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. శ్రీరామచంద్ర చరణి మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణ్ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణే శిరసా నమామి శ్రీరామచంద్ర చరణే శరణం ప్రపద్యే 'శ్రీరామచంద్రుని పాదాలను మనసుతో స్మరిస్తున్నాను. ఆయన చరణాలను వాక్కుతో కీర్తిస్తున్నాను. తలవంచి నమస్కరిస్తున్నాను. చరణాలను శరణుజొచ్చుతున్నాను' అని ఈ శ్లోకానికి తాత్పర్యం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రాముణ్ని మించిన వ్యక్తి మరొకరు కనిపించరు. పితృవాక్య పరిపాలన కోసం 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడు. దండకారణ్యంలో ఉన్న ప్పుడు రాక్షస పీడ నుంచి రక్షించమని మునులు కోరగా రాముడు వారికి అభయం ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టు కోవటానికి ఎంతకైనా వెరవనని వారికి స్పష్టం చేశాడు. అపి అహం జీవితం జహ్యాం త్వాం వాసీతే స లక్ష్మణామ్। న తు ప్రతిజ్ఞాం సంశ్రుత్వ బ్రాహ్మణేభ్యో విశేషతం॥ "ఓ సీతా! అవసరమైతే నా ప్రాణాలను, నిన్ను, చివ రికి లక్ష్మణుడినైనా వదులుకుంటాను కానీ, ఇచ్చిన మాట తప్పను' అని చెప్పాడు రాముడు వాలి భయంతో రుష్య మూక పర్వతంపై తలదాచుకున్న సుగ్రీవునికి సాయం చేస్తానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాముడు. 'బల వంతుడైన వాలిని చంపి, నిన్ను కిష్కింధకు రాజును చేస్తాను. సకల రాజభోగాలను అప్పగిస్తాను. భార్య సూపను నీ చెంత చేరుస్తాను' అని వాగ్దానం చేసి ఆ మాట నిలబెట్టుకున్నాడు. వనవాసానానికి వెళ్లిన రాముడిని అయోధ్యకు తిరిగి రావలసిందిగా భరతుడు కోరాడు. ఈ సందర్భంగా అత నికి ధర్మాచరణ, రాజ్య పాలనకు సంబంధించి హితోప దేశం చేస్తాడు రాముడు. తండ్రికి ఇచ్చిన మాట తప్పనం టాడు. 14 ఏళ్ల వనవాసం చేయడం తన ధర్మమం టాడు. వనవాసం ముగియగానే తాను కచ్చితంగా అయోధ్యకు తిరిగి వస్తానని, అప్పటి వరకూ రాజ్యపాలన చేసి ప్రజలను రక్షించాలని భరతుణ్ని ఆదేశిస్తారు. పాల నలో రహస్యాలను కాపాడాలని, సమర్థులైన మంత్రు లను నియమించుకోవాలని, వెయ్యి మూర్ఖుల కంటే ఒక జ్ఞాని సలహా పాటించాలని పాలనా దర్మాలను తమ్ముడికి బోధిస్తారు. ఈ సందర్భానికి ముందు పరివార సమేతంగా వస్తున్న భరతుణ్ని చూసి లక్ష్మణుడు అనుమానిస్తారు. భరతుడు తమపై యుద్ధానికి వస్తున్నాడని రాముడితో చెబుతాడు. లక్ష్మణుడి మాటలను కొట్టి పారేస్తాడు. రాముడు భరతుణ్ని నిందిస్తే తనను దూషణ చేసినట్టే అంటారు. భరతుడి వంటి సహోదరుడు మరొకడు చౌర కడు అంటాడు. రాముడి సోదర ప్రేమకు నిలువెత్తు నిద ర్శనం ఈ మాట. ఇక్ష్వాకు వంశీకులు అంత హీనంగా ప్రవర్తించరనే మాట కూడా స్పష్టంగా చెబుతాడు. రావణుని సోదరుడైన విభీషణుడు శరణు కోరిన ప్పుడు... అతనికి రక్షణ కల్పిస్తానని శ్రీరాముడు మాట ఇస్తాడు. "శరణు కోరిన వారు శత్రువులైనా వారిని రక్షిం చటం నా ధర్మం" అని ప్రకటిస్తాడు. రావణ సంహారానికిముందే విభీషణుడిని లంకా నగరానికి రాజుగా ప్రక టిస్తూ మాట ఇస్తాడు. రావణ వధ అనంతరం విభీషణు డికి పట్టాభిషేకం చేయాలని లక్ష్మణుడిని ఆదేశిస్తాడు. అలాగే విభీషణుని భక్తికి మెచ్చి రాముడు తన కులదైవ మైన రంగనాథుని విగ్రహాన్ని అతనికి బహుమతిగా ఇస్తాడు. చిరంజీవిగా ఉండి ప్రజలను ధర్మమార్గంలో నడిపించమని వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయంలో విభీషణుడికి చెబుతాడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం పున ర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించా డని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో జన్మించారు. ఇన్ని తిథులు ఉండగా, రాముడు నవమి నాడే ఎందుకు జన్మించారు. అని ఎవరికో సందేహం కలిగింది. 9 సంఖ్య పరమా త్మను సూచిస్తుంది. ఈ సంఖ్యను ఏ అంకెతో హెచ్చిం చినా మళ్లీ తొమ్మిది వస్తుంది. ఎన్ని రూపాలలో ఉన్నా, ఎన్ని అవతారాలు ఎత్తినా. ఎన్ని పేర్లు పెట్టినా, అసలు తత్వం ఒక్కటే అన్న రహస్యాన్ని ప్రపంచానికి వెల్లడించ టానికే స్వామి ఆ రోజున జన్మించాడని చెబుతారు. అలాగే అప్పటి కాలానికి విరుద్ధంగా శ్రీరాముడు జీవి తాంతం ఏకపత్నీ వ్రతుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. సీతను కేవలం భార్యగానే కాకుండా కష్టసుఖాలలో పాలుపంచుకునే అర్ధాంగిగా గౌరవించాడు. ఆదర్శవంత మైన దాంపత్యానికి సీతారాములు మారుపేరుగా నిలి చారు. సీతారామకల్యాణం లోకజీవన హేతుకం. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున భక్తిశ్రద్ధలతో రామ కళ్యాణం నిర్వహిస్తారు. తమ ఇంట్లో పెళ్లంత ఉత్సాహంగా దేవుడి పెళ్లిలో చిన్నాపెద్దా భాగమవుతారు. నరుడిగా చరించి.. పితృభక్తి, సోదర ప్రేమ, ఏకపత్నీ వ్రతం, కర్తవ్యనిష్ఠ లాంటి సద్గుణాలను ఆదరించి చూపిన ధర్మమూర్తి శ్రీరాముడు. మానవ జాతి నిలిచి. ఉన్నంత వరకూ ఆయన చరిత్ర అజరామరంగా మిగిలి పోతుంది. మానవాళికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది ▫️ తులసిమొక్కను నాటండి. భగవద్గీతను చదవండి. గోమాతను పూజించి సంరక్షించండి. #🏹 జై శ్రీ రామ్! #🚩జై శ్రీరామ 🕉️ #తెలుసుకుందాం
🏹 జై శ్రీ రామ్! - Nasaalla Viswaptasad Nasaalla Viswaptasad - ShareChat