ఈ కుల దురహంకారం ఈ ప్రజాస్వామ్యనికే మాయని మచ్చ!
లేదా
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి గారి వ్యాఖ్యలు కులపిచ్చికి ఓ ప్రబల నిదర్శనం!
ఈ కుల విషపూరిత వ్యాఖ్యలను ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఖడించాలి.ఓక విధంగా ఈ పెడ ధోరణి ఇలాగే కొనసాగిస్తే ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను తీవ్రంగా అవమానపరచినట్లే అనే మాట అక్షర సత్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క నాయకురాలు పై నుంచి ఉడిపడలేదు,ప్రజలు ఓట్లు వేస్తేనే అందలం ఎక్కినవారే,దీనికి మరెవ్వరరూ అతీతులు కాదు.ఎందుకంటే ఓక రాజ్యసభ సభ్యురాలు వంటి ఓక గౌరవనీయమైన హోదాలో ఉన్న రేణుక చౌదరి గారి నోటి నుండి ' పెట్టారా పేరు అమరావతి పిలవరా కమ్మ రావతి ' అంటూ జాలువారిన వ్యాఖ్యలు వింటే సగటు ప్రజానీకానికి ఎవరికైనా కులపిచ్చి ముదురి పాకాన పడిందా అని అనిపించక మానదు.అదే మాదిరి కాలు జారితే వెనక్కి తీసుకోవొచ్చేమో గాని,అదే నోరు జారితే ఆ మాటలను వెనక్కు తీసుకోవడం అంతా ఆషామాషి వ్యవహారం కాదు కూడా. అదేమాదిరి రాజకీయ రంగంలో ఎవరైనా ఎంతటివారైనా కుల ప్రస్తావన తీసుకువస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పిదం క్రిందకు వస్తుంది తప్ప అది ఎప్పటికి ఒప్పు కాదు.ఓక విధంగా చెప్పాలంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలు మనం వినాల్సి రావడం అత్యంత బాధాకరమైన విషయం.అంతేకాదు ఇలాంటి పరుష వ్యాఖ్యలు రోజు రోజుకు రాజకీయ రంగంలో నైతిక విలువలు అడుగంటిపోతున్నాయి అనే దానికి ఓ ప్రబల నిదర్శనం కూడా.పైగా రాజకీయాలలో కాకలు తీరిన,మంచి ఏదో చెడు ఏదో బాగా ఎరిగిన నాయకురాలు,ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన రేణుక చౌదరి వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలి నోటి నుంచి ఇలాంటి కులపైత్యం తలకెక్కే వ్యాఖ్యలు వెలువడటం ఎంతైనా కడు ఆక్షేపనీయం.దీనిని ఖచ్చితంగా ప్రతి యొక్క మానవతావాదులు,మానవహక్కుల సంఘాలవారు, జర్నలిస్ట్ సంఘాలవారు,మేధావి వర్గాలు,బాగా అనుభవం పండిన రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించి తీరాలి.అంతేకాదు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని మన పెద్దలు ఊరకనే సెలవు ఇవ్వలేదు.ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో అర్ధ,అంగ బలం పుష్కలంగా ఉన్న ఎంతటి నాయకులు అయిన ఇలాంటి బాధ్యతారాహిత్య మాటలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అశేష ప్రజల నుంచి చాలా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదు,అగ్రవేశాలు సైతం చవిచూడక తప్పదు.
ఏదిఏమైన కూటమి సర్కారు వారు గాని లేక న్యాయకొవిధులు గాని ఇలాంటి దుందుడుకు,అధికార దర్పం తలకెక్కి సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి గారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఆమెపై చట్టరీత్యా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత వారి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలోని ఇతర కులస్థుల ప్రజలను అవమానించేలా ఇలా దురుసు వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా ఓక అతి పెద్ద తప్పిదం క్రిందకు వస్తుంది. చట్టం దృష్టిలో
అందరూ సమానమే తప్పు ఎవరూ చేసిన తప్పు తప్పే. ఏమైనా మున్ముందు రాజకీయ రంగంలో ఇలాంటి అపవిత్రమైన,హేయమైన,ఈ యావత్తు సమాజమే తలవంచుకునేలా వ్యాఖ్యలు మరెవ్వరూ చేయకుండా ఓక చట్టాన్ని తీసుకురావాల్సిన గురుతర బాధ్యత సుప్రీం కోర్ట్ వంటి అతి పెద్ద న్యాయస్థానాల పెద్దలపై ఎంతైనా వుంది.అలా చేయకపోతే భవిష్యత్ లో ఇలాంటి కులపిచ్చితో కూడిన వ్యాఖ్యలు మరింత మంది నాయకుల నుండి వినే ప్రమాదం మన దేశ ప్రజానీకానికి పొంచి వుంది.తస్మాత్ జాగ్రత్త!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #🔊తెలుగు చాట్రూమ్😍


