
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
ఐ లవ్ షేర్ చాట్ నా హాబీలు: డాన్స్, రైటింగ్,రీడింగ్
సమిష్టిగా రాణించి ముచ్చటగా మూడోసారి టి20 ప్రపంచ కప్ విశ్వవిజేతగా ఆవిర్భవించిన టీం ఇండియా!
లేదా
టీం ఇండియా దూకుడుకు,పరాక్రమానికి చేతులెత్తేసిన ' కివీస్ ' జట్టు!
గతంలో 2007,2024లలో టి20 వరల్డ్ కప్ ను సాధించిన టీం ఇండియా ఇప్పుడు వరుసగా మూడోసారి 2026లో టి20 ప్రపంచ కప్ ను ముద్దాడింది మన టీం ఇండియా.అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నరేంద్ర మోదీజీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సూర్య కుమార్ కెప్టెన్సీ సారథ్యంలో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో కివీస్ జట్టును చిత్తు చేసి కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల హృదయాలను ఆనందడొలికల్లో ముంచెత్తింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ మెగా టోర్నమెంట్ లో ఒక్క దక్షిణాప్రికాజట్టుతో మ్యాచ్ లో మినహా మిగతా ఎనిమిది మ్యాచుల్లో సూర్యకుమార్ కెప్టెన్సీలోని టీం ఇండియా తమ అమోఘమైన,అసాధారణ ఆటతీరుతో తమ స్థాయికి తగ్గట్లు రాణించి అందరి చేత శెబాష్ అనిపించుకుంది.ఈ టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ లో టీం ఇండియా అటు బ్యాటింగ్,ఇటు బౌలింగ్,ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ చూపి ప్రత్యర్థి జట్లను ఆట కట్టించడంలో నూటికి నూరుపాళ్ళు సపలీకృతం కావడం ఎంతైనా హర్షణీయం.అన్నింటికి మించి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను,ఫైనల్లో కివీస్ వంటి అత్యంత ప్రొఫెషనల్ ఆటతీరు కలిగిన ప్రతిభావంతమైన జట్లను బురిడీ కొట్టించి మరీ టీం ఇండియా టి20 విశ్వకప్ విజేతగా ఆవిర్భవించడం ఓక గొప్ప విశేషం.అదేవిధంగా చావో రేవో తేల్చుకోవాల్సిన ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించిన సంజు సామ్సన్ ( 46 బంతుల్లో 89; 5 ఫోర్లు,8 సిక్స్ లు),ఇషాన్ కిషన్ ( 25 బంతుల్లో 54; 4 ఫోర్లు,4 సిక్స్ లు ),అభిషేక్ శర్మ ( 21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్ లు ) అర్థ సెంచరీలతో రాణించారు, చివరి ఓవర్లో శివం దూబే ( 8 బంతుల్లో 26 నాటౌట్, 3 ఫోర్లు,2 సిక్స్ లు ) చెలరేగిపోవడంతో అత్యంత భారీ స్కోరును టీం ఇండియా కివీస్ జట్టు ముందు ఉంచగలిగింది.ఇక అ తరువాత కాగల కార్యం గాంధర్వులు తీర్చినట్లు జస్టిస్ బుమ్రా ( 4 వికెట్లు ), అక్షర్ పటేల్ ( 3 వికెట్లు ) తమ బౌలింగ్ లలో మంచి వాడి వేడి ప్రదర్శించి ప్రత్యర్థి జట్ల బ్యాటర్ల పనిపట్టడంతో కివీస్ జట్టు 19 ఓవర్లలో కేవలం 159 పరుగులే సాధించి 96 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలు అయ్యింది.ఇంకా చెప్పుకుంటూ పోతే నిన్న మొన్నటి వరకు కూడా బ్యాటింగ్ లో ఫెయిల్ అవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంజు సామ్సన్ ఎట్టకేలకు కోల్పోయిన ఫామ్ ను దొరకబుచ్చుకొని ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ టి 20 విశ్వకప్ లో 5 ఇన్నింగ్స్ లలో 321 పరుగులు సాధించి ' ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ' సైతం గెలుచుకొని జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో అతను నిలువడం ఎంతైనా భారత క్రికెట్ కు సంబంధించి ఓక గొప్ప శుభ పరిణామం.ఇక అన్యూహంగా టీంకు దూరమై తిరిగి వచ్చిన తరువాత ఇషాన్ కిషన్ ఈ టి20 విశ్వకప్ లో మరింత చేలరేగిపోయి పాకిస్తాన్ మ్యాచ్ తో పాటు, సెమిస్,ఫైనల్ మ్యాచ్ లలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం,మరోవైపు అభిషేక్ శర్మ,హైదరాబాద్ బ్యాట్స్ మ్యాన్ తిలక్ వర్మ అడపదడప కీలక మ్యాచ్ లలో తమ బ్యాట్ కు పని చెప్పడం,స్లాగ్ ఓవర్లలో మొత్తం 17 సిక్సర్ లతో శివం దూబే ఓ చిచ్చర పిడుగులా చేలరేగిపోవడం,అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్ లో భారీ హిట్ లతో,బౌలింగ్ లో కొత్త బంతితో రాణించడం వెరసి ఈ టి20 వరల్డ్ కప్ విజయం టీం ఇండియాకు నల్లేరు మీద నడకే అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏదిఏమైన బౌలింగ్ లో టీం ఇండియా బౌలర్లు బుమ్రా,ఆర్ష్ దీప్,వరుణ్ చక్రవర్తిలు తమ స్థాయికి తగ్గట్లు బౌలింగ్ విభాగంలో విశేషంగా రాణించడం సూర్య కుమార్ సారథ్యంలోని టీం ఇండియాకు ఓక ఆతి పెద్ద వరంలా మారింది అనే మాట అక్షర సత్యం. ముఖ్యంగా 2024 టొర్నీలో ' ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ' నిలిచిన బుమ్రా ఈసారి కూడా ఏ మాత్రం వన్నె తగ్గకుండా రాణించి తన బౌలింగ్ లో మంచి నైపుణ్యాన్ని కనబరచి ఏడు కంటే తక్కువ ఎకానమీతో అతను పరుగులు ఇచ్చిన తీరు చూస్తే ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మ్యాన్ల ను ఎంతగా బుమ్రా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాపించారో మనం ఇట్టే ఊహించవచ్చు.ఇక ఆర్ష్ దీప్ కూడా తానేమి తక్కువ తినలేదు అన్నట్లుగా అడపదడప ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మ్యాన్ లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు.ఇది ఇలా ఉంటే మిస్టరియస్ స్పిన్నర్ గా పేరుగాంచిన వరుణ్ చక్రవర్తి సైతం టోర్నీ ద్వితీయార్థంలో కొంత తడబడిన ఓవరాల్ గా అతని మ్యాజిక్ స్పిన్ ప్రభావం బాగానే పనిచేయడంతో ప్రత్యర్థి బ్యాట్స్ మ్యాన్ ల భరతం పెట్టగలిగాడు.ఇంకా చెప్పుకుంటూ పోతే కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోర్నీల్లో భారత క్రికెట్ జట్టును విశ్వవిజేతగా నిలుపడంలో టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా ఎంతో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.కీలక సమయాల్లో వ్యూహల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాదు,కెప్టెన్ గా పెద్దగా అనుభవం లేని సూర్య కుమార్ యాదవ్ ని సైతం సరైన రీతిలో మార్గ నిర్దేశనం చేయగలిగాడు.2025 ఛాంపియన్స్ ట్రోఫీ,2026 టి20 వరల్డ్ కప్ లను గెలిపించిన టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ ను టీం ఇండియాకు సాధించి పెట్టడమే.ఇప్పటికే 2007లో ఆటగాడిగా సైతం టి20 వరల్డ్ కప్ గెలిపించిన గంభీర్ ఇప్పుడు కోచ్ గా సైతం తన ఖాతాలో మరో ప్రపంచకప్ ను జమ చేసుకున్నాడు.అన్నింటికి మించి టి20 టోర్నమెంట్ లలో సూర్య కుమార్ సారథ్యంలోని టీం ఇండియా జట్టు విజయాల జైత్రయాత్ర ఇలాగే మున్ముందు కూడా అత్యంత దిగ్విజయంగా సాగిపోవాలని భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది టీం ఇండియా అభిమానుల ఉవాచ,అభిలాష కూడా,ఓక విధంగా చెప్పాలంటే వారంతా హృదయపూర్వకంగా,మనసా,వాచ,కర్మణ,ఎలాంటి పరిస్థితుల్లో ఇటు పొద్దు అటు పొడిచిన టీం ఇండియా ఘనవిజయాలు సాధించాలనే కోరుకుంటారు తప్ప మరో మాటకు తావు ఉండదు.జయ జయహో సూర్య కుమార్ యాదవ్ టీం! హ్యాట్సాఫ్ టూ టీం ఇండియా!🏏🏏🏏🇮🇳🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల, నంద్యాల జిల్లా! #🇮🇳టీమ్ ఇండియా😍
(8 - 3 - 2026) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను వ్రాసిన వ్యాసం ' రిపబ్లిక్ ' పత్రికలో ప్రచురితమైంది!
- మధుసూదనరెడ్డి బుగ్గన, వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు! #జాతీయ మహిళా దినోత్సవం
స్వామియే శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప శరణం!
గోరణ్య కారుణ్య సంసార యాత్రికుల గోషవిని బ్రోచు స్వామిచా!
పాపాలు, దోషాలు ప్రక్షాళన చేయు పంపా నది తీర ఎరుగే వాసా!
నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించు కనిపించు అయ్యప్పస్వామి!
- మా హిందూ భక్తజనతాండవానికి ఆధ్యాత్మిక స్వామియే శరణం అయ్యప్ప శుభ బుధవారం! #శుభ బుధవారం
చెలియ నీ నడుమును చూసా ఆహా బ్రహ్మ ఎంత పిసినారి! #📽ట్రెండింగ్ వీడియోస్📱
#🌸మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💖 మా మిత్రులకు శ్రేయోభిలాషులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!(8 - 3 - 2026). ఈ ప్రత్యేక సందర్బంగా మహిళల అజేయశక్తికి,వారి యొక్క త్యాగనీరతికి ఒక్కసారి మనమంతా లాల్ సలాం చేద్దాం! జయ జయహో మహిళలోకం!👩👩👩🤰🤰🤰👩🔧👩🔬👩🏫👩🏫👩🏫👩💻👩💻👩🌾👩🌾👨👩👧👨👩👧👨👩👦👦👨👩👦👦💃💃💃👩🦼👩🦼👩🦼👩🦯👩🦯👩🦯👩🦽👩🦽👩🦽🦸♀️🦸♀️
#🌸మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💖 On the occasion of International Women' s day,bjp dynamic woman leader Smriti Irani Given wonderful and meaningful speech! In this special day every Indian to listen this valuable speech to understand the greatness of our Nation! #proudindianwomen
#🌸మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💖 మహిళల సాధికారత,స్వేచ్చ,వారి హక్కులకు పూర్తి స్థాయిలో మోక్షమెప్పుడు? ( 8 - 3 - 2026)!
లేదా
మన భారతవాణికి స్వాతంత్య్రం సిద్దించి దాదాపు 79 సంవత్సరాలు కావస్తున్న ఇంకను మహిళలకు రక్షణ గగనకుసుమమే?
ఈ నెల అంటే మార్చి 8న మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ ప్రత్యేక సందర్బంగా మరోసారి మనం మహిళల సాధికారత,స్వేచ్చ,వారి హక్కులు,రక్షణ గురించి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఈనాటికి కూడా మహిళలు వారి మా నాన వారు పూర్తి స్థాయిలో స్వేచ్చ,వాయువులు పీల్చుకోలేక పోతున్నారు అనే మాట మనకు చాలా స్పష్టంగా హితబోధ అవుతున్నది.ఎందుకంటే ఈనాటికి మహిళలు అనేక విధాలుగా గృహ హింస,లైంగిక దాడులు,భృణ హత్యలు,అత్యాచారాలు,పురిటిలోనే పసిపాపలను కడతెర్చడం,లింగ సమానత్వం వంటి విషయాల్లో తీవ్రస్థాయిలో అధిపత్య ధోరణి, దౌర్జన్యాలను,అమానుష ఘటనలను నిత్యం ఎదుర్కొంటుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబందించి అత్యంత దురదృష్టకరం.ముఖ్యంగా చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత 30 శాతానికి మించక పోవడం కూడా మహిళల పాలిట ఓ శాపంగా పరిణమించి వారి ప్రశ్నించే గొంతుకకు కళ్లెం వేసినట్లయింది. అయినప్పటికీ మహిళలు ఈ మధ్యకాలంలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో వందే భారత్ ఎక్ష్ప్రెస్స్ లా దూసుకుపోతున్నారు అనే మాట అక్షర సత్యం.అయితే మహిళా ఉద్యోగులు అతి తక్కువగా వున్న రంగాలలో మహిళలు పనిచేసేటప్పుడు మాత్రం వారికి రక్షణ అనేది ఓ గగన కుసుమంగా,
ప్రశ్నార్థకంగా మారిపోయి పలు సందర్భాలలో వారు అనేకమైన ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే విషయం మనందరికి తెలిసిన పచ్చి యదార్థమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఓక విధంగా మన భారతవాణికి స్వాతంత్య్రం సిద్దించి 79 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఎందుకనో ఇంకను మహిళలు ఇంటా బయట అనేక అవమానాలను,అవహేళనలను, ఛీత్కారాలను,చీవాట్లను,భరించలేని హింసను పురుష ప్రపంచం నుంచి ఎదుర్కొంటూనే వున్నారు అనే మాట అక్షర సత్యం.అంటే కొన్ని గృహలలో తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి తమ కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకోవడమే పరమావదిగా భావిస్తూ మహిళలు ఓ వెట్టిచాకిరి చేసే యంత్రంలా మారిపోతుండటం అత్యంత జూగుస్సకరమైన,కడు బాధాకరమైన విషయం.ఇందుకు ప్రదాన కారణం అయా కుటుంబాలలో మహిళలను ఓ మరబొమ్మగా భావించే అనాగరిక సంస్కృతి నేటికీ కొన్ని కుటుంబాలలో రాజ్యమేలుతుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబందించి అత్యంత హేయమైన, సిగ్గుచేటైన విషయం.అయినప్పటికీ అనేక మంది మహిళలు ఈ మధ్యకాలంలో తరచుగా అయా రంగాలలో మంచి విద్యావంతులుగా,చదువులమ్మ సుపుత్రికలుగా మారి మంచి ఉన్నత స్థాయికి చేరుకొని తమ ఉనికిని పురుషులతో సమానంగా చాటుకుంటుండటం ఎంతైనా ఎంతో ఆరోగ్యకరమైన పరిణామం.
ఏదిఏమైనా మహిళలు ఇంకను పూర్తిస్థాయిలో నిరక్షరాస్యతను జయించలేకపోతుండటం,చైతన్యవంతుగా మారే అవకాశం లేకపోవడం,పురుషాదిక్యత సమాజం వారికి తగినంత స్థానం కల్పించకపోవడం వెరసి మహిళలు అయా రంగాలలో ఆశాజనకమైన స్థాయిలో,చెప్పుకొదగ్గ రీతిలో ముందంజ వేయలేకపోతున్నారు అనే మాట ఎవ్వరూ కాదనలేని ఓ అక్షర సత్యం.అయితే ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో సైతం మహిళలు అనేక సందర్భాలలో తాము ' అబలలం కాదు సబలం ',వీర నారీమణులం అని నిరూపించుకుంటూ న్యాయ,పోలీస్,న్యావి మిలిటరీ,ఐ.పి.ఎస్,ఐ.ఏ.ఎస్,శాస్ర్ర,సాంకేతిక,సైన్స్ & టెక్నాలజీ రంగాలలో అన్యూహంగా ఓ తారజువ్వలా దూసుకువస్తూ పట్టుదలతో,ఎనలేని చిత్తశుద్ధితో,అవిరళ కృషితో తామేంటో ఈ సభ్య సమాజం ముందు తమను తాము నిరూపించుకుంటుండటం ఓ విప్లవాత్మక,ఆదర్శమైన మార్పుకు ఓ అతి గొప్ప సంకేతం.ఏమైనా కనీసం వచ్చే ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే సమయానికన్నా మహిళలు మరింత ప్రతిభావంతులుగా రాటుదేలి అయా రంగాలలో తమ ఉనికిని అత్యంత ఘనంగా చాటుకోవాలని,తమలో దాగి వున్న శక్తి,యుక్తులకు జీవం పోసి, అభద్రతభావానికి చరమగీతం పాడి అత్యంత ధైర్యసాహసాలతో ఓ రాణి రుద్రమదేవిలా,' నైటింగేల్ అఫ్ ఇండియా ' గా పేరుబడ్డ సరోజినీదేవి నాయుడు లాగా,ఉక్కు మహిళగా ఖ్యాతి నార్జించిన మాజీ భారత ప్రధాని దివంగత ఇందిరాగాంధీ గారిలా,నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మాజీ ఐ.పీ.ఎస్ అధికారిణి కిరణ్ బేడీ గారి లాగా,ఇన్ఫోసిస్ అధినేత్రి ఓ సుధామూర్తి గారిలాగా నేటి మహిళలు తమ సర్వశక్తులు ఒడ్డి,ఉన్నత విద్యావంతులుగా మారి తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగినప్పుడే మహిళలు తమ ప్రత్యేకతను,గొప్పతనాన్ని ఈ ప్రజాస్వామ్యంలో మరింత గొప్పగా చాటి చెప్పగలుగుతారు అనడంలో ఎలాంటి సందేహం ఇసుమంతైనను తావు లేదు.మహిళల హక్కులు వర్ధిల్లాలి మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా!నారీ శక్తిమణులు అయిన మహిళలకు ఓ లాల్ సలాం! సెల్యూట్ టూ మహిళా ప్రపంచం! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!🤵♀️🤵♀️🤵♀️🤵♀️👭👭👭
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
పులివెందుల ముద్దుబిడ్డ వైస్సారు,మా పురిటి గడ్డ మిమల్ని మరువదు సారు! క్యాప్షన్ : పేద,సామాన్య,బడుగు బలహీనవర్గాల పెన్నిధి,రైతుభాంధవుడు దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం,డాక్టర్ వైస్సార్ తాను సీఎంగా పనిచేసిన కాలంలో ప్రజల సౌకర్యార్థమై 108 అంబులెన్సు సర్వీస్,మహిళలకు పావలా వడ్డీ రుణాలు,పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజురీయింబర్స్ మెంట్,రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ,పేద,సామాన్య ప్రజలకు ఏదైనా పెద్ద జబ్బు వచ్చినప్పుడు వారు చికిత్సతీసుకునే నిమితమై ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాలలో కొలువై ఉన్న దేవుడిలా నేటికీ వారి చేత కొనియాడబడుతున్నాడు మాట మీద నిలబడే మడమ తిప్పని నేత,ఇచ్చిన హామీకీ,చెప్పిన మాటకు ఆరునూరైనా కట్టుబడే మహానేత,ఓ గొప్ప సుపరిపాలకుడు,నిరుపేదల తలవ్రాతను మార్చిన మేరుగరణధీరుడు ఈ మన దివంగత డాక్టర్ వైస్సార్! జోహార్ వైస్సార్! అమర్ రహే పులివెందుల ముద్దుబిడ్డ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
దీపావళి పండుగ అంటేనే మన కుటుంబాలలో ఎనలేని కళాకాంతులతో కూడిన సంతోషాలహరివిల్లు ఉప్పొంగిపోతుంటుంది!🧨🧨🧨🏹🏹🏹 #deepavali





