
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
ఐ లవ్ షేర్ చాట్ నా హాబీలు: డాన్స్, రైటింగ్,రీడింగ్
పులివెందుల ముద్దుబిడ్డ వైస్సారు,మా పురిటి గడ్డ మిమల్ని మరువదు సారు! క్యాప్షన్ : పేద,సామాన్య,బడుగు బలహీనవర్గాల పెన్నిధి,రైతుభాంధవుడు దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం,డాక్టర్ వైస్సార్ తాను సీఎంగా పనిచేసిన కాలంలో ప్రజల సౌకర్యార్థమై 108 అంబులెన్సు సర్వీస్,మహిళలకు పావలా వడ్డీ రుణాలు,పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజురీయింబర్స్ మెంట్,రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ,పేద,సామాన్య ప్రజలకు ఏదైనా పెద్ద జబ్బు వచ్చినప్పుడు వారు చికిత్సతీసుకునే నిమితమై ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాలలో కొలువై ఉన్న దేవుడిలా నేటికీ వారి చేత కొనియాడబడుతున్నాడు మాట మీద నిలబడే మడమ తిప్పని నేత,ఇచ్చిన హామీకీ,చెప్పిన మాటకు ఆరునూరైనా కట్టుబడే మహానేత,ఓ గొప్ప సుపరిపాలకుడు,నిరుపేదల తలవ్రాతను మార్చిన మేరుగరణధీరుడు ఈ మన దివంగత డాక్టర్ వైస్సార్! జోహార్ వైస్సార్! అమర్ రహే పులివెందుల ముద్దుబిడ్డ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
దీపావళి పండుగ అంటేనే మన కుటుంబాలలో ఎనలేని కళాకాంతులతో కూడిన సంతోషాలహరివిల్లు ఉప్పొంగిపోతుంటుంది!🧨🧨🧨🏹🏹🏹 #deepavali
చదువుల ఒత్తిడి,ప్రేమ వంటి అంశాలు యువతను అల్పఆయుష్షువులుగా మారుస్తున్న వైనం!
లేదా
ఎంతో బంగారు భవిష్యత్ గల యువత ఇష్టం లేని చదువులు,అపరిణతితో కూడిన ప్రేమల వల్ల అర్ధాంతరంగా తనువు చలిస్తున్న వైనం దురదృష్టకరం,అత్యంత దయనీయం!
ఈ మధ్యకాలంలో ఎక్కువ భాగం చదువుల ఒత్తిడి,అపరిణతితో కూడిన ప్రేమ వంటి అంశాల మూలాన అనేక మంది యువత అల్పఆయుష్షువులుగా మారుతున్న వైనం అత్యంత దురదృష్టకరం,తీవ్ర దయనీయం.దీంతో వీరిపై ఎన్నో మరెన్నో కోటి ఆశలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులు ఇలాంటి కడు దుఃఖమైన పరిస్థితిని,హఠాత్ పరిణామాన్ని భరించలేక నీరుగారిపోతున్నారు,విగత జీవులుగా మారిపోతున్నారు అనే మాట సత్య దూరం కాదు.ఎందుకనో ఈ చదువుల ఒత్తిడిని భరించలేక తమ తల్లిదండ్రులు తమ పై పెట్టుకున్న కొండంత ఆశలను అడియాసలు చేస్తున్నామనే నిరాశ వారిలో అవహించి చివరకు వారిని ఆత్మహత్యల వైపు ప్రేరరేపిస్తున్నది అనే మాట అక్షర సత్యం.ఇది ఇలా వుంటే నేటి యువత అపరిణతితో కూడిన ప్రేమ వలలో పీకలదాకా కూరుకుపోయి ఏ కారణం చేతనైనా వారి తల్లిదండ్రులు వారి ఇరువురి ప్రేమలను తిరస్కరిస్తే వారిరువురు కూడా ఈ పరిణామాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేక ఉన్నఫలంగా,తృణప్రాయంగా తమ విలువైన ప్రాణాలను సైతం త్యజించేందుకు సిద్దపడుతుండటం ఈ సమాజానికి సంబంధించి అత్యంత ఆనారోగ్యకరమైన,అనాగరిక పరిణామంగా చెప్పుకోవొచ్చు.అయితే తమ పిల్లలపై వారి తల్లిదండ్రులకు తగిన,సరిఅయిన పర్యవేక్షణ కోరవడటం,ఏదో డబ్బు పెట్టుబడిగా పెట్టి ఓ మంచి పేరుమోసిన కాలేజీలో చేర్పించడంతోనే తమ పని అయిపోయిందని చేతులు దులుపుకొని మరీ అంతా వారే చూసుకుంటారులే అనే తీవ్ర నిర్లక్ష్య వైఖరితో తమ పిల్లల నడవడిక ఎలా వుంది,వారి చదువులు ఏ విధంగా సాగిపోతున్నాయి అనే ముఖ్య విషయాలు పట్టించుకోకపోవడంతో ఈ ఆత్మహత్యలు వంటి హృదయవిదారక ఘటనలు,దారుణాలు పదే పదే పొడచూపుతున్నాయి నేటి సమాజంలో అనే మాటలో ఎంతో సత్యం దాగి వుంది.అదేవిధంగా తల్లిదండ్రులు అనే వారు ' చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే కన్నా ' ముందే కడు జాగ్రత్త వహించి తమ పిల్లలపై ఒక నిఘా పెట్టి ఉంచడం,ఒక వేళ వారికి ఆ కోర్సు ఇష్టం లేకపోతే తక్షణమే వారిని ఆ కోర్సు నుంచి తప్పించి వారికి ఇష్టమైన రంగంలో చేర్పించడం,అలా కాకుండా వారిరువురు ప్రేమలో పడితే తప్పనిసరి పరిస్థితుల్లో వారి ప్రేమను అంగీకరించే విషయంలో ఏ మాత్రం కఠిన వైఖరి అవలంబించకుండా ఆ ప్రేమ వ్యవహారాన్ని చాలా సున్నితంగా పరిష్కరించే గురుతర బాధ్యత నేటి తల్లిదండ్రులపై ఎంతైనా వుంది.అదేమాదిరి తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలపై అనవసరంగా మితిమీరిన ఆశలు పెట్టుకోకుండా వారి శక్తి,సామర్థ్యం మేరకే వారు చదువును కొనసాగించే సంపూర్ణ స్వేచ్ఛను వారికివ్వడం ఎంతైనా సర్వదా శ్రేయస్కరమైన విషయం.
ఏదిఏమైనా నేటి యువత విషయంలో వారి తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా వుంటూ,వారికి సరిఅయిన రీతిలో గైడేన్స్ ఇస్తూ వారికి అన్ని విషయాలలో మేమున్నాము మీకు అండగా వంటి భరోసాను వారికి కల్పిస్తూ,ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందు ఆ విషయాలను తమతో షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి అనే ముఖ్య అంశాన్ని వారికి బహు బాగుగా విశదీకరించాలి.అంటే ఒక విధంగా తల్లిదండ్రులు వారి పిల్లలతో ఒక పెద్దగా కాకుండా ఒక ఆత్మీయులు లాగా,ప్రాణ స్నేహితుల లాగా వ్యవహరిస్తూ,వారి ప్రతికదలికపై అత్యంత శ్రద్ధాశక్తులు కనబరిస్తే మాత్రం ఎలాంటి దుష్పరిణామాలు,అన్యూహ ఘటనలు,గుండెల్ని పిండి చేసే పరిస్థితులు వారి నుంచి ఉత్పన్నం కావు కాక కావు.ఏమైనా నేటి యుక్త వయస్సు పిల్లలను వారి తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తతో పర్యవేక్షించడం,వారిని ఉన్నత విద్యావంతులను చేయడం అనుకున్నంత ఆషామాషి వ్యవహారం మాత్రం కాదు.ఒక విధంగా చెప్పాలంటే నేటి ఆదునాతనమైన టెక్నాలజీ యుగంలో అది వారికి ' కత్తి మీద సాము లాంటిదే ' అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.కాబట్టి నేటి యువత తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం విషయంలో ఏ మాత్రం తొందర పడకుండా,హడావిడి చేయకుండా అతి చూచి వ్యవహరించడం,తమ పిల్లలకు ఈ సమాజం,ఈ సమాజంలోని పరిణామాల గురించి నిత్యం హితబోధ చేయడంతో పాటు ఎల్లవేళలా వారి వెన్నంటి వుంటూ వారికి సరిఅయిన మార్గదర్శకం చేస్తే మాత్రం తాము కోరుకున్న విధంగా తమ పిల్లలను ఒక యోగ్యులుగా,ఈ సమాజాన్ని,ఈ సమాజంలోని ప్రజలను ఉద్దరించే అత్యంత బాధ్యతాయుతమైన వ్యక్తులుగా బాసిల్లేలా,ఒక వెలుగు వెలిగేలా చూడగలిగిన వారు కావడం తథ్యం.అదేవిధంగా నేటి యువత మంచి నడవడిక,క్రమశిక్షణతో మసలుకొని,ఒక స్ఫూర్తిదాయకమైన పంథాలో ముందుకు సాగి భవిష్యత్ లో ఒక మంచి ఉన్నత విద్యావంతులుగా,చదువులమ్మ చెట్టు నీడలో ఒక గొప్ప సరస్వతీ పుత్రులుగా మారి వారికి జన్మనిచ్చిన,పుట్టుకను సంప్రాప్తించిన వారి జననీ,జనకులకు గొప్ప కీర్తి,పేరు,ప్రఖ్యాతలను తీసుకురావాలని మనమంతా మనసా,వాచ,కర్మణ,హృదయపూర్వకంగా కోరుకుందాం!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #యువత
ఆర్ఎస్ఎస్ పూర్వ ప్రచారక్ నాగేంద్ర ప్రసాద్ జీ శివైక్యం పొందడం హిందూ ధార్మిక స్వచ్ఛందసేవా సంస్థలకు & హిందూ ఆత్మీయ బంధువులందరికి కూడా ఓ తీరనిలోటు! ( 2 - 3 - 2026)!
లేదా
హిందువుల ఐక్యతకు,బలోపేతానికి తన యావత్ జీవితాన్ని అంకితం చేసిన ఓ మహోన్నత వ్యక్తి,పోరాటయోధుడు,కారణజన్ముడు ఈ నాగేంద్రప్రసాద్ గారు!
రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పూర్వ ప్రచారక్ శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు శివైక్యం చెందడం యావత్ హిందూ సమాజానికి,హిందూ ధార్మిక స్వచ్ఛంద సేవా సంస్థలకు,ప్రతి యొక్క హిందూ ఆత్మీయ బంధువులకు కూడా తీరనిలోటు అనే మాట ఓ అక్షర సత్యం.ఎందుకంటే తన యావత్ జీవితాన్ని హిందూవుల ఐక్యతకు,బలోపేతానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి,కారణజన్ముడు,ఓ పోరాట యోధుడు,హిందుత్వ ఎజెండానే ఏకైక లక్ష్యంగా మనసా,వాచ,కర్మణ జీవించిన ఓ నిఖార్సైనా హిందుత్వవాది ఈ నాగేంద్రప్రసాద్ గారు అనడంలో ఎలాంటి సందేహనికి తావులేదు.అంతేకాదు చిన్ననాటి నుండి కూడా ఆయన హిందుత్వ కార్యకలాపాలలో నిత్యం తలమానికంగా వుంటూ దాదాపు 30 సంవత్సరాలు భరతమాత సేవలో తరించిపోవడమే కాదు కాల్వబుగ్గ దగ్గర అత్యంత విశాలమైన ప్రాంగణంలో శ్రీ సురభి గోశాలను ఏర్పాటు చేయడమే కాదు,అక్కడ ప్రముఖ స్వాతంత్ర్య యోధుల ప్రతిమలను సైతం ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అసలు సిసలు హిందుత్వవాది ఈ శ్రీ నాగేంద్రప్రసాద్ గారు.అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుడిగా వుంటూ భరతమాత సేవలో తరించిపోతూ తన అమూల్యమైన జీవితాన్ని అంకితం చేయడమే కాదు తన స్వగ్రామమైన బేతంచెర్లకు వచ్చి శ్రీ వికాస భారతి అను ధార్మిక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 150 గ్రామాలలో పర్యటన చేసి నిద్రాణావస్థలో జోగాడుతున్న మన యావత్ హిందూ సమాజాన్ని తట్టిలేపి,జాగృతం చేసి తిరిగి పునర్జీవింపచేసిన,హిందూ సనాతన ధర్మ స్థాపన పటిష్టతకు ఎనలేని,వెలకట్టలేని,అజరామమైన సేవలు అందించిన ఈ హిందుత్వ పిపాసి,హిందువుల ఐకమత్యమే తన జీవిత ఆశయంగా జీవించిన ఓ గొప్ప మానవతామూర్తి,హిందూ ఆత్మీయ బంధువు,హిందూ సోదర,సోదరిమణుల నిజమైన శ్రేయోభిలాషి ఈ నాగేంద్రప్రసాద్ గారు. అన్నింటికిమించి 2019న తాను స్థాపించిన వికాస భారతి,సురభి గోశాల ఇలా రెండింటిని కలిపి భవిష్యత్ లో వికాస భారతి ఆధ్వర్యంలో జరిగే పలు హిందుత్వ సంబంధిత కార్యకలాపాలకు ఓక వేదికగా,ఓ కేర్ ఆఫ్ అడ్రస్ గా, ఓ చక్కటి ప్లాట్ ఫామ్ గా ఈ రెండు సంస్థలు బాసిల్లాలనే ఓ మంచి సదాశయానికి,లక్ష్యానికి అంకురార్పణ గావించిన ఓ నిజమైన,యదార్థమైన ఆరనాల హిందుత్వ ప్రేమికుడు ఈ నాగేంద్రప్రసాద్ గారు.
ఏదిఏమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి ప్రచారక్ గా అత్యంత సుదీర్ఘ కాలంపాటు చిరస్మరణీయమైన సేవలు అందించి,చిలువలు పలువలుగా,అనైక్యతతో చీలిపోయిన పలు హిందుత్వ కులాలను ఒకే త్రాటిపై తీసుకువచ్చి 'కలిస్తే నిలుస్తాం విడిపోతే పడిపోతే అధ పాతాళానికి ' అనే నీతి సూత్రానికి పెద్ద పీట వేసి,ఆ నీతి సూత్రాన్ని ప్రతి ఒక్క హిందూ సోదర,సోదరీమణులలో నాటుకుపోయేలా చేసి వారందరూ హిందుత్వ ఐక్యతకు విశేష,అవిరళ కృషి సల్పేలా చేయగలిగిన అంకుటిత దీక్షపరుడు, ఆరు నూరైన తననుకున్న సమున్నత లక్ష్యాలు,ఆశయాల విషయంలో ఎంతమాత్రం రాజీపడని మొండిఘట్టం,యావత్ హిందూ సమాజానికే ఓ గొప్ప స్ఫూర్తి ప్రదాత,ఆదర్శ వ్యక్తి,గొప్ప విశాలభావాలు మెండుగా గల నాయకుడు ఈ నాగేంద్రప్రసాద్ గారు.ఏమైనా ఆ మహానుభావుడు,ఓ కరుడు గట్టిన హిందుత్వ భావజాలం మెండుగా గల ఈ ఆర్ఎస్ఎస్ పూర్వ ప్రచారక్ అయిన శ్రీ నాగేంద్రప్రసాద్ గారికి ఈ విషాద సమయాన ప్రతి ఒక్క ఆత్మీయ హిందువు బంధువులు ఆయనకు అత్యంత గొప్పగా,ఘనంగా నివాళులు అర్పించాల్సిన గురుతర బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.ఓం శాంతి! బోలో భారతమాతాకీ జై! జై శ్రీరామ్!🏹🏹🏹✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు & ఆత్మీయ హిందూ బంధువు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #rss
శాస్రానికి,జ్ఞానానికి ఆదిగురువురా మన దేశం! వందేమాతరం! వందేమాతరం! క్యాప్షన్ : విదేశీయులు సైతం మన భారతదేశ సంస్కృతి,సంప్రదాయాలను ఇష్టపడుతున్న నేపథ్యంలో భారతీయులుగా పుట్టినందుకు మనమెంతో గర్వించాలి! జై హింద్! మేరా భారత్ మహాన్!🇮🇳🇮🇳🇮🇳 #✨మ్యాజిక్ జంక్షన్✨
ఉండిపో ఊపిరిలా! గుండెలో దేవతగా! #📈📈📉👩🦽👩🦽👩🦼👩🦼👩🦯👩🦯🕺🕺🕺🕺 #✨మ్యాజిక్ జంక్షన్✨
అందం అమ్మాయి అంటే నీలా ఉండాలి!✍️✍️✍️ #✨మ్యాజిక్ జంక్షన్✨
సొగయా ఏ జహ! సొగయా ఏ అస్మా!
క్యాప్షన్ : అలనాటి బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమకు చెందిన మేటి నటుడు చుంకీ పాండే ఈ యుగళ, శాంతి గీతానికి చూపిన హావభావాలు!🌹🌹🌹 #✨మ్యాజిక్ జంక్షన్✨




