ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం తెచ్చిన తంట - పెట్రోల్ బంకుల దగ్గర,ఏటిఎం సెంటర్ ల దగ్గర ప్రజల పాట్లు అన్నీ ఇన్నీ కావు - గృహలలో గ్యాస్ సిలిండర్లు అలస్యమై బేంబేలెత్తుతున్న ప్రజలు!
లేదా
ప్రపంచ దేశాల నేతల యుద్ధ పిపాసను వదులుకొని శాంతి కాముఖులుగా మారే కాలం అసన్నమైంది - లేకపోతే ప్రపంచదేశాల ప్రజల అగ్రవేశాలకు గురికాక తప్పదు!
ఏ ఏ దేశాల మధ్య యుద్ధం జరిగిన మొదటగా ప్రభావం అనేది సామాన్య ప్రజల జీవితాలపై పడుతుంది.ఇప్పుడు అదే కథ పునరావృతమై ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం దాటికి దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు పెట్రోల్, డీజిల్ బ్యాంకుల దగ్గర పెట్రోల్,డీజల్ దొరక్క,మరో వైపు ఏటిఎం సెంటర్ల దగ్గర మనీ స్టాక్ లేక ప్రజలు తెగ ఇబ్బంది పడుతున్నారు.ఎందుకంటే సామాన్యుల రోజువారి జీవితాలలో ఏటిఎంలు ప్రదాన పాత్ర పోషిస్తూ ఉంటాయి.ఎలాగంటే జీతాల దగ్గర నుంచి,ఎవరైనా వారికి డబ్బులు ఇవ్వాలన్న ఏటిఎం లనే ఆశ్రయిస్తుండటం ఓ షరా మాములు అయిన విషయంగా మారిపోయింది.ఇక గృహల్లో అయితే గృహిణులకు గ్యాస్ సిలిండర్ల రాక ఓ గగన కుసుమంగా మారి వారు గత్యంతరం లేక కట్టేల, కరెంటు పొయ్యి వంటి ప్రత్యామయ మార్గాలను వెదుకుంటున్నారు.ఇలా దేశ,ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రజలు ఇంతగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవడానికి ప్రదాన కారణం యుద్ధం.యుద్ధం ఎప్పుడు వచ్చిన అందువల్ల వినాశకమే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు.కేవలం అధిపత్యం కోసం,తమ మాటనే చెల్లాలనే దురహంకారం,ప్రపంచ దేశాలపై తమ పెత్తనం చెలాయించాలనే నియంత స్వభావంతో కూడిన వైఖరి,ఆరునూరైన తమ మాటే నెగ్గాలనే పంతం,నేను చెప్పినట్లే వినాలనే మంకు పట్టు,మాకు ఆయుధ సంపత్తి,అంగ,అర్ద బలం ఎక్కువ మేము ఏమి చేసిన చెల్లుతుందనే పొగరుబోతు తనం వెరసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయా దేశాల ప్రజలు తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ పెట్రోల్,డీజిల్,గ్యాస్, ఏటిఎం సెంటర్ల దగ్గర డబ్బుల కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఉత్పన్నం అయ్యింది,దాపురించింది.
ఏదిఏమైన ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచంలోని అయా దేశాల ప్రజల పాలిట బ్రహ్మరాక్షసిగా తయారై పట్టిపీడిస్తున్నది అనే మాట సత్యదూరం కాదు.ఇలా ప్రజల జీవితాలతో ఆటలాడుకునే యుద్ధ పైశాచికత్వానికి అలవాటుపడ్డ అయా దేశాల నేతలు ఏమో యుద్ధం జరుగుతున్నప్పుడు బుల్లెట్ ఫ్రూఫ్ బంకర్లలలో, భవనాలలో అత్యంత సురక్షితంగా దాక్కొని తమ పని కాస్త కానిస్తూ ఉపన్యాసాలు ఇస్తుంటారు.ఇక బయట వుండే ప్రజలు ఏమో యుద్ధ ప్రభావం వల్ల తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని జీవిస్తూ,రోజులు దొర్లిస్తూ,ఎప్పుడు ఈ మాయదారి యుద్ధం తమ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందోనని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతూ వుంటారు.ఏమైనా ప్రపంచ దేశాల ప్రజలకు ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఓక శనిలా దాపురించి,వారి అమూల్యమైన జీవితాలను అల్లకల్లోలం చేయడంతో పాటు వారందరిని పీకలలోతుల కష్టాల్లో ముంచేత్తి వారి జీవితాలను అశాంతిమయం చేస్తున్నది అనే మాట సత్యదూరం కాదు.యుద్ధం అనే రాక్షసక్రీడకు చరమగీతం పాడి - శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి యొక్క ప్రజానీకం, మానవతావాదులు,మేధావివర్గాలు అవిరళకృషి చేయాల్సిన గురుతర బాధ్యత ఎంతైనా ఉంది.ప్రపంచ శాంతి వర్ధిల్లాలి - యుద్దనరమేధాన్ని కుక్కటివ్రేళ్ళతో సహా పేకలించాలి!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రం


