వృద్ధకాలే మృతా భార్య
బంధు హస్తే గతం ధనమ్
భోజనంచ పరాధీనం
తిస్రః పుంసాం విడంబనా!
ఇది ఆచార్య చాణక్యుడు చెప్పిన శ్లోకం.
దీని అర్థం ఏమిటంటే?
వృద్ధాప్యంలో భార్యను కోల్పోవలసి రావటం,
తన ధనము బంధువులు చేతిలో చిక్కి ఉండటం. ఇతరులు పెట్టే భోజనం పై ఆధారపడాల్సి రావటం... ఇవి గనుక జరిగితే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.
ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే..అతని భార్య యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకోండి.! అని ఒక నానుడి ఉంది.
గొప్ప వ్యక్తులు భార్యల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు.
వృద్ధాప్యంలో భర్త /భార్యను కోల్పోతే అనేక కష్టాలు పడతారని ఈ శ్లోకంలో చెప్పబడింది.
అలాగే
మీ ధనాన్ని మీ అధీనంలోనే ఉంచుకోవాలి.
మీ తర్వాత మాత్రమే మీ పిల్లలకు గానీ బంధువులకుగాని, చెందేటట్లు వీలునామా రాసుకోండి.
మీ డబ్బు మీ వద్ద లేకుండా ఇతరుల హస్తాల్లో ఉంటే మీ జీవితం నరకప్రాయమే.
ఇంకొక విషయం ఏంటంటే;
మనకు రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటే నిరంతర ఆదాయం ఉండేట్లు చూసుకోవాలి.
భోజనం కోసం ఇతరుల మీద ఆధారపడకూడదు.
అలా పైన శ్లోకంలో చెప్పినట్లు గనుక పరిస్థితి ఉంటే, అతడు మృతుడితో సమానం అని చాణక్యుడు అంటాడు.
అందుకే యవ్వనంలో ఉన్నపుడు, చేతిలో డబ్బు ఉన్నప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
#🕉️హర హర మహాదేవ 🔱 #🙏🏻భక్తి సమాచారం😲 #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #దేవుళ్ళ స్టేటస్


