
Satya Vadapalli
@13077355
🌹💖I sustain myself with the love of family 🌹💝
శివాష్టోత్తర శతనామము
అభివృద్ధి లోనికి వచ్చేఏ కోరిక అయినా, ధర్మబద్ధము అయి చాలా తొందరగా తీరాలి అనుకొంటే ఒకసారి శివాష్టోత్తరము చదువుకొని బయలు దేరాలి అని పెద్దలు చెపుతారు.
శివాష్టోత్తర శతనామము చదివేటప్పుడు ముందుగా ధ్యానశ్లోకమును ధ్యానము చేయాలి.
ధ్యానమ్
ధవళ వపుష మిందోర్మండలేసన్నివిష్ఠం
భుజగవలయహారం, భస్మదిగ్ధాంగమీశం I
మృగయపరశుపాణిం, చారుచంద్రార్ధ మౌళిం
హృదయకమలమధ్యే, సంతతం చింతయామి II
శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || ౧ ||
శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || ౨ ||
భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివప్రియః
ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః || ౩ ||
గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || ౪ ||
కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || ౫ ||
సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || ౬ ||
హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || ౭ ||
హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || ౮ ||
కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః
మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || ౯ ||
వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః || ౧౦ ||
అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || ౧౧ ||
మృడః పశుపతిర్దేవో మహాదేవోzవ్యయో హరిః
భగనేత్రభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః || ౧౨ ||
పూషదంతభిదవ్యగ్రో సహస్రాక్షస్సహస్రపాత్
అపవర్గప్రదోzనంతస్తారకః పరమేశ్వరః || ౧౩ ||
ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||
ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్
#🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲 #😇శివ లీలలు✨ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ
ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు
ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారు.
1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.
2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.
3 . ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.
4 . అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.
5 శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.
6 . ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.
7 . సర్వప్రపంచం చేతా సేవించబడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన
మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.
8 . మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.
9 . చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.
10 . నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.
11 . శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం
చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.
12 ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇహపర భోగాలను అందజేస్తుంది.
#🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🕉️హర హర మహాదేవ 🔱 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏🏻భక్తి సమాచారం😲
ఒకనాడు లింగావిర్భావ కాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం(మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది. దానిని నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగితే మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగింది. బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగాడు. ఏమిటి కావాలి మీకు?” అని అడిగింది మొగలిపువ్వు. ఆయన “క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. మొగలిపువ్వు చెప్తాను అన్నది. బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగితే విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు.
బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు. జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు. నీకు భూమియందు పూజ లేకుండుగాక! కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక! అంటే కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను. అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి.
#🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #🕉️హర హర మహాదేవ 🔱 #🌅శుభోదయం #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ
#🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🌅శుభోదయం #🕉️హర హర మహాదేవ 🔱 #🙏హ్యాపీ మహాశివరాత్రి📿
#🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #🕉️హర హర మహాదేవ 🔱 #🌅శుభోదయం #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ
నాయనార్ల చరిత్రలు - 11 వ భాగం
🚩 భార్య మంగళసూత్రాన్ని త్యాగం చేసి.. వాలిపోయిన శివలింగాన్ని సరిచేసిన మహనీయుడు: గుగ్గులు కలశ నాయనారు 🚩
శివారాధనలో 'ధూపం' (సాంబ్రాణి/గుగ్గులం) వేయడానికి తన సర్వస్వం అర్పించిన ఆ మహా భక్తుడు గుగ్గులు కలశ నాయనారు పూర్తి చరిత్ర..
తమిళనాడులోని 'తిరుక్కడవూరు' (అమృతఘటేశ్వరుడు - అభిరామి అమ్మవారి ఆలయం) క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు.స్వామివారికి సుగంధ పరిమళాలు వెదజల్లే "గుగ్గులం" (సాంబ్రాణి) ధూపం వేయడం ఆయనకు ప్రాణం. అందుకే ఆయనకు "గుగ్గుల కలశ నాయనారు"అని పేరు వచ్చింది.ఆ సేవ చేయడం లో తనకున్న ఆస్తినంతా ఖర్చు చేశాడు, కటిక పేదరికం లో కూడా శివయ్యకు ధూప సేవ ఆపలేదు.
శివుడు తన భక్తుడిని పరీక్షించాలనుకున్నాడు. క్రమంగా నాయనారు ఆస్తి కరిగిపోయింది.తినడానికి తిండి లేని దుస్థితి. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. అది చూడలేక ఆయన భార్య, కన్నీటితో తన మెడలోని పవిత్రమైన "మంగళసూత్రాన్ని" (తాలిబొట్టు) తీసి భర్త చేతిలో పెట్టింది.
"నాథా! ఇది తప్ప మన దగ్గర ఏమీ లేదు. దీన్ని అమ్మి కాస్త బియ్యం తీసుకురండి, పిల్లల ఆకలి తీరుద్దాం" అని చెప్పింది.
భారమైన గుండెతో మంగళసూత్రాన్ని తీసుకుని మార్కెట్కు వెళ్తుండగా.. దారిలో ఒక వర్తకుడు అత్యంత శ్రేష్టమైన గుగ్గులాన్ని అమ్మడం చూశాడు. అంతే! ఆ క్షణం ఆయనకు పిల్లల ఆకలి, భార్య త్యాగం అన్నీ మర్చిపోయాడు. ఆయన కళ్లకు కేవలం శివుడే కనిపించాడు.
"ఇంత మంచి గుగ్గులం స్వామికి ధూపం వేస్తే ఎంత బాగుంటుంది!" అనుకుని, ఆ మంగళసూత్రాన్ని ఇచ్చి, బదులుగా గుగ్గులం తీసుకున్నాడు. నేరుగా ఆలయానికి వెళ్లి స్వామికి ధూపం వేసి పరవశించిపోయాడు.
రాత్రి అయ్యాక స్పృహలోకి వచ్చాడు. "అయ్యో! బియ్యం తేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి?" అని భయపడుతూ ఇంటికి వెళ్లేసరికి అద్భుతం జరిగింది! ఇల్లు ధనధాన్యాలతో, బంగారు ఆభరణాలతో నిండిపోయి ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడే కుబేరుని పంపి ఆ ఇంట సిరులు కురిపించాడు. భార్య సంతోషంతో స్వామి లీలను వివరించింది. నాయనారు ఆ సంపద ను శివ ప్రసాదంగా భావించి, శివ సేవకు, శివ భక్తులకు వినియోంచాడు.
వాలిపోయిన శివలింగం - తిరుప్పనందల్ క్షేత్రం
కొన్నాళ్లకు నాయనారు 'తిరుప్పనందల్' అనే క్షేత్రానికి వెళ్లారు. అక్కడ శివలింగం (అరుణజటేశ్వరుడు) ఒక పక్కకు వాలిపోయి ఉంది.
❓ అసలు లింగం ఎందుకు వాలిపోయింది?
పూర్వం "తాటకై" అనే ఒక భక్తురాలు స్వామికి పూలమాల వేస్తుండగా, ఆమె చీర కొంగు జారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆమె పడుతున్న ఇబ్బందిని గమనించిన శివుడు, ఆమె మాల వేయడానికి వీలుగా, తన లింగాన్ని పక్కకు వంచి ఆ మాలను స్వీకరించాడు. భక్తురాలి కోసం భగవంతుడు తల వంచాడు! అప్పటి నుండి ఆ లింగం అలాగే ఉంది.
రాజుగారి విఫల ప్రయత్నం:
కొంత కాలము గడిచి పోయింది,ఆ దేశపు రాజు ఆ వాలిపోయిన లింగాన్ని సరిచేయాలని పట్టుబట్టాడు. ఏనుగులను, మల్లయోధులను తెప్పించి, గొలుసులతో లింగాన్ని లాగించాడు. కానీ శివలింగం ఇసుమంత కూడా కదలలేదు. రాజు నిరాశలో కూరుకుపోయాడు.
🙏 భక్తి పాశం - అద్భుత దృశ్యం:
ఇదంతా చూసిన గుగ్గుల కలశ నాయనారు.. "నా స్వామిని బలంతో సరిచేయలేరు, భక్తితోనే బంధించగలరు" అని గ్రహించారు.
వెంటనే, ఏనుగులకు కట్టిన గొలుసులను పక్కన పెట్టించి.. తన మెడకు ఒక తాడును (పాశాన్ని) గట్టిగా బిగించుకుని, రెండో చివరను శివలింగానికి కట్టారు.
"శివయ్యా! నీ భక్తుల ప్రేమకు లొంగిపోతావని నాకు తెలుసు. దయచేసి సరిగా నిలబడు తండ్రీ!" అని ప్రార్థిస్తూ, కన్నీళ్లతో ఒక్కసారి బలంగా లాగారు.
అంతటి ఏనుగులకు కదలని ఆ శివలింగం.. భక్తుడి మెడకు బిగుసుకున్న తాడు లాగగానే, చకచకా కదిలి యథాస్థానంలో నిటారుగా నిలబడింది! ఆకాశం నుండి పూలవాన కురిసింది. ఆ రాజు, ప్రజలు నాయనారు పాదాలపై పడ్డారు. అతని భక్తి లోక ప్రకటన అయింది.
ముగింపు:
గుగ్గుల కలశ నాయనారు జీవితాంతం శివసేవలో గడిపి, చివరికి శివసాయుజ్యం పొందారు.
నీతి:
భగవంతుడికి కావాల్సింది సంపదో, శారీరక బలమో కాదు.. "నిష్కల్మషమైన భక్తి". తాటకై భక్తికి తలవంచిన శివుడు.. కలశ నాయనారు భక్తికి తల ఎత్తాడు. అదే శివుని లీల!
#🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🙏🏻భక్తి సమాచారం😲 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్
#🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🕉️హర హర మహాదేవ 🔱 #🌅శుభోదయం
#🌅శుభోదయం #🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🙏హ్యాపీ మహాశివరాత్రి📿
#🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🕉️హర హర మహాదేవ 🔱 #🌅శుభోదయం












