
Satya Vadapalli
@13077355
🌹💖I sustain myself with the love of family 🌹💝
శివాష్టోత్తర శతనామము
అభివృద్ధి లోనికి వచ్చేఏ కోరిక అయినా, ధర్మబద్ధము అయి చాలా తొందరగా తీరాలి అనుకొంటే ఒకసారి శివాష్టోత్తరము చదువుకొని బయలు దేరాలి అని పెద్దలు చెపుతారు.
శివాష్టోత్తర శతనామము చదివేటప్పుడు ముందుగా ధ్యానశ్లోకమును ధ్యానము చేయాలి.
ధ్యానమ్
ధవళ వపుష మిందోర్మండలేసన్నివిష్ఠం
భుజగవలయహారం, భస్మదిగ్ధాంగమీశం I
మృగయపరశుపాణిం, చారుచంద్రార్ధ మౌళిం
హృదయకమలమధ్యే, సంతతం చింతయామి II
శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || ౧ ||
శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || ౨ ||
భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివప్రియః
ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః || ౩ ||
గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || ౪ ||
కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || ౫ ||
సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || ౬ ||
హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || ౭ ||
హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || ౮ ||
కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః
మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || ౯ ||
వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః || ౧౦ ||
అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || ౧౧ ||
మృడః పశుపతిర్దేవో మహాదేవోzవ్యయో హరిః
భగనేత్రభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః || ౧౨ ||
పూషదంతభిదవ్యగ్రో సహస్రాక్షస్సహస్రపాత్
అపవర్గప్రదోzనంతస్తారకః పరమేశ్వరః || ౧౩ ||
ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||
ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్
#🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲 #😇శివ లీలలు✨ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ
#🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🌅శుభోదయం #🕉️హర హర మహాదేవ 🔱 #🙏హ్యాపీ మహాశివరాత్రి📿
#🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #🕉️హర హర మహాదేవ 🔱 #🌅శుభోదయం #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ
నాయనార్ల చరిత్రలు - 11 వ భాగం
🚩 భార్య మంగళసూత్రాన్ని త్యాగం చేసి.. వాలిపోయిన శివలింగాన్ని సరిచేసిన మహనీయుడు: గుగ్గులు కలశ నాయనారు 🚩
శివారాధనలో 'ధూపం' (సాంబ్రాణి/గుగ్గులం) వేయడానికి తన సర్వస్వం అర్పించిన ఆ మహా భక్తుడు గుగ్గులు కలశ నాయనారు పూర్తి చరిత్ర..
తమిళనాడులోని 'తిరుక్కడవూరు' (అమృతఘటేశ్వరుడు - అభిరామి అమ్మవారి ఆలయం) క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు.స్వామివారికి సుగంధ పరిమళాలు వెదజల్లే "గుగ్గులం" (సాంబ్రాణి) ధూపం వేయడం ఆయనకు ప్రాణం. అందుకే ఆయనకు "గుగ్గుల కలశ నాయనారు"అని పేరు వచ్చింది.ఆ సేవ చేయడం లో తనకున్న ఆస్తినంతా ఖర్చు చేశాడు, కటిక పేదరికం లో కూడా శివయ్యకు ధూప సేవ ఆపలేదు.
శివుడు తన భక్తుడిని పరీక్షించాలనుకున్నాడు. క్రమంగా నాయనారు ఆస్తి కరిగిపోయింది.తినడానికి తిండి లేని దుస్థితి. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. అది చూడలేక ఆయన భార్య, కన్నీటితో తన మెడలోని పవిత్రమైన "మంగళసూత్రాన్ని" (తాలిబొట్టు) తీసి భర్త చేతిలో పెట్టింది.
"నాథా! ఇది తప్ప మన దగ్గర ఏమీ లేదు. దీన్ని అమ్మి కాస్త బియ్యం తీసుకురండి, పిల్లల ఆకలి తీరుద్దాం" అని చెప్పింది.
భారమైన గుండెతో మంగళసూత్రాన్ని తీసుకుని మార్కెట్కు వెళ్తుండగా.. దారిలో ఒక వర్తకుడు అత్యంత శ్రేష్టమైన గుగ్గులాన్ని అమ్మడం చూశాడు. అంతే! ఆ క్షణం ఆయనకు పిల్లల ఆకలి, భార్య త్యాగం అన్నీ మర్చిపోయాడు. ఆయన కళ్లకు కేవలం శివుడే కనిపించాడు.
"ఇంత మంచి గుగ్గులం స్వామికి ధూపం వేస్తే ఎంత బాగుంటుంది!" అనుకుని, ఆ మంగళసూత్రాన్ని ఇచ్చి, బదులుగా గుగ్గులం తీసుకున్నాడు. నేరుగా ఆలయానికి వెళ్లి స్వామికి ధూపం వేసి పరవశించిపోయాడు.
రాత్రి అయ్యాక స్పృహలోకి వచ్చాడు. "అయ్యో! బియ్యం తేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి?" అని భయపడుతూ ఇంటికి వెళ్లేసరికి అద్భుతం జరిగింది! ఇల్లు ధనధాన్యాలతో, బంగారు ఆభరణాలతో నిండిపోయి ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడే కుబేరుని పంపి ఆ ఇంట సిరులు కురిపించాడు. భార్య సంతోషంతో స్వామి లీలను వివరించింది. నాయనారు ఆ సంపద ను శివ ప్రసాదంగా భావించి, శివ సేవకు, శివ భక్తులకు వినియోంచాడు.
వాలిపోయిన శివలింగం - తిరుప్పనందల్ క్షేత్రం
కొన్నాళ్లకు నాయనారు 'తిరుప్పనందల్' అనే క్షేత్రానికి వెళ్లారు. అక్కడ శివలింగం (అరుణజటేశ్వరుడు) ఒక పక్కకు వాలిపోయి ఉంది.
❓ అసలు లింగం ఎందుకు వాలిపోయింది?
పూర్వం "తాటకై" అనే ఒక భక్తురాలు స్వామికి పూలమాల వేస్తుండగా, ఆమె చీర కొంగు జారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆమె పడుతున్న ఇబ్బందిని గమనించిన శివుడు, ఆమె మాల వేయడానికి వీలుగా, తన లింగాన్ని పక్కకు వంచి ఆ మాలను స్వీకరించాడు. భక్తురాలి కోసం భగవంతుడు తల వంచాడు! అప్పటి నుండి ఆ లింగం అలాగే ఉంది.
రాజుగారి విఫల ప్రయత్నం:
కొంత కాలము గడిచి పోయింది,ఆ దేశపు రాజు ఆ వాలిపోయిన లింగాన్ని సరిచేయాలని పట్టుబట్టాడు. ఏనుగులను, మల్లయోధులను తెప్పించి, గొలుసులతో లింగాన్ని లాగించాడు. కానీ శివలింగం ఇసుమంత కూడా కదలలేదు. రాజు నిరాశలో కూరుకుపోయాడు.
🙏 భక్తి పాశం - అద్భుత దృశ్యం:
ఇదంతా చూసిన గుగ్గుల కలశ నాయనారు.. "నా స్వామిని బలంతో సరిచేయలేరు, భక్తితోనే బంధించగలరు" అని గ్రహించారు.
వెంటనే, ఏనుగులకు కట్టిన గొలుసులను పక్కన పెట్టించి.. తన మెడకు ఒక తాడును (పాశాన్ని) గట్టిగా బిగించుకుని, రెండో చివరను శివలింగానికి కట్టారు.
"శివయ్యా! నీ భక్తుల ప్రేమకు లొంగిపోతావని నాకు తెలుసు. దయచేసి సరిగా నిలబడు తండ్రీ!" అని ప్రార్థిస్తూ, కన్నీళ్లతో ఒక్కసారి బలంగా లాగారు.
అంతటి ఏనుగులకు కదలని ఆ శివలింగం.. భక్తుడి మెడకు బిగుసుకున్న తాడు లాగగానే, చకచకా కదిలి యథాస్థానంలో నిటారుగా నిలబడింది! ఆకాశం నుండి పూలవాన కురిసింది. ఆ రాజు, ప్రజలు నాయనారు పాదాలపై పడ్డారు. అతని భక్తి లోక ప్రకటన అయింది.
ముగింపు:
గుగ్గుల కలశ నాయనారు జీవితాంతం శివసేవలో గడిపి, చివరికి శివసాయుజ్యం పొందారు.
నీతి:
భగవంతుడికి కావాల్సింది సంపదో, శారీరక బలమో కాదు.. "నిష్కల్మషమైన భక్తి". తాటకై భక్తికి తలవంచిన శివుడు.. కలశ నాయనారు భక్తికి తల ఎత్తాడు. అదే శివుని లీల!
#🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🙏🏻భక్తి సమాచారం😲 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్
#🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🕉️హర హర మహాదేవ 🔱 #🌅శుభోదయం
#🌅శుభోదయం #🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🙏హ్యాపీ మహాశివరాత్రి📿
#🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🕉️హర హర మహాదేవ 🔱 #🌅శుభోదయం
వృద్ధకాలే మృతా భార్య
బంధు హస్తే గతం ధనమ్
భోజనంచ పరాధీనం
తిస్రః పుంసాం విడంబనా!
ఇది ఆచార్య చాణక్యుడు చెప్పిన శ్లోకం.
దీని అర్థం ఏమిటంటే?
వృద్ధాప్యంలో భార్యను కోల్పోవలసి రావటం,
తన ధనము బంధువులు చేతిలో చిక్కి ఉండటం. ఇతరులు పెట్టే భోజనం పై ఆధారపడాల్సి రావటం... ఇవి గనుక జరిగితే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.
ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే..అతని భార్య యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకోండి.! అని ఒక నానుడి ఉంది.
గొప్ప వ్యక్తులు భార్యల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు.
వృద్ధాప్యంలో భర్త /భార్యను కోల్పోతే అనేక కష్టాలు పడతారని ఈ శ్లోకంలో చెప్పబడింది.
అలాగే
మీ ధనాన్ని మీ అధీనంలోనే ఉంచుకోవాలి.
మీ తర్వాత మాత్రమే మీ పిల్లలకు గానీ బంధువులకుగాని, చెందేటట్లు వీలునామా రాసుకోండి.
మీ డబ్బు మీ వద్ద లేకుండా ఇతరుల హస్తాల్లో ఉంటే మీ జీవితం నరకప్రాయమే.
ఇంకొక విషయం ఏంటంటే;
మనకు రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటే నిరంతర ఆదాయం ఉండేట్లు చూసుకోవాలి.
భోజనం కోసం ఇతరుల మీద ఆధారపడకూడదు.
అలా పైన శ్లోకంలో చెప్పినట్లు గనుక పరిస్థితి ఉంటే, అతడు మృతుడితో సమానం అని చాణక్యుడు అంటాడు.
అందుకే యవ్వనంలో ఉన్నపుడు, చేతిలో డబ్బు ఉన్నప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
#🕉️హర హర మహాదేవ 🔱 #🙏🏻భక్తి సమాచారం😲 #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #దేవుళ్ళ స్టేటస్
శివరాత్రి నోము.
పూర్వకాలములో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతడెంతటి విద్యాసంపంన్నుడో అంతటి దారిద్రము అతడిని వేదిస్తుండేది. యెంత ప్రయత్నించినా చేతికి చిల్లి గవ్వైనా లభించేదికాదు. ఇందుకు జతగా అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా వుండేది. ఈ దుర్భర పరిస్తులతో మరొకర్ని యాతన పెట్టడం ఇష్టం లేక దేనికని వివాహం చేసుకోలేదు. నా అన్నవారెవరూ లేక సేవలు చేసే ఇల్లాలు లేక అతడు ఎంతగానో బాధపడుతుండేవాడు. క్రమక్రమంగా అతడికి జీవితం మీద విరక్తి కలిగింది. ప్రాణాలు తీసుకోవడం శాస్త్రసమ్మతం కాదని నారు పోసినవాడు నీరు పొయ్యక పోతాడా అని కాలాన్ని గడుపుతుండేవాడు. క్రమక్రమంగా ఓర్పు నశించింది. ఇంక ప్రాణ త్యాగం ఒక్కటే తనకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు. నీటిలో పడాలి, అగ్నికి ఆహుతికావాలి. కత్తి కటార్లతో పొడుచుకోవాలి, విషాన్ని తినాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి ఒదిగిపోయాడు. నిద్రలో అతనికి పరమేశ్వరి సాక్షాత్కరించి ఓయీ! ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాదేడవు. సదాశివుడు కన్నా దయామయుడు లేడు ఆ శంకురుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది. మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరకు వెళ్లి తన బాధలను తనకు వచ్చిన కళను చెప్పి శివ కరుణ కొరకు తానేమి చెయ్యాలి అని ప్రశ్నించాడు. విప్రోత్తమా పార్వతి పరమేశ్వరులు జననీ జనకులు కదా జగదాంబ నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షం పొందమని ప్రభోదించింది. ధన్యుడవు శివునకు ప్రీతియైన రోజు శివరాత్రి ప్రతిమాసంలో ఆఖరి మూడవరోజు శివరాత్రౌతుంది. ఆనాడు నీవు నదీ స్నానం చేసి ఉపవాసముండి ఆరాత్రంతా శివనామార్చనతో జాగారం గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించి ఇలా మహా శివరాత్రి వరకు గడుపు. ఆనాడు కలిగిన మేరకు ఎవరికైన ఒకరికి ఒక ఫలమో తృణమో ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందు నీ బాధలు తీరుతాయి. దారిద్యము తొలగిపోతుంది . ఆరోగ్య వంతుడవు అవుతావు అని చెప్పగా ఆ ప్రకారంగా భక్తి శ్రద్దలతో శివరాత్రి నోము నోచుకుని అతడు జీవితాంతం సుఖముగా వున్నాడు.
ఉద్యాపన: ప్రతి మాసశివరాత్రి నాడు శివలింగార్చనతో నిరాహారము జాగారము చేయాలి. ఇలా సంవత్సరకాలం ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు దానం చెయ్యాలి. మహా శివరాత్రి పర్వదినాన క్షణమైనా వ్యర్ధం చెయ్యక శివాక్షరిని జపించాలి. శివునకు అర్చన చెయ్యాలి. ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం ఆర్ధిక సహాయము నిరుపేదలకు అందించి వారి ఆశీస్సులు పొందాలి.
#😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🕉️హర హర మహాదేవ 🔱 #🙏🏻భక్తి సమాచారం😲 #🙏హ్యాపీ మహాశివరాత్రి📿












