🌿🌼 మాఘ పురాణం - 23వ అధ్యాయము 🌼🌿
బ్రాహ్మణ కన్యల విమోచనము
కొంతకాలం క్రిందట మగధరాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు. వారి నలుగురికి నిండు యవ్వనవతులైన నలుగురు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్ధి వచ్చాడు. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి తమను వివాహము చేసుకోమని బలవంతము చేసారూ. ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కె నిరాకరించెను. ఆ కన్యలు కోపంతో “నీవు పిశాచివి కమ్మని” శపించారు. “మీరుకూడా పిశాచులగుదురు గాక” అని విద్యార్ది ప్రతిశాపము ఇచ్చాడు. వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుతు ఉండేవారు.
కొంత కాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎలా పోతాయని అడిగారు. ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచరూపములు తొలగి పోతాయి” అని చెప్పాడు. అలా చేయటము చేత ఆ నలుగురికి యధారూపములు కలిగాయి. అలా జరుగుటకు మాఘస్నానము కారణము.
#☸🙏సూర్యనారాయణ స్వామి #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః


