బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు
ఆకవీడులో వైభవంగా శ్రీ చిన్నయ్య స్వామి జండా మహోత్సవం..
రాచర్ల మండలం, ఆకవీడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ చిన్నయ్య స్వామి వారి జండా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. జండా మహోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను (ఎడ్ల పందాలు) ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. పల్లె సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఇటువంటి బండలాగుడు పందాలు రైతన్నల్లో ఉత్సాహాన్ని నింపుతాయని కొనియాడారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల యజమానులను, రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు శ్రీ చిన్నయ్య స్వామి వారిని దర్శించుకుని, ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందించారు. ఈ ఆధ్యాత్మిక మరియు క్రీడా కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట
రాచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు జనసేన మరియు బీజేపీ పార్టీల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో భక్తులు, రైతులు పాల్గొన్నారు. #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్


