*_కదంబ వృక్షం............!!_*
*హనుమంతుడి* *పుట్టుకకు మూలం ఈ వృక్షం:*
*క్రిష్ణుడు గోపికల చీరలను దాచిన చెట్టు :*
*ప్రకృతిలో రాధాకృష్ణుల ముచ్చట్లన్నీ ఈ చెట్టు నీడలోనే*:.
*పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు*
*చెక్క పనికివస్తుంది*.
*భగవద్గీతలో కూడా దీని గురించి ప్రస్తావించారు. రాధాకృష్ణులకు నచ్చే మొక్క ఇది*..
*ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ*
*వారి ప్రేమాయణం కొనసాగిందని,*
*అందుకే దీనిని హిందువులు పవిత్రమొక్కగా భావిస్తారని సమాచారం*.
*గోపికల చీరలను కృష్ణుడు తీసుకెళ్లి ఈ రుద్రాక్షాంబ చెట్టు మీదే ఉంచినట్టు కూడా మహాభారతంలో ఉందట*.
*ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది. ఉష్ణ మండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది.*
*ఇది ఆకురాల్చదు.*
*ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది*.
*నీడను బాగా ఇస్తుంది*.
*అడవులలో ఎక్కువగా పెరుగుతుంది.*
*దీని పూలు గుండ్రంగా ఉంటాయి.*
*దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు*.
*దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు.*
*_పురాణాల్లో కదంబ వృక్షం :_*
*ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల*
*పేర్లు ఉన్నాయి.*
*ఉత్తరభారతం లో దీన్ని కృష్ణవృక్షమనీ*,
*దక్షిణభారతం లో పార్వతీవృక్షమనీ అంటారు*.
*ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది*. *రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు.*
*అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి*.
*దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబవనవాసిని' అంటారు*.
*కదంబ వృక్షానికి 'ఓం శక్తిరూపిణ్యై నమః' అనే మంత్రంతో పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు*.
*గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.*
*హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం..* *అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం*.
*దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబవనవాసిని'..*
*అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు*.
*ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు 'నారాయణా నారాయణి' లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు*.
*హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం :*
*అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు*.
*సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం*. *గార్దబాసురుడు అనే రాక్షసుడు* *పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమిమీద,* *మనుషులతో, జంతువులతో* *మరణంలేకుండా ఉండాలని*
*వరం కోరతాడు*.
*శివయ్య తథాస్సు అని అంతర్థానమవుతాడు.*
*వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రున్ని తరిమికొడతాడు గార్దబుడు*.
*దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంట పెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు.*
*గార్దబాసురుని చంపమని కోరతాడు శ్రీమహావిష్ణువు*.
*అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య*.
*ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు*.
*నువ్వు గార్దబాసురుని చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు.*
*దానికి శివయ్య నువ్వు గనుక గార్దబాసురుని చంపినట్టైతే నేనే దాసుడిగా* *మారతానని దానికి*
*మరో మాట* *కలుపుతాడు*
*అయితే మోహినీ రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి.*
*దక్షిణాన ఉన్న గార్దబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు*.
*అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్యరూపంలో వస్తుంది పార్వతీదేవి*.
*అమ్మవారి అందానికి* *ముగ్దులైన రాక్షసులు*
*ఆమె దగ్గరకు* *చేరతారు*.
*మరోవైపు మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు*.
*దీంతో కదంబాసురున్ని ఆకాశంలోకి ఎగరేసి*.. *తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు*.
*ముఖం తోడేలు.. మొండెం మనిషి రూపంలో ఉండి…* *పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు.*
*అలా సంహరిస్తున్న తరుణంలో* *అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరిని సంహరిస్తుంది* *అమ్మవారు.*
*దీంతో గార్దబాసురుని సంహారం జరిగిపోయింది*. *అయితే సరదాగా అన్న మాట..మాటే కాబట్టి…* *రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామబంటుగా సేవలు అందించాడు శివుడు*.
*_జ్యోతిష్య శాస్త్రంలో కదంబం :.._*
*ఈ కదంబ వృక్షానికి పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు*.
*జ్యోతిష శాస్త్రం లో నక్షత్రాలు ఒక్కొక్క దానికి*
*ఒక వృక్షాన్ని గుర్తించారు.*
*అందుచేత నక్షత్రవనం లో కదంబ వృక్షాన్ని*
*శతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు*.
*గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు. పసుపు, కుంకమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు*.
*గ్రహదోషాలు ఉన్నవాళ్లు… కదంబ వృక్షానికి*
*పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి*.
*కదంబ వృక్షం మంచి సువాసనతో మత్తెక్కించేటట్లు గా ఉంటాయి కదంబ పూలు*.
*గుండ్రని టెన్నిస్ బంతుల ఆకారంలో మొదట్లో ఆకుపచ్చగా తర్వాత పసుపు బంగారు వర్ణంలో తర్వాత తెల్లగాను మారతాయి*.
*ఈ పువ్వులు పార్వతి దేవి పూజలు జరిగే*
*చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే*
*కడిమి పూలు ఎక్కువ పూస్తాయి*.
*ఆద్యాత్మిక పరంగానే* *కాక వాణిజ్య పరంగాను*
*కడిమి చెట్టు ప్రత్యేకమే*.
*ఔషధ పరంగా ఈ కదంబ వృక్షం మనుషులకు ప్రకృతి ప్రసాదించిన వరం అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ చెట్టు ఆకులు షుగర్ వ్యాది నివారణకు ఉపయోగిస్తారు.* #మన సంప్రదాయాలు సమాచారం


