ఓటరు దేవుళ్ళు మీరు డబ్బుకు దాసోహమయితే ప్రజాస్వామ్యం ఖుని అయునట్లే!
లేదా
ఎన్నికల వేళ కోడ్ అమలులో ఉంటునప్పటికి పోలీసు వారి తనిఖీలో మాత్రం ప్రతి ఎన్నికల వేళ లక్షలాది రూపాయలు బయటపడుతున్న వైనం అత్యంత బాధాకరం!
మాములుగా అయితే ఏ ఒక్కరూ కూడా ఉడతాభక్తిగా తమ డబ్బులను ఇతరులకు ఇవ్వడమో, పేదవారికి దానం చేయడమో జరుగదు.అయితే ఈ ఎలక్షన్స్ పుణ్యమా అని కొంతమంది పార్టీల నాయకులు ప్రజల ఓట్లకు గాలం వేసేందుకు డబ్బు అనే వజ్రాయుధాన్ని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ వుంటారు అనే మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం.ఇది ఇలా వుంటే ఎన్నికల కోడ్ అమలులో వున్న వేళ పోలీసు వారు తమ విధి నిర్వహణలో రోడ్లపై వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు ఆ తనిఖీల్లో లక్షలాది రూపాయలు ఎన్నికలు జరిగే ప్రతి సందర్భంలో బయటపడుతుండటం,ఆ విచ్చలవిడి డబ్బు ఖచ్చితంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకై ఉపయోగించే డబ్బే అని నిర్ధారణ అవుతుండటాన్ని బట్టి ఈ ప్రజాస్వామ్యంలో డబ్బు అనేది ఎంతటి బలమైన సాధనంగా తమ విశ్వ రూపాన్ని,ప్రతాపాన్ని చూపుతున్నదో మనం ఇట్టే ఊహించవచ్చు.అయితే అయా పార్టీల గెలుపు అవకాశాలను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే నిర్ణయాత్మక శక్తులు మాత్రం ఖచ్చితంగా మన ఓటరు దేవుళ్లే అనడంలో ఎలాంటి అవాస్తవానికి తావు లేదు.అయితే ఈ ఓటరు దేవుళ్ళు పొరపాటున ఈ డబ్బు అనే బలహీనతకు దాసోహమయ్యి స్వేచ్ఛగా వేయాల్సిన తమ అమూల్యమైన ఓటును కాసులకు అమ్ముడుపోయి ఓటు వేస్తే మాత్రం మన ప్రజాస్వామ్యం నిట్ట నిలువునా ఖుని అయ్యినట్లే.అయితే ఓటరు దేవుళ్ళు ఎప్పుడు అయితే డబ్బు అనే మాయల మంత్రదండానికి ఆశపడి,కకృతి పడి,లాలూచి పడి తమ ఓటును అమ్ముకున్నారంటే మాత్రం అంతకుమించిన దౌర్బాగ్యం,దారుణం మరొకటి ఈ ప్రజాక్షేత్రంలో ఉండదు కాక ఉండదు.అంటే దీని అర్థం అందరూ ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోతారు అని కాదు,కొందరు నిరక్షరాస్యులు,డబ్బు అత్యవసరం వున్న,పూట కూడా గడవడం గగన కుసుమం అయిన నిరుపేదలు పొరపాటున తమ ఓటును అమ్ముకున్న కూడా కొంతమంది అయా పార్టీల నాయకుల ముందు తమ హక్కులను,లక్ష్యాలను కాలదన్ని మరీ వారి కాళ్ళ ముందు వారంతా జాగిర్ల పడినట్లే లెక్క.కాబట్టి ఇకనైనా ప్రతి ఒక్క ఓటరు దేవుడు కూడా తమ స్వాభిమానానికి,నైతికతతో కూడిన తమ ఓటు హక్కుకు కట్టుబడి ఎలాంటి పరిస్థితుల్లో ఈ డబ్బు అనే మాయలో పడి తమ వ్యక్తిత్వాన్ని అమ్ముకునే స్థాయికి దిగజారిపోకూడదు.ఎందుకంటే ఎప్పుడయితే ఓటరు మహాశయులు తమ ఓటును డబ్బుతో ముడిపెడతారో మున్ముందు మీరు ఏదేని సమస్య పై ప్రజాప్రతినిధులను ప్రశ్నించే,నిలదీసే అవకాశాన్ని ఖచ్చితంగా,చేజేతులారా కోల్పోతారు అనే పచ్చి యదార్థమైన విషయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మీరు మరువకూడదు.
ఏదిఏమైన డబ్బు పోగుట్టుకుంటే మళ్ళీ ఎలాగోలా సంపాదించుకోవొచ్చు,అయితే డబ్బుకు ఆశపడి ఏకంగా మన విలువైన వ్యక్తిత్వాన్నే అమ్ముకొని మరీ ఓటు వేసే కు సంస్కృతికి మనం బీజం వేశామంటే మాత్రం ఖచ్చితంగా అది మన దిగజారుడు వ్యవహారశైలికి ఓ ప్రబల నిదర్శనంగా నిలువడం తథ్యం. కాబట్టి ఓటరు మహాశయులం అయిన మనమందరం నైతిక విలువలకు పెద్ద పీట వేసి,మంచి నడవడిక ఉన్నత వ్యక్తిత్వంతో మన అత్యంత ప్రతిష్టాత్మక ఓటును ఎవరి ప్రొద్భలం,ఒత్తిడి ప్రమేయం ఏ మాత్రం లేకుండా ఓటుకు నోటు అనే అనాగరిక ధోరణికి గుడ్ బై చెప్పి,స్వేచ్ఛగా,నిర్భయంగా మనకు నచ్చిన నాయకునికి ఓటు వేసి మన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టుకుందాం.ఏమైనా రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో విచ్చలవిడిగా లక్షల రూపాయలను ఎరవేసి మరీ ఎలాగోలా ఓటరు మహాశయులను మభ్య పెట్టి తమ పని కానించుకుందాం అనే కొంతమంది అయా పార్టీల నాయకుల కుట్రలు,కుతంత్రాలకు ఓటరు దేవుళ్ళు బలి అవ్వకుండా, శునకాలకు బిస్కెట్ లు ఇచ్చి వాటిని ఎలా వశబరచుకుంటారో అ స్థాయికి మన ఓటరు దేవుళ్ళు దిగజారిపోకుండా తమ స్వార్థం,స్వలాభం కోసం కొంతమంది పార్టీ నాయకులు ఇచ్చే డబ్బును ఖచ్చితంగా, ఖరాకండిగా మన ఓటరు దేవుళ్ళు తిరస్కరిస్తే మన ప్రజాస్వామ్యం మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా వర్దిల్లడం తథ్యం!ఇక ఏమి చేయాలి అనేది అంతా మన ఓటరు దేవుళ్లపై ఆధారపడి ఉంది.వారు ఇచ్చే తాయిలాలకు అమ్ముడుపోయి వారికే ఓట్లు వేస్తారో లేదా వారిచ్చే డబ్బుకు జై కొట్టకుండా,తల ఆడించకుండా వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించి తమ ఓటు విలువను కాపాడుకుంటారో అంతా ఓటరు దేవుళ్ళం అయిన మన చేతుల్లోనే ఉంది! జై హింద్! జయ జయహో భారత్!మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️💶💶💶💷💷💷
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #voters


