ShareChat
click to see wallet page
search
#తిరుమల లడ్డు #ఏపీ అప్ డేట్స్..📖 *ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు బెదిరింపులు❗️* FEBRUARY 10, 2026🎯 రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ తటస్థ జర్నలిజానికి మారుపేరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈయన చేసే సామాజిక, రాజకీయ విశ్లేషణలకు విలువ వుంది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపల నూనె కలిశాయని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆరోపించడాన్ని మొదటి నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నోళ్లు ఎలా మాట్లాడ్తారని గట్టిగా నిలదీస్తున్నారు. ఇదే ప్రశ్నల్ని వైసీపీ సంధించడం కంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులు, జర్నలిస్టులు నిలదీస్తుండడం టీడీపీ, జనసేనలకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో తనకు తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నట్టు ఒక చానెల్ డిబేట్లో ఆయన బయటపెట్టారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ” నాకు ఫోన్లు చేసి తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. రేయ్ నా కొడకా గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది. బాత్రూం కెమికల్స్ కలిసిందని ఎందుకు చెప్పవు. ఇవే కాదు, ఇంకా పలానా కలిశాయని చెప్పాలి. వాటి గురించి నా నోటితో అనలేను. అన్యాయమైంది. అది కూడా కలిసిందని చెప్పాలంటున్నారు. నాకు ఫోన్ చేసి తిట్టిన వారి సెల్ నంబర్ను కూడా లోకేశ్కు పంపాను. మూడు రోజుల క్రితం లోకేశు నంబర్ పంపినా ఎలాంటి స్పందనా లేదు. నా మీద ఒత్తిడి తెస్తున్నారు. బెదిరిస్తున్నారు, తిడుతున్నారు. లోకేశ్ టీమ్కు కూడా పంపాను. సీఎం చంద్రబాబే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, బాత్రూంకెమికల్స్ కలిశాయని ఆరోపించిన తర్వాత కిందోళ్లు మాట్లాడరా? చేతులు జోడించి మళ్లీమళ్లీ చెబుతున్నా. మీరు నన్ను కొట్టినా, తిట్టినా, చంపుతానని బెదిరించినా నేను మాత్రం మీరు చెప్పినట్టుగా కల్తీ జరిగిందని అనను. ఏ ఆధారం లేకుండా దేవుని ప్రసాదంలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూం కెమికల్స్ కలిశాయని మీరు వాడే భాషను నేను వాడను. నిజంగా కలిసినా, నేను అనలేను. అలా చేసేవారిని జైలుకు పంపాలని కోరతా. నన్ను ఏం చేసినా సిద్ధంగా ఉన్నా. ఏం చేసుకుంటారో చేసుకోండి. చచ్చినా నేను చెప్పను” ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారి మాటలు ఎంతగా కూటమి నేతలకు గుచ్చుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా తటస్థంగా వుండేవారి మాటలకు విలువ వుంటుందని కూటమి నేతలకు తెలుసు. అందుకే అలాంటి వారితో తమ ఆరోపణల్ని పలకించాలని తాపత్రయ పడుతున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఇన్ఫ్లూయన్సర్గా పేరున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావును బెదిరించి, భయపెట్టి దారికి తెచ్చుకునే ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. చచ్చినా తన నోటితో అబద్ధాలు పలికించలేరని ఆయన స్పష్టం చేశారు.
తిరుమల లడ్డు - ShareChat