పాఠశాలలో గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుని కాపాడిన పదో విద్యార్థి నిజంగా ధన్వంతరీ రూపమే. శుక్రవారం మండలంలోని గండిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఇది జరిగింది. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె.సి. మాలకొండ రెడ్డి రోజులాగే శుక్రవారం విధులకు హాజరయ్యారు. ప్రార్థన సమయం ముగిసిన అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళుతుండగా ఒక్కసారిగా ఛాతి లో నొప్పి ఏర్పడి ఒకసారిగా కూలిపోయాడు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇస్కపల్లె గ్రామానికి చెందిన విద్యార్థి కంచర్ల వెంకట కిరణ్ సిద్ధార్థ ఉపాధ్యాయుడి పరిస్థితి గమనించి వెంటనే గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన సి పి ఆర్ చికిత్సను అందించడంతో కోలుకొని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఉపాధ్యాయులు 108 వాహనానికి సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరు వైద్యశాలకు తరలించారు. ఉపాధ్యాయుడిని కాపాడిన సిద్ధార్థ ను హెచ్ఎం రవీంద్ర, ఉపాధ్యాయులు వెంగళరావు, సురేష్, విష్ణు నారాయణ, నారాయణరావు తదితరులు అభినందించారు. #😃మంచి మాటలు #💪పాజిటీవ్ స్టోరీస్


