#💪పాజిటీవ్ స్టోరీస్ *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (సోమవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.* ఈ పర్యటనలో భాగంగా *బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ* చేయడంతో పాటు, ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. *సోమవారం ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా బాసర చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి,* శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించి అధికారికంగా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆలయ రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం చేపట్టిన ఈ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. బాసర పర్యటన ముగించుకుని *మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామానికి చేరుకుంటారు.* అక్కడ జిల్లాకు సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పిప్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.


