* గిద్దలూరు - శ్రీశైలం ఆర్టీసీ సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..
* స్వయంగా బస్సు నడిపిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు
* పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం గిద్దలూరు ఆర్టీసీ డిపో నుండి నూతన బస్సు సర్వీసును స్థానిక శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఆర్టీసీ డిపో ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు పాల్గొని నూతన బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్ర పర్యటనకు వెళ్లే భక్తులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉపయోగపడే అనేక ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారని మండిపడ్డారు.ప్రయాణికుల కనీస అవసరాలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, గిద్దలూరు డిపోకు మరిన్ని నూతన బస్సులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు స్వయంగా స్టీరింగ్ పట్టి బస్సును నడిపారు. ఎమ్మెల్యే గారు డ్రైవర్ సీటులో కూర్చుని బస్సు నడపడం చూసి అక్కడున్న ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు మరియు కార్యకర్తలు ఆశ్చర్యానికి లోనవడమే కాకుండా, ఆయన ఉత్సాహాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా చిత్ర లేఖనం పోటిల్లో గెలుపొందిన ఆర్టీసీ సిబ్బందికి బహుమతులు అందచేశారు. అదే విధంగా జీరో ఫెయిల్యూర్స్ అవార్డుకు గిద్దలూరు డిపో ఎన్నిక కావటంతో డిపో సిబ్బందిని అభినందిస్తూ ఇన్ఛార్జ్ డిఎం కు ప్రశంశా పత్రం అందచేశారు.. #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు


