ప్రశ్న :- నీలాదేవి ఎవరు .ఆమె వేంకటేశ్వర స్వామిని ఏ విధంగా సేవించింది.
#తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు
సమాధానం :- దేవీభాగవతం,భాగవతం,స్కందపురాణంలో వేంకటాచల మహత్యం ,మార్కండేయ పురాణం లలో పేర్కొన్న విషయాలు ఈ పోస్ట్ కు ఆధారం.
వైకుంఠ వాసుడు ఐన శ్రీ మహావిష్ణువు ను
శ్రీ,తుష్టి,పుష్టి, ఊర్జ,ఇలా, నీల అనే శక్తులు స్త్రీ రూపం లో నిత్యము సేవిస్తూ ఉంటాయి .వీరు అందరూ లక్ష్మీదేవి యొక్క అంశ స్వరూపాలు .
అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో ఈ నామాలను పదే పదే పేర్కొన్నారు.
అలాగే వీరితో పాటు ఒక తామసి శక్తి నిత్యం స్వామిని ఆవాహన చేసి ఉంటుంది . ఆ తామసి శక్తి ద్వారానే స్వామి సమస్త సృష్టి నీ నడుపుతాడు.
ఆ శక్తి నీ మహామాయ అని దుర్గ అని వైష్ణవి అని అంటారు. ఈ మహామాయాయే ద్వాపర యుగం లో శ్రీ కృష్ణుని చెల్లెలు అయిన అంబికా దేవి గా యశోదా దేవికి జన్మించింది.
పైన పేర్కొన్న శక్తులలో నీలా దేవి పరమ శాంత మూర్తి కరుణామూర్తి ఆ నీలాదేవియే వేంకటేశ్వర స్వామివారికి తన నీలాల ను (వెంట్రుకలు )సమర్పించి స్వామి తలపై శిరోజాల మధ్య ఉన్న ఖాళీ నీ నింపి స్వామి వారి అందాన్ని పరిపూర్ణం చేసింది.ఈ నీలా దేవి పేరు మీదనే సప్త గిరు లలో నీలాద్రి లేద నీలాచలం అనే ఓక పర్వతం ఉంది.
ఆ నీలాదేవి కి స్వామివారు ఇచ్చిన వరం వల్లనే మనం తిరుమలలో మన తల నిలాలను సమర్పించుకుంటున్నాం.
జై శ్రీ కృష్ణ 🙏🌺


