💐93శ్రీ లింగ మహాపురాణం💐
🍀వివిధ రూపాల శివ విగ్రహాల ప్రతిష్ఠాపన పుణ్య ఫలాలు 🍀
#తొంభై మూడవ భాగం#
త్రిశూలము, కమలము,అభయ ముద్ర ధరించి,చతుర్భు జాలు కలిగి, సర్వాభరణ భూషితమై ఉండిన శివ పార్వతుల అర్ధ నారీశ్వరవిగ్రహముతయారు చేయించి ప్రతిష్ఠించిన భక్తుడు శివలోకం చేరి మహాభోగాలు సూర్యచంద్రులు ఉన్నంతవరకు అనుభవించి,అణిమాదిసిద్దులుమోక్షము పొందుతాడు.
శిష్యులుభక్తులమధ్యభాష్యము చేయుచున్నముద్రలోలకులీశ్వర శివ విగ్రహం నిర్మించి ప్రతిష్ఠించిన సాధకుడు దేవతల మధ్య నివసించి అనంత కాలం అనంత భోగాలు అనుభవించి కైలాసం చేరి మోక్షము పొందుతాడు.
శరీరము పై చితాభస్మము పూయబడి, త్రిపుండ్రాల శిరోమాల ధరించి యుండి, బ్రహ్మ కేశములతో తయారు చేయబడిన యజ్ఞోపవీతం ధరించి, కుడిచేతిలో బ్రహ్మ కపాలము కలిగి విష్ణు శరీర ధారణ చేసిన పరమేశ్వరుని విగ్రహంశివనారాయణరూపంలో నిర్మించి ప్రతిష్ఠించిన వ్యక్తి సంసార బంధముల నుండి విముక్తి పొంది జన్మరాహిత్య మోక్షం పొందుతాడు.
పరమేశ్వరుడు జలంధరుని రెండు ఖండములు చేసి సంహరించాడు. ఆ రెండు జలంధరుని శరీరభాగాలే సుదర్శన చక్ర నిర్మాణానికి మూలములు అయ్యాయి. ఇటువంటి శివుని రూపంలో విగ్రహం నిర్మించి ప్రతిష్ఠించిన వ్యక్తి శివసన్నిధికి చేరుకుని మోక్షము పొందువరకు నివసిస్తాడు.
శివునికి తన నేత్రమును పుష్పంగా సమర్పించి విష్ణువు పూజించాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై సుదర్శన చక్రంతో పాటు తన అక్షమును దానంగా ఇచ్చాడు. ఇటువంటి శివుని విగ్రహం చేయించి భక్తితో ప్రతిష్ఠించిన వ్యక్తి శివలోకంలో గౌరవ పూజలు అందుకుంటాడు.
శివుడు నికుంభ నామక పీఠము పై దక్షిణ పాదము ఉంచి వామభాగాన ఉన్న పార్వతీదేవిని ఒక చేతితో కౌగిలించుకుని, మరోక చేతిలో త్రిశూలము ధరించి నిలబడి అంధకునికి దర్శనమిచ్చాడు. శూలము చివర ఉన్నకోయిలను సర్పము చుట్టుకుని ఉంది. అంధకుడు భక్తితో చేతులు జోడించి మోకాళ్ల పై నిలబడి ఉన్నాడు. ఈ ఆకారంలో విగ్రహం నిర్మించి ప్రతిష్టించిన భక్తుడు శివసాయిజ్యం శాశ్వతంగా పొందుతాడు.
త్రిపురాసుర సంహారం చేసిన శివుడు పార్వతీదేవితో బ్రహ్మ రథసారథిగా ఉన్న రథంలో శివలోకం తిరిగి చేరుకున్నాడు. చేతిలో ధనుస్సు, భుజాన తూణీరము గల చంద్రశేఖరుడు పార్వతితో కలసి బ్రహ్మరథంలో కైలాసం వెళుతున్నట్టు శిల్పము తయారు చేయించి ప్రతిష్ఠించిన భక్తుడు ఇచ్ఛానుసారం శివ లోకంలోభోగములనుభవించి జ్ఞానప్రాప్తి పొంది మోక్షము పొందుతాడు.
శిరము పై గంగాదేవి, శిరస్సున చంద్రుడు, పక్కనవామాంకంలో ఉమాదేవితో పీఠమునధిష్ఠించి, వినాయకుడు, కుమారస్వామి, దుర్గాదేవి, జేష్ఠాదేవి, భాస్కర, సోమ, బ్రహ్మణి, మహేశ్వరి, వైష్ణవి, వారాహి, కౌమారి, ఇంద్రాణి, చాముండీ మొదలైన మాతృకల సమేతంగా విరాజ మానుడై ఉన్న పరమేశ్వరుడి విగ్రహము ప్రతిష్ఠించిన వ్యక్తి శివసాయిజ్యం పొందుతాడు.
కలహపడుతున్న బ్రహ్మ విష్ణువులకు శివుడు ప్రథమంగా అగ్ని జ్వాలాలింగ రూపంలో దర్శన మిచ్చాడు. లింగ మధ్యములో చంద్రరేఖ ఉంది. హంస రూపంలో బ్రహ్మ లింగ ఊర్థ్వ భాగం కనుక్కోవడానికి పై వైపు , లింగ అధోభాగము కనుక్కోవడానికివిష్ణువువరాహ రూపంలో లింగ అధోభాగము వైపుపయనానికిసిద్దమయ్యారుఈ విధమైన లింగమును శివుడి సమీపంలో ఉన్నట్టు తయారు చేయించి ప్రతిష్ఠించిన భక్తునికి సకల సౌభాగ్యాలు, ముక్తి ఫలాలు, శివలోక ప్రాప్తి అనుగ్రహిస్తాడు.
శివుని మహాలింగాన్ని జలములు, జలధారాలు అధికంగా గల ప్రదేశాలలో ప్రతిష్ఠించిన వ్యక్తికి శివ సాయిజ్యం తప్పక లభిస్తుంది. పవిత్ర క్షేత్ర రక్షకుడిగా, క్షేత్ర పాలకునిగా శివుని విగ్రహం తయారు చేసి భక్తి శ్రద్థలతో, విధివిధానాలతో ప్రతిష్ఠాపన చేసిన భక్తుడు శివలోకం చేరి అత్యున్నత గౌరవం పొందు తాడు" అని సూత మహర్షి శౌనకాది మునులకు వివిధ శివ విగ్రహాల ప్రతిష్ఠాపన వలన లభించే పుణ్య ఫలాలను వివరించి చెప్పాడు
*తరువాతకధ రేపటి భాగంలో చదువుదాం*.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5 #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

ॐ భగవాన్ శ్రీ మహా 1
WhatsApp Group Invite

